-
బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు!
గత వారం రోజుల నుంచి ఎలాంటి పెరుగుదల లేకుండా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5770.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6295గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57700, రూ. 62950గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 100 తగ్గినట్లు స్పష్టమవుతోంది. చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు రూ.100, రూ.110 తగ్గి తులం రేటు రూ.58200 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63490 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63100గా ఉంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ.. వెండి ధరలు బంగారం ధరలు మాత్రం రోజు రోజుకి తగ్గుతుంటే.. వెండి ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రూ. 200 తగ్గినా వెండి ఈ రోజు మళ్ళీ రూ.200 పెరిగింది. -
ఇషా డబుల్ ధమాకా
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్కు పారిస్ ఒలింపిక్ బెర్త్ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. -
మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే..
భారతదేశంలో గత కొన్ని రోజులుగా పడుతూ.. లేస్తూ ఉన్న బంగారం, వెండి ధరలు ఈ నేడు కూడా స్వల్ప దగ్గుదల వైపు కదిలాయి. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5695, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6213గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 56950, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62130గా ఉంది. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా.. రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5750 (22 క్యారెట్స్), రూ. 6273 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 57500, రూ. 62730గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: పనిగంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు.. కష్టం వృధా కాలేదు ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5705, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6123గా ఉంది. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర ఈ రోజు రూ. 57050 (22 క్యారెట్స్), రూ. 61230కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు రూ. 200 తగ్గినట్లు తెలుస్తోంది. -
భారత్ ‘పంచ్’ పవర్
యెరెవాన్ (అర్మేనియా): అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు భారత్కు మూడు పసిడి పతకాలు, ఆరు రజత పతకాలు లభించాయి. మూడు స్వర్ణాలూ మహిళా బాక్సర్లే నెగ్గడం విశేషం. పాయల్ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో పాయల్ 5–0తో హెజినె పెట్రోసియాన్ (అర్మేనియా)పై, నిషా 5–0తో ఫరినోజ్ అబ్దుల్లాఇవా (తజికిస్తాన్)పై, ఆకాంక్ష 5–0తో తైమజోవా ఎలిజవెటా (రష్యా)పై విజయం సాధించారు. ఇతర ఫైనల్స్లో వినీ (57 కేజీలు) 0–5తో మమతోవా సెవర (ఉజ్బెకిస్తాన్) చేతిలో... సృష్టి (63 కేజీలు) 0–5తో సియోఫ్రా లాలెస్ (ఐర్లాండ్) చేతిలో... అనా బుజులెవా (రష్యా) చేతిలో నాకౌట్ అయిన మేఘ (80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్ (75 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (ప్లస్ 80 కేజీలు), జతిన్ (54 కేజీలు) ఫైనల్లో పరాజయం చవిచూసి రజత పతకాలు గెల్చుకున్నారు. సాహిల్ 0–5తో అల్బెర్ట్ హరుతిన్యాన్ (అర్మేనియా) చేతిలో... హేమంత్ 0–5తో సలిఖోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... జతిన్ 1–4తో తులెబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి - నేటి కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు, ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేసింది. నేడు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5885, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6420గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 58850, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 64200గా ఉంది. నిన్నటి స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా.. రూ. 400 నుంచి రూ. 440 వరకు పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5975 (22 క్యారెట్స్), రూ. 6518 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 59750, రూ. 65180గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య.. ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5900, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6435గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. కొత్త ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 59000 (22 క్యారెట్స్), రూ. 64350కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. -
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
నిన్న రూ. 850 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 650 వరకు తగ్గింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5750, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6273గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 5750, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62730గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 600, రూ. 650 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5865 (22 క్యారెట్స్), రూ. 6398 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 58650, రూ. 63980గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 50, రూ. 60 మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5765, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6288గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ 600, రూ. 650 తగ్గింది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57650 (22 క్యారెట్స్), రూ. 62880కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. -
స్థిరంగా పసిడి.. స్వల్పంగా పెరిగిన వెండి - నేటి ధరలు ఇలా
గత కొన్ని రోజులుగా పడుతూ.. లేస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ సీజన్ తరువాత భారీగా పెరిగిన ధరలు ప్రస్తుతం కొంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపిస్తాయి. నేడు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5685, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6102గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 56850, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 61020గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5740 (22 క్యారెట్స్), రూ. 6260 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 57400, రూ. 62600గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 90 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5700, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6217గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57000 (22 క్యారెట్స్), రూ. 62170కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు రూ. 200 పెరిగింది. -
AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు. దిగులు లేని అవ్వాతాతలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం. ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహిళా సాధికారతకు పట్టం.. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. 2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్లైన్లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. -
స్థిరంగా బంగారం.. రూ.500 తగ్గిన వెండి - కొత్త ధరలు ఇలా!
