-
350 మందికి రూ.1 కోటికి పైగా వేతనం ఇస్తున్న కంపెనీ
పురాతన సంస్థగా పేరున్న ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్(ఐటీసీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 మంది ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..ఏటా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్న వారి సంఖ్య 350కు చేరింది. గతంలో ఇది 282గా ఉంది.కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం..కోటి రూపాయలు వేతనం తీసుకుంటున్న ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.9 లక్షలు జీతం వస్తుంది. 2022-23 ఏడాదికిగాను రూ.1 కోటి వేతన బ్రాకెట్లోని ఉద్యోగుల సంఖ్య 282గా ఉంది. 2021-22 కంటే అదనంగా 62 మంది చేరారు. తాజాగా 68 మంది ఈ బ్రాకెట్లో చేరి మొత్తం 350 మంది రూ.1 కోటికిపైగా వేతనం అందుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరీ రూ.28.62 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇది గతంలో కంటే 50 శాతం పెరిగింది. కీలక నిర్వహణ సిబ్బంది (కేఎంపీ) వేతనం 59 శాతం పెరిగినట్లు కంపెనీ చెప్పింది. ఏడాదిలో దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను చెల్లించడం, మధ్యంతర కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి కారణమని పేర్కొంది. కేఎంపీ మినహా ఉద్యోగుల సగటు వేతనం 9 శాతం పెరిగినట్లు చెప్పింది. మార్చి 31, 2024 నాటికి ఐటీసీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 24,567కు చేరింది. సిగరెట్లు, ఎఫ్ఎంసీజీ, హోటళ్లు, అగ్రి బిజినెస్, పేపర్బోర్డ్లు, పేపర్ అండ్ ప్యాకేజింగ్ వంటి అనేక రకాల వ్యాపారాలను కలిగి ఉన్న ఐటీసీ 2023-24లో రూ.76,840.49 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. -
విశాఖ విమల విద్యాలయం మూసివేత
ఉక్కునగరం/గాజువాక: స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత తెలుగు మీడియం పాఠశాల.. ‘విశాఖ విమల విద్యాలయం’ హఠాత్తుగా మూతపడింది. పాఠశాలలు తెరుచుకునే ముందు రోజు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతో పాటు 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో తెలుగు విద్యార్థులు, నిర్వాసిత ప్రజల పిల్లల సౌకర్యార్థం స్టీల్ప్లాంట్ యాజమాన్యం అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఆర్సీఎం డయాసిస్ మిషన్ సంస్థ ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి బిల్డింగ్తో పాటు విద్యుత్, మంచినీటి సరఫరా, ఫీజులు, సిబ్బంది జీతాలను ఉక్కు యాజమాన్యమే చెల్లిస్తోంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు, నిత్యం కూలి పనులు చేసుకునే వారి పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఎంవోయూను రెన్యువల్ చేస్తారు. యాజమాన్యం ఏడాదికి సుమారు రూ.6 నుంచి 7 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తోంది. ఈ ఏడాది మే 31తో ఎంవోయూ గడువు ముగియనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్ నుంచి మిషన్ ప్రతినిధులు ఎంవోయూ రెన్యువల్ కోసం అభ్యర్థన పంపారు. యాజమాన్యం ఎంవోయూ కొనసాగిస్తుందన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలు చేసింది. ఈ నెల 11న ఉక్కు యాజమాన్యం నుంచి పిడుగు లాంటి వార్త అందింది. పాఠశాల నిర్వహణకు బిల్డింగ్ ఇస్తామని సొంత ఫీజులతో పాఠశాల నిర్వహణకు సంబంధించి కొత్త ఎంవోయూ చేసుకుందామని తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యం హడావుడిగా ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు 13 నుంచి పాఠశాలకు రావొద్దని సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పల్లా పెంటారావు తదితరులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.సొంతంగా నిర్వహించలేం గత 40 ఏళ్లుగా స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తోంది. రెన్యువల్ కోసం అభ్యర్థించగా కొత్త ఎంవోయూకు సిద్ధమవమంటున్నారు. ఫీజులు వసూలు చేసుకుని జీతాలు చెల్లించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా చెల్లించే మాకు సొంత ఫీజులతో పాఠశాల నిర్వహించే పరిస్థితి లేదు. – ఫాదర్ రత్నకుమార్, కరస్పాండెంట్ ఆర్సీఎం మిషన్ సీఎండీ బంగ్లా ముట్టడిస్తాం స్టీల్ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలను మూసివేయడం అన్యాయం. పాఠశాలను వెంటనే తెరిపించకపోతే సీఎండీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు వేల మంది పిల్లల అంశంపై అడ్మిన్, సీఎండీ బంగ్లాను ముట్టడిస్తాం. – బి.గంగారావు, 78వ వార్డు కార్పొరేటర్ పాఠశాల తెరిపిస్తాం హఠాత్తుగా పాఠశాలను మూసివేస్తే ఉపా«ధ్యాయులు, విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల సహకారంతో ఉక్కు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. పాఠశాలను తెరిపించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. – పల్లా పెంటారావు, కార్మిక నాయకుడు మా పిల్లల పరిస్థితేంటి? కూలీ, నాలీ చేసుకుని బతుకులు సాగిస్తున్నాం. నా భర్త చనిపోతే నేను కూలి పనిచేసుకుంటూ నా కొడుకుని ఈ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల మూసేస్తామంటే ఎక్కడ చదవాలి? ఎవరు చేర్చుకుంటారు మాలాంటి పేదోళ్లను. – కృష్ణమ్మ, విద్యార్థి తల్లి మా చదువులు ఎలా? నేను పదో తరగతికి వచ్చాను. మేము చాలా పేదోళ్లం. మా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి? మా చదువులు మధ్యలో ఆగిపోవాల్సిందేనా? – 10వ తరగతి విద్యార్థిని ఆందోళన వద్దు ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని గాజువాక ఎంఈవోలు ఎం.సునీత, బి.విశ్వనాథం గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాఠశాల మూసివేత వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లామని, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. -
