-
నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం
► నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్ ► మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్సింగ్, సునిల్రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్ఆనంద్తదితరులు పాల్గొన్నారు. -
గుం‘టూరు’లో నరకం
అధ్వానంగా మారిన రహదారులు ఆక్రమణలతో మూసుకుపోయిన వీధులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న వాహనాలు కనీసం నడిచేందుకూ అవస్థలే అధికారుల పర్యవేక్షణలేమి ఫలితం ఇది నరకం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గానీ... గుంటూరు నగరంలో నివసించే సగటుజీవికి మాత్రం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా పెరిగిపోయిన వాహనాల రద్దీ, ఏ వీధిలో చూసినా తవ్వి వదిలేసిన డ్రెయిన్లు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులతో విలవిల్లాడిపోతున్నారు. కనీసం నడిచేందుకు వీలులేని విధంగా పరిస్థితి. సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణలేమి కారణంగానే గుం‘టూరు’ నరకం చూపుతోంది. అరండల్పేట (గుంటూరు) : నగరంలో ప్రస్తుత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఆక్రమణలతో ప్రధాన రోడ్లతో పాటు వీధులూ మూసుకు పోయాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య జఠిలమైపోయింది. ఏ సెంటర్లో చూసినా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, పొన్నూరు, తెనాలి, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశిస్తున్న వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగరం ప్రజలతో పాటు బయట నుంచి వచ్చే వారూ గుంటూరులో నెలకొన్న పరిస్థితులను చూసి బెంబేలెత్తుతున్నారు. మరమ్మతులన్నీ ఒకేసారి.. నగరంలోని అన్ని ప్రధాన రహదారులకు మరమ్మతులు ఒకేసారి చేపట్టడం పెద్ద సమస్యగా మారింది. చిలకలూరిపేట,నరసరావుపేట, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటికీ కలిపి నగర ప్రవేశం కోసం ఒకే ఒక్క చిన్న రహదారి దిక్కైంది. తెనాలి, బాపట్ల, పొన్నూరు, చీరాల, నిజాంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటికీ కూడా గుంటూరు ప్రవేశానికి మానసరోవరం రోడ్డు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. సాగుతున్న రోడ్డు నిర్మాణం, మరమ్మతు పనులే ఈ దుస్థితికి కారణం. ఫలితంగా ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవాల్సి వస్తోంది. ఈ మార్గాల్లోనే ఇక్కట్లు... పొన్నూరు రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. కొత్త రహదారి నిర్మాణం కోసం దాన్ని వన్వేగామార్చారు. తెనాలి, బాప ట్ల ప్రాంతాల నుంచి గుంటూరు వస్తున్న వాహనాలను ైబె పాస్ నుంచి మానస సరోవరం మీదుగా దారి మళ్లించారు. తెనాలి, బాపట్ల, నిజాంపట్నం, చీరాల తదితర ప్రాంతాల వాహనాలు మొత్తం మానస సరోవరం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుండటంతో ఆ మార్గం నిత్యం ట్రాఫిక్ మయమవుతోంది. అసలే అది గుంతల రోడ్డు. ఇప్పుడు మరింత అధ్వానంగా మారిపోయింది. బైపాస్ నుంచి ఎన్టీఆర్ బస్టాండ్కు రావడానికి ఒక్కో వాహనానికి అరగంట సమయం పడుతోంది. ప్రత్తిపాడు నుంచి వచ్చే వాహనాలకు కూడా బైపాస్ వద్ద బ్రేక్ పడుతోంది. వంతెన నిర్మాణ పనులు చేపట్టడంతో ఆ వాహనాలు కేవీపీ కాలనీ మీదుగా చుట్టుగుంట, కలెక్టరేట్ మీదుగా మార్కెట్ వైపునకు రావాల్సిన దుర్భర స్థితి నెలకొంది. గుంటూరు నుంచి బైపాస్ వైపునకు వెళ్లే ప్రతి రహదారి గుంతలమయమైపోయింది. ప్రస్తుత వర్షాలకు రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. నగరంలో ఏ ప్రధాన రహదారిపై చూసినా గుంతలు, రోడ్డు పనులు చేస్తున్నారు. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి. జిల్లా కోర్టు, లక్ష్మీపురం రోడ్డు పొడువునా, బృందావన్గార్డెన్స్ సెంటర్, మెడికల్ క్లబ్, నాజ్సెంటర్, కొత్తపేట శివాలయం, విద్యానగర్ రెండో లైన్, గెస్ట్హౌస్, జేకేసీ కాలేజ్ రోడ్డు.. ఇలా దాదాపు అన్ని ప్రధాన కూడళ్లు, సెంటర్లలో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఉన్నాయి. -
సా...గుతున్న పనులు
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం ఇప్పటికి పూర్తయిన పుష్కర పనులు 30 శాతమే.. కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇవ్వనున్న అధికారులు చేపా.. చేపా.. ఎందుకు ఎండలేదే అంటే గడ్డిమోపు అడ్డొచ్చింది.. అన్న కథను గుర్తుకు తెచ్చేలా విజయవాడ నగరంలో కృష్ణాపుష్కరాల పనులు కొనసా...గుతున్నాయి. రూ.98 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. వానలు ముంచుకు రావడంతో అసలు ఈ పనులు పూర్తవుతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. విజయవాడ సెంట్రల్ : పుష్కరాల అభివృద్ధి పనులు మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు నడుస్తున్నాయి. ఈనెలాఖరుకు పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మూడు సర్కిళ్ల పరిధిలో 55 రోడ్లను రూ.98 కోట్లతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. 14 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన పనులు ముందుకు కదలడం లేదు. పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. సమన్వయలోపం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనులు చురుగ్గా సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ కో అధికారులు ఆయా స్థలాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు సాగడం లేదు. విద్యుత్స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ఇస్తే కానీ పనులు చేయలేమని కొందరు కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజి నీరింగ్ అధికారులు పలుమార్లు ట్రాన్స్కో అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణదారులు, స్థల యజమానులు కోర్టు నుంచి స్టే తెస్తుండటంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడుతోంది. చెట్లు తొలగించిన తరువాత వాటి తరలింపు సకాలంలో జరక్కపోవడంతో రోజుల తరబడి పనులు నిలిచిపోతున్నాయి. సబ్లీజులు పుష్కర పనులను 14 ప్యాకేజీలుగా విభజించగా బడా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. వీరిలో కొందరు సొంతంగా ప్రారంభించగా, మరికొందరు సబ్లీజ్కు చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులకు సంబంధించి నిధులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు సందేహంలో పడ్డారు. హడావుడిగా పూర్తి చేశాక డబ్బులు రాకుంటే అడ్డంగా బుక్కైపోతామన్న భయం వారిని వెంటాడుతోంది. ఈక్రమంలో పనులు చేయాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. తాఖీదులు సిద్ధం కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు పనులు చేయడంలో వెనకబడ్డ కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా నోటీసులు ఇచ్చి వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తున్నారు. సర్కిల్ -3 పరిధిలో పనులు చేపట్టిన వీఎస్ ఇంజినీరింగ్స్తో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్ల పనితీరుపై కమిషనర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
‘ఎస్ఆర్డీపీ’ని అడ్డుకోండి..