దీపావళి నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5655, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6169గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 56550, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 61690గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5700 (22 క్యారెట్స్), రూ. 6218 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 57000, రూ. 62180గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఢిల్లీలో ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5670, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6179గా ఉంది. నిన్న ధరలే ఈ రోజూ కొనసాగుతాయి, కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56700 (22 క్యారెట్స్), రూ. 61790కి (24 క్యారెట్స్) చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో రూ. 500 తగ్గుముఖం పట్టింది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు పెరుగుతున్న బంగారం ధర... తాజాగా నవంబర్ 5వ తేదీన కాస్త బ్రేకులు పడ్డాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,150 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350గా ఉంది ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790గా ఉంది హైదరాబాద్లో22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది -
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దసరా పండుగ రోజు పసిడి ప్రియులకు శుభవార్త. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 23న 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,750 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,850 గా ఉంది. ముంబై, బెంగుళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750 గా కొనసాగుతోంది. వెండి ధరల్లో సైతం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర ఇవాళ రూ.75,300గా ఉంది. ప్రస్తుతం, ముంబైలో కిలో వెండి ధర రూ.75,300గా ఉంది. చెన్నైలో 78,700, బెంగళూరులో 74,500, హైదరాబాద్ లో 78,700గా ఉంది. ఇక విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,700 గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా?
జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాటు దసరా, దీపావళి పండుగలతో పెట్టి బడిదారులు అనిశ్చితి సమయాల్లో లాభాల్ని అందించే బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరల విషయానికొస్తే.. ఆదివారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,660 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.6,175గా ఉంది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750గా ఉంది ముంబై, కోల్కతా,కేరళ, బెంగళూరు, హైదరాబాద్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా 24 క్యారెట్ గోల్డ్ రూ.61,750గా ఉంది ఢిల్లీ, చెన్నైలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,750 ఉండగా రూ.24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,600 ఉండగా 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.61,750గా ఉంది. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్తో నగదును హైదరాబాద్లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
హైదరాబాద్లో పోలీసులు తనిఖీలు.. భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.56 కోట్ల నగదు, రూ.2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు సీజ్ చేశారు. 5,529 లైసెన్స్డ్ తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17,128 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. తాజాగా, చందానగర్లో భారీగా బంగారం, వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 29 కేజీల బంగారం, 26 కేజీల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగారంలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఆభరణాలు లభించగా, చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువెలర్స్ షాపులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
తగ్గిన బంగారం, వెండి ధరలు - నేటి ధరలు ఇలా..
పండుగ సీజన్లో రోజురోజుకి పెరుగుతున్న పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ. 150 (22 క్యారెట్స్) నుంచి రూ. 160 (24 క్యారెట్స్) తగ్గింది. ఈ రోజు విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5495 & 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5995గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ఒక గ్రామ్ మీద రూ. 15 నుంచి రూ. 16 వరకు తగ్గింది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 54950 & రూ. 59950గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి. చైన్నైలో నేటి బంగారం ధరలు రూ. 150 నుంచి రూ. 160 వరకు తగ్గి రూ. 55,150 (10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్), రూ. 60,160గా (10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్) ఉన్నాయి. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 77,000 వద్ద ఉంది. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 55,100 & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 60,100గా ఉంది. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 73,600 వద్ద ఉంది. -
ఎన్నికల కోడ్..బంగారం, వెండి, వజ్రాలు సీజ్..
