-
నీ కుంభకోణాల చరిత్ర నాకు తెలుసు ఆధారాలు బయటపెట్టానంటే..
-
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
-
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
GHMCలో వెలుగు చూసిన భారీ స్కామ్
-
గొర్రెల స్కాం లో అసలు దొంగలు దూకుడు పెంచిన ఈడీ
-
గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్
-
నీట్ వివాదంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు
-
కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్కుమార్పై ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది. బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాంచందర్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం
-
పబ్ లో కొత్త దందా..
-
ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్.. రూ.1.2 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ వాసి
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాల చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇటీవల కొంతమంది కేటుగాళ్లు పోలీసుల పేరుతో.. పార్శిల్ స్కామ్ / ఫేక్ డిజిటల్ అరెస్ట్ అనే కొత్త స్కామ్కు తెరలేపారు. దీనికి బలైన ఓ హదరాబాద్ వాసి 20 రోజుల్లో ఏకంగా రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్నారు.మే 7న ఊహించని ఫోన్ కాల్తో హైదరాబాద్ వాసి కష్టాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి పోలీస్ అధికారినని నమ్మించి.. అతని పేరు మీద ఉన్న పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని.. దానిని స్వాధీనం చేసుకున్నట్లు ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నీ కూడా ఎలాంటి తప్పు లేకుండా చెప్పడంతో.. బాధితుడు నకిలీ వ్యక్తిని పూర్తిగా నమ్మేశాడు.పోలీసుగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. బాధితున్ని 24/7 ఆన్లైన్లో ఉండాలని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి 20 రోజులు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ 20 రోజులు సరిగ్గా తిండి లేదు, సరిగ్గా నిద్ర కూడా పోలేదని ఆ వ్యక్తి మీడియాతో చెప్పుకున్నారు.డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి రూ. 30 లక్షలు పంపాలని నకిలీ పోలీస్ చెప్పాడు. ఇలా వారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. మొత్తం మీద బాధితుడు రూ.1.2 కోట్లు నష్టపోయినట్లు పేర్కొన్నాడు.డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అంటే..డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలువబడే ఈ స్కామ్లో నేరస్థులు చట్టాన్ని అమలు చేసేవారిగా నటించి, అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకుంటారు. అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు పెద్ద నేరంలో చిక్కుకున్నట్లు నమ్మించి వారిని భయాందోళనలకు గురి చేస్తుంటారు.ఇలాంటి మోసాల నుంచి బయటపడే మార్గం..కాలర్ ఐడెంటిటీ ద్రువీకరించుకోవాలి: తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా ద్రువీకరించుకోవాలి. దీనికోసం అధికారిక వెబ్సైట్ లేదా డాక్యుమెంట్స్ ద్వారా సమాచారం తెలుసుకుని అధికారిక సంస్థను నేరుగా సంప్రదించాలి.వ్యక్తి సమాచారం చెప్పకూడదు: మీకు తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు.. మీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇది మీకు చాలా ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది.అత్యవసర అభ్యర్థనలు: నిజానికి స్కామర్లు ఎప్పుడూ.. అత్యవసర పరిస్థితులను సృష్టిస్తారు. ఇలాంటి సమయంలో బాధితులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.అనుమానాస్పద కార్యకలాపాలు: గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ లేదా మెసేజస్ వస్తే.. వెంటనే పోలీసులను సంప్రదించాలి. బ్యాంకులకు సంబంధించినవైతే.. నేరుగా బ్యాంకుకు వెళ్లి సమాచారం తెలుసుకోవాలి.ప్రస్తుతం ఇలాంటి స్కామ్లు ఎక్కువైపోతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. కాబట్టి ఇలాంటి స్కామ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి. -
దిమాక్ అంటే ఇట్లుండాలే!.. గొర్రెల మిన 700 కోట్లు సంపాదించిండు
-
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్కుమార్ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్కుమార్ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం
-
200 కోట్ల భారీ స్కాంలో దొరికిపోయిన నిమ్మగడ్డ ఫ్యామిలీ
-
ట్రేడింగ్ స్కామ్.. రూ.1.07 కోట్లు మాయం - ఎక్కడంటే?