- దీని వల్ల సహజ వనరులకు తీరని నష్టం కలుగుతోంది - హైకోర్టులో పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నగరంలోని 20 కూడళ్లను కలుపుతూ మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను, ఫ్లై ఓవర్ల నిర్మాణం నిమిత్తం చెట్ల నరికివేత కోసం అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ జీవోలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త కె.పురుషోత్తంరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ.4,051 కోట్ల వ్యయం తో మొదటి విడతలో మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణం నిమిత్తం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్ఆర్డీపీ)కి అనుమతులిస్తూ గత ఏడాది మేలో జీవో 208ని జారీ చేసిందని, అలాగే చెట్ల నరికివేతకు అనుమతులిస్తూ ఈ ఏడాది మే 13న జీవో 19ని జారీ చేసిందని పురుషోత్తంరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల సహజ వనరులు ప్రమాదంలో పడ్డాయన్నారు. మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో భారీగా చెట్లను నరికేస్తున్నారని, ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దుర్గం చెరువుకు కూడా ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ సమస్య తీరకపోగా మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,319 చెట్లు నరికివేతకు గురవుతున్నాయని, దీని వల్ల అనేక జీవరాశులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇదే హైకోర్టుకు గతంలో హామీ ఇచ్చిందని, దాని ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పర్యావరణ అధ్యయన నోటిఫికేషన్ ప్రకారం భారీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరిగా చేపట్టాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయకుండానే మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ముందుకెళుతోందని పురుషోత్తంరెడ్డి ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతోందని, ప్రాజెక్టు పనులపై ట్రిబ్యునల్ స్టే విధించిందని ఆయన తెలిపారు. అయితే జీవోల చట్టబద్దతను ట్రిబ్యునల్ ముందు సవాలు చేయడం కుదరదు కాబట్టి, హైకోర్టును ఆశ్రయించానని ఆయన వివరించారు. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మిస్తాం
కలెక్టర్ యువరాజ్ అచ్యుతాపురం:ఎస్ఈజెడ్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వసతి ఏర్పాటుకు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. సోమవారం ఆయన బ్రాండిక్స్ పరిశ్రమను సందర్శించారు. దూరప్రాంతాలనుంచి పరిశ్రమకు రావడం వల్ల ఎదుర్కొం టున్న సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులను తరలించడంలో పరిశ్రమలకు భారంగా ఉందన్నారు. ఉద్యోగులు వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య, ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా టౌన్షిప్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత భాగాన్ని వాయిదాగా చెల్లించడానికి ముందుకు వస్తే ఇంటినిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు. ఇందుకోసం చోడపల్లి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. సెజ్కు సమీపంలో మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సేకరించి టౌన్ఫిప్కు సిద్ధం చేస్తామని వివరించారు. చదరపు అడుగు రూ.వెయ్యి నుంచి రూ.1500 ధరలో నిర్మాణం చేపట్టేలా సంస్థలకు అప్పగిస్తామన్నారు. ఉద్యోగికి తక్కువ ధరకు అపార్టమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి వాయిదా చెల్లించిన వెంటనే ఉద్యోగికి ఇల్లు అప్పగిస్తామని వాయిదాలు పూర్తయిన తరువాత ఇంటి డాక్యుమెంట్ను అందజేస్తామని చెప్పారు. మొదటి విడతగా 15 వేల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మించే పైపులైన్కు పూడిమడక మత్స్యకారులు సహకరించాలని కోరారు. ఉన్నఫలంగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యపడదన్నారు. ప్యాకేజీ తీసుకొని పైపులైన్క అంగీకరిస్తే అంచెలంచెలుగా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దీనిపై మత్స్యకారులతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్ హెచ్ఆర్ మేనేజర్ రఘుపతి, భాస్కర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాసులు కావాలి
మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు అధ్వానంగా ఉన్న ఆర్ అండ్ బి రహదారులు రూ. 500 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు నిధుల కోసం అధికారుల ఎదురుచూపులు విజయవాడ : మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. కోట్లాదిమంది యాత్రికులు పుణ్యస్నానాలాచరించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివస్తారు. వేలాది వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు కృష్ణా తీరం వెంబడి ఉన్న రహదారులన్నీ గోతులమయంగా మారడంతో ప్రయాణికులు యాతన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆర్ అండ్ బి రోడ్లకు పుష్కరాలనాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. రోడ్ల అభివృద్ధికి ఆ శాఖ అధికారులు అంచనాలైతే సిద్ధం చేశారు కాని అక్కడ్నుంచి మరో అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో వేల కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు ఉన్న కృష్ణా తీరంలో దాదాపు 800 కి.మీ. మేర రహదారులు విస్తరించాయి. ప్రధాన రహదారులతోపాటు అనేక సర్వీసు రోడ్లు, గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నీ ఆర్ అండ్ బి పరిధిలోనే ఉన్నాయి. పుష్కరాలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ గత నెలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా నిధుల కొరత లేదని, అన్ని శాఖల అధికారులు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ప్రత్యేకంగా ఆయా శాఖల నుంచి నిధులు మంజూరుచేయిస్తామని ప్రకటిం చారు. ఇది జరిగి కూడా రెండు నెలలు దాటింది. మళ్లీ మంత్రి వాటి గురించి కనీసం వాకబు కూడా చేసిన దాఖ లాలు లేవు. మరోవైపు దుర్గగుడి వద్ద కనకదుర ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్సహా జిల్లా ఉన్నతాధికారులంతా ఆ పనులపైనే దృష్టిసారించి మిగిలిన పనులను మరిచిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లానే ఆర్ అండ్ బి అధికారులు కూడా భారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి గత నెలలో ఆమోదం కోసం పంపి కాసుల కోసం నిరీక్షిస్తున్నారు. 60 రహదారులకు మరమ్మతులు జిల్లాలో 2800 కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బి రహదారులున్నాయి. అన్ని గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఇవి ఉన్నాయి. వీటికి ఏటా సాధారణ మరమ్మతులు జిల్లాలో నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీనికి కొంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే జిల్లాలోని ఆర్ అండ్ బి రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి పుష్కరఘాట్లను ప్రామాణికంగా తీసుకొని ఘాట్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అధికారులు గత నెలలో పరిశీలించారు. దీనికి అనుగుణంగా అవసరమైన చోట నిర్వహించాల్సిన పనులను కూడా గుర్తించారు. ప్రాథమికంగా జగ్గయ్యపేటలోని వేదాద్రి నుంచి అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వరకు 90 ప్రధాన ఘాట్లు ఉన్నాయి. 60 ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయడం, కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు వీలుగా రహదారుల విస్తరణ పనులు నిర్వహిం చాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 500 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేసి 60 రహదారుల పనులను ఆమోదించాలని ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా మైలవరం, తిరువూరు రోడ్డు, నూజివీడు రోడ్డు, యనమలకుదురు నుంచి చల్లపల్లి వరకు ఉన్న కరకట్ట మార్గం, గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న మార్గం, హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల వాహనాల రద్దీ నియంత్రణకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కీలక ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేయడం, దాదాపు 15 చోట్ల రోడ్లను విస్తరించడం వంటి పనులు పూర్తిచేయాలి. పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరు విషయంపై దృష్టి సారించడంలేదు. -
హైదరాబాద్ లో ఫ్రీ పార్కింగ్ స్థలాలివే...