-
పట్టుకున్న నగదు, వస్తువులు రూ. 37 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చినప్పటి నుంచీ పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తంగా 1,196 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. తనిఖీల కోసం 89 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 169 ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వివరించింది. ఇప్పటివరకు కమిషన్ నేతృత్వంలో సాగిన నిఘా, స్వాదీనాలు, కేసుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాల మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.20,43,38,375 నగదును, రూ.14,65,50,852 విలువైన బంగారం, వెండి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.86,92,533 విలువైన 31,730 లీటర్ల మద్యం, వెయ్యి కిలోల నల్లబెల్లం, 501 కిలోల అల్లం స్వాధీనం చేసుకున్నారు. రూ.89,02,825 విలువైన 310 కిలోల గంజాయిని తనిఖీల్లో పట్టుకున్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు తరలిస్తున్నారనే అనుమానంతో 7,040 కిలోల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు మెషీన్లు, 87 కుక్కర్లు, ఒక కారును స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22,51,963. మొత్తంగా నగదు, వస్తువులన్నీ కలిపి విలువ రూ.37,07,36,548 అని కమిషన్ గుర్తించింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై 34,388 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ♦ గురువారం హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.33.55 లక్షలను, జూబ్లీహిల్స్లో మణిపూర్కు చెందిన మహిళ నుంచి రూ. 5.50 లక్షలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అబిడ్స్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షల నగదు, అమీర్పేటలో మరొకరి నుంచి రూ. 9.9 లక్షలను, మియాపూర్లో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి 448.96 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ♦ నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురంలో చేపట్టిన వాహన తనిఖీల సందర్భంగా ఎలాంటి పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు. ♦ మేడిపల్లి పోలీసులు నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ వద్ద వాహన తనిఖీల్లో రూ.13.50 లక్షలు, హబీబ్నగర్ పోలీసులు సీతారామ్భాగ్ ఎక్స్ రోడ్డులో ఓ వ్యక్తి నుండి రూ.6.95 లక్షలు నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
Gold rate today: బంగారం ధర తగ్గుముఖం..
Gold price today: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈరోజు (అక్టోబర్ 5) బంగారం ధరలు కాస్త తగ్గాయి. గతకొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇది చాలా తక్కువ మొత్తంలోనే ఉంటోంది. కాగా ప్రస్తుతం బంగారం ధర సుమారు రూ.200 తగ్గి వినియోగదారులకు కాస్త ఊరట కలిగించింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.190 తగ్గి రూ. 52,400 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.200 చొప్పున తగ్గి రూ.57,160 లకు దిగొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! పెరిగిన వెండి ధర Silver rates today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధర కేజీకి రూ.400 మేర పెరిగింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ. 73,500లుగా ఉంది. క్రితం రోజు ఇది రూ.73,100 గా ఉండేది. -
జీఆర్టీ జ్యువెలర్స్ ‘సిల్వర్ ఉత్సవ్’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వెండి వస్తువులు, వెండి ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లతో ‘సిల్వర్ ఉత్సవ్’ను తీసుకొచి్చంది. పూజా సామగ్రి నుంచి డిన్నర్ సెట్ల వరకూ ప్రతి శ్రేణిలో డిజైన్లను అత్యంత స్వచ్ఛత, నాణ్యతతో తీర్చిదిద్దారు.వెండి వస్తువుల తరుగుపై 25%, వెండి ఆభరణాల మీద 10% తగ్గింపు పొందవచ్చు. ‘సిల్వర్ ఉత్సవ్ ద్వారా కస్టమర్లకు ప్రశాంతమైన, మంగళకరమైన అనుభవాన్ని అందించాలని భావిస్తున్నాము. తదనుగుణంగా ప్రతి డిజైన్ను రూపొందించాము’ అని జీఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ అన్నారు. -
సూపర్ కైనన్...
