-
పల్నాడు ప్రాంతంలో పులి భయం
-
పల్నాడులో దారితప్పి తిరుగుతున్న రెండు పెద్ద పులులు
-
నీళ్ల కోసం రోడ్డుపైకి వచ్చిన పెద్ద పులి.. నిలిచిపోయిన వాహనాలు!
-
గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్
సాధారణం పులి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లిపోతుందే తప్ప సాధారణంగా తలవంచదు. దాని దారికి అడ్డంగా వస్తే హడలెత్తించి మరీ పరిగెట్టిస్తుంది. అలాంటిది పులి గజరాజులకు దారివ్వడమే గాక దూరంగా నక్కి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పులి అడవిలో అలు ఇటు తిరుగుతుంటుంది. ఇంతలో ఓ ఏనుగుల గుంపు అటుగా వచ్చాయి. దీంతో పులి దూరంగా వాటికి కనబడకుండా కిందకి కూర్చొంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఏనుగులు వెళ్లిపోతుంటాయి. ఇంతలో పులి నెమ్మదిగా లేచి ఆ ఏనుగుల వెళ్తున్న దారివైపు వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి తన దారిని వెళ్లేందుకు యత్నిస్తుంది. సరిగ్గా ఇంకో ఏనుగు దానికి ఎదురు పడుతుంది. అంతే ఒక్కసారిగా పులిరాజు భయంతో తత్తరపడి దానికి దారి ఇచ్చి మరీ వేగంగా వెళ్లిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద 'అడవికి రాజు ఏనుగులకు దారి ఇచ్చింది' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. బహుశా ఆ జంతువులు ఈ విధంగా తమ సామరస్యాన్ని చాటుకుంటాయి కాబోలు అని అన్నారు. వాస్తవానికి ఈ వీడియోని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అదీగాక పులులు ఏనుగులను వేటాడే సందర్భాలు చాలా అరుదు. This is how animals communicate & maintain harmony… Elephant trumpets on smelling the tiger. The king gives way to the titan herd😌😌 Courtesy: Vijetha Simha pic.twitter.com/PvOcKLbIud — Susanta Nanda (@susantananda3) April 30, 2023 (చదవండి: ఏ మూడ్లో ఉందో సింహం! సడెన్గా కీపర్పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..) -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..
చండీగడ్: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషల్ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్ పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా.. కలెసర్ నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు -
పుష్ప కాదు పులి.. ఊరు ఖాళీ చేయండి, అబ్బే తగ్గేదేలే
జన్నారం: పులి సంరక్షణ కోసం కవ్వాల్ అభయారణ్యంలోని గ్రామాల తరలింపునకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పునరావాసానికి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అడవిలోని మూడు గ్రామాల్లో మరోమారు సర్వే నిర్వహించారు. నివేదికలను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కాగానే, పునరావాస ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అలజడి తగ్గించే దిశగా.. అడవిలో వన్యప్రాణులకు, పులికి అలజడి లేకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లోకి మనుషులు, పశువులు వెళ్లకుండా నివారించారు. కోర్ ఏరియా పరిధిలో ఆంక్షలు విధించారు. అలజడి తగ్గించే ఏర్పాట్లు చేశారు. అయినా అడవి లోపలి గ్రామాల ప్రజలు పశువులను అడవిలోకి తోలుకెళ్తున్నారు. తరతరాలుగా అడవిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో అలజడి తగ్గడం లేదు. అలజడి తగ్గిస్తే తప్ప పులులు ఇక్కడ ఆవాసం చేసుకునే అవకాశం లేదని అధికారులు గుర్తించారు. ఆవాసం ఉండని పులి.. కవ్వాల్ అభయరాణ్యాన్ని 2012, ఏప్రిల్ 10న టైగర్జోన్గా కేంద్రం ప్రకటించింది. ఈ టైగర్జోన్లో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియాగా, 1,123 చదరపు కిలోమీటర్లలో బఫర్ ఏరియాగా ఏర్పాటు చేశారు. కవ్వాల్ టైగర్ జోన్కు సమీపంలోని తడోబా, ఇంద్రావతి టైగర్ జోన్ల నుంచి పులులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో టైగర్జోన్ పరిధిలో దట్టమైన అడవులు ఉండి, అలజడి లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే అడవుల్లో పశువుల, మనుషుల సంచారం అధికంగా ఉండటంతో పులులు వచ్చి వెళ్లిపోతున్నాయి. స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. ఇందుకు అలజడే కారణమని అధికారులు గుర్తించారు. మాల తరలింపు షురూ.. అడవిలో ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజన గ్రామాలను తరలించి.. వారికి పునరావాసం కల్పించి, అలజడి తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో టైగర్జోన్ పరిధిలోని రాంపూర్, మైసంపేట, అలీనగర్, దొంగపల్లి, మల్యాల గిరిజన గ్రామాలను ముందుగా తరలించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో మొదటి దశలో నిర్మల్ జిల్లా కడెం మండలం రాంపూర్, మైసంపేట గ్రామాల ప్రజలకు పునరావాసం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి. ఈ క్రమంలో మొదటి దశలో ఈ గ్రామాల ప్రజలకు కడం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో భూమి కేటాయించి కాలనీ నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి సౌకర్యాలు కల్పిస్తే గ్రామాలు ఖాళీ చేస్తామని గిరిజనులు తెలిపారు. కోరుకున్న ప్రదేశం కేటాయిస్తేనే.. పునరావాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఐదేళ్ల క్రితం విముఖత చూపిన గిరిజనులు తాజాగా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామాలకు రోడ్డు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, కనీసం అంబులెన్స్ కూడా వచ్చే వీలు లేకపోవడంతో అడవి నుంచి బయటకు రావడానికి అంగీకరిస్తున్నారు. అయితే తాము కోరుకున్న ప్రాంతం కేటాయించాలని కండీషన్ పెడుతున్నారు. కొత్తూరుపల్లి గ్రామ సమీపంలోని సర్వే 270లో ఇళ్లు నిర్మించి వ్యవసాయ భూమి కేటాయించాలని కోరుతున్నారు. అయితే కొత్తూరుపల్లి కూడా టైగర్ జోన్ కోర్ ఏరియాలో ఉన్నందున పుట్టిగూడ ప్రాంతంలో భూమి కేటాయిస్తామని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు.. ఐదేళ్ల క్రితం పునరావాసం కల్పించే గ్రామాల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 ల క్షలు ప్రతిపాదించారు. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాలి. అయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తాజాగా ఆ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఒ క్కో కుటుంబానికి రూ.15 లక్షల ప్యాకేజీ లేదా భూమి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఉన్న భూమికి బదులుగా భూమిని ఇస్తూ ఇళ్ల నిర్మాణం, కాలనీ ఏర్పాటు, పూర్తి సౌకార్యాలు కల్పించాలనే నిబంధన ఉంది. అయితే ఇందులో కొందరు ప్యాకేజీ తీసుకోవడానికి, కొందరు భూమి తీసుకోవడానికి సుముఖత చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పునరావాస పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మరో మూడు గ్రామాలకు ప్రతిపాదనలు.. కవ్వాల్ టైగర్జోన్ ప్రాంతంలోని జన్నారం అటవీ డివిజన్లో మరో మూడు అటవీ గ్రామాలను తరలించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్యాల, దొంగపల్లి, అలీనగర్ గ్రామాల్లో రెవెన్యూ, అటవీ అధికారులు జాయింట్గా సర్వే నిర్వహించారు. కుటుంబాల వివరాలు నమోదు చేశారు. తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆయా గ్రామాలను వీడేందుకు గిరిజనులు కూడా అంగీకరించలేదు. తాజాగా మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని దొంగలపల్లి, అలీనగర్, మల్యాల గ్రామాలను అడవి నుంచి బయటకు తీసుకురావాలని ప్రతిపాదించారు. అలీనగర్లో 70 ఇళ్లు, 350 మంది, దొంగపల్లిలో 85 ఇళ్లు, 380 మంది, మల్యాలలో 55 ఇళ్లు, 130 మంది నివాసం ఉంటున్నారు. అయితే కుటుంబాల వివరాలు సేకరించేందుకు నెల క్రితం మరోసారి సర్వే నిర్వహించి 316 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి పంపారు. పునరావాసానికి కావాల్సిన నిధుల గురించి వివరించినట్లు అధికారులు తెలిపారు. కొత్తూరుపల్లిలో కేటాయించాలి.. 1994లో కొత్తూరుపల్లి ప్రాంతంలో జంగల్ కొట్టుకున్నాం. 270 సర్వే నంబర్లో మా మూడు గ్రామాలకు సరిపడా భూమి ఉంది. అక్కడకు తరలిస్తే వెళ్లడానికి సిద్ధం. జంగల్ కొట్టినప్పుడు మాపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇంత కష్టపడ్డ ఆ భూమిని అటవీ అధికారులు తీసుకుంటున్నారు. మా మూడు గ్రామాలను అదే ప్రాంతానికి తరలించి సౌకర్యాలు కల్పించాలి. – హన్మంతరావు, సర్పంచ్, మల్యాల ప్రతిపాదనలు పంపాం అటవీ గ్రామాలకు పునరావాసం కల్పించే విషయంపై సర్వే నిర్ణయించాం. ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాం. బడ్జెట్ కేటాయించాలని కోరాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పునరావాసంపై నిర్ణయం తీసుకుంటాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపడతాం. గిరిజనుల విన్నపాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. – సిరిపురం మాధవరావు, డిప్యూటీ కన్జర్వేటర్ -
అది పులి కాదు.. మరి ఏంటి?
