-
కమల్హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
-
చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!
సినిమా హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే కోట్ల రూపాయలే గుర్తొస్తాయి. కానీ అదే సినిమాకు పనిచేసిన చాలామందికి మాత్రం వేలల్లోనే జీతాలు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు హీరోయిన్ రకుల్ భర్త జాకీ భగ్నానీ. బాలీవుడ్లో పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఇతడికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్గా బయట పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.1986లో పూజా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత పలు మూవీస్ చేస్తున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ తీసింది. ఘోరమైన నష్టాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పనిచేసినందుకు గానూ తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)బాలీవుడ్ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు అందలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు పబ్లిక్గా చెబుతున్నారు. వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటింగ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందన ఏమిటనేది చూడాలి?(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్బాస్' శోభాశెట్టి) -
యోగాసనాలతో ‘పవర్ కపుల్’ రకుల్-జాకీ ఇంటర్నెట్లో హల్చల్
అందంతో పాటు ఫిట్నెస్కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే హీరోయిన్స్లో ఒకరు రకుల్ ప్రీతి సింగ్. రకరకాల యోగాసనాలను వేయడంలో ఆమె దిట్ట. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోను ఇన్స్టా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఇటీవల ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ భర్తతో కలిసి రకరకాల భంగామల్లో యోగాసనాలను అదరగొట్టేసింది. ఈ కొత్త జంట యోగాసనాలు ఇపుడు ఇన్స్టాలో హల్చల్ చేస్తున్నాయి. ఆరోగ్యంలోనూ, అన్నింటిలోనే కలిసి ఉంటే ఆనందం.. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వరుస ఫోటోలను షేర్ చేశారు ఈ లవ్బర్డ్స్."పార్ట్నర్ స్ట్రెచెస్"తో ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఆసనాలో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా మారాయి. మొదటి భంగిమగా భాగస్వామి సహాయంతో బడ్డీ బోట్ భంగిమ అంటే నౌకాసనంలో కనిపించారు. ఇంకా లెగ్ ఫార్వర్డ్ బెండ్, కోబ్రా పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
Fathers Day: నాన్నే మొదటి హీరో.. స్పెషల్ ఫోటోలను పంచుకున్న స్టార్స్
నేడు(జూన్ 16) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు తమ నాన్నతో ఉన్న అనబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డకి నాన్నే మొదటి హీరో అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్ ఎక్స్లో పోస్ట్ చేశారు. శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్తో సహా పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమ నాన్నలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కేయండి. Father is the First Hero, to Every Child! Happy Father’s Day to All !#FathersDay pic.twitter.com/PwxwEyN7ge— Chiranjeevi Konidela (@KChiruTweets) June 16, 2024Happy Father’s Day … to every father in the world 🖤 pic.twitter.com/ctE89upq2q— Allu Arjun (@alluarjun) June 16, 2024Happy Father’s Day @ikamalhaasan ❤️ Thankyou for being our Appa pic.twitter.com/60iVgLimqH— shruti haasan (@shrutihaasan) June 16, 2024#ShrutiHaasan and #Ulaganayagan cute moments♥️♥️♥️♥️😍😍😍#Happyfathersday@ikamalhaasan@shrutihaasan#KamalHaasan#Indian2 pic.twitter.com/PyOfRsU6wF— Nammavar (@nammavar11) June 16, 2024 View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) https://www.instagram.com/p/C8RAhxbP7Ex/?img_index=1 View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
ఇంకా సమయం ఉంది
‘‘భారతీయుడు 2(తమిళంలో ఇండియన్ 2)’ చిత్రం నా కెరీర్లో బెస్ట్గా నిలుస్తుంది. ఈ మూవీలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉందనే భావన కలిగించింది. ఈ సినిమా గురించి చాలా విషయాలు జనాలతో పంచుకోవాలనే ఆత్రుతగా ఉంది. కానీ, అందుకు ఇంకా సమయం ఉంది’’ అంటున్నారు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్. నటుడు, దర్శక–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన విషయం తెలిసిందే.పెళ్లి కోసం కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ జోరుమీదున్నారు. రకుల్ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ కి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ రూపొందింది. ఈ మూవీలో రకుల్ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ–‘‘భారతీయుడు 2’ నా కెరీర్లోనే ఎంతో స్పెషల్ మూవీ. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను. నా గత చిత్రాలకంటే ఈ మూవీలోని నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేసినన్ని రోజులు గొప్ప అనుభూతి కలిగింది. శంకర్గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
సీక్వెల్ స్టార్ట్
కొత్త సినిమా సెట్స్లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్లో నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీంతో ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ‘దే దే ప్యార్ దే 2’ను సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని అజయ్ దేవగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.ఈ సీక్వెల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ప్రస్తుతం అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్కు అకివ్ అలీకి బదులుగా అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫేవరెట్ సినిమా ‘దే దే ప్యార్ దే 2’ సెట్స్లో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు రకుల్. ఈ చిత్రంలో అనిల్ కపూర్, మాధవన్ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తొలి భాగంలో నటించిన టబు సీక్వెల్లోనూ నటిస్తారా? ఆమె స్థానంలో మరో నటి ఎవరైనా జాయిన్ అవుతారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
బికినీలో కూల్గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్క్యూట్ స్మైల్తో మాయలో పడేస్తున్న దీపికా పిల్లివెనక అందాలు చూపిస్తూ కిక్ ఇచ్చేస్తున్న అమైరా దస్తూర్నడుము వయ్యారాలు.. జబర్దస్త్ వర్ష కిర్రాక్ పోజులుచిన్న పిల్లలా ఆడుకుంటున్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Kanch (@akansharanjankapoor) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Likhita Yalamanchili (@likhita_yalamanchili) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
Rakul Preet Singh: డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
Rakul Preet Singh: హైదరాబాద్లో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టిన రకుల్ (ఫోటోలు)
-
హైదరాబాద్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ మరో బిజినెస్
తెలుగులో చాలామంది హీరోహీరోయిన్లు.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తుంటారు. పలువురు హీరోలకు హైదరాబాద్ లో పబ్స్ ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు జిమ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్లలో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా తెలుగులో చరణ్, బన్నీతో సినిమాలు చేసిన రకుల్.. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో గతంలో జిమ్స్ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో రకుల్ కి జిమ్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు స్టార్ వీటికి వెళ్తుంటారు కూడా. (ఇదీ చదవండి: Yatra 2 In OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లోనూ రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది. హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2019లో న్యూబూ‘పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది. హైదరాబాద్ ఆరంభం పేరుతో త్వరలో ఓ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన పుడ్ లభించనుంది. మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్న రకుల్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ గా మొదలుపెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
Ayalaan OTT Release: ఓటీటీలోకి 'అయలాన్'
తమిళ హీరో శివకార్తికేయన్కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న సన్ నెక్ట్స్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వర్షన్ రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్ వర్షన్లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. -
షాపింగ్లో మంగళవారం బ్యూటీ.. ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్!