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించిన రెండు వారాలలోపే మరో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా డిపార్చర్ల సంఖ్య తగ్గడం క్యాబిన్ సిబ్బంది జీతాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూనియన్ పేర్కొంది.ఎయిర్పోర్ట్ ప్రవేశ పాస్లు లేకపోవడంతో 100 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది గత రెండు నెలలుగా ఫ్లైయింగ్ డ్యూటీలు లేకుండా ఖాళీగా కూర్చున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) పేర్కొంది. ఈ యూనియన్ ఎయిర్లైన్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలో మే 9న చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఏర్పాటు చేసిన యూనియన్, విమానయాన సంస్థ ప్రతినిధుల సమావేశం తర్వాత క్యాబిన్ క్రూ సమ్మె విరమించింది. ఎయిన్లైన్ యాజమాన్య వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులకు అంతరాయాలు ఏర్పడ్డాయి.ఎయిర్లైన్ షెడ్యూలింగ్ విభాగం కొత్త సాఫ్ట్వేర్కు మారుతున్న క్రమంలో క్యాబిన్ సిబ్బంది డేటా తొలగిపోయిందని తాజాగా చీఫ్ లేబర్ కమిషనర్కు రాసిన లేఖలో యూనియన్ పేర్కొంది. విమానాల రద్దు, ఆలస్యాలను కవర్ చేయడానికి క్యాబిన్ సిబ్బంది బేస్ వారీగా షెడ్యూలింగ్ విభాగానికి మాన్యువల్గా సహాయం చేస్తున్నారని యూనియన్ చెబుతోంది.డిపార్చర్ల సంఖ్య తగ్గడం వల్ల క్యాబిన్ సిబ్బంది జీతాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని, ఈ విషయంలో కమిషనర్ తక్షణ జోక్యాన్ని యూనియన్ కోరుతోంది. క్యాబిన్ సిబ్బంది ఫ్లైయింగ్ హవర్స్తో జీతాలు కూడా ముడిపడి ఉంటాయి. అయితే ఈ అంశంపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారిక ప్రతినిధి నుంచి ఎటువంటి స్పందనా లేదు. -
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?
దేశంలో 2024లో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్సీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటాను విశ్లేషించింది. కరోనా పరిణామాల అనంతరం 2022లో దేశీయంగా అధిక వేతన పెంపు లభించిందని, రానున్న రోజుల్లో గరిష్ఠ స్థాయిలో వేతనాలు పెంపు ఉంటోందని తెలిపింది. సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా వ్యూహాత్మక సర్దుబాటును సూచిస్తోందని పేర్కొంది. ‘మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలు గణనీయ వృద్ధిని నమోదు చేస్తాయి. కొన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమవుతాయి’ అని ఎయాన్ ఇండియాలో ట్యాలెంట్ సొల్యూషన్స్కు ముఖ్య కమర్షియల్ అధికారిగా ఉన్న రూపాంక్ చౌదరి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగల దేశాల్లో, వేతన పెంపు అధికంగా ఉంటున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందని సర్వే తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయని పేర్కొంది. 2024లో ఈ రెండు దేశాల్లో సగటు వేతన పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనుందని పేర్కొంది. మనదేశంలో సిబ్బంది వలసల రేటు 2022లో 21.4% కాగా.. 2023లో 18.7 శాతానికి పరిమితమైందని సర్వే తెలిపింది. ఇదీ చదవండి: సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉందని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్, వాహన, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. రిటైల్, టెక్నాలజీ కన్సల్టింగ్, సేవల రంగాల్లో తక్కువ వేతన పెంపు ఉండొచ్చని సర్వే ద్వారా తెలిసింది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త!
న్యూ ఇయర్కి ముందే ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాల పెంపుపై ఐదు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన ఇన్ఫోసిస్ తాజాగా జీతాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. త్వరలో శాలరీలను హైక్ చేస్తున్నట్లు తెలిపింది. పెరిగిన జీతాలు నవంబర్ 1 నుంచి అమలు అవుతాయని వెల్లడించింది. అయితే శాలరీ పెంపు ఉద్యోగులందరికి వర్తించదని స్పష్టం చేసింది. 2021 అక్టోబర్ తర్వాత జూనియర్ స్థాయిలో సంస్థలో చేరిన ఉద్యోగులకు, అదేవిధంగా 2021 అక్టోబర్ తర్వాత చేరిన మేనేజర్ స్థాయి సిబ్బందికి శాలరీ పెంపు జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉండగా.. ఈ పెంపు 7 శాతం నుంచి 10 మధ్యలో ఉంటుందని సమాచారం. మిగిలిన ఐటీ కంపెనీల పరిస్థితి ఇది సాధారణంగా, ఐటి కంపెనీలు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై) వేతనాల్ని పెంచుతాయి. ఏప్రిల్ 1 నుండి పెరిగిన శాలరీ అమల్లోకి వస్తుంది. అయితే, ఈ ఏడాది దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో వేతనాల పెంపును వాయిదా వేశాయి. విప్రో మరో టెక్ కంపెనీ విప్రో ఉద్యోగుల జీతాల్ని పెంచుతుండగా.. వారిలో ఇప్పటికే ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వారికి కాకుండా.. పనితీరు బాగుండి, తక్కువ వేతనం తీసుకుంటున్న సిబ్బంది జీతాలు పెంపు ఉంటుందంటూ నివేదికలు హైలెట్ చేశాయి. హెచ్సీఎల్ జీతాల పెంపు విషయంలో రెండు సార్లు వాయిదా వేసిన హెచ్సీఎల్ ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో సీనియర్ ఉద్యోగులకు శాలరీ హైకుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాక్సెంచర్ సైతం అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఈ ఏడాది భారత్, శ్రీలంకలోని తమ ఉద్యోగులందరికి శాలరీ పెంపు ఉండదని కేవలం కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని, స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆర్ధిక మాద్యం భయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రమోషన్లు, రివార్డుల విషయంలో సంస్థ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. -
ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..!