-
హైదరాబాద్ బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పులి కలకలం
-
పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత
పులి భయంతో రెండు గ్రామాలు వణికిపోత్నున్నాయి. ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేయడంతో మరింత ఎక్కువైంది. దీంతో యంత్రాంగం కదిలి వచ్చి గ్రామంలో కర్ఫ్యూ విధించి, అంగన్ వాడిలు, పాఠశాలలను మూసివేయాలని ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోనిచోటు చేసుకుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్లోని రిఖానిఖాల్, ధూమాకోట్ తహసీల్ గ్రామాలు పులి భయంతో హడలిపోతున్నాయి. అదీగాక ఇటీవల ఇద్దరు వ్యక్తులను పులి హతమర్చాడంతో దెబ్బకు పౌరీ గర్హ్వల్ జిల్లా యంత్రాంగం కదిలి వచ్చి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అలాగే ఆయ ప్రాంతాల్లోని అంగన్వాడీలు, పాఠశాలలను ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 18 వరకు మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జారీ చేసింది. యంత్రాంగం ఆదేశాల మేరకు ధుమాకోట్, రిఖానిఖాల్ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ చేసి పులిబారినపడే అవకాశం ఉన్న కటుంబాలను, ఇళ్లను గుర్తించాలని సూచించింది. కాగా, లాన్స్డౌన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దలీప్ రావత్ ఈ ప్రాంత నివాసితులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరారు. (చదవండి: భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు) -
పులుల సంతతిని ఎలా లెక్కిస్తారు ?
-
పులికే ప్రాణ గండమా? ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది
పాపం పులి సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవిలో వేట పూర్తిగా ఆగితేనే జాతీయ జంతువు పులికి భద్రత లభిస్తుంది. ఈ ఏడాది కవ్వాల్ టైగర్జోన్ పరిధిలో రెండు పు లుల మరణాలు వెలుగులోకి రావడం ముప్పును తె లియజేస్తోంది. నెన్నెల మండలం కుశ్నపల్లి రేంజ్లో పులి అవశేషాలు బయటపడడం తెలిసిందే. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర పరిధి జివితి తాలూకాలో కు మురంభీం జిల్లాలో సంచరించిన ఓ పులిని హతమార్చి చర్మం విక్రయిస్తుండగా అక్కడి అటవీ అధికారులు పట్టుకున్నారు. టైగర్ మిస్సింగ్.? వరుస ఘటనలతో కవ్వాల్ టైగర్జోన్లో పులుల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పులులు చనిపోయిన నెలల తర్వాత వాటి అవశేషా లు విక్రయిస్తున్న క్రమంలోనే ఈ ఉదంతాలు బయటకు వస్తున్నాయి. పులి ట్రాకింగ్ వ్యవస్థ స్పష్టత లేక ఏ పులి ఎక్కడ సంచరిస్తుందో తెలియక కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి జాడ లేకుండా పోయిన పులులు ఉన్నాయి. చాలావరకు మహారాష్ట్ర వెళ్లిపోయాయని చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి ఎక్కడున్నాయో స్పష్టత లేదు. కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు అడవిలో వన్యప్రాణుల వేట కోసం అమర్చుతున్న విద్యుత్ తీగలతోనూ పులులకు ముప్పు వాటిల్లుతోంది. గతంలో అటవీ ప్రాంతాల వరకు విద్యుత్ సదుపాయం ఉండకపోవడంతో ఉరిలు మాత్రమే వేసేవాళ్లు. అడవి పందులు, దుప్పులు, ఏదులు, మెకం వంటి జంతువులను వేటాడేందుకు ఏకంగా 32కేవీ సబ్స్టేషన్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ లైన్ల నుంచి దొంగచాటుగా అడవి లోనికి ప్రసారం చేస్తూ వాటి ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికీ అటవీ సమీప ప్రాంతాల్లో యథేచ్ఛగా వేట కొనసాగుతోంది. జాతీయ జంతువుకు గండం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, అంధేరి పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంతతి పెరిగి కవ్వాల్లోకి అడుగు పెడుతున్నాయి. ఆహారం, ఆవాసం, తోడు కోసం ఇటు వైపు వస్తున్నాయి. ఇలా వచ్చిపోయే వలస పులులతోపాటు కవ్వాల్ పరిధిలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న వాటికి ముప్పు పొంచి ఉంది. అటవీ సమీప ప్రాంతాల ప్రజలకు జాతీయ జంతువుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోపాటు పులులు వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు వివరించడం లేదు. భద్రత పేరుతో గోప్యత ఒక్కోసారి పులి వచ్చిందని చెప్పినా అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనూ సమస్యలు వస్తున్నాయి. గతంలో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల పరిధిలో పులి సంచరిస్తోందని అక్కడి అధికారులకు చెబితే ఈ ప్రాంతంలో పులి లేదని కొట్టిపారేశారు. రెండ్రోజులకే అక్కడ ఓ రైతుపై దాడి చేసి ప్రాణాలు తీసింది. పులి భద్రత పేరుతో గోప్యత పాటించి అసలుకే మోసం తెస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక రాత్రి వేళ కరెంటు సరఫరా, తనిఖీలు, గస్తీ, యానిమల్ ట్రాకర్స్ ఉన్నప్పటికీ పులికి ప్రాణగండం తప్పడం లేదు. వేసవిలోనూ వేటగాళ్ల ముప్పు వేసవిలో వన్యప్రాణులు అడవిలో నుంచి వేడిని తట్టుకునేందుకు, నీరు, ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్లు షికారీ చేస్తూ అటవీ జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వానాకా లంలో పత్తి పంటను కాపాడుకునేందుకు అడవి పందుల నియంత్రణకు విద్యుత్ తీగలతో కంచెలు వేస్తుంటారు. ఆ సమయంలో ఏ జంతువు తగిలినా ప్రాణాలు కోల్పోతాయి. వేసవిలో నీటికుంటలు, ఒర్రెలు, లోయలు, వెదురు చెట్ల చల్లదనం కోసం వచ్చే క్రమంలో వేటగాళ్లు ఉచ్చులు వేసి ప్రాణాలు తీస్తున్నారు. దీనిపై పకడ్బందీగా ప్రణాళిక వేసి అమలు చేస్తే గానీ అటవీ జంతువులకు రక్షణ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వేటగాడే వేటకు బలి.. అరుదైన దృశ్యం నెట్టింట వైరల్..
