-
'వామ్మో.. పులి' కాదు ‘గ్రామ సింహం..' అసలు విషయం తెలిస్తే షాక్..
ఆదిలాబాద్: మండలంలోని సావర్గాంలో ఆదివా రం పులిని పోలిన శునకం దర్శనమిచ్చింది. ఇది పులి పిల్లనా? లేక శునకమా? అని సందిగ్ధంలో పడ్డారు. గ్రామానికి చెందిన రంగన్న అనే మేకల కాపరి తన మేకలకు కాపలాగా శునకాన్ని పెంచుతున్నాడు. ఈ మధ్య తాంసి, భీంపూర్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన పెంపుడు కుక్కకి పులిని పోలిన రంగులను అద్దాడు. విచిత్రంగా ఉన్న శునకం గ్రామంలోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. శునకాన్ని పెంచుతున్న మేకల కాపరిని గ్రామస్తులు టైగర్ రంగన్న అని పిలుస్తున్నారు. -
మహారాష్ట్ర సరిహద్దులో పులి
తాంసి: తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు లోని పెన్ గంగ పరీవాహక ప్రాంతం వెంట పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మహా రాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి వచ్చిన పులి పెన్గంగ ఒడ్డున మహారాష్ట్ర వైపున్న గ్రామాల్లో సంచరిస్తూ శుక్రవారం రాత్రి కనిపించింది. నదికి అవతల మహారాష్ట్ర వైపు చిన్నార్లి గ్రామానికి సమీపంలోని పంటచేల వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కనిపించగా.. వాహనాల డ్రైవర్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. నదికి అటువైపు సంచరిస్తున్న పులి నది దాటి తెలంగాణ వైపు వచ్చే అవకాశం లేకపోలేదు. గత ఫిబ్రవరిలో ఒకపులి, మూడు పిల్లలతో భీంపూర్ మండలంలోని పలు గ్రామాల శివారులో సంచరించడం తెలిసిందే. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
చిక్కిన చిరుత.. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
మహబూబ్నగర్: రెండేళ్ల నుంచి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో శనివారం రాత్రి చిక్కింది. రెండు నెలల నుంచి మరికల్ మండలం రాకొండ శివారులోని గుట్టపై ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనించి అక్కడే ఉంటుంది. నిత్యం రాత్రి కాగానే వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపై ఎక్కడో ఒక చోట దాడి చేసి ఆకలి తీర్చుకుంటుంది. చిరుత పులిని పట్టుకోవాలని పది రోజుల కిందట గ్రామస్తులు నారాయణపేట అటవీ శాఖ అధికారులను సంప్రందించారు. మూడు రోజుల కిందట రాకొండ గుట్ట సమీపంలో బోనులో మేకపిల్లను ఉంచి చిరుతను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు తల్లి చిరుత బోనులో చిక్కడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆదివారం మేకపిల్లను బయటకు పంపించి క్రేన్ సాయంతో బొలెరొ వాహనంలో శ్రీశైలం అడవిలోకి తరలించారు. బోనులో చిక్కిన చిరుత మండలంలో రాకొండ, పూసల్పహాడ్, మాద్వార్ తదితర గ్రామాల్లోని పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఈ చిరుతకు సంబంధించిన రెండు చిరుత పిల్లలు తప్పించుకోవడంతో వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారి వీణావాణి తెలియజేశారు. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు పట్టుబడిన చిరుతను ఆదివారం అటవీ శాఖ వారు బోనులో బంధించి నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం గిరిజ గుండాల బేస్ క్యాంపు సమీపంలో అడవిలోకి వదిలిపెట్టారు. -
కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్!
ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్కు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ — Prashant pandey (@prashant_lmp) September 30, 2023 -
నల్లమలకు పులికూనలు
నల్లమల అభయారణ్యానికి మరో మూడు పులికూనలు రానున్నాయి. తిరుపతి జూపార్కులో ఉన్న వీటిని చిన్నమంతనాల బీటు పరిధిలో వదిలిపెట్టేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 11 నెలలుగా జూ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను వాటి సహజ సిద్ధ ఆవాసానికి తరలించేందుకు ముందుగా అడవిలో ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా చేసి ఆపై అడవిలో వదలనున్నారు. పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో పెరుగుతున్న పులి పిల్లలు త్వరలోనే వాటి సహజసిద్ధ వాతావరణమైన నల్లమల అభయారణ్యంలోకి అడుగిడనున్నాయి. పులి పిల్లలను నల్లమలకు తరలించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. సుమారు ఎనిమిది నెలల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి స్థానికులకు కనిపించిన విషయం పాఠకులకు విదితమే. ఫిబ్రవరి మొదటి వారంలో పులి పిల్లలు దొరికిన నాటి నుంచి తల్లి పులి కోసం అన్ని ప్రాంతాలను అన్వేషించిన అటవీశాఖ అధికారులు తల్లిపులి దొరకక పోవటంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల జూ పార్కులోనే మృతి చెందింది. ఈ క్రమంలో పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. క్రమేపి అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. నల్లమలలో అనువైన ప్రాంతాల పరిశీలన పులిపిల్లలను సంరక్షించేందుకు అవసరమైన ప్రాంతాలను అడిషనల్ పీసీసీఎఫ్ ఏకే.