ఉప్పల్కు చెందిన అరుణ్ ఉదయమే టిఫిన్ తెద్దామని సమీపంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్కు వెళ్లాడు... బైక్ రోడ్డు మీద పెట్టి టిఫిన్కు వెళ్లడంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారమైంది...ఇది ఒక్క ఉప్పల్లోనే కాదు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. అయితే జీహెచ్ఎంసీ పార్కింగ్ కాంట్రాక్టర్లమంటూ ఎక్కడ సందు దొరికితే అక్కడ వసూళ్ల పర్వం కొనసాగిస్తుండటంతో చాలా మంది ద్విచక్రవాహనదారులు తమ వాహనాన్ని రహదారులపైనే పార్కు చేసి వెళ్తున్నారు. నో పార్కింగ్ జోన్లో వందల సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనిపై అధ్యయనం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ‘ఫ్రీ పార్కింగ్’ సౌకర్యాన్ని కల్పించారు. మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 49 ప్రాంతాలను గుర్తించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ స్థలాలను శుభ్రం చేసి పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎటువంటి రుసుం లేకుండా ఇక్కడ బైక్లు, కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఇవీ ఫ్రీ పార్కింగ్ స్థలాలు... మాదాపూర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో: మాదాపూర్లోని అవసా హోటల్, ప్రైడ్ హోండా, హైటెక్స్ జంక్షన్కు వెళ్లే సీఐఐ, ఇమేజ్ గార్డెన్, కొండాపూర్లోని హర్ష టయోటా, కొత్తగూడలోని రత్నదీప్ సూపర్ మార్కెట్, శిల్పరామం నైట్ బజార్కు ఎదురుగా ఫోర్వీలర్స్ను పార్కింగ్ చేసుకోవచ్చు. కూకట్పల్లి ఠాణా పరిధిలో... జేఎన్టీయూ రైతు బజార్ సమీపంలో ద్విచక్ర వాహనాలు, రైతు బజార్కు ఎదురుగా బైక్లు, కారులు, రెడీమేడ్ ఆస్పత్రి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ రోడ్డు నంబర్ 3లో ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. మియాపూర్ పరిధిలో: చందానగర్లోని మైత్రి ఆస్పత్రి నుంచి ఈనాడు బ్యాంక్, అంగర హోటల్ నుంచి కేఎస్ బేకర్స్, గంగారామ్లోని చెన్నై షాపింగ్ మాల్ నుంచి నీల్కమల్ ఫర్నిచర్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. అల్వాల్ ఠాణా పరిధిలో... సుచిత్ర జంక్షన్, కొంపల్లిలోని బర్టన్గూడ జంక్షన్, ఏఎంఆర్ గార్డెన్లో బైక్లు, ఫోర్ వీలర్స్, ఓల్డ్ అల్వాల్లోని లైబ్రరీ బిల్డింగ్ ఎదురుగా, కుత్బుల్లాపూర్ మీ సేవా రోడ్డు సమీపంలో బైక్లు పార్క్ చేసుకోవచ్చు. బాలానగర్ ఠాణా పరిధిలో... బీబీఆర్ హాస్పిటల్, బొజయ్ గార్డెన్ ఓల్డ్, శోభనా, నర్సాపూర్ ఎక్స్ రోడ్డులోని రామ్ హోండా, బాలానగర్ టీ జంక్షన్లోని గణేశ్ మెడికల్ షాప్, మల్లికార్జున లాడ్జి రాజుకాలనీలో కమాన్ , ఫెరోజ్గూడ ఎస్బీహెచ్ ఎదురుగా బైక్లు పార్క్ చేసుకోవచ్చు, జీడిమెట్ల ఠాణా పరిధిలో... జీడిమెట్ల ఐడీఏలోని జేఎస్ఆర్ కాంప్లెక్స్, షాపూర్నగర్లోని కిరణ్మయి హాస్పిటల్, రంగ.. భుజంగ థియేటర్ సమీపంలోని విఘ్నేశ్వర కాంప్లెక్స్, ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, గాజులరామారం ఎక్స్ రోడ్డులోని ఉషోదయ టవర్స్, షా సినీ ప్లానెట్లోని వాల్యూమార్ట్, గణేశ్నగర్లోని గౌరి వైన్స్ కాంప్లెక్స్, క్యూకాటన్ బిల్డింగ్, ఐడీపీఎల్ ఎక్స్ రోడ్డులోని భాగ్యరథీ డిగ్రీ కాలేజి బిల్డింగ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద బైక్లు, ఫోర్వీలర్స్ నిలుపవచ్చు. ఉప్పల్ ఠాణా పరిధిలో... రామంతాపూర్ చెరువు సర్వీసు రోడ్డు, యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఉప్పల్ ఎక్స్ రోడ్డు, సర్వీసు రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా బైక్లు, ఫోర్వీలర్స్ నిలుపవచ్చు. మాల్కాజిగిరి ఠాణా పరిధిలో... మల్కాజిగిరి ఎక్స్ రోడ్డులోని గాంధీ పార్క్ వాల్ రోడ్డు, ఆనంద్బాగ్ నుంచి ఉత్తమ్నగర్ వరకు బైక్లు, ఫోర్వీలర్స్ నిలుపవచ్చు. నేరేడ్మెట్ ఎక్స్రోడ్డు, ఏఎస్రావ్ నగర్లోని కెనడీ హైస్కూల్, వెర్టక్స్ ప్లాజా, నార్త్ కమలానగర్లోని ఉడ్ ల్యాండ్స్ హోటల్, కుషాయిగూడ మార్కెట్, కమలానగర్లోని కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో... దిల్సుఖ్నగర్లోని సాయిబాబా గుడి, కొత్తపేటలోని రైతు బజార్, రాజేంద్రనగర్లోని ఆర్డీఓ ఆఫీసు వద్ద బైక్లు పార్క్ చేయవచ్చు. -
ట్రాఫిక్ జామ్ ఝూటం
ఏమేవ్..ఆఫీసుకు వెళ్లాలి.. త్వరగా బాక్స్ రెడీ చెయ్..ఏంటండీ అంత తొందర.. ఇప్పుడు ఏడు గంటల కూడా కాలేదు..హడావుడి చేస్తున్నారు.. హడావుడి కాకపోతే నిన్న 8.30 గంటలకు బయలుదేరా.. ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు చేరేపాటికి 10.30 గంటలైంది.. బాసు గయ్యమన్నాడు.. అమ్మో...ఆ ట్రాఫిక్ తలుచుకుంటేనే భయమేస్తోంది..నేను త్వరగా వెళ్లాలి. నువ్వు కానీకానీ..ఇవీ నిత్యం గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఇంటింటికో కథలు..ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ప్రజల వెతలు. ట్రాఫిక్ సమస్య ఇక్కడ అధికం.. విజయవాడ నగరానికి ప్రవేశ ద్వారంగా ఉన్న కుమ్మరిపాలెం సెంటర్, రామవరప్పాడు రింగ్లో రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. బందరు రోడ్డులోని పశువుల ఆసుపత్రి సెంటర్, బెంజ్ సర్కిల్, పడమట, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్డులో మాచవరం డౌన్, గుణదల సెంటర్లోనూ ట్రాఫిక్ తిప్పలు ఎక్కువగా ఉన్నారుు. వన్టౌన్లో కాళేశ్వరరావు మార్కెట్, బొడ్డెమ్మ హోటల్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, రథం సెంటర్ల ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారుు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల కారణంగా వన్టౌన్ అంతా ట్రాఫిక్ అంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి నగరంలో వచ్చే వాహనాలు కుమ్మరిపాలెం మీదుగా సితార సెంటర్, కబేళా, వెంకట్రావ్ ఫ్లైఓవర్ పాల ఫ్యాక్టరీ మీదుగా ఎర్రకట్ట వైపు మళ్లిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను సొరంగ మార్గం లోంచి అనుమతిస్తున్నారు. ఎర్రకట్ట రోడ్డు ఇరుకుగా ఉంది. గతంలో 30 అడుగులు ఉన్న ఎర్రకట్టను ఇటీవలే 12 అడుగులు వెడల్పు పెంచారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోజు సగటున 25 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో 42 అడుగులు రోడ్డు కావటంతో అందులోనూ మూడు రైల్వే బ్రిడ్జిలు శిథిలావస్థ చేరటంతో విజయవాడ : ట్రాఫిక్ పద్మ వ్యూహంలో జంట నగరాలు చిక్కుకున్నాయి. పక్కా ప్రణాళిక లేకపోవటం, ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రహదారులు ఇరుకుగా ఉంటడం, నగరానికి ప్రవేశ ద్వారాలుగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా చిన్న రోడ్లు ఉండటం వెరసి ట్రాఫిక్ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. జంట నగరాలకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, విదేశి ప్రతినిధుల తాకిడి పెరిగింది. వీఐపీల కోసం ట్రాఫిక్ను కొద్ది సేపు నిలువరిస్తే పునరుద్ధరించడానికి గంటపైనే పడుతుంది. రాజధాని నగర స్థాయికి తగ్గట్లుగా రోడ్లు లేవని సీఎంతో సహా అందరూ పదే పదే చెబుతున్నారు. వీటి అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ నుంచి ఒడిషా, చత్తీస్ఘడ్, తమిళనాడు, కర్ణాటక వెళ్లే వాహనాలు తప్పనిసరిగా నగరంలోకి రావాల్సిందే. పక్కా ప్రణాళిక ఏది ? విజయవాడలో దసరా ఉత్సవాలు, వీవీఐపీల బహిరంగ సభలు, భవానీ దీక్షల సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు మినహా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. గతంలో సీఎం రోడ్ల వెడల్పుకు వంద కోట్లు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. వరుస ప్రాజెక్ట్లతో అది అటకెక్కింది. నగర కమిషనర్గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ అంశాలపై బిజీగా ఉండటంతో ట్రాఫిక్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించ లేదు. గుంటూరులో నల్లపాడు, పొన్నూరు రోడ్లు పూర్తి స్థాయిలో విస్తరించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదం పొంచి ఉంది. గుంటూరులో.. గుంటూరులో బస్టాండ్, జిన్నాటవర్, మార్కెట్, గుజ్జనగుండ్ల, బ్రాడీపేట నాలుగో లైను, శంకర్విలాస్, లక్ష్మీపురం, రింగ్ రోడ్డు సెంటర్లలో ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోతోంది. నగరంలో ఎక్కడా వంద అడుగుల రోడ్డు లేదు. ఉన్న రోడ్లను అవసరాలకు అనుగుణంగా పది అడుగులు విస్తరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో అక్రమణల కారణంగా విస్తరణ చేయడం లేదు. పట్నంబజార్ మెరుున్ రోడ్డులోకి వెళ్లి తిరిగి రావాలంటే కనీసం గంట సమయం పడుతుంది. -
ఐటీఎస్కు పోటాపోటీ!