బలహీనుడిపై బలవంతుడుపై చేయి సాధించడం తెలిసిందే.. అయితే ఇద్దరు బలవంతుల మధ్య పోటీ జరిగితే విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్లో చిరుతపులిని తింటున్న పులి చిత్రాన్ని నెట్టింట షేర్ చేశారు. రణతంబోర్ నేషనల్ పార్క్లో అనూహ్యంగా ఒక పులి చిరుతను వేటాడింది. వాటి మధ్య జరిగిన బీకర పోరులో చిరుత పులి చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చిరుతను చంపిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంతో తింటోంది. అందులో సఫారీకి వచ్చిన పర్యాటకులు కొందరు ఈ ఘటనను ఫోటో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పులి, చిరుతపులి మధ్య పోరాటం చాలా అరుదని కామెంట్లు పెడుతున్నారు. Wild wild world. The tiger name is T 101 of Ranthambore. @HJunglebook recently captured it and want everyone to witness it. pic.twitter.com/dAT7WNvxtv — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 1, 2023 -
తిరుపతి జూ పార్క్కు తరలిన పులి కూనలు
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలి పారు. తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్కు తరలించారు. పులి కూనల ఆరోగ్యం భేష్ తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జూపార్క్కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు. కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు. -
విఫలమైన మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్
-
నాలుగో రోజైనా జాడ దొరికేనా?
ఆత్మకూరు రూరల్/కొత్తపల్లి: శ్రీశైలం–నాగార్జున సాగర్ పులుల అభయారణ్యంలో 4 ఆడ పిల్లలను ఈనిన ‘టీ108’ అనే పెద్దపులి వాటికి దూరమై 3 రోజులు గడిచిపోయింది. మరో వైపు తల్లీ బిడ్డల పునరేకీకరణ (రీయూనియన్)కు అటవీ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. 300 మంది ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్ పేట్రోలింగ్) చేస్తున్నారు. పులుల ప్రవర్తనాంశాలను పరిశీలిస్తే తల్లి పులి తన పిల్లల కోసం గరిష్టంగా 4 రోజుల వరకు వెతికే యత్నం చేస్తుందని పులి జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు చెబుతున్నారు. అయితే ఇంకో 24 గంటలు గడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తల్లి పులి తన బిడ్డలను గుర్తించి అక్కున చేర్చుకోవడమన్నది అసాధ్యమంటున్నారు. తల్లి పులి జాడ దొరకని పక్షంలో పులి కూనలను జంతు ప్రదర్శన శాలకు తరలించే అవకాశం ఉంది. కాగా, పులి కూనల ఆరోగ్యం నిలకడగా ఉందని ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ చెప్పారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులి కూనలు చక్కగా ఆహారం తీసుకుంటున్నాయని, కోడి కాలేయం ముక్కలను ఇష్టంగా భుజించాయని తెలిపారు. 300 మంది ఎన్ఎస్టీఆర్ సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్ పేట్రోలింగ్)లో ఉన్నట్లు వివరించారు. తల్లిని విడిచిన కూనలు కొంత షాక్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించడం వాటికి ఇబ్బంది అయిన కారణంగా మొదట తల్లిని అన్వేషించి ఆ తరువాత పిల్లలను ఆ పులి వద్దకు చేర్చే వ్యూహాన్ని పాటిస్తున్నామన్నారు. స్నిప్పర్ డాగ్స్తో (శునక శోధన), డ్రోన్ కెమెరాలతో పులిని గుర్తించే యత్నం చేయడం లేదని, అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని చెప్పారు. ఆ పాదముద్ర తల్లి పులిదేనా? నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు, చిన్నగుమ్మడాపురం గ్రామాల మధ్యన ప్రధాన రహదారికి కొద్ది దూరంలో ఆటోడ్రైవర్కు పెద్దపులి బుధవారం కనిపించింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న గొర్రెల కాపరి చిన్న వెంకటేశ్వర్లుకు అతడు తెలపగా..అతను చూసేలోపు పులి అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి కాలిముద్రలను పరిశీలించారు. అచ్చిరెడ్డికుంట వరకు పెద్దపులి కాలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడినుంచి పులి ఎటువైపుగా వెళ్లిందనే కోణంలో గాలింపునకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ పులి పాదముద్రలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో అచ్చు తీసి టీ108 తో సరిపోల్చి నిర్థారించగలిగితే తల్లిని అన్వేషించే పనిలో కొంత పురోభివృధ్ధి సాధించినట్లేనని శ్రీశైలం అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు డీఎఫ్వో అలెన్చాంగ్టేరాన్ తెలిపారు. -
నంద్యాల: తల్లి పులి ఉత్కంఠ.. కీలక పరిణామం