నాయక్, ఆంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరక్టర్ శాంతి ప్రియ పాండే, రాహుల్ పాండే లాంటి ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజుల క్రితం నల్లమలలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతమైన చిన్న మంతనాల బీటు పరిధిలోని పెద్దపెంట ప్రాంతాన్ని అనువుగా ఉందని నిర్ధారించారు. దీంతో పెద్దపెంటలోనే పులికూనలను సంరక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దపెంట ప్రాంతంలో వాతావరణం పులులు సంచరించేందుకు అనువుగా ఉండటంతో పాటు, అక్కడి శీతోష్ణస్థితి వన్యప్రాణులు జీవించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పులుల సంరక్షణకు సంబంధించి ఎన్ఎస్టీఆర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పులిపిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు: నల్లమలలోని పెద్దపెంట వద్ద పెద్దపులి పిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సహజంగా తల్లిని వీడిన వన్యప్రాణుల పిల్లలకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు వేటాడే ప్రక్రియను నేర్పిస్తారు. తరువాత వాటిని అభయారణ్యంలో వదిలి పెట్టే రీ వైల్డింగ్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సహజంగా కొత్తపల్లిలో దొరికిన నాటికి పులిపిల్లల వయస్సు మూడు నెలలు. నాటి నుంచి నేటి వరకు 11 నెలల కాలంగా ఆ పిల్లలు వేటాడే తమ సహజసిద్ధ గుణాలను మరిచి కేవలం జూ అధికారులు అందజేసే అహారంతోనే జీవిస్తున్నాయి. అడవికి రారాజుగా పేరొందిన పులుల విషయంలో ఈ పక్రియ అంత మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. పులి అంటేనే వన్యప్రాణులను వేటాడే స్వభావం కలిగింది. అటువంటి పెద్దపులి పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి అడవి కుక్కలు, అడవి పందులతో పాటు స్వజాతికి చెందిన పులుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాక దొరికిన జంతువుల పిల్లలకు రీ వైల్డింగ్లో భాగంగా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు నేర్పిస్తారు. ఎన్క్లోజర్లలో పెరిగే పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 జంతువులను స్వంతంగా వేటాడి తినగలిగిన నాడే దాన్ని అభయారణ్యంలోకి వదిలి వేసే పరిస్థితిలు ఉంటాయి. అలా వేటాడలేక పోయిన నాడు వాటికి ఎదురు పడిన జింకల కొమ్ములు, అడివి పందుల దంతాల ధాటికి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాటు మగపులులు ఎదురుపడితే మేటింగ్కు ప్రయత్నిస్తాయని, అలా కాకుండా ఆడపులులు ఎదురు పడితే వీటిపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పలువురు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందు వల్లే ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా పులిపిల్లలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు పుట్టడం అపూర్వ సంఘటన తిరుపతి వెంకటేశ్వర జూ పార్కులో తల్లిపులి నుంచి విడిపోయి అధికారుల సంరక్షణలో పెరుగుతున్న పులి పిల్లల పుట్టుక అపురూపమైందిగా పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై పర్యావరణ ప్రేమికుల్లో కొంత మేర ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాన్పులో నాలుగు పులిపిల్లలు పుట్టడంతో పాటు, అవి తల్లి పులి నుంచి విడిపోయి బాహ్య ప్రపంచానికిలోకి రావటం ఎంతో అరుదని వారు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆడపులి పిల్లల వల్ల భవిష్యత్తులో మరెన్నో లాభాలు ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ పులుల సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బోనులో చిక్కిన హంతక పులి
మైసూరు: ఇటీవల బాలున్ని చంపి తిన్న పులిని అటవీ శాఖాధికారులు పట్టుకోగలిగారు. హెచ్డీ కోటె తాలూకా కల్లహట్టి గ్రామంలో రైతు కృష్ణనాయక, మాదేవీబాయి దంపతుల కుమారుడు చరణ్ నాయక్ (9)ను తీసుకుని సెప్టెంబర్ 4న పొలానికి వెళ్లారు, అప్పుడు పులి బాలున్ని ఎత్తుకెళ్లి చంపి తినింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పులిని వెంటనే పట్టుకోవాలని ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం కూడా పులిని బంధించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో దసరా వేడుకల కోసం మైసూరుకు వచ్చిన గజ బృందంలోని అర్జున్ ఏనుగు ద్వారా పులి కోసం అడవుల్లో అన్వేషణ సాగించారు. సుమారు 16 రోజులపాటు అన్వేషణ సాగించినా ఫలితం దక్కలేదు. దీంతో అర్జున్ ఏనుగు వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా వెతుకులాట చేయగా, పులి కదలికలు కనిపించాయి. ఆ కదలికల ఆధారంగా పులి తరచూ తిరిగే స్థలాలను ఊహించారు. మంగళవారం రాత్రి కల్లటి గ్రామానికి చెందిన తావరే నాయక అనే వ్యక్తి పొలం వద్ద బోనును ఉంచగా పులి అందులోకి చిక్కింది. తరువాత పులిని నాగరహోలె అడవికి తరలించారు. -
11 దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి గుంటూరులో..