రంగంలో ఆరు సంస్థలు టెక్నికల్ స్క్రూట్నీపై హెచ్ఎండీఏ కసరత్తు జనవరిలో ప్రాజెక్టు పనులకు శ్రీకారం గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ సిటీబ్యూరో: రాజధాని హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతోన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రూ.160 కోట్లతో హెచ్ఎండీఏ తలపెట్టిన ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం (ఐటీఎస్) ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఆరు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీఎస్కు సంబంధించిన టెండర్స్ను ఓపెన్ చేసిన అధికారులు మొత్తం ఆరు బిడ్స్ దాఖలైనట్లు గుర్తించారు. వీటిలో సావ్రానిక్ (టర్కీ), ఏఆర్ఎస్ అండ్ పి అండ్ టి (నెదర్ల్యాండ్స్), కొరియా ఎక్స్ప్రెస్ వే కార్పొరేషన్ (కేఎక్స్సి- కొరియా)లు విదేశీ సంస్థలు కాగా, ఎల్అండ్టి, బీఈఎల్, ఎఫ్కాన్లు స్వదేశీ సంస్థలున్నాయి. వీటికి సంబంధించి త్వరలో టెక్నికల్ స్క్రూట్నీ పూర్తిచేసి అనంతరం టెక్నికల్ బిడ్స్ను ఓపెన్ చేస్తామని ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్మోహన్ తెలిపారు. అర్హత గల సంస్థను ఖరారు చేసే ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే జనవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తిచేయాలని ల క్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ప్రాజెక్టును దక్కించుకొన్న సంస్థ నిర్మాణంతో పాటు ఐదేళ్లు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. సమగ్ర సమాచారం నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రయాణించే వాహనదారులకు సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని హెచ్ఎండీఏ చెబుతోంది. ప్రధానంగా ప్రయాణ సమయం ఆదా, ఖర్చు తగ్గించడం, ప్రమాదాల నివారణ, వాహన కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయమైన ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఐటీఎస్ వల్ల నగర రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎఫ్.ఎం రేడియో ద్వారా, వేరియబుల్ సైన్ బోర్డుల ద్వారా ముందుగానే ప్రజ లకు తెలిపేందుకు వీలవుతుందంటున్నారు. ప్రధాన మార్గాల్లోని తాగునీటి పైపులైన్, డ్రైనేజీ పనులు అత్యవసరంగా చేపట్టాల్సి వచ్చినప్పుడు తవ్వకాలు జరపడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురై ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ముందగానే పసిగట్టి ఆ మార్గంలో వచ్చే వాహనదారులకు చేరవేయడం ద్వారా వారు మరో ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు వీలవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ట్రాఫిక్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడం వల్ల పెట్రోలు వృథా, అలాగే వాహన కాలుష్యం వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిరోధించవచ్చు. వర్షాకాలంలో రోడ్డుపై వరదనీరు నిలిచిపోయిన విషయాన్ని ముందుగానే వాహనచోదకులకు చేరవేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆధునిక వ్యవస్థ కోసం నాన్రామ్గూడ, ఘట్కేసర్లలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి కేబుల్ నెట్వర్క్, వైర్లెస్ నెట్ వర్క్ ద్వారా దీనికి అనుసంధానం చేస్తారు. సింక్రనైజ్డ్ సిగ్నలింగ్ సిస్టం, వేరియబుల్ మెసేజ్ సైన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వీటి ద్వారా నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందంటున్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలపకుండా వ్యవస్థను అందుబాటులోకి తెస్తే వాహన కాలుష్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. 3 దశల్లో నిర్మాణం... అత్యాధునిక హంగులతో కూడిన ఇంటలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం (ఐటీఎస్) ప్రాజెక్టును 3 దశల్లో నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1175 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. తొలి దశలో రూ.160 కోట్లతో చేపట్టే ఐటీఎస్కు జైకా ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే రెండో దశను రూ.425 కోట్లు, మూడో దశను రూ.600 కోట్లతో తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. -
కాకినాడలో భారీ వర్షం
కాకినాడ టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా కుండపోతగా వర్షం పడింది. దీంతో కాకినాడ మెయిన్ రోడ్డులో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని జగన్నాయకపూర్, ట్రెజరీకాలనీ, గోడారిగుంట, జె. రామారావుపేట తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యం
కాలు తీసి కాలు పెడితే ఖరీదైన కారు.. లేదా వాయువేగంతో వెళ్లే మోటారు సైకిల్.. ఇదీ నేటి సమాజ ధోరణి. ఫలితంగా పెరిగిన పెట్రోల్ వినియోగం..ట్రాఫిక్ సమస్య..రోజు రోజుకూ దెబ్బతింటున్న పర్యావరణం.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊబకాయం..అధిక కొలెస్ట్రాల్..బీపీ..మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే సైకిలింగ్ బెస్ట్ అంటున్నారు వైద్యనిపుణులు. ఈ క్రమంలో సైకిలింగ్తో ఉపయోగాలపై ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం. పలమనేరు: సమాజంలో ఒకనాడు ఓ ఊపు ఊపిన సైకిళ్లు రకరకాల మోటారు సైకిళ్లు, కార్ల రాకతో తగ్గుముఖం పట్టాయి. ఖరీదైన కార్లు, మోటారు సైకిళ్ల వినియోగంతో పెట్రోల్ వినియోగం పెరిగింది. ఇక పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. మరోవైపు శ బ్ధ, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు పెచ్చుమీరాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పలువురు మళ్లీ సైకిళ్లపై మోజు పెంచుకున్నారు. ఏటా పెరుగుతున్న సైకిళ్ల వినియోగం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 29 లక్షలు, పట్టణాల్లో 12 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 1.50 లక్షల మంది సైకిళ్లు వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం కంటే నేడు సైకిళ్ల వినియోగం పెరిగింది. 1995 వరకు సైకిళ్ల వినియోగం భారీ గానే ఉండేది. ఆ తర్వాత క్రమేపి వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే నేడు మళ్లీ ఊపందుకుంది. మార్కెట్లో పలు రకాల సైకిళ్లు ప్రస్తుతం మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన సుమారు 370 రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలకు కిడ్ సైకిల్, విద్యార్థులకు రేంజర్, స్పోర్ట్స్, మహిళలకు లేడీ బర్డ్, మిగిలిన వారికి స్టాండర్డ్ సైకిళ్లు ఉన్నాయి. వీటి ధర రూ. 750 నుంచి రూ.4500 వరకు ఉన్నాయి. ఇంపోటెడ్ సైకిళ్ల ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంది. అయితే హీరో, హెర్క్యులస్, అట్లాస్, అవెన్ కంపెనీల సైకిళ్లు మాత్రం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. జిల్లాలో సుమారు 30 పట్టణాల్లో సైకిల్ దుకాణాలున్నాయి. అన్ని కంపెనీల సైకిళ్లు ఏడాదికి 30 వేల నుంచి 40 వేల వరకు అవుు్మడవుతున్నారుు. జిల్లాలో 20వేల మంది దాకా సైకిల్ మెకానిక్లకు ఉపాధి లభిస్తోంది. సైకిళ్లపై పెరిగిన మక్కువ ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.45 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.71.50కి పెరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కార్లు, మోటారు సైకిళ్ల వినియోగం కష్ట సాధ్యంగా మారింది. దీంతో పాటు పదిమందిలో ముగ్గురికి ఒబేసిటీ సమస్యలొస్తున్నాయి. వీటన్నింటికీ సైకిలింగ్ పరిష్కార మార్గంగా మారింది. ఈ క్రమంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ వాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మనిషిలోని కొలెస్ట్రాల్ తగ్గి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. శబ్ద, వాయు కాలుష్య నివారణ సాధ్యం. ఇంధన పొదుపుతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఎటువంటి మార్గాల్లోనైనా సులభంగా ప్రయాణించవచ్చు. బరువులు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య నివారణ. ప్రమాదాలు నుంచి రక్షణ. బరువు తగ్గేందుకు ఇదో మంచి వ్యాయామం. తక్కువ ధరకు దొరికే ప్రయాణ సాధనం. -
ఎనిమిదో రోజు 30 లక్షలు
గత నాలుగు రోజులతో పోలిస్తే తెలంగాణలో తగ్గిన రద్దీ ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు నెట్వర్క్: గోదావరి పుష్కరాలకు ఎనిమిదో రోజూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చారు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ప్రధాన పుణ్య క్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం, బాసర, భద్రాచలానికి భక్తుల తాకిడి తగ్గింది. సాధారణ భక్తులు గంటలోపే ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామిని సందర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి 4 గంటలు, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనానికి 3 గంటలు, బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కరీంనగర్లో అత్యధికంగా 11.32 లక్షల మంది పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పుష్కర స్నానం చేశారు. కోటిలింగాల పుష్కర ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, యువజన అధ్యక్షుడు వేణుమాధవరావు పుష్కర స్నానమాచరించి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. సుందిల్ల ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పుష్కర స్నానం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోన్ పుష్కర ఘాట్లో 1.4 లక్షల మంది స్నానాలు ఆచరించారు. నిజామాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న ఓ ఆటో బాసరా గోదారి వంతెన సమీపంలో అగ్ని ప్రమాదానికి గురవడంతో భక్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. గోదావరిఖనిలో పుష్కర స్నానానికి వెళ్లి సుంకె ప్రసాద్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. గోదావరి ఎగువ ప్రాంతం, ఏటూరు నాగారం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో వరంగల్లోని ఘాట్ల వద్ద నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టె ఘాట్ల వద్ద ఇప్పటివరకు 13 లక్షల మంది స్నానాలు ఆచరించారు. మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్రెడ్డి దంపతులు మంగపేటలో పుష్కరస్నానం ఆచరించారు. -
ముక్కోటి దాటింది..
ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు ప్రధాన క్షేత్రాల్లోనూ తొందరగానే దర్శనం ఏపీలో మంగళవారం తగ్గిన పుష్కర భక్తులు రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర గోదావరిలో ముక్కోటి మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. భక్తజనం ఎక్కువవుతుండటంతో పుష్కరాలకు మరో 4 రోజు లుండగానే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మంగళవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. కోటి లింగాల రేవు, పుష్కర ఘాట్లు మినహా మిగిలిన ఘాట్లలో తెల్లవారుజాము నుంచే పెద్దగా ర ద్దీ కనిపించలేదు. అలాగే సరస్వతీ (వీఐపీ) ఘాట్కు వచ్చే వీఐపీల తాకిడి కూడా తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 47 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 34,03,457 మంది భక్తులు మాత్రమే పుణ్య స్నానాలను ఆచరించారు. తూర్పున 24,06,858 మంది, పశ్చిమలో 10,86,201 మంది పుష్కర స్నానమాచరించారు. తూర్పులో లక్ష మంది, పశ్చిమలో 70 వేలమంది వరకు భక్తులు పుష్కరస్నానాల కోసం ఇంకా వేచి ఉన్నారు. దీంతో ఇప్పటివరకు ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 3,09,42, 618కు చేరింది. రాజమండ్రి అర్బన్ పరిధిలోని ఘాట్లలో 1,17,62,323 మంది పుష్కర స్నానం చేయగా, తూర్పుగోదావరిలోని గ్రామీణ ఘాట్లలో 93,78,081 మంది, పశ్చిమలో మరో 98,02,214 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
ఏం జనంరా.. బాబూ !
‘అబ్బో.. ఏం జనంరా బాబూ..! ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు’ తనయుడితో తల్లి. ‘మరేమనుకున్నావ్.. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న ఒక్కరోజే మన జిల్లాకు 20 లక్షలు దాటిపోయి జనమొచ్చారంట’ తనయుడి సమాధానం. ‘ఆళ్లందర్నీ గోదారమ్మ తల్లి చల్లగా చూడాలి. అందరిళ్లల్లో సిరిసంపదలు బాగుండాలి. ఆడోళ్లంతా జీవితకాలం సౌభాగ్యంతో బతకాలి. పుష్కరాలకొచ్చినోళ్లంతా సంతోషంగా ఇంటికెళ్లాల’ంటూ గోదారమ్మతోపాటు దేవుళ్లందరినీ ఆ తల్లి ప్రార్థించింది. జిల్లాలో ప్రతిచోట.. ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. జన జాతర నడుమ పుష్కరోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మఖ నక్షత్రం.. ఆదివారం వేళ పుష్కర సంబరం అంబరాన్ని తాకింది. రెండు రోజులుగా యాత్రికులను నరకయాతనకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను కొంతమేర అధిగమించడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పుష్కర పర్వం ఒకింత సాఫీగానే సాగింది. శనివారం రోజంతా కొవ్వూరు, నరసాపురం పట్టణాలకు కిలోమీటర్ల దూరంలో వాహనాలు ఆగిపోవడం.. యాత్రికులు పుష్కర ఘాట్లకు చేరుకోలేక ప్రత్యక్ష నరకం చవిచూసిన పరిస్థితుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచే అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. చెన్నై, విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలను రాజమండ్రి, కొవ్వూరు వైపు రానివ్వకుండా రావులపాలెం, జొన్నాడ, రాజోలు మీదుగా విశాఖ వైపు మళ్లిం చారు. ఏలూరు-కొవ్వూరు-రాజమండ్రి మార్గంలో వచ్చే భారీ వాహనాలను మళ్లించి ప్రయాణికుల కార్లను, ఆర్టీసీ బస్సులను మాత్ర మే అనుమతించారు. గుండుగొలను మీదుగా రాజమండ్రి వెళ్లే వాహనాలను జాతీయ రహదారి మీదుగా, కొయ్యలగూడెం నుంచి రాజ మండ్రి వెళ్లే వాహనాలను నాలుగో వంతెన మీదుగా మళ్లించారు. శనివారం ప్రయాణికుల అనుభవాలు, అవస్థలు మీడియాలో హోరెత్తిన నేపథ్యమే కావొ చ్చు గానీ ఆదివారం భక్తుల తాకి డి అంచనాలకు మించి లేదనే చెప్పాలి. పుష్కరాల తొలిరోజు నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వేళల్లోనే పిండప్రదానాలు చేస్తున్నారు. ఆదివారం విపరీతమైన రద్దీ ఉంటుందని భావించిన యాత్రికులు, భక్తులు శనివారం అర్ధరాత్రి కూడా పిండప్రదానాలు చేశారు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. కొవ్వూరు ఘాట్లకు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. బస్సుల కోసం ఎదురుచూపులు ఆర్టీసీ బస్సులు అవసరానికి తగ్గ సంఖ్యలో లేకపోవడంతో నరసాపురంలో భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం పుష్కర స్నానాలు పూర్తి చేసుకున్న యాత్రికులు సాయంత్రం వరకు బస్టాండ్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం పట్టణంలో ఆదివారం ఏ వీధిలో చూసినా భక్తుల సందడి కనిపించింది. లక్షలాదిగా జనం రోడ్లపైకి రావడంతో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ట్రాఫిక్ విషయంలో ఉన్న ఇబ్బందులను కొంతమేర అధిగమించగలిగారు. వాహనాలను పాలకొల్లు రోడ్డులో నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఘాట్ల వద్ద భక్తులు స్నానాల కోసం ఎండలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. దీంతో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి దంపతులు నరసారురంలో పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. పెరవలిని వదలని ట్రాఫిక్ సమస్య పెరవలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోవడంతో భక్తులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు పోలీసులను నియమిం చాల్సిన అవసరం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శాపంగా మారింది. పోలవరంలో లాంచీలు సరిపోక గంటల తరబడి భక్తులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఘాట్ల వద్ద రద్దీ కారణంగా చిన్నపాటి తోపులాటలు చోటు చేసుకున్నాయి. రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇక్కడి ఘాట్లను పరిశీలించారు. యలమంచిలిలో అదే జోరు యలమంచిలి మండలంలో భక్తుల జోరు కొనసాగింది. లక్ష్మీపాలెం ఘాట్లో పైకిలేచిన రాళ్లవల్ల భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. భారీగా వస్తున్న జనాన్ని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఇక్కడ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుష్కర స్నానం ఆచరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, రాజమండ్రి ఘటనలో మృతి చెందిన వారికి పిండప్రదానాలు చేశారు. యలమంచిలి ఘాట్లో ఓ ముస్లిం కుటుంబం పుష్కర స్నానమాచరించింది. సిద్ధాంతం కేదారీ ఘాట్లో వీల్చైర్లు లేక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8 గంటలకే ఉచిత బస్సులు నిలిపివేత పుష్కర యాత్రికుల అవస్థలు కొవ్వూరు: పుష్కరాలకు తరలివచ్చే భక్తులను స్నానఘట్టాలకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రైవేటు ఉచిత బస్సులను ప్రతిరోజు రాత్రి 8 గంటల తరువాత నిలిపివేస్తుండటంతో భక్తులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉదయం 7నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నారు. కొవ్వూరు ప్రాంతానికి ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రాత్రివేళ ఎక్కువగా వస్తున్నాయి. ఏలూరు, ఖమ్మం ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు సైతం ఎక్కువగా తిరుగుతుంటాయి. రాత్రివేళ రైళ్లు, బస్సుల నుంచి దిగుతున్న యాత్రికులతోపాటు ప్రైవేటు వాహనాల్లో పార్కింగ్ జోన్లకు చేరుకున్న వారంతా సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం నడిచి పుష్కర ఘాట్లకు చేరుకోవాల్సి వస్తోంది. అప్పటికే ప్రయాణం చేసి అలసిపోయిన యాత్రికులు కాలినడకన ఘాట్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. పగటిపూట 250 ఉచిత బస్సులను నడుపుతున్న ప్రభుత్వం రాత్రివేళ కనీసం వాటిలో సగం బస్సులనైనా ఘాట్లవరకు నడపాలని యాత్రికులు కోరుతున్నారు. -
బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ
ములుగు : మంగపేట పుష్కరఘాట్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పుణ్యస్నానాల ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు ఉచిత షటిల్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యంకాలేదు. శుక్రవారం అమావాస్య అరుునా సాయంత్రం వరకు సుమారు 60వేల మంది భక్తులు తరలివచ్చారు. వీరిని గంపోనిగూడెం తరలించే క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా ప్రైవేటు వాహనాలు నిలిచిపోయూరుు. సీఐ శ్రీధర్రావు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భారీగా తరలివచ్చే వాహనాలు నిలిపేందుకు మంగపేట పార్కింగ్ ప్రాంతంలో మరో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కాగా, గంపోనిగూడెం నుంచి ఉచిత షటిల్ సర్వీసులు వేస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తన భార్యాపిల్లలతో ఎండలో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని వరంగల్కు చెందిన భక్తులు వి.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
మెట్రో-3 పూర్తయ్యేనా?