కార్పొరేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అందరూ కీలకమే. కానీ వారి బాధ్యతలను అనుసరించి వారికి చెల్లించే వేతనాల్లో తేడా ఉంటుంది. ప్రతి కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)ల అత్యంత కీలకం.. కంపెనీ అభివృద్ధి సాధించే వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే వారి వేతనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అమెరికాలో 2023 సంవత్సరానికిగాను అత్యధిక వేతనాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు(రూ.1800 కోట్లు). దాంతో ఆయన రోజూ రూ.5 కోట్లు వేతనం పొందుతున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం. అతిపెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ వేతనం 182 మిలియన్ డాలర్లు(రూ.1500 కోట్లు). అమెరికన్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు(రూ.1400 కోట్లు). ఇదీ చదవండి: ‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’ అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు(రూ.1100 కోట్లు). గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు). ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు(రూ.825 కోట్లు). -
IT Jobs: కంపెనీ మారుతున్నారా? హైక్ ఎంతంటే..
చదువు అయిపోయిన వెంటనే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అనే ధోరణి చాలామందిలో ఉంది. కొవిడ్ వల్ల ఐటీ నిపుణులకు ఒక్కసారిగా పెరిగిన గిరాకీ, వారికి లభిస్తున్న అధిక వేతనాలు ఎంతోమందికి కలల ప్రపంచాన్ని చూపించాయి. తర్వాత కొత్త ప్రాజెక్టులు తగ్గడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగి, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ‘ఐటీ రంగం’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్త భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాల వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలు అంకురాల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలు తీసుకుంటున్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. అందులో భాగంగా ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఐటీ రంగం అంతటా కాస్ట్కటింగ్ సమస్యే ఉంది. దాంతో కొత్తగా చేర్చుకునే వారికి మునుపటిలా భారీగా జీతాలు పెంచి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి లేదు. కంపెనీ మారాలనుకునే వారి పాత జీతంపై కేవలం 18-22శాతం పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వారికి జీతాల పెంపు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. మునుపటి కంపెనీలోని జీతంతో పోలిస్తే కేవలం 18-22% పెంపుతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అయితే గతంలో అభ్యర్థులు కనిష్ఠంగా 40%, గరిష్ఠంగా 100-120% వరకు వేతనం పెంచాలనే డిమాండ్ చేసేవారని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుతం ఉద్యోగస్థాయిని ఆ డిమాండ్ 35-40 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ఉదాహరణకు 2022లో ఫుల్స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షలు వేతనం ఉండేది. ఈ సంవత్సరం సగటున 8%-16% తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. -
వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్సీఎల్, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం.. అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Infosys CEO's pay 2,200 times a fresher's pay. How many hours of work a week does the CEO and a fresher put in respectively? There are only 168 hours in a week. pic.twitter.com/DP1C4ODkAt — Ashok Khemka (@AshokKhemka_IAS) October 29, 2023 -
TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!
దేశంలో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగాలకు లంచాల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సిబ్బంది సంస్థలకు చేసే చెల్లింపుల్లో మార్పులు చేసింది. ఇలా చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వచ్చే జనవరి నుంచే.. బిజినెస్ వార్తా సంస్థ ‘మింట్’ నివేదిక ప్రకారం.. టీసీఎస్ సవరించిన చెల్లింపు విధానం వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న వెండర్ (సిబ్బంది సంస్థ) ఒప్పందాలు ఈ ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటాయి. కొత్త ఒప్పందాలు 2024 జనవరి నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, వెండర్ ఖర్చులు, బీమా వంటివన్నీ కంపెనీ చెల్లింపుల్లోనే కలిసి ఉంటాయి. పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ధరల సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంచి అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీని చేరువ చేయడం ద్వారా అటు సిబ్బంది సంస్థలు, ఇటు టీసీఎస్.. రెండింటికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రేట్ కార్డులలో చేస్తున్న మార్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. టీసీఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. లంచాల స్కామ్ ఎఫెక్ట్ టీసీఎస్ నియామక ప్రక్రియలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ధరల విధానాలలో ఈ సర్దుబాటు చేసింది. కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ నియామక సంస్థల నుంచి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టీసీఎస్ విచారణ చేపట్టింది. ఫలితంగా కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ హెడ్ ఈఎస్ చక్రవర్తితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే ఆరు సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది. -
నిఫ్టీ50 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా..