గుంటూరు డెస్క్: దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండువేలలోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కృష్ణా, బాపట్ల అభయారణ్యం ప్రాంతంలో వీటిజాడ గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 11 దేశాల్లో మాత్రమే.. చేపలను వేటాడి జీవించే ఈ అరుదైన జాతి పిల్లిని ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలుస్తారు. దీని శాసీ్త్రయ నామం రౖపైనెలూరుస్ వైవెర్రినస్ (prionailurus viverrinnus). మడ అడవులు, చిత్తడి నేలలలో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే వీటి జాడను కనుగొన్నారు. 2013లో మడ అడవులపై రీసెర్చ్ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,500 నుంచి 2,000 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ జాతులు ప్రత్యుత్పత్తి చెందకపోతే త్వరలోనే అంతరించిపోతాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి హెచ్చరించింది. రాత్రివేళల్లోనే వేట.. 78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరిగే ఈ బావురు పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులికంటే చిన్నదిగానూ ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేస్తుంది. ఈ వాసన గమనించిన ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు. పర్యావరణ పరిరక్షణకు దోహదం.. సముద్రంలో ఉండే పలు రకాల చేపలు పెట్టే గుడ్లు, కొన్ని రకాల చేపలను తినే పలు రకాల చేపలను ఈ బావురు పిల్లి తింటుంది. దీనివల్ల ఇది సంచరించే ప్రాంతంలో మత్స్య సంపద పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుంది. తీర ప్రాంత ప్రజలకు అవగాహన అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ మధ్య బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్లో లెక్కింపునకు చర్యలు.. అటవీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వీటి జాడను కనుగొన్నామని అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవరావు తెలిపారు. అక్టోబర్ నుంచి వీటి సంఖ్యను లెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
పులిని ఫాలో చేసిన ఎలుగు, అది వెనక్కి తిరిగినంతనే శరణుకోరుతూ..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని షాక్కు గురిచేసింది. పులి, ఎలుగుబంటి మధ్య చోటుచేసుకున్న విచిత్రమైన సీన్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పులి వెనుకగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ ఎలుగుబంటి.. పులికి దూరంగా వెళ్లేందుకు బదులు.. వెనుక కాళ్లపై దానిముందు నిలబడి శరణాగతి వేడుతున్నట్లు చూస్తుంది. కొంతసేపటి తరువాత ఆ ఎలుగుబంటి పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే .. ‘ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుందని’ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. అడవిలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నది’ అని రాశారు. మరో యూజర్.. ‘ఎలుగుబంటి ఆ పులి దృష్టిని మళించడానికి ప్రయత్నించింది. తనకు తానుగా లొంగిపోతున్నట్లు తెలియజేసిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్! While people in safari wanted- fight hone de- it was an affable interaction… Tiger use their tails to communicate with each other. An upright, slowly wagging tail indicates friendliness. Bear understood the language☺️ pic.twitter.com/huDRjStLot — Susanta Nanda (@susantananda3) September 3, 2023 -
చిరుత ఎదురుపడితే ఇలా చేయండి చాలు..! వెంటనే..
కుమరం భీం: ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి? దాని భారినుంచి ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై డెప్యూటీ కన్జర్వేటర్, జన్నారం ఎఫ్డీవో మాధవరావు పలు సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో కాలినడకన వెళ్లిన బాలికను చిరుతపులి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తప్పించుకునే మెలకువల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే.. పిల్లి జాతి జంతువు.. చిరుతపులి పిల్లి జాతికి చెందిన సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్తే పులి కనిపిస్తుంది. కానీ చిరుతపులి కనబడటం చాలా తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరిణితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలో ఇవి గుహల్లాంటి ఆవాసాల్లో నివసిస్తాయి. జింకలు, సాంబర్లు, అడవి పందులను చిరుతలు ఎక్కువగా వేటాడుతాయి. పైకి చూస్తే శరీరంపై మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా రెండు చిరుతలకు ఒకే విధంగా ఉండవు. ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలి? దేశంలో పులుల సంఖ్య కంటే చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్లో సుమారుగా 80 వరకు చిరుతలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిరుత పులుల జాతి ఉంది. చిరుతలు జనావాసాల్లోకి ఊరికే రావు. వాటికి ఆహారం, నీటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనాల్లోఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మఽ ద్యకు వచ్చిన చిరుతను బంధించడం సులువుకాదు. చిరుత పులి ఎంతదూరంలో ఎదురుపడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో మనుషులపై దాడి చేయాల్సిన అవసరం చిరుతకు ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరవాలి. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తమకన్నా పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా చిరుతలు దాడికి దిగవు. చిరుత పులి ఎదురుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చిరుత వెంటపడి దాడిచేసే అవకాశం ఉంది. ఒకవేళ పారిపోతే ఎంత పరుగెత్తినా చిరుత వేగం ముందు మనం నిలువలేం. కాబట్టి చిరుత కాస్త దూరంలో ఎదురుపడితే చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవడం, దగ్గరగా ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి నడిస్తే చిరుత అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెట్లు ఎక్కినా వేటాడాలనుకునే చిరుత సులభంగా చెట్లు ఎక్కుతుంది. కూలీలు ఏంచేయాలి? అడవిలోకి పనికి వెళ్లే కూలీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుత పులి వెనుక వైపు నుంచి వేటాడుతున్నందున కూలీలు మాస్కులు, తలకు వెనుకవైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఫేస్ మాస్కులు ధరించి, మాట్లాడుకుంటూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిరుత పులి బారి నుంచి తప్పించుకోవచ్చని మాధవరావు సూచించారు. -
సరిహద్దుల్లో పులి సంచారం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సరిహద్దు ప్రాంతమైన మన్యం జిల్లా భామిని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వార్త దావానంలా వ్యాపించడంతో గుణుపూర్ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలమాధవ పాఢి సిబ్బందితో గుణుపూర్లోని అటవీ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి పశువులను మేతకు విడిచిపెట్టవద్దని హెచ్చరించారు. ఇదిలాఉండగా భామిని ఫారెస్ట్ సిబ్బంది పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పులి అడుగుల నమూనాలను సేకరించారు. ఒడిశా, ఆంధ్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు ఈ మేరకు దీనిపై స్పందించి, సంయుక్తంగా అడవుల్లో నిఘా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ రేంజర్ పాఢి పేర్కొన్నారు. -
అమ్మో పులి..!
పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో పులి సంచారం అలజడి రేపుతోంది. ఏనుగుల భయం వీడిందనేసరికి పులి సంచారంతో ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. భామిని మండలం చిన్నదిమిలి–పెద్దిదిమిలి గ్రామాల సమీపంలో బుధవారం పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. చిన్నదిమి లి క్వారీ సమీపంలో మంగళవారం రాత్రి వింత జంతువు అలికిడి గుర్తించినట్టు వాచ్మన్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ ఫారెస్ట్ రేంజర్ తవిటినాయుడు ఆధ్వర్యంలో కొత్తూరు సెక్షన్ అధికారి కృష్ణారావు, అటవీశాఖ సిబ్బంది చిన్నదిమిలి సమీపంలో పులిసంచరించే ప్రాంతాన్ని పరిశీలించారు. పులి పాదముద్రలుగా నిర్ధారించా రు. భామిని, సీతంపేట, కొత్తూరు మండలాల ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని తవిటినాయు డు హెచ్చరికలు జారీ చేశారు. వేకువ జామున బయటకు వెళ్లే రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బత్తిలి పోలీసుల ఆదేశాల మేరకు వీఆర్వో వినోద్కుమార్, ఏఎస్సై గురుమూర్తి, సర్పంచ్ రవికుమార్లు గ్రామాల్లో దండోరా వేయించారు. సీతంపేటలోనూ పులిజాడ సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో పులిజాడ కనిపించడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. దోనుబాయి–చెక్కాపురం పరిసర ప్రాంతంలో ఉన్న గుగ్గిలంతోటల గుండా పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్బీఓ దాలినాయుడుతో పాటు సిబ్బంది చేరుకుని పులిపాదముద్రలు పరిశీలించారు. దోనుబాయిలోని అటవీశాఖ కార్యాలయం వెనుక నుంచి పుబ్బాడ గ్రామం కొండలపైకి పులి వెళ్లినట్టు పాదముద్రలు ఆధారంగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
అయ్యో..! కారు ప్రమాదంలో గాయపడిన పులి.. కుంటుకుంటూ..
నాగ్పూర్: మహారాష్ట్రలోని అభయారణ్యంలో వేగంగా వెళుతున్న కారు ఓ పులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడిన పులి ప్రాణాలను కోల్పోయింది. గోండియా జిల్లాలోని నావగావ్- నజ్రియా కారిడార్లో ఈ ప్రమాదం జరిగింది. రెండేళ్ల పులి రోడ్డు దాటుతుండగా.. ముర్డోలీ అటవీ ప్రాంతంలోని కోహ్మారా-గోండియా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రమోద్ పంచభాయ్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన చోటే రోడ్డుపైనే గాయంతో పులి కాసేపు కూర్చుండిపోయింది. కారు అక్కడే ఆగడంతో మళ్లీ ఏం ప్రమాదం పొంచి ఉందో? అనే భయంతో నొప్పి ఉన్న కాలుతోనే పొదల్లోకి కింద పడుతూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలను వెనుక ఉన్న వాహనదారులు వీడియో తీశారు. అటవీ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పంచుకున్నారు. Dear friends Wildlife has first right of way in #wildlife habitats. So always travel safely & slowly. This tiger hit by vehicle at Nagzira. Via @vijaypTOI pic.twitter.com/fpx6zlKQDI — Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 11, 2023 అటవీ ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ప్రవీణ్ కాశ్వాన్ కోరారు. జంతువులకు హాని కలగకుండా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జంతు ప్రేమికులు. గాయపడిన పులి కోసం అధికారులు ఉదయం వెతికి జంతు సంరక్షణ శిబిరానికి తీసుకువచ్చే క్రమంలో బాధిత పులి మరణించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం -
వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్లో ఇటువంటి క్లిప్నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. Tiger sighting in Monsoons. This comes from Bandipur. VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9 — Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023 -
పులి గాండ్రింపులు ఏవీ?!