అడ్డంకిగా మారిన స్థల సేకరణ సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కొలాబా-బాంద్రా-సిబ్జ్ ప్రాంతాల మధ్య చేపట్టిన మెట్రో-3 ప్రాజె క్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుకు సంబంధించిన రైలు మార్గం జనావాసాల మధ్యనుంచి వెళ్తుండటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు కోసం బీఎంసీ కార్యాలయాలు, గోదాములు, రిజర్వుడు స్థలాలు, క్రీడా మైదానాలు, ఉద్యానవనాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల స్థలాలు సేకరించాల్సి ఉంటుంది. వీటికోసం ఆయా శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. బాధితుల ప్రత్యామ్నాయాలకు ఇబ్బంది ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టడానికి మెట్రో-3 నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టు పనులకు ‘పబ్లిక్ అర్బన్ ట్రాన్స్పోర్టు ప్రాజెక్టు’కు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో స్థల సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజె క్టుకు సంబంధించి మెట్రో రైలు పిల్లర్లకు, రైల్వే స్టేషన్ల నిర్మాణాలకు, మెట్లు, ఎస్కలేటర్ల నిర్మాణానికి భారీగా స్థలం సేకరించాల్సి ఉంటుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి స్థానికులనుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించినా, స్థలాలు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురవనుండటంతో ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు సఫలీకతమైతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అడ్డంకులు ఎదురయ్యే ప్రాంతాలు ⇒ వర్లీ-ఇంజినీరింగ్ హబ్ భవనం ఎదురుగా బీఎంసీకి చెందిన భద్రత శాఖ భవనం ఉంది. ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చేవరకు భవనం కూల్చివేసేందుకు బీఎంసీ అనుమతివ్వదు. ⇒ వర్లీ-సస్మీరా ఇన్స్టిట్యూట్ పరిసరాల్లో ఉన్న బీఎంసీ మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు బిల్డర్కు అప్పగించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన న్యాయ శాఖ వద్ద పెండింగులో ఉంది. ఇది క్లియర్ అయితే తప్ప మెట్రోకు స్థలం లభించదు. ⇒ ప్రభాదేవి-సిద్ధివినాయక్ మందిరం స్టేషన్ నిర్మాణం కోసం 15,254 చ.మీ. స్థలం కావాలి. అందుకు మందిరం పక్కనే ఉన్న నర్దుల్లా ట్యాంక్ మైదానం స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. ⇒ లోయర్పరేల్-సైన్స్ మ్యూజియం స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో ఉండడంతో దాన్ని స్వాధీనం చేసుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది. ⇒ ముంబెసైంట్రల్-నాయర్ ఆస్పత్రి విస్తరణ, ఆస్పత్రిలో ఎల్పీజీ గ్యాస్ చాంబర్ స్థలాన్ని మెట్రో-3 కి ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతున్నారు. ⇒ చర్చిగేట్-హుతాత్మ చౌక్ వద్ద ఉన్న పే అండ్ పార్కింగ్ స్థలాన్ని ఇచ్చేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ⇒ రాజకీయ పార్టీ కార్యాలయాలు-అసెంబ్లీ హాలు, మంత్రాలయ పరిసరాల్లో అనేక రాజకీయ పార్టీల కార్యాలయాలున్నాయి. మెట్రో-3 నిర్మాణానికి ఆ స్థలాలని ఖాళీ చేయించాలి. -
రిస్కీ జర్నీ
కిక్కిరిసిపోతున్న ఎంఎంటీఎస్ రైళ్లు రద్దీ వేళల్లో {పయాణికుల ఇబ్బందులు డిమాండ్ మేరకు బోగీలు పెంచని ద.మ.రైల్వే సిటీబ్యూరో మహా నగరంలో ఒక చోట నుంచి ఇంకోచోటికి ప్రయాణం ఎంతో కష్టతరంగా మారింది. ట్రాఫిక్ సమస్య, చాలీచాలని బస్సులు, అధ్వానపు రోడ్లతో నగరజీవి ప్రయాణమంటేనే హడలుతున్నాడు. ఈ దశలో నగరం నాలుగువైపుల నుంచి హైటెక్ సిటీకి మధ్య దక్షిణ మధ్యరైల్వే ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్(మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్) రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఊరటనిచ్చాయి. అయితే ఇప్పుడు ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సీట్లు లభించక ప్రయాణికులు గంటల తరబడి నిల్చొని ప్రయాణించవలసి వస్తోంది. కిటకిటలాడే బోగీల్లోకి దూరేందుకు అవకాశం లేక ఎంతోమంది ప్రయాణికులు మరో ట్రైన్ కోసమంటూ పడిగాపులు కాస్తూ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. సిటీబస్సు తరువాత ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థగా నిలిచే ఎంఎంటీఎస్ సేవలు రోజురోజుకు వ్యధాభరితమవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో కేంద్రం రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ సేవలపై ప్రత్యేక కథనం.. సగానికి పైగా స్టాండింగే.... ఫలక్నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్,ఫల క్నుమా-సికింద్రాబాద్ మార్గాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. లక్షా 70 వేల మంది ప్రయాణికులు పయనిస్తున్నారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోకి వచ్చే ఉద్యోగులు, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి హైటెక్సిటీ, మాదాపూర్లోని ఐటీ సంస్థలకు వెళ్లే సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆఫీసులకు చేరే సమయంలో, సాయంత్రం 4 గంటల నుంచి 7.30 వరకు తిరిగి ఇళ్లకు చేరే సమయంలో రద్దీ నెలకొంటోంది. ఈ సమయంలోనే ప్రయాణికుల డిమాండ్కు తగినన్ని రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సీట్ల సామర్ధ్యానికి మించి 70 శాతం ప్రయాణికులు నిల్చొనే ప్రయాణించవలసి వస్తోంది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్లో మొత్తం 715 సీట్లు ఉంటే రద్దీ వేళ ల్లో మరో 1000 మందికి పైగా నిలబడవలసి వస్తోంది. బోగీలు పెంచడమే పరిష్కారం... ఎంఎంటీఎస్ ట్రైన్కు ప్రస్తుతం 9 బోగీలే ఉన్నాయి. వీటిలో ట్రైలర్కార్ బోగీలో 78 సీట్లు ఉంటే, మోటార్కార్ బోగీలో 98 సీట్లు ఉన్నాయి. సగటున ఒక ట్రైన్లో 718 మంది మాత్రమే ప్రయాణించగలరు. కానీ డిమాండ్కు తగినవిధంగా బోగీలు పెరగకపోవడం వల్ల మరో వెయ్యిమంది అదనంగా నిలబడి పయనిస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 9 బోగీలను 12కు పెంచ డమే ఏకైక పరిష్కారం. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. లోకల్ట్రైన్ ఆయువుపట్టుగా ఉన్న ముంబయి నగరంలో ఒక్కో ట్రైన్లో 16 బోగీలు ఉన్నాయి. కోల్కత్తాలోనూ లోకల్ రైళ్లు 15 బోగీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తుండగా, మన సిటీ ఎంఎంటీఎస్ మాత్రం 9 బోగీలకే పరిమితమైంది. ఇదీ ఎంఎంటీఎస్ ప్రస్థానం .... మల్టిమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నగరంలో 2003 లో ప్రారంభమైంది. మొదట్లో ఒక ట్రైన్కు 6 బోగీలే ఉండేవి. 2003 నుంచి 2007 వరకు 6 బోగీలు ఉన్న రైళ్లు ప్రతి రోజు 65 ట్రిప్పులు తిరిగేవి. మొదట్లో 30 వేల మంది ఉన్న ప్రయాణికులు క్రమంగా 50 వేలకు పెరిగారు. 2007 లో బోగీల సంఖ్యను 8 కి పెంచారు. సర్వీసులు కూడా 84 కు పెరిగాయి. 2009 లో కొన్ని సర్వీసులకు 9 బోగీలు పెంచారు. మరికొన్ని 8 బోగీలతోనే నడిచాయి. ఆ ఏడాది సర్వీసుల సంఖ్య 104 కు పెరిగింది. ప్రయాణికులు సైతం లక్ష దాటారు. 2011లో అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులకు 9 బోగీలు పెంచారు. ఆ ఏడాది నుంచి సర్వీసులు కూడా 121 కి పెరిగాయి. ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంది. 2012-13 నాటికి ప్రయాణికుల సంఖ్య 1.5 లక్షలకు పెరిగింది. {పస్తుతం లక్షా 70 వేల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. -
రోడ్డుపై బంగారం కోసం అన్వేషణ
వేములపల్లి (నల్లగొండ): నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని రోడ్డుపై బంగారం ముక్కలు దొరుకుతున్నాయంటూ జనం వెతుకులాట ప్రారంభించటం కలకలం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం మండలంలోని వేములపల్లి- మిర్యాలగూడ రహదారిలో ఒక లారీ వెళ్లిందని, అందులో నుంచి బంగారం ముక్కలు జారి పడ్డాయని వదంతులు వచ్చాయి. ఒకరికొకరు అనుకోవటం ద్వారా విన్న జనం బంగారం ముక్కల కోసమంటూ రోడ్డుపైకి చేరారు. చిన్నా పెద్దా అంతా కనకాన్వేషణలో పడటంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బంగారం రంగులో మెరుస్తున్న లోహపు ముక్కలు కొందరికి దొరకటంతో అది బంగారమేనని చర్చించుకున్నారు. అంతలోనే అటుగా వచ్చిన పోలీసులు కూడా విధులు మరిచి బంగారం కోసం వెతుకులాటలో మునిగిపోయారు. సాయంత్రానికి గాని ఈ హడావుడికి పుల్స్టాప్ పడలేదు. -