టెక్నాలజీ పెరుగుతున్న వేళ సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల నవీ ముంబైలోని ఖార్ఘర్ టౌన్షిప్కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి షేర్ ట్రేడింగ్ స్కామ్లో రూ.1.07 కోట్లు మోసపోయారు. విచారణలో భాగంగా ఓ యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.సైబర్ మోసాలు కొత్తేమీ కాదు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) వివరాలు చెబుతున్నాయి. ఇందులో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు మాత్రమే కాకుండా.. గేమింగ్ యాప్స్, చట్ట విరుద్ధమైన లోన్ యాప్స్, ఓటీపీలను ఇతరులకు షేర్ చేయడం వంటివి ఉన్నాయి.ఇటీవల నవీ ముంబైలో సైబర్ మోసానికి ఎరగా చిక్కిన వ్యక్తిని మోసగాళ్లు ఫిబ్రవరి 13 నుంచి మే 5 వరకు పలుమార్పు కలిసి షేర్ ట్రేడింగ్ నుంచి లాభాలను ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తరువాత వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. 10709000 డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు డిపాజిట్ చేయించుకున్న తరువాత ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (చీటింగ్) వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మొత్తం కేసులుఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I4C ) ప్రకారం.. 2023లో 1 లక్షకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కామ్ల ద్వారా మోసపోయిన వారు 20,043 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. డేటింగ్ యాప్ల వల్ల మోసపోయిన వారి సంఖ్య 1725గా నమోదైంది. ఇలా వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మాయ చేస్తూ.. మోసం చేస్తున్నారు.మోసగాళ్ల కొత్త అవతారాలు..మోసగాళ్లు తమ ఫోన్ నంబర్లను చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి తరచుగా కాల్ స్పూఫింగ్ ఉపయోగిస్తారు. స్కామర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తారు. ఇది నిజమని నమ్మి ప్రజలు మోసపోతున్నారు. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్షిప్కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
BH రిజిస్ట్రేషన్.. బయటపడ్డ డీలర్ల మోసాలు
-
కాంగ్రెస్కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ఆదివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.నాలుగు సంస్థలకే టెండర్లు..బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్ సప్లై, ఎఫ్సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. బీజేపీపై అనుమానాలు..ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. -
మాటలతో మూటలు
సాక్షి, హైదరాబాద్: శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ చేసిన రూ.200 కోట్ల స్కామ్లో టెస్కాబ్ మాజీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణీబాల పాత్ర కీలకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్ష నిర్వహిస్తున్న ప్రింటింగ్ మెటీరియల్ సప్లై ఏజెన్సీని ఫైనాన్స్ సంస్థగా మార్చడంలో ఆమె పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 517 కాగా, దర్యాప్తు నిమిత్తం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క టెస్కాబ్ అధికారులు వాణీబాలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వాణీబాల చేసిన మోసంలో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు. ‘ప్రియాంక’ సంస్థ ఏర్పాటు ఉద్దేశమే వేరు... ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985 నుంచి అబిడ్స్ తిలక్రోడ్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి ఖరీదు చేసి, ప్రింటింగ్ ప్రెస్ వారికి విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లోనే చేరారు. కొన్నాళ్లుగా ఈ సంస్థ వ్యాపారం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెటీరియల్ సరఫరా చేసే కంపెనీల నుంచి దాదాపు రూ.6 కోట్ల మేర క్రెడిట్ తీసుకోవడంతోపాటు ఆయా కంపెనీల్లో పనిచేసే వారి వద్ద నుంచి వడ్డీకి భారీగా అప్పులు కూడా తీసుకున్నారు. ఈ సంస్థ ఏటా దాదాపు రూ.6 కోట్ల టర్నోవర్ చేస్తుండటంతో తమ నగదు ఎక్కడికీ పోదనే ఉద్దేశంతో పలువురు అప్పులు ఇచ్చారు. వాణీబాల సలహాతోనే ఫైనాన్స్ సంస్థగా... తన భర్త, కుమారుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసిన వాణీబాల తనకున్న పరిచయాలు, ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీ స్కామ్కు ప్లాన్ చేసింది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ను ఫైనాన్స్ సంస్థలా మార్చేలా చేసింది. తొలినాళ్లల్లో తన సహోద్యోగులతో పాటు వారి బంధువుల నుంచి డిపాజిట్లు తీసుకుంది. వీరికి సాలీనా 18 నుంచి 24 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. దీంతో వారికి వాణీబాలపై నమ్మకం ఏర్పడి సహకరించడం ప్రారంభించారు. టెస్కాబ్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో వాణీబాల మాటలు కలిపేది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకునేది. ఆపై తమకున్న ఫైనాన్స్ కంపెనీ విషయం చెప్పి..