సాక్షి, నంద్యాల: తల్లిపులి దగ్గరికి పులి పిల్లలను చేర్చడం అనే ఆపరేషన్ ద్వారా.. దేశ చరిత్రలోనే తొలిసారి ఈ తరహా ప్రయత్నానికి ఏపీ వేదిక అయ్యింది. అలాగే నంద్యాల జిల్లాలో తల్లి పులి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే.. తాజాగా ఆపరేషన్ తల్లి పులిలో కీలక పరిణామం చోటు చేసుకుందని ఆపరేషన్ కమిటీ మెంబర్, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్ఎస్ పేర్కొన్నారు. పెద్ద గుమ్మాడాపురం అటవీప్రాంతంలోపెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు విగ్నేష్ తెలిపారు. అయితే.. అది తల్లి పులి (T108 F)వి అవునా? కాదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మరోవైపు 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్ తల్లి పులి నిర్వహిస్తున్నట్లు తెలిపారాయన. పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారాయన. శాస్త్రీయంగాను సాంకేతికంగా తల్లి పులికోసం గాలిస్తున్నాం. దాదాపు 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నాము. అవసరాన్ని బట్టి డ్రోన్ కూడా వినియోగిస్తాం అని తెలిపారాయన. నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం చేత ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నాం. నిపుణుల సూచనల మేరకు పులికూనలకు పాలు, సెరోలాక్ తో పాటు ఇవాళ (బుధవారం) చికెన్ లివర్ ముక్కలను అందించాం అని తెలిపారాయన. -
తల్లి కోసం పులి కూనల కలవరం
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది. పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్క్లోజర్లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్క్లోజర్ నుంచి వదులుతారు. ఆ నాలుగూ ఆడ కూనలే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. చేరదీస్తుందో.. లేదో! వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. అన్ని సందర్భాల్లో వర్తించదు మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్లో గర్భంతో ఉన్న పులిని ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్ తోయిబా సింగ్ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చోంగ్ టెరాన్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
కళ్ల ముందు జింక ఉన్నా.. వేటాడని పులి.. వీడియో వైరల్..
పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు. The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2 — Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023 ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
పులిని చంపి వండుకుని తిన్నారు?
యర్రగొండపాలెం:(ప్రకాశం జిల్లా): పులిని చంపి వండుకుని తిన్నారని అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పులు, మనపోతులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కొంతమంది విద్యుత్ తీగలుపెట్టి జంతువులను వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. ఈ పులిని కరెంటు తీగలు పెట్టి చంపారని, తోలును అడవిలో ఉన్న బావిలో వేసి, మాంసాన్ని వండుకుని తిన్నారని యర్రగొండపాలెంలోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ధ్రువీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు పులులు సంచరిస్తున్నాయి పులిని చంపి దాని మాంసం వడుకుని తిన్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.నీలకంఠేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని ఆయన తెలిపారు. పులి సంచరిస్తోందని తెలిసిన వెంటనే పాదముద్రలు సేకరించామని, తద్వారా అక్కడ రెండు ఆడ పులులు, ఒక మగపులి సంచరిస్తోందని తేలిందని ఆయన వివరించారు. అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తున్న ఆ ప్రాంతంలో సహజంగానే పులులు తిరుగుతుంటాయన్నారు. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు కూడా తెలిసిందని, దీనివల్ల పులులకు ప్రాణహాని ఉంటుందన్నారు. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పులిని చంపినట్లు వస్తున్న వదంతులపై తమ దర్యాప్తు ఇంకా ముగియలేదని ఎఫ్ఆర్ఓ చెప్పారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? -
వైరల్ వీడియో: జస్ట్ కారు దిగి వచ్చింది..దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..
-
జస్ట్ కారు దిగి వచ్చింది.. దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..
క్రూర మృగాలు దాడులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అడవిలో జంతువుల వేటా ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడొక పెద్ద పులి భలే కామ్గా వచ్చి లటుక్కున మహిళను పట్టుకుపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఒక కారు అడవి మార్గం గుండా వెళ్తోంది. ఇంతలో సడెన్గా కారు ఆగింది. ఒక మహిళ కారు దిగి ముందుకు వచ్చి అటు వైపు ఉన్న డోరు తీసి అందులో ఉన్నవారితో ఏదో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి ఒక్కసారిగా పెద్ద పులి వచ్చింది. వారంతా చూస్తుండగానే ఆ మహిళను అడవిలోకి ఏదో బొమ్మను లాక్కెళ్లినట్లు లాక్కుపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో కారులో ఉన్నవారు షాక్కు గురయ్యారు. వారు తేరుకుని ఆమెను రక్షించే అవకాశం కూడా లేకుండాపోయింది. Oh Shit pic.twitter.com/MG195HihOH — Terrifying As Fuck (@TerrifyingAsfuk) January 20, 2023 (చదవండి: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్: వీడియో వైరల్) -
పులులు పెరిగాయ్... బతికే చోటేదీ?
దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. కానీ ప్రతి మూడు పులుల్లో ఒకటి రిజర్వ్ ఫారెస్టుకు వెలుపల ఉండాల్సి వస్తోంది. ఇది మానవ–జంతు ఘర్షణలకు దారి తీస్తోంది. రక్షిత ప్రాంతాల వెలుపల పులులు మాత్రమే కాక, అనేక జీవజాతులు కూడా మనుగడ కోసం పోరాడుతున్నాయి. 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేర ఇతరులు చొరబడలేని స్థలం అవసరం. కానీ, మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో... అలాంటి సహజమైన అరణ్యాలను ఆశించడం ఆశావహమైన కోరిక మాత్రమే. వన్యప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేదికలు చెబుతున్నప్పటికీ మనం ఇప్పటికీ పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాము. ఈ సంవత్సరం వార్తాయోగ్యమైన రెండు ఘటనలు జరిగాయి. ఒకటి – ప్రపంచంలోనే అత్యధిక జనాభా విషయంలో భారతదేశం చైనాను దాటేసింది. కేవలం 2 శాతం భూప్రాంతం కలిగిన దేశం 145 కోట్ల ప్రజలు లేదా విశ్వ మానవ జనాభాలో 18 శాతం మందికి ఆవాస ప్రాంతంగాఉంటోందని ఊహించండి. జనసాంద్రత రీత్యా, భారతదేశం... చైనా కంటే మూడు రెట్ల రద్దీతో ఉంటోంది. రెండు – భారతదేశంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణి రక్షణ పరిశ్రమ అయిన ప్రాజెక్ట్ టైగర్ ఏర్పడి ఈ ఏప్రిల్ నాటికి 50 ఏళ్లు దాటుతుంది. పెరుగుతున్న పులుల సంఖ్య విషయంలో రికార్డు అంచనాలు ఉన్నాయి. 2022 నాటి పెద్దపులుల జనాభా లెక్కలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పులుల సంఖ్య 3 వేలను దాటి ఉంటుందని ఒక అంచనా. దేశంలో ప్రాజెక్టు టైగర్ 1973 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 2014 నాటికి దేశంలో 2,226 పులులు ఉండగా, 2018లో వీటి సంఖ్య 2,967కి పెరిగిందని జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ (ఎట్టీసీఏ) నివేదించింది. దేశంలో పులుల సంఖ్యలో అమాంతం 33 శాతం పెరుగుదల నమోదు కావడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. 2006లో పులుల జనాభా లెక్కల ప్రక్రియను శాస్త్రీయమైన బిగువుతో, కెమెరా ట్రాప్ టెక్నాలజీతో సరిదిద్దినప్పటి నుంచి నాలుగేళ్లకోసారి జరిపే పులుల జనాభా లెక్కల్లో సంఖ్యలు పెరుగుతూ వచ్చాయి. 2006లో దేశంలో 1411 పులులు ఉండేవనీ, 2010 నాటికి వాటి సంఖ్య 1706కు పెరిగిందనీ ఎన్టీసీఏ అంచనా వేసింది. విజయవంత మైన పులుల పరిరక్షణ ఏర్పాట్లకు ఈ సంఖ్యలు సాక్ష్యంగా నిలుస్తు న్నప్పటికీ దీనిలో నాణేనికి మరో వైపు కూడా ఉంది. పులులు ఒంటరి జీవులు. వీటికి నిర్దిష్టంగా స్థలం అవసరం. పెద్దపులులు వాటితోపాటు సాధారణంగా వన్యప్రాణులు కూడా మానవులు గీసిన హద్దులు కానీ, మ్యాప్లను (జాతీయ పార్కులను, వన్యప్రాణి కేంద్రాలను లేదా టైగర్ రిజర్వ్లను) కానీ అర్థం చేసుకోవు. గత నెల అస్సాంలో, ఒక పులి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంబడి 120 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. ఒరాంగ్ నేషనల్ పార్కు నుంచి గౌహతిలోని ఉమానంద ద్వీపం వరకు అది నడిచివచ్చింది. 79 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చిన్న కీలకమైన ప్రాంతంలో ఉండే ఒరాంగ్, తనలో పెరుగుతున్న పులుల జనాభాకు తగినట్టు ఆశ్రయం ఇవ్వలేక కొట్టుమిట్టాడుతోంది. మానవుల ఆవాసానికి లోపలా, వెలుపలా పులులు తిరగడం రోజువారీ వ్యవహారం అయింది. బిహార్ పశ్చిమ చంపారణ్ ప్రాంతంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ వంటి అతి పెద్ద రక్షిత ప్రాంతాలు కూడా ఇదే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దం క్రితం వాల్మీకి టైగర్ రిజర్వ్... పెద్ద పులుల సంరక్షణ మ్యాప్లో స్థానం కోల్పోయింది. కానీ బిహార్ అటవీ శాఖ, ఇతర లాభరహిత పరిరక్షణ సంస్థల ప్రయత్నాల కారణంగా ఇప్పుడది భారతదేశంలోనే అత్యుత్తమంగా పనిచేసే టైగర్ రిజర్వులలో ఒకటిగా నిలిచింది. 