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. షూటింగ్ క్రీడాంశం చివరిరోజు భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం కలిపి మూడు పతకాలు వచ్చాయి. ఓవరాల్గా భారత షూటర్లు ఈ క్రీడల్లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలు గెలిచారు. ఆఖరి రోజు పురుషుల, మహిళల ట్రాప్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరిగాయి. పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో హైదరాబాద్కు చెందిన కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్లతో కూడిన భారత జట్టు 361 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల కొత్త రికార్డును నెలకొల్పింది. క్వాలిఫయింగ్లో కైనన్ 122 పాయింట్లు, జొరావర్ 120 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్కు అర్హత పొందారు. వ్యక్తిగత విభాగంలో ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొరావర్ 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... కైనన్ 32 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్లతో కూడిన భారత జట్టు 337 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. రజతంతో ముగింపు... ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించే అవకాశాన్ని భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 22–20, 14–21, 21–18 తో షి యుకీపై గెలిచి భారత్కు 1–0 ఆధిక్యం ఇచ్చాడు. రెండో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–15, 21–18తో లియాంగ్ వెకింగ్–చాంగ్ వాంగ్ జంటను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్లో శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ... నాలుగో మ్యాచ్లో ధ్రువ్–సాయిప్రతీక్ ద్వయం 6–21, 15–21 తో లియు యుచెన్–జువాన్యి ఒయు జోడీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో గాయంతో ఫైనల్కు దూరమైన భారత నంబర్వన్ ప్రణయ్ స్థానంలో మిథున్ ఆడాల్సి వచ్చింది. మిథున్ 12–21, 4–21 తో హాంగ్యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు. -
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు
Gold And Silver Price: వినాయక చవితి సంబరాలు దాదాపు ముగింపు దశకు వచ్చాయి, త్వరలో విజయదశమి కూడా రానుంది. ఈ తరుణంలో బంగారం ధర భారీగా తగ్గింది. ఈ రోజు (2023 సెప్టెంబర్ 28) 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ మీద ఏకంగా రూ. 600 తగ్గింది. ప్రాంతాల వారీగా పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం. 👉 విజయవాడలో ఒక గ్రాము 22, 24 క్యారెట్ ధరలు వరుసగా రూ. 5390 & రూ. 5880గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ. 53900, రూ. 5880. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 600 తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, విశాఖపట్టణంలో కూడా ఇదే ధరలు ఉంటాయి. 👉 వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 76.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 76500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 👉 చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5410 అండ్ రూ. 5902. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం రూ. 54100 (22క్యారెట్స్) రూ. 59020 (24 క్యారెట్స్)గా ఉంది. 👉 ఒక గ్రామ్ వెండి ధర చెన్నైలో రూ. 76.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 76500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 👉 దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5405 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 5895గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 54050 (22 క్యారెట్) రూ. 58950 (24 క్యారెట్). 👉 వెండి ఒక గ్రామ్ ధర ఢిల్లీలో రూ. 73.70. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 73700. నిన్న కంటే నేడు వెండి ధర కేజీపై రూ. 500 వరకు తగ్గింది. మొత్తం మీద పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గడం పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. -
బుల్లెట్ దిగింది...