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా అటవీ ప్రాంతం ఉన్నా పులులు కన్పించకుండా పోయాయి. జాతీయ జంతువైన పులుల నివాసానికి జిల్లా అడవులు అనువైనవే అయినా... మనుగడ సాగడం లేదు. రెండేళ్లక్రితం ఓసారి జిల్లా అటవీ ప్రాంతంలో పులుల అడుగుజాడలు కనిపించాయి. కానీ ఆతర్వాత మళ్లీ జాడ లేదు. జిల్లా అటవీ విస్తీర్ణం 4,33,446 హెక్టార్లు కాగా, ఇందులో కిన్నెరసాని అభయారణ్యం విస్తీర్ణం 634.4 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అటవీప్రాంతంలో గుత్తికోయలు నివాసం ఏర్పాటుచేసుకోవడం, పోడు సాగుకు అడవులు నరికివేయడంతో పాటు రహదారుల నిర్మాణంతో పులుల మనుగడ కష్టమవుతోందనే భావన వ్యక్తమవుతోంది. శనివారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పులుల మనుగడ, రాకపోకలు, నివాసం ఏ ర్పాటుచేసుకోకపోవడానికి గల కారణాలపై కథనం. గతంలో పులుల కదలికలు 2001 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు పులుల అడుగు జాడలను అధికారులు గుర్తించారు. ఇక 2005లో మూడు, 2008లో నాలు గు, 2011, 2012లో మూడేసి పులులు, 2013లో రెండు, 2014, 2015లో ఒక్కో పులి కనిపించినా ఆతర్వాతజాడలేదు. 2018లో చేపట్టిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్కడా పులిని గుర్తించలేకపోయారు. వలన వచ్చినట్లే వచ్చి... జిల్లా అడవుల్లోకి పులుల వలస వస్తున్నాయి. జిల్లా అటవీ ప్రాంతాని ఆనుకుని ఏపీలోనిపాపికొండలు, అటు ఛత్తీస్గఢ్, ఇటు ఏటురూనాగారం అటవీ ప్రాంతాలు ఉండటంతో పెద్దపులులు అతిథులుగా వచ్చివెళ్తున్నాయే తప్ప స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. 2020 నవంబర్, 2021 డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద పులులు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించాయి. ఇక్కడ కిన్నెరసాని అభయారణ్యం పెద్దపులులకు సంరక్షణగా అనువుగా ఉన్నా పులులు మాత్రం ఉండడం లేదు. అనేక కారణాలు పొరుగు రాష్ట్రాల నుంచి గోదావరి నది దాటి జిల్లా అటవీప్రాంతానికి పెద్దపులులు అప్పుడప్పుడు వస్తున్నా స్థిర స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. అటవీప్రాంతం ఉన్నా పులులకు కావాల్సిన శాఖాహా ర జంతువులైన జింకలు, దుప్పులు, సాంబార్ వంటి జంతువుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గుత్తికోయ గుంపులు విస్తరించడం, అడవుల్లోనూ రహదారుల నిర్మాణం కూడా ఇంకో కారణం కావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పులి ఉండాలంటే.. జిల్లా అటవీ ప్రాంతంలో పులులు మనగడ కొనసాగించాలంటే వాటికి ఆహారమైన దుప్పులు, కణుజులు, సాంబారులు అధికంగా ఉండాలి. అవి అధికంగా ఉన్నచోట పెద్దపులి నివాసం ఉండే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా అటవీ ప్రాంతంలో జింకలు ఉన్నా ఎక్కువ లేవు, ఉన్నవాటిని అటవీ ప్రాంతంలోగుత్తికోయ గిరిజనులు మాయం చేస్తున్నారని ఫారెస్టు అధికారులు అంటున్నారు. -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
రైతు పొలం దున్నుతుండగా.. పులి ఎంట్రీ.. ఆ తర్వాత..
లక్నో: జనావాసాల్లోకి పులులు వచ్చిన సందర్భాలను మనం చూశాం. వాటిని చూసి మనం సహజంగా భయాందోళనకు గురవుతాం. కానీ ఉత్తరప్రదేశ్లోని పిలిబిత్ జిల్లాలో ఓ అరుదైన ఘటన కెమెరాకు చిక్కింది. వ్యవసాయ పొలంలో రైతు ఓ పక్క సాగు చేస్తుంటే.. మరో పక్క పులి పొలంలో దర్జాగా తిరుగుతూ కనిపించింది. పితిబిత్ జిల్లాలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వచ్చాడు. ట్రాక్టర్తో పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి ఓ పులి ఎంట్రీ ఇచ్చింది. వరిచేనులో సంచరిస్తూ కనిపించింది. పొలం దున్నతున్న రైతును ఏ మాత్రం పట్టించుకోకుండా సంచరించింది. ఈ దృశ్యాలను మరో రైతు కెమెరాలో బంధించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. This is Pilibhit, UP A tiger roaming in the field & in the background farmer plowing the field. Video shot by another farmer. pic.twitter.com/LXjOv1HVho — Raj Lakhani (@captrajlakhani) July 12, 2023 ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కేవలం ఒక్కరోజులోనే 1,20,000 వ్యూస్ వచ్చాయి. 2,000 లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మనుషులు, జంతువులు కలిసి జీవించడం అంటే ఇదేనంటూ కామెంట్ చేశారు. టైగర్ గంభీరమైన నడకపై కొనియాడారు. మరో అవకాశం లేనప్పుడు టైగర్ కూడా గడ్డే తినాలి అంటూ మరికొందరు కామెంట్ చేశారు. పులులకు భారత్ పెట్టింది పేరు. దేశంలో ఇప్పటికీ 3000 పులులు ఉన్నాయి. పులుల సంరక్షణ చేపట్టిన దగ్గర నుంచి దేశంలో వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: టమాటాలకు కాపలాగా.. ముట్టుకుంటే అంతే సంగతులు.. -
నా అడ్డాలోకి వస్తే ఇలానే ఉంటుంది.. బీకేర్ ఫుల్!