2021లో కన్జర్వేషన్ అస్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ (సీఏటీఎస్) గుర్తింపు పొందిన దేశంలోని 14 టైగర్ రిజ ర్వులలో ఒకటయ్యింది. పులుల పరిరక్షణలో ఉత్తమ ఆచరణలు, ప్రమాణాలకు సంబంధించి ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపు. అయితే ఈ విజయం అటు అటవీ శాఖకూ, ఇటు స్థానిక కమ్యూ నిటీకీ కొత్త తలనొప్పికి కారణమైంది. గత అక్టోబర్లో తొమ్మిది మంది ప్రజల హత్యకు కారణమైన మూడేళ్ల మగపులిపై కనిపిస్తే కాల్చివేత ఆదేశం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత దాన్ని కాల్చి చంపారు. జనవరి 10న ఈ ప్రాంతం నుంచే ఒక మైనర్ బాలికపై మరో పులి దాడి చేసిన ఘటన వార్తలకెక్కింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కొన్ని దురదృష్టకర ఘటనలు జరగడంతో ప్రజలు పులులకు వ్యతిరేకంగా మారుతున్నారు. మన జాతీయ జంతువును కాపాడే మంచి పరిరక్షణ కృషికి వీరు వ్యతిరేకమవు తున్నారు. పెరుగుతున్న పులుల సంఖ్య పులుల పరిరక్షణ విజయానికి తిరుగులేని నిదర్శనం కాగా, అదే సమయంలో దానికి వ్యతిరేక పరి స్థితి కూడా రంగం మీదికొచ్చింది. ఎన్టీసీఏ అంచనా ప్రకారం చూసినప్పటికీ దేశంలోని ప్రతి మూడు పులుల్లో ఒకటి రక్షిత అభయా రణ్య ప్రాంతాల వెలుపల నివసిస్తున్నాయి. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం ఉన్న భారత్ అతిపెద్ద టైగర్ జనాభా కేంద్రంగా వెలుగుతోంది. 1973లో దేశంలో 9 టైగర్ రిజర్వులుఉండగా 2022 నాటికి ఈ సంఖ్య 53కు పెరిగింది. ఈ వెయ్యికిపైగా పులులను తరచుగా భారతదేశ నిరుపేద, నిరాశ్రయ పులులుగా పేర్కొంటూ ఉంటారు. ఇప్పుడు దేశంలోని 53 టైగర్ రిజర్వులు 75 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండవచ్చు. కానీ వీటిలో ఎక్కువ భాగం మనుషులు నివసించే ప్రాంతాలే. ఇవి చిన్నవిగానూ, లేదా ముక్కచెక్కలైపోయిన అటవీ భాగాలుగా ఉంటూ వస్తున్నాయి. టైగర్ రిజర్వులు పులులకు, వన్యప్రాణులకు మాత్రమే సంబంధించినవని అందరూ ఊహిస్తుంటారు కానీ వాటిలో అనేక గ్రామీణ ఆవాసాలు ఉంటున్నాయి. వేలాది ప్రజలు, పశువులు ఉండటంతోపాటు రోడ్లు, రైలు పట్టాలు కూడా వీటిగుండా పోతుంటాయి. దీనికి పశ్చిమబెంగాల్ లోని బక్సా టైగర్ రిజర్వ్ ఒక మంచి నిదర్శనం అని చెప్పాలి. కేంద్ర ప్రాంతంలో కనీసం 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేరకు ఇతరులు చొరబడకూడని స్థలం అవసరమవుతుందని రీసెర్చ్ డేటా సూచిస్తోంది. కానీ మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో, సహజమైన అరణ్యాలు కోరుకోవడం ఆశావహమైన కోరిక మాత్రమే. దానికి తోడుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రక్షిత ప్రాంతాలను అనుసంధానిస్తున్న అటవీ కారిడార్లు... మనుషులు, వన్యప్రాణుల మధ్య ఇరుకైన స్థలాన్ని మాత్రమే మిగుల్చుతున్నాయి. భారతదేశ స్థానిక ప్రజలు, వెనుకబడిన కమ్యూనిటీలు సాంస్కృతికంగా, సామా జికంగా, ఆర్థికంగా ఈ రిజర్వు ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ లోపల, వెలుపల నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు అదనంగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వస్తున్న అటవీ ఏనుగులతో కూడా వ్యవహరించాలి. ఉమరియా జిల్లా (బాంధవ్గఢ్) ప్రజలకు తరతరా లుగా ఏనుగులతో తలపడిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మాత్రం మానవులు–పులులు, మానవులు–ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితులు రావడం వన్యప్రాణుల పరిరక్షణలో కీలకమైన సవాలుకు దారితీస్తోంది. పెరుగుతున్న పులుల సంఖ్యలు మాత్రమే విజయానికి కొల బద్దగా ఉంటున్న సమాజంలో పులుల సంఖ్య క్షీణించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు. ప్రకృతి మనకు విధిస్తున్న పరిమితులను గుర్తించి మసులుకోవడం మనకు సాధ్యం కావడం లేదు. వన్య ప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేది కలు చెబుతున్నప్పటికీ మనం పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాం. పులులు, సింహాలు, ఏనుగులు లేదా ఖడ్గమృగాల వంటి జీవుల సంఖ్య పట్ల మన ఆసక్తి పెరుగుతోంది. దేశంలో మరిన్ని ప్రాంతాలు శీఘ్రంగా నగరీకరణకు గురవుతుండడంతో... మన నగరాల అంచుల్లో, తగ్గిపోతున్న అడవుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో లేదా ఎస్టేట్లలో పులులు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒక్క పులులే కాదు... ఈ మారుతున్న ప్రపంచంలో తమ ఉనికి కోసం అనేక జీవజాతుల పరిస్థితీ అదే! ఆనంద బెనర్జీ వ్యాసకర్త రచయిత, ఆర్టిస్ట్, వన్యప్రాణి పరిరక్షణవాది (‘ది హిందుస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కోతుల కోసం కుక్క పులి వేషం వేసింది!