చైనా గడ్డపై భారత తుపాకీ గర్జించింది. ఒకే రోజు మన షూటర్లు ఏకంగా ఏడు పతకాలతో అదరహో అనిపించారు. స్టెతస్కోప్ను వదిలేసి రైఫిల్ ఎత్తిన సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ టీనేజ్ షూటర్ ఇషా సింగ్ డబుల్ ధమాకా సృష్టించింది. పిస్టల్ ఈవెంట్లో ఇషా సభ్యురాలిగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిపించగా... వ్యక్తిగత విభాగంలో ఇషా రజత పతకంతో మురిపించింది. స్కీట్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్ రెండు పతకాలతో భారత బృందంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. సెయిలింగ్లో విష్ణు శరవణన్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల వుషు సాండా ఈవెంట్లో రోషిబినా దేవి ఫైనల్ చేరి... పురుషుల టెన్నిస్ డబుల్స్లో సాకేత్ మైనేని–రామ్కుమార్ జోడీ సెమీఫైనల్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. వెరసి ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలు చేరాయి. ఓవరాల్గా 22 పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది. హాంగ్జౌ: గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 467 పాయింట్లతో బ్రిటన్ షూటర్ సియోనైడ్ మెకింటోష్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్ కౌర్ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో భారత్కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్ కియోంగ్యు జాంగ్ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది. పంజాబ్లోని ఫరీద్కోట్ ప్రాంతానికి చెందిన సిఫ్ట్ కౌర్ ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ రైఫిల్ షూటింగ్లో కొనసాగింది. అయితే షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో సిఫ్ట్ కౌర్కు మంచి ఫలితాలు వస్తుండటంతో ఏడాది తర్వాత ఆమె వైద్య విద్యకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో ఈ క్రీడపై దృష్టి సారించింది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని తాజా ఫలితం నిరూపించింది. అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్కు టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్ జీత్ సింగ్, గురుజోత్ సింగ్, అంగద్ వీర్సింగ్ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్ జీత్ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. -
తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు
వినాయక చవితి సందర్భంగా పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ మీద రూ. 20 తగ్గింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 200 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది. మీరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5,485 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5,984 వరకు ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ & 24 క్యారెట్ గోల్డ్ ధర వరుసగా రూ. 54850, రూ. 59840గా ఉంది. ఇదే ధర బెంగళూరు, గుంటూరు, విశాఖపట్టణం మొదలైన ప్రాంతాల్లో ఉంది. వెండి ధర ఒక గ్రాము రూ. 790 వద్ద నిలిచింది. కావున కేజీ వెండి ధర రూ. 79000. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 1000 పెరిగింది. చైన్నైలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5510 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 6011 వరకు ఉంది. దీని ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ & 24 క్యారెట్ గోల్డ్ ధర వరుసగా రూ. 55100, రూ. 60110గా ఉంది. చెన్నైలో నేడు బంగారం ధర గ్రాము మీద రూ. 20 తగ్గింది. అంటే గత రెండు రోజుల్లో రూ. 400 తగ్గింది (10 గ్రామ్స్). వెండి ధర రూ. 10 పెరిగి గ్రాము రూ. 790 వద్ద నిలిచింది. కావున కేజీ వెండి ధర రూ. 79000. ఇదీ చదవండి: ఐఫోన్ 15 సిరీస్ ఫస్ట్ సేల్ షురూ.. ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న కస్టమర్లు! దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5500 & 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5994. 10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 55000 కాగా 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 59940గా ఉంది. వెండి 10 గ్రాముల ధర రూ. 755గా ఉంది. కావున కేజీ వెండి ధర రూ. 75500. -
పెరిగిన బంగారం & వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు..
ఇటు వినాయక చవితి మరోవైపు వస్తున్న విజయదశమి సందర్భంగా బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదు రోజుల నుంచి గోల్డ్ రేట్లు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు (19 సెప్టెంబర్ 2023) ఒక గ్రామ్ 22, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5520 & రూ. 6022గా ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ రేట్ రూ. 15 & రూ. 14 ఎక్కువ అని తెలుస్తోంది. దీని ప్రకారం నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం విలువ రూ. 55200 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60220. 👉హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55200 & రూ. 60220గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. 👉వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 78.30. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 100 పెరిగినట్లు తెలుస్తోంది. 👉చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5550 అండ్ రూ. 6055. 10 గ్రాముల బంగారం రూ. 55500 (22క్యారెట్స్) రూ. 60550 (24 క్యారెట్స్) 👉ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5535 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 6037గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 55350 (22 క్యారెట్) రూ. 60370 (24 క్యారెట్). 👉చెన్నైలో 1 గ్రామ్ వెండి రూ. 78.30. కావున కేజీ వెండి ధర రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధరలు కేజీపై రూ. 300 పెరిగింది. 👉ఢిల్లీలో వెండి ఒక గ్రామ్ ధర రూ. 74.80. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 74800. నిన్న కంటే నేడు వెండి ధర రూ. 300 అధికం కావడం గమనార్హం. -
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023