బ్యాంక్లో అయితే కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పేది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకూ సరిపోదని, తన భర్త, కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్ చేయాలని సూచించేది. తాము క్రమం తప్పకుండా 20 నుంచి 24 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవీవిరమణ చేసిన వారు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. బ్యాంకు సిబ్బందినీ వినియోగించుకుంది జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ వాణీబాల తన భర్తకు చెందిన సంస్థలోకి టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లను మళ్లించింది. దీనికోసం ఆ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. డిపాజిట్ల వ్యవహారాలు పర్యవేక్షించే వారికి కమీషన్ల ఆశ చూపి, వినియోగదారులు ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఇలా టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లు ప్రైవేట్ సంస్థకు తరలి వెళ్లిపోతున్నా ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు సీసీఎస్లో కేసు నమోదైన తర్వాత వాణీబాలను సస్పెండ్ చేసి, విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు. తమను సంప్రదించిన బాధితులతో ఆమెకు, బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని తెలిసింది. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి, రూ.1 విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి, సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా, గతేడాది నవంబరు, డిసెంబర్ నుంచి వడ్డీలు చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులు దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ఆ మరుసటి రోజు నుంచి వాణీబాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు రాష్ట్రాల్లో వ్యాపారాలంటూ బ్రోచర్లు డిపాజిట్దారులకు ఇవ్వడానికి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఎస్పీ లోగోతో బ్రోచర్లు ముద్రించింది. వాటిలో తమకు ఎస్పీ గ్రాఫిక్ సిస్టమ్స్, శ్రీ ప్రియాంక డిజిటల్స్, శ్రీ ప్రియాంక గ్రాఫిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్లోని తిలక్రోడ్తో పాటు జీడిమెట్ల, బెంగళూరులోని రాజాజీనగర్, విజయవాడలోని గాంధీనగర్ల్లో వీటి బ్రాంచ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. తమ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్టు వాటిలో స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మంగళవారం మరికొందరు బాధితులు సీసీఎస్కు రాగా వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు వీరితోపాటు సంబం«దీకులు, ఆయా సంస్థల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న సబ్రిజి్రస్టార్లకు లేఖలు రాస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో నిందితులు దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్పై జూలై మూడోవారంలో హియరింగ్ జరగనుంది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారిలో వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఉద్యోగ జీవితంలో సంపాదించింది మొత్తం పెట్టేశా మా బంధువు ఒకరు టెస్కాబ్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు దాదాపు రూ.60 లక్షల వరకు ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడి పెట్టారు. వారి ద్వారానే వాణీబాల నాకు పరిచయమైంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన నేను నా ఉద్యోగ జీవితంలో సంపాదించిన రూ.20 లక్షలు వారి వద్ద పెట్టుబడిగా పెట్టాను. సైదాబాద్ మనోహర్కాలనీలోని వాణీబాల ఇంటికి తాళం వేసి ఉండగా.. బ్యాంకు అధికారులు అక్కడే ఆమె సస్పెన్షన్ నోటీసు అంటించారు. సీసీఎస్ పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. – ఎం.శ్రీనివాసమూర్తి, ల్యాబ్ టెక్నీషియన్, కోటి గవర్నమెంట్ ఆస్పత్రి -