భారతీయ కంపెనీల్లోని మహిళా ఉద్యోగుల జీతాలు సగటున పురుష ఉద్యోగుల జీతాల కంటే దాదాపు పదో వంతు తక్కువగా ఉన్నాయని కొన్ని కథనాలు ప్రకారం తెలుస్తుంది. నిఫ్టీ50 కంపెనీల్లోని స్త్రీ, పురుష ఉద్యోగుల జీతాలను విశ్లేషించి కొంత డేటాను సేకరించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నిఫ్టీ50లోని 31 కంపెనీల్లో మహిళల జీతాల కంటే పురుషుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. సగటు స్త్రీల జీతాలు పురుషుల జీతాల కంటే 9.2% తక్కువగా ఉన్నాయి. ఇది సుమారు సంవత్సరానికి రూ.1.2 లక్షల వేతన వ్యత్యాసానికి సమానం. పురుషుల జీతాలు దాదాపు ఏటా రూ.12.9 లక్షలు అయితే మహిళా ఉద్యోగుల జీతాలు రూ.11.7 లక్షలుగా ఉన్నాయి. టాప్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అధిక కుటుంబ బాధ్యతలు, కెరీర్ బ్రేక్లు, కెరీర్ స్విచ్లు వంటి అంశాలు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ మైండ్ట్రీ కంపెనీల్లో పురుషుల జీతాలు 30-46% ఎక్కువగా ఉన్నాయి. టాటా కన్జ్యూమర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీల్లో మహిళల వేతనాలు 20-73% ఎక్కువగా ఉన్నాయని డేటా తెలుపుతుంది. -
కొలువుల కాలం
భారీ వేతనాలు... సర్వే సంస్థలకు అభ్యర్థులు, పార్టీలు ఇచ్చే మొత్తాన్ని బట్టి ఉద్యోగుల వేతనాలుంటాయి. పలు సర్వే సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రోజుకు రూ. 3 నుంచి 5 వేల వరకూ చెల్లిస్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు స్మార్ట్ సర్వేలూ చేస్తున్నాయి. అభ్యర్థి నియోజకవర్గంలో ఉండే ఓటర్ల సోషల్ మీడియా ఫాలో అప్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాథ్యమాల్లో అతను చేసే పోస్టింగులను విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్లను సర్వే సంస్థలు దిగుమతి చేసుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో అనుభవం ఉన్న యువతను ఈ విభాగాల్లో నియమిస్తున్నారు. వీరికి ఎన్నికల సీజన్ వరకూ ఏకమొత్తంగా వేతనాలుంటాయని సర్వే సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ను డేటా ఎనాలసిస్లో అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల నైపుణ్యం ఉన్న యువతకూ మంచి గుర్తింపు ఇస్తున్నారు. భారీగానే డబ్బు ఇస్తుండడంతో సర్వేలు చేయడానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రకాల సర్వేలు చేయడానికి కూడా యువత ఆసక్తి చూపుతున్నారు. లింక్డ్ ఇన్... నౌకరీ డాట్ కామ్.. వంటి జాబ్ పోర్టల్స్లో మల్టీ నేషనల్ కంపెనీల ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న యూత్కు ఎన్నికల సీజన్ వరంలా మారింది. రాష్ట్రంలో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా, మరొకొద్ది నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు.. వరుసగా ఉండటంతో బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఉద్యోగం తాత్కాలికమే అయినా మంచి వేతనం అంతకు మించిన అనుభవం లభించే వీలుంది. ఎలక్షన్ సర్వేల కోసం ఆయా సంస్థలు యువతీ యువకులను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆరు నెలల నుంచి ఈ తరహా ఉపాధి అవకాశాలు జోరందుకున్నాయి. చిన్నా చితకా కలిపి రాష్ట్రంలో వందకు పైగా సర్వే సంస్థలు ప్రస్తుతం ఎన్నికల సర్వేల్లో నిమగ్నమయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఈ స్పీడ్ మరికొంచెం పెరిగింది. జనం నాడి తెలుసుకునేందుకు, ప్రజల మూడ్ను పట్టుకునేందుకు సర్వేక్షణం తోడ్పడుతుందని అన్ని పార్టీలూ, నేతలు నమ్ముతున్నారు. బహుళ జాతి కంపెనీలు ఆర్థిక అనిశి్చతితో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో జాబ్ మార్కెట్కు ఎలక్షన్ సీజన్ కొంత ఆక్సిజన్ ఇచ్చిందని యువత అభిప్రాయపడుతున్నారు. పుష్కలంగా అనుభవం... రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సర్వే చేయడానికి కనీసం వెయ్యి మంది అవసరం అని సర్వే సంస్థలు చెబుతున్నాయి. పొలిటికల్ సైన్స్ నేపథ్యం ఉన్న పోస్టు–గ్రాడ్యుయేట్ అభ్యర్థులను నేరుగా ప్రజా క్షేత్రంలోకి పంపుతారు. ప్రజల రాజకీయ అభిప్రాయం, అభ్యర్థి నుంచి ప్రజలు ఏం కోరుతున్నారో ఈ బృందం సేకరిస్తుంది. ఆపై డేటా ఎనలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. టెక్నాలజీ నేపథ్యం ఉన్న యువతను ఈ కేటగిరీలో నియమిస్తున్నారు. వివిధ కేటగిరీల నుంచి వచ్చే పలు రకాల డేటాను అప్లోడ్ చేయడం, అవసరమైన ఫార్మాట్లోకి దీన్ని తేవడం వారి బాధ్యత. ఆ తర్వాత కేటగిరీలో ఎనలిస్టులుంటారు. ఆన్లైన్ నుంచి అందే డేటాను క్రోడీకరించి, ఇందులో అంశాల ద్వారా విశ్లేషణ చేయడం, కచ్చితమైన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వారి విధి. అభ్యర్థి వ్యక్తిగతంగానే కాదు... పార్టీలూ ఈ సర్వే సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో ఎన్నికల సీజన్లో కనీసం ఆరు నెలలు సర్వే సంస్థలకు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం ఉంటుంది. ఇవి తమ వృత్తికి పదును పెట్టే అనుభవంగా కూడా యువత భావిస్తున్నారు. విశ్లేషణలో మానవ వనరులే కీలకం ప్రజల నాడి తెలుసుకునేందుకు రాజకీయ నేతలు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో ఈ సర్వేలే కీలకమని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలంటే వేల సంఖ్యలో వివిధ రకాల విద్యావంతులు అవసరం. తాత్కాలిక ఉపాధే అయినా, వారికి మెరుగైన అనుభవం వస్తోంది. ఈ ఎన్నికల సీజన్లో దాదాపు లక్షకు పైగానే యువత ఎన్నికల సర్వేలో నిమగ్నమైనట్టు అంచనా. –దేశినేని రాజ్కుమార్ (హెచ్ఎంఆర్ రీసెర్చ్) మంచి ఉపాధి సర్వే సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపే యువతను గుర్తించి నెల రోజులు సాంకేతికంగా, ఫీల్డ్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్కిల్ వెలుగులోకి రావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ తక్కువ సమయంలో లభించే వేతనం పోటీ పరీక్షలు, కొన్ని రోజులు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు ఉపయోగపడుతోంది. – శైలజ (సర్వే సంస్థలో ఉద్యోగి) మంచి అనుభవం ప్రజాక్షేత్రంలో ఎన్నికల సర్వే చేపట్టడం ఓ మంచి అనుభవం. ఈ సమయంలో వేతనంతో పాటు ఫీల్డ్కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా టీఏ, డీఏ ఉంటాయి. ఉపాధి పరంగానూ మంచి అవకాశమే. యువత సర్వే చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కోరుకునేదేంటో నేతల దృష్టికి తీసుకెళ్తున్న తృప్తి ఉంటోంది. – లక్ష్మాగౌడ్ (ఎన్నికల సర్వేలో ఫీల్డ్ సిబ్బంది) -