పులిని కాస్త దూరంలో చూసినా పైప్రాణాలు పైకే పోతాయేమో అన్నట్లే భయపడతాం. అదే పులి ఒక్క ఉదుటన దూకి వస్తే ఇంకెలా ఉంటుంది.. ఇక ఆ పరిస్థితి వర్ణణాతీతమే. ఈ తరహా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో చూస్తే మాత్రం పులి భయపెట్టిన తీరు అలా సరదాగా రైడ్కు వెళ్లిన వారి వెన్నులో వణుకు పుట్టించిదనే చెప్పాలి కొంతమంది కలిసి టాప్ లెస్ జీప్లో ‘విహార యాత్ర’ కు బయల్దేరారు. వారు అలా స్లోగా వెహికల్లో వెళుతుండగా, పులి ఉన్నపళంగా దూకుతూ వారిపైకి రాబోయింది. వారు గట్టిగా కేకలు వేస్తూ వెహికల్ను ముందుకు కదిలించే క్రమంలో కూడా పులి మరొక్కసారి బయపెట్టింది. ‘ నా అడ్డాలోకి వస్తే ఇలానే ఉంటుంది’ అనేంతగా జర్క్లు ఇచ్చింది. అంతే వారు అక్కడ ఉండటం మంచిది కాదని విషయం అర్ధమై మెల్లగా జారుకున్నారు. పులి కూడా వారు వెళ్లిపోవడం చూసి ఇక దాడి చేయడానికి వెనుకాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి ఏమి అర్ధమవుతుందంటే వన్య ప్రాణాల జోలికి వెళితే ఏమైనా జరగొచ్చనే విషయం అవగతమవుతోంది. ఏదో సరదాగా కోసం ముచ్చటపడితే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. Bhaiya, chalo chalo...ho gaya!!!🤣 pic.twitter.com/E3oPegDwaF— Dr. Ajayita (@DoctorAjayita) July 15, 2023 -
పులి మాంసం రుచి చూద్దామని..!
కర్ణాటక: కొందమాల్ జిల్లా బల్లిగుడా రేంజ్, తుమ్మిదిబందో పోలీస్ స్టేషన్ పరిధిలోని రైకియా అటవీ ప్రాంతంలో పులిని వేటాడి హతమార్చి, మాంసం తిందామనుకున్న 13మంది ప్రబుద్ధులను అటవీశాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బల్లిగుడ అటవీ ప్రాంతంలో రైకియా గ్రామస్తులు బుధవారం రాత్రి ఉమ్మడిగా పులిని వేటాడారు. అనంతరం గ్రామం సమీపంలోని తోటలో అంతా కలిసి వాటాలు వేసుకున్నారు. ఇంటికి తీసుకు వచ్చి, కమ్మగా వండుకున్నారు. ఎట్టకేలకు.. పులి మాంసం రుచి చూద్దామనుకొని సిద్ధమవుతున్న సమయంలో విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ, పోలీసులు అధికారులు దాడి చేశారు. ఈ మేరకు 13మంది గ్రామస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పులి చర్మం, గోళ్లు, ఇతర అవయవాలు, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పులి వయస్సు, బరువు ఇతర వివరాలేమీ తెలియలేదు .ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. జింక మాంసం.. కిలో రూ.1500లు రాయగడ: రాయగడ రిజర్వ్ ఫారస్ట్లో జింకను వేటాడి, మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆశాఖ డిప్యూటీ రేంజర్ సంజయ్కుమార్ సాహు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయగడ సమీపంలోని మానిక్జోల గ్రామంలో జింక మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారి గౌరీశంకర్ సాహు, గార్డు సంతోష్ పాణిగ్రాహి, సిబ్బంది దాడులు నిర్వహించారు. పితామహల్ గ్రామానికి చెందిన మాధవ ఉలక(43), మానిక్జోలకు చెందిన మాధవ ఉలక(41) వేటాడి తెచ్చిన జింక మాంసాన్ని గ్రామంలో కిలో రూ.1,500ల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుల్లో కొంతమంది పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వారినుంచి 3కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఏఆర్సీలో ఆడపులి కుమారి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ)లో ఆడ పులి మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జూ పార్కు సమీపంలో ఉన్న ఏఆర్సీలో 23 సంవత్సరాల వయసు కలిగిన కుమారి అనే ఆడపులి వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురై ఈ నెల 24వ తేదీ రాత్రి మృతి చెందినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఫేమస్ సర్కస్ కంపెనీకి చెందిన కుమారిని 2007లో ఏఆర్సీకి తీసుకొచ్చారని, కుమారి మృతితో ఏఆర్సీలో ప్రస్తుతం పులులు లేవని పేర్కొన్నారు. కాగా, కుమారి మృతి చెందిన రెండు రోజులు వరకు విషయం బయటపడకుండా జూ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. అదే రోజు ఉదయం జూలో జానకి అనే 22 ఏళ్ల ఆడ పెద్ద పులి మరణించిన విషయం బయటకు వెల్లడించిన జూ అధికారులు ఏఆర్సీలో మృతి చెందిన కుమారి విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు -
టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం.. దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, హైదరాబాద్: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవ వైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను ప్రజలకు వివరించనుంది. ఈ ఎగ్జిబిషన్లో ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ డోబ్రియాల్, ఐఎఫ్ఎస్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్(ఐపీఎఫ్), ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్లోని పులుల ఫొటోలు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. రాకేశ్ మోహన్ డోబ్రియాల్ మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి టీఎస్ఆర్టీసీ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ అటవీ శాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రెండు టైగర్ రిజర్వ్ లలో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు. పులులు అడవుల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆధీన ప్రాంతంలో ఉండే అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవి తోడ్పాడుతాయని వివరించారు. పులులను కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిద్యాన్ని రక్షించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పులులను సంరక్షిస్తే పర్యావరణాన్ని సంరక్షించినట్లే అని ఆయన చెప్పారు. పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్ తో కలిసి టీఎస్ఆర్టీసీ 'హైదరాబాద్ ఆన్ వీల్స్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని.. ఫోటోస్, విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితం అయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. మాటల ద్వారా వ్యక్తికరించలేని భావాలను ఫోటోలు చెప్తాయని వివరించారు. ఈ ఫొటో గ్రఫీ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అని తెలిపారు. 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్'లో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించామని చెప్పారు. అడవుల్లోకి వెళ్లలేని వారు ఈ ఎగ్జిబిషన్ లోని పులుల ఫోటోలను చూసి మంచి అనుభూతుని పొందవచ్చని అన్నారు. హైదరాబాద్ లోని జనసమర్థ ప్రాంతాల్లో హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సు తిరుగుతుందని, ప్రజలందరూ ఈ ఫోటోలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తోన్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. పర్యవరణహితం కోసం టీఎస్ఆర్టీసీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్ట ప్లాన్ చేస్తోందని వివరించారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎఫ్ వ్యవస్థాపకుడు ఆక్విన్ మాథ్యూస్ అన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంతో కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులులపై అవగాహన కల్పించాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారిని ఈ సందర్భంగా అభినందించారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ దాదాపు 13 ఏళ్లుగా ఎంతో కష్టపడి తీసిన తన ఫొటోలను హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని అన్నారు. అడవుల్లో ఒక్కో పులి ఫొటో తీయడానికి రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. యువతకు పులుల సంరక్షణపై అవగాహన లేదని, వారికి పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఐపీఎఫ్ ప్రతినిధురాలు తరుషా సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ హీరో మదర్ను మోసం చేసిన ఉద్యోగి
బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ భార్య, టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ను అలెన్ ఫర్నాండో అనే వ్యక్తి రూ.58 లక్షలకు మోసం చేశాడు. ఈ మేరకు అయేషా ష్రాఫ్ ముంబయ్లోని శాంటాక్రజ్ పోలీస్స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఫెర్నాండెజ్పై సెక్షన్ 420, 408, 465, 467, 468 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 20, 2018న MMA మ్యాట్రిక్స్ అనే జిమ్ కంపెనీని టైగర్ ష్రాఫ్ తన సోదరితో కలిసి స్టార్ట్ చేశాడు. (ఇదీ చదవండి: నాగార్జున సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్) అక్కడ ఆపరేషన్స్ డైరెక్టర్గా అలెన్ ఫర్నాండోను వారు నియమించారు. టైగర్ ష్రాఫ్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం వల్ల దాని బాధ్యతలను తల్లి అయేషా చూసుకుంటుంది. MMA మ్యాట్రిక్స్ ద్వారా పలు టోర్నమెంట్లను నిర్వహించడం కోసం కొందరి నుంచి రూ.58 లక్షలు తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. అలెన్ ఫర్నాండోను ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!) -
పులి కూనా.. అమ్మను వీడకు!