పార్కింగ్ స్థలం చూపితేనే వాహనం రిజిస్ట్రేషన్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన సాక్షి, ముంబై: ఇకపై యజమానులు పార్కింగ్ స్థలం చూపిస్తేనే వారి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని బొంబాయి హైకోర్టు సూచించింది. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు, రోడ్డు, ఫూట్పాత్పై ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ‘జనహిత్ మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు సూచనలు చేసింది. అస్తవ్యస్తమైన పార్కింగ్, నగరంలో పెరుగుతున్న వాహనాల సమస్యను ఎలా అధిగమిస్తారని న్యాయమూర్తులు నరేష్ పాటిల్, అజయ్ గడ్కరిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని, బీఎంసీని ప్రశ్నించింది. వచ్చే ఐదేళ్లకు మీ ప్రణాళిక ఏమిటని నిలదీసింది. రోడ్లపై కార్లను నిలపడాన్ని అనుమతించకూడదని ఆదేశించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ముంబైలోనే నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు గత ఐదేళ్లలో రూ.25 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది జస్బీర్ సలుజా కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ప్రభుత్వంపై మరింత మండిపడింది. ఇలా చేయడంవల్ల ప్రభుత్వ ఖజానాలో భారీగానే ధనం చేకూరుతుంది, కానీ రాకపోకలు సాగించే జనానికి తగినంత స్థలం లేకపోవడం వల్ల ప్రయోజనమేంటని కోర్టు నిలదీసింది. ప్రభుత్వం స్కైక్ వాక్లు నిర్మించిందని, కానీ వాటిని ప్రజలు వినియోగించడం లేదన్న న్యాయవాది వ్యాఖ్యలను కూడా కోర్టు తిరస్కరించింది. ‘‘మీరు నిర్మించిన స్కై వాక్లు ప్రణాళికాబద్ధంగా లేవు. వాటిపై లైట్లు లేనందున అవి మహిళలకు సురక్షింతం కావు. వృద్ధులు వాటిపైకి ఎక్కి, దిగలేరు’’ అని మందలించింది. ‘‘విదేశాల్లో వాహన యజమానులు బాటసారులను గౌరవిస్తారు. వారికి రోడ్డు దాటే అవకాశం ఇస్తారు. కాని మనదేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వాహన యజమానులను ఆదరిస్తారు’’ అని ధర్యాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థను మార్చాలంటే ముందు వాహన యజమానులు పార్కింగ్ స్థలం చూపించాలి. ఆ తరువాతే ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ పనులు జరగాలి. అప్పుడే నగరంలో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పడతాయని కోర్టు అభిప్రాయపడింది. -
'ట్రాఫిక్ సమస్యలేని నగరంగా హైదరాబాద్'
హైదరాబాద్: తెలంగాణ రహదారుల అభివృద్ధి కోసం రూ.14 వేల కోట్లు కేటాయించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తమ రాష్ట్రం గుండా వెళుతున్న జాతీయ రహదారిని పొడిగించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. -
చిరు వ్యాపారులకు చుక్కలు
ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది. కడప జిల్లాలో సర్వే ఇలా... జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్లైన్లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే... ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది. కడప జిల్లాలో సర్వే ఇలా... జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్లైన్లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే... ఇటీవల సుప్రీం కోర్డు ఆదేశాలు జారీ చేసిన తరువాత సర్వే నిర్వహించిన వారికే ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద కేవలం 35,523 మంది వివరాలే ఉన్నాయి. గతంలో కేవలం గుర్తింపు పేరుతో నామమాత్రపు సర్వేలు చేశారే తప్ప వారి నుంచి పూర్తి వివరాలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఏళ్లు గడుస్తుండటంతో నమోదు చేసుకున్న వారు ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో స్థలాలు ఎక్కడా... ప్రస్తుతం గుర్తించిన వారికన్నా స్థలాలు ఇచ్చేందుకు మున్సిపాలిటీల్లో కసరత్తు జరగడం లేదు. కనీసం స్థలాలు ఉన్నాయా అంటే అవీలేవు. ఉన్న స్థలాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. అయినా మున్సిపల్ కమిషనర్లు కానీ, టౌన్ప్లానింగ్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా అన్న అనుమానం వ్యాపారులను పీడిస్తోంది. కేవలం ఎదురు చూపులు, పోలీసు వేధింపులు తప్ప తమకు ఎలాంటి న్యాయం జరగదన్నది వ్యాపారుల వాదన. -
‘లింక్’ కుదర్లే
రేడియల్ రోడ్లు... ట్రాఫిక్ సమస్యకు హెచ్ఎండీఏ ఎంచుకున్న పరిష్కార ‘మార్గం’. ఇన్నర్ రింగ్ రోడ్డుకు...ఔటర్ రింగ్ రోడ్డుకు ‘లింక్’ పెట్టడం ద్వారా రాజధాని నగరంలో ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చాలనే ప్రయత్నం. నిత్యం పెరుగుతున్న వాహనాలు... అంతే స్థాయిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు... పొరపాటున ఒక్క మోటార్ సైకిల్ ఆగినా రోడ్లపై వాహనాల బారులు... ఇవి నగర జీవికి నిత్యానుభవాలు. ‘లింక్’ రహదారులతో ఈ కష్టాలు తప్పించాలనేది హెచ్ఎండీఏ యత్నం.కాస్తంత దృష్టి పెడితే సిటీ జనానికి ఎంతో మేలు చేసే ఈ రహదారులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. నిధులు విదల్చనంటోంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో చుక్కెదురైంది. రేడియల్ రోడ్ల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా రూ.300 కోట్లు కావాలని ప్రతిపాదించగా... బడ్జెట్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో వీటి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యే నాటికి నగరంలో మొత్తం 33 రేడియల్ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. వీటిలో ఇప్పటికే ఏడింటిని (53.72 కి.మీ. మేర) హెచ్ఎండీఏ, ఆర్అండ్బీలు సంయుక్తంగా నిర్మించగా...జాతీయ రహదారుల మీదుగా ఉన్న మరో ఐదింటిని (83.35 కి.మీ.) నేషనల్ హైవే అథార్టీ నిర్మించింది. జీడిమెట్ల, ఈసీఐఎల్ ఎక్స్రోడ్, నాగోల్, షేక్పేట్, కుషాయిగూడ ప్రాంతాల్లో మరో 5 రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని జైకా నిధులతో గత ఏడాది హెచ్ఎండీఏ చేపట్టింది. మిగిలిన 16 రేడియల్ రోడ్లనూ పూర్తి చేసి ... నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్ఎండీఏ భావించింది. గత ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి. కొత్త ప్రభుత్వమూ అదే దారిలో వెళ్లడం అధికారులను విస్మయపరిచింది. పెండింగ్లో ఉన్న 16 రేడియల్ రోడ్లకు సంబంధించి ఇంతవరకు భూ సేకరణ జరుగలేదు. వీటిలో 6 రహదారులకు అసలు సర్వే కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తొలి దశలో కీలకమైన 10 రేడియల్ రోడ్లకుసర్వే చేయాలని నిర్ణయించినా... కేవలం నాలిగింటితో సరిపెట్టేశారు. సర్వే పూర్తి కాకపోవడంతో భూసేకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో రవాణా గ్రిడ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం రాజధాని నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణంపై దృషి ్టపెట్టకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నరకం తప్పదా..? రాజధాని చుట్టూ 158 కి.మీ. దూరం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుకు నగరం నుంచి అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రోరైల్ వంటివి ప్రవేశపెట్టినా ప్రయోజనం ఉండదంటున్నారు. కోర్ ఏరియాలో రోడ్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య నిత్యం నరకం చూపిస్తోంది. ప్రధాన ప్రాంతాలను ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపితే...50 శాతం ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని గతంలో హెచ్ఎండీఏ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితి తల్లకిందులవడంతో రేడియల్ రోడ్లపై చేతులెత్తేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడమో... లేదా జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి శాఖల నుంచి నిధులు మళ్లించడమో చేస్తే తప్ప అవి సాకార మయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పాత భూసేకరణ చట్టం ప్రకారం కీలకమైన 16 రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.1470 కోట్లు వరకు ఖర్చవుతుందని అప్పటి ఉమ్మడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి రావడంతో ఈ వ్యయం మరింత పెరగనుంది. మిగిలిపోయిన 16 రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
నెలరోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో మీరే చూస్తారు.. ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతామో. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం అంటే అక్కడక్కడా కానిస్టేబుళ్లను పెడితే సరిపోదు. ఆధునిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను వినియోగించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నగర కమిషనరేట్ స్థాయి పెంపు, నేరాలకు అడ్డుకట్ట తదితర అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : కమిషనరేట్ పరిధి 80 కిలోమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు? సీపీ : ఇప్పటికిప్పుడే దీనిపై వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఈ నెలాఖరులోగా రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కమిషనరేట్ పరిధి ఎలా ఉండాలి, సిబ్బంది, విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో ఇస్తుంది. అప్పటి వరకు ఇంతే. ఇప్పటికిప్పుడు విషయాన్ని స్పెక్యులేట్ చేస్తే కొందరికి మంచి జరిగితే, కొందరికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సాక్షి : నగరంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. పలు చిట్ఫండ్సంస్థల మూసివేతతో రూ.500 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగక్కుండా ఏం చేయబోతున్నారు? సీపీ : ఈ విషయంలో మోసపోతున్న వారి బాధ్యత కూడా కొంత ఉంది. ప్రారంభంలో తెలియక రిజిస్టర్ కాని సంస్థల్లో సభ్యులుగా చేరారంటే అర్థం ఉంది. మోసాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా దురాశకుపోయి స్కీములు, చిట్స్లో చేరి మోసపోయేవాళ్లకు సాయం చేయమంటే ఎలా? తప్పుడు కంపెనీల్లో పెట్టుబడి పెడితే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుంది. పోలీసు యంత్రాంగం వీటి పైనే దృష్టిసారిస్తే దౌర్జన్యాలు, దొంగతనాలు, అల్లర్లను అరికట్టేది ఎవరు? సాక్షి : నగర విస్తరణతో పాటు వ్యాపారాలు విస్తరించాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా పరంగా తీసుకునే చర్యలు ఏంటి? సీపీ : వ్యాపార సముదాయాలకు వచ్చే వారికి భద్రత కలిపించాల్సిన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాలదే. ఇది ఎస్టాబ్లిష్ చట్టంలోనే ఉంది. ఖచ్చితంగా వారు రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాము. ఇక బహిరంగ ప్రదేశాల్లో పౌరుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సాక్షి : గొలుసు దొంగతనాలు (చైన్ స్నాచింగ్స్) నిలువరించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? సీపీ : ఇది మాకో ముఖ్యమైన సవాల్, గొలుసు దొంగతనాల్లో విద్యార్థులు, కొందరు యువ కానిస్టేబుళ్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంటికి కన్నం వేసి రూ.లక్షలు కాజేసిన దానికంటే ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చోరీలు మహిళలను భయానక స్థితిలోకి నెడతాయి. చైన్ స్నాచింగ్స్ను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం. -
ట్రాఫిక్ సమస్యకు ‘షేరింగ్’తో చెక్!
సాక్షి, ముంబై: రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్ను నియంత్రించలేక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వాహనాల సంఖ్య తగ్గితేనే ట్రాఫిక్ను నియంత్రించగలమని ట్రాఫిక్ విభాగం తేల్చేయడంతో వాహనాల సంఖ్యను తగ్గించే దిశగా రవాణా విభాగం చర్యలు తీసుకుంటోంది. సొంత కార్లలో ఆఫీసులకు వెళ్లేవారు ప్రజారవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తే వాహనాల సంఖ్య తగ్గే అవకాశముందని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సొంత వాహనాలకు బదులుగా షేర్ ట్యాక్సీలను వినియోగించుకునేలా చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు రహదారులపై ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ముందుగా అభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు రవాణా విభాగా అధికారి ఒకరు తెలిపారు. వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆవరణలో షేర్ ట్యాక్సీలను అందుబాటులో ఉంచడం ద్వారా ఒకే ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులంతా ఈ ట్యాక్సీని ఆశ్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంత ప్రయాణికుల కోసం కూడా ఈ సౌకర్యం కల్పించడం ద్వారా ఒకే రూట్లో వెళ్తున్న ట్యాక్సీల రద్దీని కూడా కొంత మేర తగ్గించవచ్చని చెబుతున్నారు. షేర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రావడంతో కార్లు ఉన్న వారు కూడా తమ కార్లను ఇంటి వద్దనే ఉంచుతారని, అంతేకాకుండా వీరికి పార్కింగ్ రుసుము చెల్లించే ఖర్చు కూడా తప్పుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నవీముంబై, ఠాణే తదితర సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు షేర్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ములుండ్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు, అంధేరి నుంచి చర్చ్గేట్ వరకు, బాంద్రా నుంచి పరేల్ వరకు షేర్ ట్యాక్సీలను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. దీంతో షేర్ ఆటోల కోసం స్టాండ్లను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని గుర్తించాలని రవాణా విభాగం అధికారులు సూచించారు. ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ప్రయాణికులకు తెలపడం కోసం ప్రకటనలు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైవరు పూర్తి వివరాలతోపాటు షేర్ ఆటో చార్జీల వివరాలను ఆటో స్టాండ్లు, వెబ్సైట్లలో పొందుపర్చాలని, దీంతో ప్రయాణికులు కూడా తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన ఆటో స్టాండ్ను ఆశ్రయిస్తారని చెబుతున్నారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే చాలా మంది ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ఖార్గర్ నుంచి పరేల్ వరకు రోజు ట్యాక్సీలో వెళ్తాను. నాతోపాటు ఈ మార్గంలో వెళ్లే మరికొంతమంది ప్రయాణికులను కూడా డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కించుకుంటాడు. అయితే నేను డ్రైవరుకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నా ఒక్కడినే తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తే అతను అడిగినంత చార్జీ ఇవ్వాల్సి వస్తుంది. అదే మరికొంత మంది ట్యాక్సీలో ఎక్కడం ద్వారా చార్జీని మేమందరం షేర్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో షేర్ ట్యాక్సీలు నడుస్తున్నాయ’న్నారు. ఇదిలాఉండగా ఈ ప్రక్రియను తాము కూడా స్వాగతిస్తామని ముంబై ట్యాక్సీమెన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్ క్వాడ్రోస్ తెలిపారు. -
నగరం ‘హై’ఫైగా ఉండాలి
హైదరాబాద్ ట్రాఫిక్పై సీఎం సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఉప మఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు మహేందర్రెడ్డి, టి.పద్మారావు, జీహెచ్ఎంసీ, పోలీసు, రవాణా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ట్రాఫిక్ సమస్యపై సమీక్షించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల భద్రత, వాహనదారులు, పాదచారుల సౌకర్యం, ఆర్టీసీ బస్సుల సేవలు, డంప్యార్డులు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. పెరుగుతున్న జనాభాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టు సిస్టమే పరిష్కారమని ఆయన చెప్పారు. నగరంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు.అలాగే బస్టాప్లను ఆధునికీకరించాల్సి ఉందని, ఎల్సీడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. ముంబైలో ప్రభుత్వం ట్రాన్స్పోర్టు సిస్టం చాలా బాగా పనిచేస్తోందని మంత్రి మహేందర్రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేయాలని కేసీఆర్ సూచించారు.రవాణా, ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని, ఇందుకోసం ఓ సమావేశాన్ని కూడా పెట్టుకోవాలని అడ్మిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నోడల్ ఏజెన్సీగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. పోలీసు శాఖకు కొత్తగా సమకూరనున్న 1650 ఇన్నోవా వాహనాలు ఆగస్టు నాటికి కంపెనీ నుంచి డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.