Fact Check: చిరుద్యోగులపై దొంగ ఏడుపులు
చిరుద్యోగులకు గత సర్కారు హయాంలో జీతాల వ్యయం రూ.1,100 కోట్లు! మరిప్పుడు వారి జీతాల కోసం చెల్లిస్తున్న మొత్తం ఏకంగా రూ.3,300 కోట్లు!! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిరుద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల నుంచి 108 డ్రైవర్ల దాకా పలు వర్గాల జీతాలను పెద్ద ఎత్తున పెంచింది. జీతాల ఖర్చు మూడు రెట్లు పెరగడం కళ్లెదుటే కనిపిస్తున్నా చిరుద్యోగులకు దగా చేస్తున్నారంటూ కడుపు నొప్పితో కళ్లనీళ్లు పెట్టుకునే వారిని ఏమనాలి? మరిలాంటి దుష్ప్రచారం ఈనాడులో చేస్తున్నారు కాబట్టి రామోజీనే అనుకోవాలేమో!! జీతాలు పెంచాలని చిరుద్యోగులు గత ప్రభుత్వ హయాంలో గగ్గోలు పెట్టిన విషయం ఆయనకు గుర్తున్నా తెలియనట్లే నటిస్తున్నారు!!– సాక్షి, అమరావతి పారదర్శకంగా నియామకాలు, చెల్లింపులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పూర్తి పారదర్శకతను తీసుకొస్తూ దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఆప్కాస్ కార్పొరేషన్ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. లంచాల ప్రసక్తే లేకుండా శాశ్వత ఉద్యోగుల కంటే ముందే ఠంచనుగా ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలిచ్చే పద్ధతిని తెచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ను వర్తింప చేసింది. దీనికి అనుగుణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను కూడా పెంచారు. వీరికి గరిష్టంగా రూ.28 వేల వరకూ చెల్లిస్తున్నారు. మరి టీడీపీ సర్కారు ఇలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చిరుద్యోగులను ఎందుకు ఆదుకోలేదు? వారి పోస్టులకు తగ్గట్టుగా పూర్తి జీతాలను ఎందుకు ఇవ్వలేదు? ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టి ఏజెన్సీ కమీషన్ల పేరుతో జీతాలను గుంజుకుంటే ఈనాడుకు కనపడలేదా? మనసున్న ప్రభుత్వం ఎవరిది? నాలుగున్నరేళ్ల పాటు చిరుద్యోగుల జీతాలను పెంచాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబు సర్కారు గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అరకొరగా పెంచిన జీతాలను కొందరికి మాత్రమే అమలు చేసింది. మరి కొందరికి పెంపు కాగితాలపైనే పరిమితమైంది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలను మరింత పెంచి మొదటి రోజు నుంచే అమలు చేసింది. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, శానిటేషన్ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలు లాంటి చిరుద్యోగుల విషయంలో సీఎం జగన్ మనసు పెట్టి జీతాలు పెంచారు. గత సర్కారు హయాంలో రూ.1,100 కోట్లు మాత్రమే ఉన్న వారి జీతాల వ్యయం ఇప్పుడు ఏకంగా రూ.3,300 కోట్లకు పెరగడమే అందుకు తిరుగులేని నిదర్శనం. ఉదారంగా అర్హతల సడలింపు ప్రభుత్వ పథకాల అమలులో అర్హతలను సడలిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వక్రీకరిస్తూ ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. పథకాలను మరింత మందికి అందజేయాలనే ఉద్దేశంతో ఆదాయం, భూమి, కరెంటు వినియోగం తదితర అంశాలలో ఉదారంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. గత ప్రభుత్వంలో పథకాలను పొందేందుకు గ్రామాల్లో నెలకు కనీస ఆదాయ పరిమితి రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలుగా ఉండేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలను నెలవారీ ఆదాయ పరిమితిగా నిర్ణయించి ప్రభుత్వం మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. కరెంట్ వినియోగంపై గతంలో 200 యూనిట్ల పరిమితి విధించగా ఇప్పుడు 300 యూనిట్లకు పెంచారు. వివాహాల అనంతరం వేరుగా ఉంటున్న వారిని విడి కుటుంబాలుగా పరిగణిస్తున్నారు. ఆ మేరకు వారికి విడిగా రేషన్ కార్డులను జారీ చేస్తూ వివిధ పథకాలకు అర్హత కల్పిస్తున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో వేల సంఖ్యలో అందిన ఇలాంటి దరఖాస్తులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. చిరుద్యోగులకు సీఎం జగన్వేతనాలను పెంచారిలా.. ♦ అంగన్వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ రూ.7వేలు ఉంటే ఇప్పుడు రూ.11,500కు పెంచారు. హెల్పర్ల జీతాలు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయి. ♦ గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్ జీతాలను రూ.2 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచారు. ♦ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు తీసుకుని వెళ్లారు. ♦ ఆశావర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ♦ గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి ఏకంగా రూ.4 వేలకు పెంచి అండగా నిలిచారు. ♦ పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల జీతాలను రూ.18 వేల నుంచి రూ.21,300కు పెంచారు. ♦ పాఠశాల విద్యాశాఖలో కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచారు. ♦ 108 డ్రైవర్ల జీతాలను రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ.17,500 నుంచి రూ.20 వేలకు తీసుకుని వెళ్లారు. ♦ 104 డ్రైవర్ల జీతాలను రూ.26 వేలకు పెంచారు. ♦ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!!