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
సైబర్ నేరస్తులు బెంగళూరులోని ఆర్బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు. నగరంలోని కన్నింగ్హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్లో ఎగ్జిక్యూటివ్ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్లో ముంబైలో ఐదు పాస్పోర్ట్లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. ముంబై పోలీసులు మీ పార్శిల్పై ఆరా తీశారు. ఈ కాల్ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం..అంటూ ప్లాన్ ప్రకారం.. కాన్ఫిరెన్స్ కాల్లో మరో సైబర్ నేరస్తుడు లైన్లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్ అకౌంట్ను మనీ ల్యాండరింగ్కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్ అకౌంట్ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్ అకౌంట్కు పంపించండి. విచారణ పూర్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘జెల్లె స్కామ్’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్ బ్యూటీ
అమెరికన్ బ్యూటీ బ్రియానా సియాకా ‘జెల్లె స్కామ్’లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ స్కామ్ పట్ల అందరూ అప్రమత్తంగా హెచ్చరించారు. అసలేంటీ స్కామ్, డబ్బులు ఎలా పోగొట్టుకున్నది ఆమె వివరించారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. యూఎస్లో మాజీ మిస్ న్యూయార్క్ అయిన బ్రియానా సియాకా టిక్టాక్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు యువకులు తన నుంచి 2,000 డాలర్లు (రూ. 1.66 లక్షలు) ఎలా లాక్కున్నారో వివరించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సియాకా, తాను మాడిసన్ స్క్వేర్ పార్క్లో కూర్చుని పాడ్కాస్ట్ వింటుండగా ఇద్దరు కుర్రాళ్లు తన వద్దకు వచ్చి తమ బాస్కెట్బాల్ జట్టు కోసం నిధులు సేకరిస్తున్నామని, తమకు సహాయం చేయాలని కోరారని చెప్పారు.తాను వారికి కొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించానని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో జెల్లె యాప్ ద్వారా చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ అకౌంట్ వివరాలు నమోదు చేసేందుకు తన ఫోన్ తీసుకున్నాడని, మరో కుర్రాడు తనను మాటల్లో పెట్టగా అతను తన అకౌంట్ నుంచి 2,000 డాలర్లు వారి ఖాతాకు మళ్లించుకున్నారని వివరించారు. న్యూయార్క్ పోలీసుల ప్రకారం, ఇది చాలా సాధారణమైన స్కామ్. దీని దుండగులు విరాళాల పేరుతో డబ్బును స్వాహా చేస్తారు."నేను ఆశ్చర్యపోయాను. ఈ అబ్బాయిలు చాలా మంచిగా, అమాయకంగా మాట్లాడితే వారు నిజంగానే తమ జట్టు కోసం విరాళాలు సేకరిస్తున్నారని అనుకున్నాను" అని సియాకా చెప్పారు. జెల్లె (Zelle) అనేది జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా ఏడు బ్యాంకుల యాజమాన్యంలోని పీర్-టు-పీర్ నెట్వర్క్. 2017లో ప్రారంభమైన జెల్లె అతిపెద్ద యూఎస్ పీర్-టు-పీర్ చెల్లింపుల నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగింది. -
యథేచ్ఛగా ‘ప్రీలాంచ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి ఆశలను కొందరు బిల్డర్లు అడియాసలు చేస్తున్నారు. ప్రీ లాంచ్ దందా నిర్వహిస్తూ, ఆకర్షణీయమైన హామీలు ఎరవేస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన సాహితీ, భువనతేజ, ఓబిలీ హౌసింగ్ వంటి సంస్థల యజమాను లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, కొనుగోలుదారుల సొమ్ముతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా ఎత్తుగడలు వేస్తూ చివరికు బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా కొంపల్లిలో భారతి లేక్వ్యూ పేరిట అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రీలాంచ్ ఆఫర్ పెట్టి రూ.60 కోట్లు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వరకు వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, ప్రీలాంచ్ ఆఫర్ల వలలో చిక్కుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు హైదరాబాద్లో కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా రియల్టర్ల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఈ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రియల్ వెంచర్ల విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సైతం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తక్కువ ధరకే చదరపు అడుగు పేరిట..హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు అవతల కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చాలామందికి సొంతంగా 100 లేదా 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న ఉద్యోగులు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వలస వస్తున్న వారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కోకాపేట, గచ్చిబౌలి, మియాపూర్, పటాన్చెరు తదితర డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బడా సంస్థలు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో రియల్టర్లు, భూదందాలు చేసేవాళ్లు కరీంనగర్, వరంగల్, విజయవాడ, మెదక్ హైవేల వైపు దృష్టి సారించి నాలుగైదేళ్ల క్రితమే ఈ ప్రీలాంచ్ దందాకు తెరతీశారు. అంటే ప్రజల ఆశనే పెట్టుబడిగా పెట్టి ఫ్లాట్లు నిర్మించి ఇవ్వడం అన్నమాట. అపార్ట్మెంటులో ఫ్లాట్ చదరపు అడుగు ధర రూ.3వేల నుంచి రూ.5వేల లోపు నిర్ణయించి, నిర్మాణానికి ముందే చెల్లించే పక్షంలో ఇలా తక్కువ ధరకు ఇస్తామని చెబుతూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ తరహా వెంచర్లు హైదరాబాద్ పరిసరాల్లో వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తవుతున్నప్పటికీ మోసపోయిన వాళ్లే అధికంగా ఉంటుండటం గమనార్హం. డబ్బులు చెల్లించినప్పటికీ సరైన సమయంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బిల్డర్ల చుట్టూ కోర్టులు, పురపాలక సంస్థలు, ‘రెరా’ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. నోటీసులకే పరిమితమవుతున్న ‘రెరా’రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడం, వినియోగదారుడి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ‘రెరా’ను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది ఏడాది క్రితం వరకు నామ మాత్రంగానే ఉండిపోయింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సత్యనారాయణ గత సంవత్సరం జూన్లో ‘రెరా’ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తరువాత కొంత కార్యాచరణ మొదలైందని చెప్పవచ్చు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ఫ్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించి, తదనుగుణంగా నోటీసులు జారీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే ప్రీలాంచ్ ఆఫర్ల విషయంలో ‘రెరా’కు సైతం పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేకపోతోంది. ప్రీలాంచ్ ఆఫర్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, ప్రకటనలు విడుదల చేసినా నోటీసులు జారీ చేసి, చర్యలకు స్థానిక పురపాలక, పంచాయతీ సంస్థలకు రిఫర్ చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ప్రీలాంచ్ మోసాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రీలాంచ్ దందాల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులు కూడా ప్రభుత్వం వీటిపై సరైన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల పేరుతో స్క్రాచ్ కార్డ్లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్ కేసులో 2 బిగ్ ట్విస్టులు
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే వ్యబిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు.‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు. వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు.మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.దేవరాజ్ గౌడ్పైనా లైంగిక దాడి కేసుఇక ప్రజ్వల్ ఎపిసోడ్లో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. ఈ భాగోతం మొత్తం బయటపెట్టిన బీజేపీ నేత, ప్రముఖ లాయర్ దేవరాజ్ గౌడపైనా లైంగిక దాడి కేసు ఒకటి నమోదు అయ్యింది. హోలెనరసిపురా టౌన్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 1వ తేదీన కేసు నమోదు అయ్యింది. అంతకు ముందురోజు ఆమె భర్త.. గౌడ తమ ఇంటికి వచ్చి బెదిరించాడనే ఫిర్యాదు చేశారు.తమకు సంబంధించిన ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని గౌడ నమ్మించారని, ఆ వంకతో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా పోలీసులను ఆశ్రయించారు .ప్రజ్వల్ సెక్స్ వీడియో క్లిప్ల పెన్ డ్రైవ్లను బీజేపీ అధిష్టానానికి దేవరాజ్ గౌడే అందించారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తు వద్దని వారించింది ఈయనేనని ఒక ప్రచారం ఉంది.