వేములపల్లి (నల్లగొండ): నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని రోడ్డుపై బంగారం ముక్కలు దొరుకుతున్నాయంటూ జనం వెతుకులాట ప్రారంభించటం కలకలం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం మండలంలోని వేములపల్లి- మిర్యాలగూడ రహదారిలో ఒక లారీ వెళ్లిందని, అందులో నుంచి బంగారం ముక్కలు జారి పడ్డాయని వదంతులు వచ్చాయి. ఒకరికొకరు అనుకోవటం ద్వారా విన్న జనం బంగారం ముక్కల కోసమంటూ రోడ్డుపైకి చేరారు.
చిన్నా పెద్దా అంతా కనకాన్వేషణలో పడటంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బంగారం రంగులో మెరుస్తున్న లోహపు ముక్కలు కొందరికి దొరకటంతో అది బంగారమేనని చర్చించుకున్నారు. అంతలోనే అటుగా వచ్చిన పోలీసులు కూడా విధులు మరిచి బంగారం కోసం వెతుకులాటలో మునిగిపోయారు. సాయంత్రానికి గాని ఈ హడావుడికి పుల్స్టాప్ పడలేదు.
రోడ్డుపై బంగారం కోసం అన్వేషణ
Published Thu, Feb 5 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
- అగ్గే.. పిడుగు కాదు!
- కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
- లైవ్ రిపోర్టింగ్లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
Advertisement