ఆత్మకూరురూరల్: పులుల స్వర్గధామమైన భారతదేశంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారసంస్థ (ఎన్టీసీఏ) ప్రాజెక్ట్ టైగర్ను ఏర్పాటు చేసి పులుల సమీకృత సంరక్షణకు పాటు పడుతోంది. ఇంతటి మార్గదర్శకాలు ఉన్నప్పటికీ నల్లమలలో మాత్రం తరచూ పులికూనల మరణాలు సంభవిస్తుండటం అధికా రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు అధికారుల సంరక్షణలో చేరిన తర్వాత మరణిస్తుండటం అటవీ శాఖ పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఇటీవల ఆత్మకూరు అటవీ డివిజన్లోని పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో తల్లిని వీడిన నాలుగు ఆడ పులికూనలను తిరుపతి జంతు ప్రదర్శన శాలకు చేర్చారు. వీటిని 108 అనే పులికి చెందిన కూనలుగా గుర్తించారు. పులి ప్రవర్దనంలో ఆడపులులే ప్రధాన పాత్ర వహించే సందర్భంలో ఒకే సారి నాలుగు ఆడకూనలు తల్లిని వీడటం జఠిలమైన సమస్యగా మారింది. వీటిని అత్యంత శాసీ్త్రయ పద్ధతులలో తల్లికి చేరువ చేయాల్సి ఉండగా అధికారుల వైఫల్యంతో తిరుపతి జంతు ప్రదర్శనశాలకు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ వీటిని వన్య జీవనానికి దగ్గరగా పెంచుతూ క్రమేపీ అడవిలో వదులుతామని అప్పట్లో అటవీ అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ప్రత్యేక ఎన్క్లోజర్ల్లలో ఉంచి పర్యవేక్షిస్తామని చెప్పిన జూ అధికారులు మూడు నెలలుగా వాటిని ఒక ఏసీ గదికే పరిమితం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్రమైన ఆందోళనతో ఉన్న పులి కూనలలో ఒకదానికి చిన్నపాటి గాయ మైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గాయం ఇన్ఫెక్ష న్ అయి అది ఇతర అవయవాలకు విస్తరించడంతో పులికూన మరణించినట్లు సమాచారం. పులికూనలను త్వరలో నల్లమలకు తీసుకు రావాల ని ఇక్కడ అడవిలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లలో ఉంచాలని, ఆ మేరకు అనువైన అటవీ ప్రాంతాలను అధికారులు గుర్తించే క్రమంలో ఉండగా జూలో పులి కూన మరణించి స్థానిక నల్లమల అధికారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో మిగిలిన మూడు పులికూనల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతంలో మత్తు మందు వికటించి.. ఆత్మకూరు అటవీ డివిజన్లోని వెలుగోడు పట్టణం శివార్లలోకి గతంలో రెండు పులికూనలు వచ్చాయి. అప్పట్లో కూడా ఈ కూనలు తల్లి నుంచి విడిపోయి జనారణ్యంలోకి వచ్చాయి. కాకపోతే అవి సంవత్సరం వయసు దాటిన కూనలు. వీటిని నేరుగా పట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి వాటికి మత్తు ఇచ్చి బంధించారు. అయితే వాటిలో ఒక పులికూనకు పరిమితికి మించిన మత్తు ఇవ్వడంతో చనిపోయినట్లు అప్పట్లో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. మిగిలిన రెండో పులికూన జూకు చేర్చారు. -
తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో పులిపిల్ల మృతి
-
వరుసగా మృతి చెందుతున్న పులులు... విషయం తెలిసిన గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే...
మధ్యప్రదేశ్లోని శ్యోపూర్లోగల కూనో నేషనల్ పార్క్లో గడచిన రెండు నెలలలో మూడు చిరుతలు, వాటి పిల్లలు మూడు మృతిచెందాయి. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. దీనికితోడు ఇదే ఈ జూర్కులో ఉన్న 17 చిరుతలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఒక చిరుత కూన కూడా వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుపడాలని కోరుతూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కర్హల్ తహసీల్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో పులల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా కూడా చేస్తున్నారు. గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా 2022 సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ కూనో పార్క్కు నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుతలను అప్పగించారు. వాటిలో ఐదు మగ చిరుతలు, 3 ఆడ చిరుతలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాటి సంరక్షణకు చీతా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇదేవిధంగా 2023 ఫిబ్రవరి 18 ఇక్కడకు ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వీటిలో 7 ఆడ చిరుతలు, 5 మగ చిరుతలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 26న నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. అలాగే ఏప్రిల్ 23న సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఒక చిరుత మృతి చెందింది. మే 9న మరో చిరుత మరణించింది. మే 23న ఒక చిరుత కూన మృతి చెందింది. తరువాత కొన్ని చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. -
ఆ కుక్క ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే! భలేగా పులిని, సింహాన్ని..
ఇంతవరకు జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూశాం. వన్యమృగాలు సాధారణంగా ట్రైయినర్ కంట్రోల్లో ఉంటాయి. ఐతే ఒక్కోసారి అవి వారి మాట కూడా వినవు. అంతేందుకు వారిపైనే దారుణంగా దాడి చేసి హతమార్చిన పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఓ కుక్క రెండు వన్యమృగాలను కంట్రోల్ చేస్తోందంటే..నమ్మబుద్ది కాదు కదా! కానీ ఇక్కడ అలానే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఓ పులి, సింహం జూలో దారుణంగా ఫైట్ చేసుకుంటున్నాయి. దీంతో అక్కడే ఉన్న కుక్క ఒక్కసారిగా ఆ రెండింటిని దెబ్బలాడుకోకుండా చేసింది. పైగా పులి చెవిని కరుస్తూ సింహంతో ఫైట్ చేయకుండా నిలవరించింది. ఆ కుక్క అవి ఫైట్ చేసుకోకుండా ఆపడంలో విజయం సాధించింది కూడా. కానీ ఏ మాత్రం తేడా వచ్చి.. పులి దాడి చేస్తే గనుక ఆ కుక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ఆ కుక్క మాత్రం కుంచెం కూడా బెరుకు లేకుండా వాటి రగడను ఆపింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మిలియన్స్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Dog stops tiger and lion from fighting pic.twitter.com/O2qfgk9q4v — B&S (@_B___S) May 20, 2023 (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..)