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!! -
పెళ్లి కార్డులో పేర్ల పక్కన ఐఐటీ.. జీతాలు చెప్పాలంటున్న నెటిజన్లు!
వివాహ సమయంలో డిజైనర్ ఇన్విటేషన్ కార్డ్లు చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్ని పెళ్లి కార్డులలో లగ్జరీ చాక్లెట్లు ఉంటుండగా, మరికొన్ని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకునేలా బయోడిగ్రేడబుల్ కార్డ్లు రూపొందుతాయి. ఇటీవల ఒక వివాహ ఆహ్వాన కార్డ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇది వధూవరుల చదువులను హైలెట్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ ఆహ్వానపత్రంలో వరుడి పేరు పక్కన ఐఐటి బాంబే అని, వధువు పేరు పక్కన ఐఐటి ఢిల్లీ అని ఉంది. ఈ పెళ్లి ఆహ్వాన పత్రికను ఎక్స్లో షేర్ చేసిన మహేష్.. ‘పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమేనని’ ఆ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. దీనిని షేర్ చేసినప్పటి నుండి ఈ కార్డ్కు 53 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. 400కి పైగా లైక్స్ లభించాయి. దీనిని చూసిన ఒక యూజర్ ‘కొన్ని దశాబ్దాల క్రితం డిగ్రీ పొందడం కష్టంగా ఉన్నప్పుడు బీఎస్సీ, బీకాం లాంటి డిగ్రీలను గొప్పగా పేర్కొనేవారు. ఈ ఆహ్వాన పత్రంలో ఇంటిపేరు లేకపోయినా వారి విద్యార్హతలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మరొక యూజర్ ‘ఈ ఆహ్వాన పత్రంలో వధూవరుల జీతం జీతం, లింక్డ్ఇన్ ప్రొఫైల్ను పేర్కొనకపోవడం నిరాశ పరుస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అయ్యో.. ర్యాంక్ రాయలేదే’ అని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది? All you need is love to get married pic.twitter.com/sjd4SZSSJR — Mahesh (@mister_whistler) September 12, 2023 -
చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ISRO Employees Salary Structure: ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా.. టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు & సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100) 👉: మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300) 👉: ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900) 👉: క్యాటరింగ్ సూపర్వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400) 👉: కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: ఫైర్మ్యాన్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అసిస్టెంట్ (రాజ్భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400) -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్భవన్వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
ఆ విషయంలో దిగ్గజ కంపెనీలకు దీటుగా చిన్న సంస్థలు.. అదేమిటంటే?
ఎక్కువ వేతనాలు ఇచ్చే విభాగం ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది.. 'ఐటీ' ఫీల్డ్. అయితే గత కొంతకాలంగా ఐటీ సంస్థల ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు హైక్ చేయకపోగా.. మరి కొన్ని కంపనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా దిగ్గజ కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సీఈఓల కంటే కూడా చిన్న కంపెనీల సీఈఓలకు ఎక్కువ శాలరీలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ 'సందీప్ కల్రా' వేతనం ఏడాదికి రూ. 61.7 కోట్లు, కాగా.. ఎంఫాసిస్ (Mphasis) సీఈఓ జీతం రూ. 59.2 కోట్లు కావడం విశేషం. పెద్ద కంపెనీల జాబితాలో విప్రో సీఈఓ మాత్రమే రూ. 82.4 కోట్లు జీతం తీసుకుంటూ అధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా మొదటిస్థానంలో నిలిచాడు. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మినహా నిఫ్టీ కంపెనీలను మించిన వేతనాలు అందుకుంటున్న సీఈఓలలో కోఫోర్ట్ సీఈఓ సుధీర్ సింగ్ ఉన్నారు. ఇక టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వేతనం రూ. 30 కోట్లు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చాలామంది వేతనాలు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఈ సీఈఓల జీతాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
ఒకప్పటి నుంచి కూడా చాలామంది ఎక్కువ సంపాదించాలంటే ఐటీ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్న సంగతి తెలిసిందే. లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, టూర్లు, షికార్లు, ఐదు రోజుల పనిదినాలు ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది కావున మెజారిటీ యువత ఈ ఉద్యోగంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. అయితే కరోనా మహమ్మారి తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా విజృంభణ తరువాత చాలా వరకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి, అదే సమయంలో కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోయాయి. అయితే సీఈఓలు మాత్రం రికార్డు మొత్తంలో జీతాలు తీసుకుంటున్నారు. మనం ఈ కథనంలో ఎక్కువ జీతాలు తీసుకుంటున్న ఐటీ కంపెనీల CEOల జీతాలను గురించి తెలుసుకుందాం. థియరీ డెలపోర్టే (Thierry Delaporte) ఎక్కువ జీతాలు తీసుకుంటున్న సీఈఓల జాబితాలో విప్రో CEO 'థియరీ డెలపోర్టే' ఉన్నట్లు సమాచారం. ఈయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ డాలర్లను వేతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 82.2 కోట్లు. సలీల్ పరేఖ్ (Salil Parekh) ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఎక్కువ సాలరీ తీసుకుంటున్నవారి జాబితాలో ఒకరు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 56.4 కోట్లు వేతంగా అందుకున్నట్లు సమాచారం. అంతకు ముందు సంవత్సరంలో ఈయన జీతం ఇప్పటికంటే 21 శాతం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఎక్కువ జీతం తీసుకుంటున్న రెండవ సీఈఓగా రికార్డ్ సృష్టిచాడు. ఇదీ చదవండి: మూడు బ్యాంకుల కొత్త ప్రకటనలు.. ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! రాజేశ్ గోపీనాథన్ (Rajesh Gopinathan) టీసీఎస్ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 29 కోట్లు వార్షిక వేతంగా అందుకున్నట్లు సమాచారం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 13 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఐటీ కంపెనీ ఉద్యోగుల సగటు జీతం కంటే ఇది సుమారు 427 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓగా కృత్తివాసన్ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: ఫ్రెండ్షిప్డే రోజు మిత్రులకు గిఫ్ట్గా ఓ స్మార్ట్వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్! సి విజయ్ కుమార్ (HCL Technologies) 2022-23ఆర్థిక సంవత్సరంలో రూ. 28.4 కోట్లు వార్షిక వేతనం తీసుకున్న హెచ్సిఎల్ టెక్ సీఈఓ 'సి విజయ్ కుమార్' మన జాబితాలో ఒకరు. అయితే ఈ యన ఈ సారి తన వేతనం భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం. -
18 నెలలుగా పెరగనే లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్ పర్సన్) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పీఎల్ఎఫ్ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్ లేబర్ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. ప్రైవేటులో ఉపాధిలేమి.. పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్ సెక్టార్లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్ ట్రెండ్స్’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్ ఇనసైట్స్ ట్రాకర్’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్ పేర్కొంది. ఏయే రంగాల్లో వృద్ధి... ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్/మెరైన్ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్–పీఆర్ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్ వేజ్) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది. గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. -
‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!
ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గణనీయమైన లాభాల్ని సాధించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్స్ సరికొత్తగా ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంది. కానీ ఉద్యోగులే జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈవో సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు ఇంటర్నల్ మెసేజ్ పంపించారు. అందులో ఈ ఏడాదిలో ఉద్యోగుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ సాధించిన ఫలితాలకు ఉద్యోగుల వినూత్నం, సృజనాత్మకత వల్లే సాధ్యమైందని కొనియాడారు. క్లయింట్లను, భాగస్వాములను సైతం అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని అధిగమించేలా అందరూ బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. థ్యాంక్యూ నోట్పై అసహనం సత్యనాదెళ్ల పంపిన ఈ ఇంటర్నల్ మెసేజ్ను 2లక్షల మందికి పైగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, సీఈవో తమకి అభినందనలు తెలపడంపై 130కి మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. మరికొంత మంది సీఈవో థ్యూంక్యూ నోట్పై అసహనం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు తెలపడం అంటే ఇలాగేనా ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపడం అంటే జీతాలు పెంచకుండా ఉండటం కాదని ఓ ఉద్యోగి అంటుంటే..సంస్థ గడించిన లాభాల గురించి మాట్లాడుతూ.. జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపై సదరు ఉద్యోగి విమర్శలు గుప్పించారు. కంపెనీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు రికార్డ్ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఉద్యోగులు మాత్రం వేతనాల కోతను ఎదుర్కొంటున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఇది సరికాదు, వేరే మార్గం లేదా? అని ప్రశ్నించారు. సంస్థను నమ్ముకుంటే మిగిలేది ఇదే.. పెరగకుండా స్తబ్దుగా ఉన్న వేతనాల గురించి ప్రస్తావిస్తూ మండిపోతున్న ధరలు.. పెరిగిపోతున్న ఖర్చులతో అల్లాడుతుంటే సంస్థ భారీ లాభాల్ని మూటగట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ తమకు పెరగాల్సి జీతాలు పెరగలేదని అన్నారు. ‘రికార్డు లాభాలు ఎక్కడ నుండి వస్తాయని ఆశ్చర్యపోతున్నాను? ఇక్కడ (ఆఫీస్లో) అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి కష్టపడి పనిచేసినందుకు నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు మరో ఉద్యోగి. జాబ్కు రిజైన్ చేస్తాం.. సత్యనాదెళ్ల పంపిన థ్యాంక్యూ మెసేజ్పై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం సందిగ్ధంలో పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఉద్యోగుల మధ్య జరిగిన ఇంటర్నల్ పోల్ సంభాషణల్లో ఎక్కువ మంది..తాము కోరుకున్న ఉద్యోగం దొరికితే..మైక్రోసాఫ్ట్ను వదిలివెళ్లేందుకు సిద్ధపడ్డట్లు నివేదికలు హైలెట్ చేశాయి. అయితే, ఉద్యోగుల అసంతృప్తి, రిజైన్ల అంశంపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి👉 ‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’ -
జీతాల కోసం హైడ్రామా..
తెయూ(డిచ్పల్లి): జీతాలు ఇచ్చే వరకు విధులు నిర్వహించేది లేదని పేర్కొంటూ తెలంగాణ వర్సిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన బుధ వారం మూడో రోజూ కొనసాగింది. ఉదయాన్నే పరిపాలనా భవనం వద్ద సిబ్బంది బైఠాయించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక ధర్నా వల్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్ హాస్టల్స్ విద్యార్థులకు భోజనం వండకపోవడంతో పస్తులున్నారు. హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రాత్రికి బయట నుంచి భోజనాలు తెప్పించారు. తిరిగి బుధవారం ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఉదయం హాస్టల్స్లో అల్పాహారం చేయలేదు. చీఫ్ వార్డెన్ సెలవులో ఉండడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులు పీఆర్వో జమీల్కు చెప్పడంతో ఆయన వీసీతో మాట్లాడారు. వీసీ ఆదేశాలతో బయట నుంచి అల్పాహారం తెప్పించారు. ఉద యం 11 గంటలకు వీసీ క్యాంపస్కు చేరుకున్నారు. అప్పటికే ధర్నా నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వీసీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నా రు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ దు స్థితి తలెత్తిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జీతాలు ఇచ్చేవరకు తాము విధులు నిర్వహించేది లేదని సిబ్బంది వీసీకి స్పష్టం చేశారు. దీంతో వీసీ బ్యాంకు మేనేజర్ను పిలిపించి మాట్లాడారు. హైకోర్టులో కేసు ఉందని అందుకే జీతాల చెక్కును ఆమోదించలేకపోతున్నట్లు మేనేజర్ వివరించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రే వీసీ రవీందర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యకు ఫోన్లో చెప్పానని పేర్కొన్నారు. వీసీతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో చివరకు మేనేజర్తో మాట్లాడి జీతాలు ఇచ్చేలా చూస్తానని చెప్పి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లు బ్యాంకులోకి వెళ్లారు. అదేసమయంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ క్యాంపస్కు వచ్చారు. జీతాల చెల్లింపునకు వీసీ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య సంతకం ఆమోదించాలంటే ఈసీ నుంచి ఎన్వోసీ తేవాలని, ఈసీ నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి సంతకం ఆమోదించాలంటే వీసీ ఎన్వో సీ ఇవ్వాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు కాదంటే హైకోర్టులో కేసు ఉండడంతో జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వు లు తేవాలని సూచించారు. దీంతో వీసీ సూచన మేరకు కనకయ్య కొందరు ఈసీ మెంబర్లకు ఫోన్చేసి పరిపాలనా భవనానికి రావాలని కోరారు. దీంతో ఈసీ మెంబర్ ఎన్ఎల్శాస్త్రి మాత్ర మే వచ్చారు. బ్యాంకు అధికారుల సూచనలు విన్న ఆయన వీసీ తో మాట్లాడారు. ఫోన్లలో మాట్లాడితే ఈసీ మెంబ ర్లు స్పందించకపోవచ్చని, ఈనెల 17న ఈసీ సమా వేశానికి హాజరైతే సమస్యపై చర్చించవచ్చన్నారు. సమావేశానికి హాజరైతే వీసీ, ఈసీ మధ్య అంతరం తొలిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఒక సారి ఈసీ మెంబర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వీసీ పేర్కొన్నారు. అంతకు ముందు వీసీ తన చాంబర్కు వెళ్ల డానికి యత్నించగా విద్యార్థులు మెట్లపై ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. చాంబర్ తాళం తీయకపోవడంతో చేసేది లేక వీసీ బయటకు వచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఆర్డర్ ఇవ్వగా.. సాయంత్రం 6 గంటలకు రావడంతో ఆకలితో ఉన్న విద్యార్థులు అప్పుడు భోజనాలు చేసి హాస్టల్స్కు వెళ్లారు. తమకు కనీసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయినా జీతాలు ఇప్పించాలని ఉద్యోగులు వీసీని కోరారు. దీంతో వీసీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారితో ఫోన్లో మాట్లా డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని సూచించారు. -
కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు..
ప్రసిద్ధ ఐటీ సేవల కంపెనీ హెచ్సీఎల్ టెక్(HCLTech)కి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖను ఆశ్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లింపు విధానాన్ని అప్డేట్ చేసిన హెచ్సీఎస్ టెక్ సంస్థపై ఐటీ ఉద్యోగుల యూనియన్ ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. భారీగా తగ్గిన జీతాలు త్రైమాసిక పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఈపీబీ చెల్లించే విధానాన్ని హెచ్సీఎస్ టెక్ ఇటీవల సవరించింది. కోవిడ్ కంటే ముందున్న ఫార్మాట్ను అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు రేటింగ్తో సంబంధం లేకుండా అందరికీ అంటే బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు కూడా 100 శాతం ఈపీబీని కంపెనీ చెల్లించేది. కానీ దీన్ని పాత విధానంలోనే ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్కు అనుగుణంగా బోనస్ చెల్లించునున్నట్లు కంపెనీ ఉద్యోగులకు తెలియజేసింది. ఏప్రిల్ 1 నుంచే పాత విధానాన్ని అమల్లోకి తెచ్చిన కంపెనీ ఉద్యోగులకు ఒక రోజు ముందు దీని గురించి ఈ-మెయిల్స్ పంపినట్లు తెలిసింది. పాత ఈపీబీ) చెల్లింపు విధానంతో ఉద్యోగుల జీతాలు భారీగా తగ్గాయి. ఉద్యోగుల ఆక్షేపణలు ఇవి.. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ ‘గత పాలసీ ప్రకారం, ఉద్యోగులు బెంచ్లో ఉన్నప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన స్థిరమైన రేటుతో ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లిస్తామని హెసీఎల్ కంపెనీ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈపీబీ చెల్లింపులను నిర్ణయించడానికి త్రైమాసిక పనితీరు సమీక్ష ప్రక్రియను అమలు చేస్తూ కంపెనీ ఆకస్మికంగా పాలసీని మార్చింది’ అన్నారు. మార్చిన విధానం ప్రకారం.. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఆధారంగా ఈపీబీని కంపెనీ చెల్లిస్తుంది. అంటే అత్యుత్తమ పనితీరు రేటింగ్ ఉన్న వారికి గరిష్టంగా 80-90 శాతం, తక్కువ రేటింగ్ ఉన్నవారికి కేవలం 30-40 శాతం వరకు ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి ► ఈ ఐటీ కంపెనీ సూపర్! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్ నుంచే.. -
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న 1791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలను కూడా పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఇటీలు, హెల్త్ సూపర్ వైజర్లు వేతనాలను పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల (జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా దీనిని రూ.24,150 లకు పెంచామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) వేతనం రూ.16,100 ఉండగా దీన్ని కూడా రూ.24,150కు పెంచామని తెలిపారు. ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్ల( టీజీటీ) వేతనం రూ.14,800 ఉండగా దీన్ని రూ.19,350కు పెంచడం జరిగిందన్నారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా దీనిని రూ.16,350కు, హైల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ ల వేతనం రూ.12,900 ఉండగా దానిని రూ.19,350లకు పెంచడం జరిగిందని నాగార్జున వివరించారు. ఈ పెంపుదలతో 1791 మంది పార్ట్ టైమ్ టీచర్లతో పాటుగా ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసామన్నారు. 2019 తర్వాత పార్ట్ టైమ్ టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలను పెంచడం ఇదే ప్రథమం అని మంత్రి చెప్పారు. కాగా తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు,టీచర్లు శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జునను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే జేఏసీ ఛైర్మెన్ నాగభూషణం మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే బీజీ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తమకు మంత్రి తమకు న్యాయం చేసారని చెప్పారు. బీసీ వెల్ఫేర్ టీచర్లతో సమానంగా పీజీటీలు, టీజీటీల వేతనాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి నాగార్జునను కోరారు.