పలిమెల: జయశంకర్భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగ్గూడెంలో ఓ కుక్క పులి వేషం వేసింది! అదిప్పుడు వైరల్గా మారింది. గ్రామానికి చెందిన ఓ రైతు పంట చేనులో కోతుల బెడదను తప్పించుకోవడానికి మార్గం ఆలోచించాడు. శునకం శరీరంపై నలుపు రంగుతో పులి చారలు గీసి చేనులో కాపలా పెట్టాడు. పంట చేను వద్ద పులిని తలపిస్తున్న శునకాన్ని చూసి భయపడిన కోతులు పంట చేనులోకి రావడం లేదని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు. వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల ధర్నా.. క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
కొత్త కొత్తగా.. టైగర్ సఫారీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త హంగులు, ఆకర్షణలతో ప్రజలకు మరోసారి ‘వైల్డ్ లైఫ్ టూరిజం’.. అందులో భాగంగా ‘టైగర్ సఫారీ’ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పచ్చటి అడవితో పాటు జీవవైవిధ్యానికి ప్రతీకగా పెద్ద పులుల ఆవాసం, విభిన్నరకాల పువ్వులు, ఔషధమొక్కలు, వాగులు, వంకలకు కేంద్రమై ఉంది. పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఏటీఆర్ పరిధిలో ఈ నెల 20వ తేదీన టైగర్ సఫారీని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యాటకులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనేది త్వరలోనే వెల్లడిస్తారు. 2021 నవంబర్లో ఏటీఆర్లోని ఫరాహాబాద్లో తొలిసారిగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో కోవిడ్ రెండో దశ ఉధృతమవడంతో 2022లో ఈ సఫారీ నిర్వహణ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రారంభించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఏమిటీ ‘వైల్డ్ లైఫ్ టూరిజం’ ? వైల్డ్లైఫ్ టూరిజంలో టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని ఆకర్షణలను జతచేస్తున్నారు. దాదాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదదీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బసతో కొత్త అనుభూతిని కలిగించే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు అటవీశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్లకు తీసుకెళ్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్నకు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్ళడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. ►గతంలో 2 పాత వాహనాలను టైగర్ సఫారీకి ఉపయోగించారు. ఇప్పుడు 8 కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. గతంలో 12 మందికి వసతి అవకాశం కల్పించగా ఇప్పుడు 24 మందికి వసతి ఏర్పాట్లు ఇస్తున్నారు. ►అతిథుల కోసం ఆధునిక వసతులు, సౌకర్యాలతో కొత్తగా 6 మట్టి కాటేజీలు నిర్మించారు. కొత్తగా ఏవి అందుబాటులోకి వచ్చాయంటే ? ►‘ట్రీహౌజ్’–చెట్టుపై నిర్మించిన ఇళ్లు కొత్తగా అందుబాటులోకి.. ‘ట్రీహౌజ్’ నుంచి రాత్రిపూట సమీపంలో పర్క్యులేషన్ ట్యాంక్లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణ ►అందుకోసం నైట్విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు ►కొత్తగా ఎయిరోకాన్ హౌజ్ తదితరాల ఏర్పాటు ►గతంలో పైనుంచి ఒకరూట్లోనే సఫారీ నిర్వహించారు. ఇప్పుడు కిందనున్న చెరువు దాకా (ఉమామహేశ్వరం గుడి) వెళ్లాలని అనుకునే వారికి అదనపు చార్జీలతో మరో కొత్తరూట్ ఏర్పాటు ►ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పిస్తారు. ►2023 జనవరి 4వ వారం నుంచి జూన్ 30 వరకు (ప్రతీరోజు 24 మంది చొప్పున) ఈ ప్యాకేజీని ఉపయోగించుకునే వీలుంది. ►ఒక్కరికి, ఇద్దరికి లేదా ఒక గ్రూపునకు సంబంధించి టికెట్ ధరలు ఎంత ఉంటాయనే దానిపై ఇంకా అటవీశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో వైల్డ్లైఫ్ టూరిజం/ సఫారీ ప్యాకేజీలో భాగంగా ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ.9,600గా ధరలు నిర్ణయించారు. ఈసారి ఇంకా కొంగొత్తగా.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అటవీ, జంతుప్రేమికులకు మరింత ఆహ్లాదం పంచే విధంగా చర్యలు చేపట్టాం. ఏటీఆర్లో కెమెరా ట్రాప్లకు చిక్కిన పులుల ఫొటోలతో రూపొందించిన ‘టైగర్ బుక్ ఆఫ్ ఏటీఆర్’ పుస్తక ఆవిష్కరణ, ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్’ పేరిట పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న చెంచుగైడ్స్కు బహుమతులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఇప్పుడు పులుల సంఖ్య గణనీయంగా పెరిగినందున సైటింగ్స్ మరింత పెరగవచ్చు. –ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