బ్లూ డ్రెస్లో రకుల్ ప్రీత్ హోయలు.. షాపింగ్తో బిజీగా ఉన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్... ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్.. అలాంటి డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో రితికా సింగ్ బోల్డ్ లుక్స్.. గ్రీన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
పెళ్లి తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ మార్చరా? రకుల్ అదిరిపోయే రిప్లై
చాలామంది అమ్మాయిలు పెళ్లంటేనే భయపెడతారు. ఎందుకు? పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని, అనేక కట్టుబాట్లు ఉంటాయని, తమ జీవితం అవతలివారి చేతుల్లోకి వెళ్లిపోతుందని! పెళ్లికి ముందు, తర్వాత.. జీవితం ఒకేలా ఉండదన్నదే వారి ప్రధాన భయం! అయితే ఇది కేవలం అపోహే అని కొట్టిపాడేయలేం.. పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా, జాలీగా తమకు నచ్చినట్లు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా అవతలివారికి నచ్చినట్లు మెదులుకునేవారూ ఉన్నారు. పెళ్లిని ఎందుకని.. ఇప్పుడిదంతా ఎందుకంటే? ఈ మధ్యే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లయ్యాక మీ ఇంట్లో నీ వేషధారణ (డ్రెస్సింగ్ సెన్స్) ఏమైనా మార్చుకోమని చెప్పారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు రకుల్ మాట్లాడుతూ.. అలా ఎవరూ చెప్పలేదు. పుట్టింట్లో, అత్తింట్లో నాకు నచ్చినట్లు ఉండేలా స్వేచ్ఛనిచ్చారు. మన సమాజమే పెళ్లిని పెద్ద విషయంగా చూస్తోంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక సహజ ప్రక్రియలా భావిస్తే సరిపోతుంది. అమ్మాయిలనే ఎందుకడుగుతారు? అలాగే పెళ్లి తర్వాత.. ధగధగ మెరిసే షేర్వాణీలే ధరించాలని మగవాళ్లకు చెప్పగలరా? చెప్పరు కదా.. మరి ఆడవాళ్ల విషయంలో మాత్రం ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతారు? కాలం మారింది.. ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటారు. ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకుంటారు' అని చెప్పుకొచ్చింది. కాగా రకుల్ ఫిబ్రవరి 21న గోవాలో ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. చదవండి: సూర్యను ఇచ్చేయమన్న వీరాభిమాని.. జ్యోతిక ఏమందంటే? -
అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. పెళ్లి తర్వాత రకుల్ లుక్స్ వైరల్!
గౌనులో చిన్నపిల్లలా మారిపోయిన రవీనా టాండన్ అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. కళ్లతోనే మాయ చేస్తోన్న శ్రియా శరణ్.. గ్రీన్ డ్రెస్లో లైగర్ భామ అనన్య పాండే అలాంటి పోజులు.. బ్లాక్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్... View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Arun Prasath (@arunprasath_photography) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: వయ్యారి భామల సందడి, ఫోటోలు
-
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
గోవాలో ఘనంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి న్యూ ఫోటోలు
-
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
రకుల్-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ వైరల్
PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్ను స్వయంగా రకుల్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్గా మారింది. Your blessings touch our hearts deeply, Prime Minister @narendramodi ji. Thank you for your kind wishes as we begin this meaningful new chapter.@Rakulpreet pic.twitter.com/6VOfWhzl68 — Jackky Bhagnani (@jackkybhagnani) February 22, 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్ ఆశీర్వాదాలు అందించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
గోవాలో గ్రాండ్ గా రకుల్ పెళ్లి
-
ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురిగా ముస్తాబైంది. మనసిచ్చినవాడితో మనువాడింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు. మూడు రోజుల నుంచే సంబరాలు ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పుడే లీక్ చేసింది కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్పైనా ఫోకస్ చేసింది. ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్ పండగకు థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ లోపెజ్ సినిమాలో అలా! -
Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఈరోజు గోవాలో ఫిబ్రవరి 21 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, తరలి వెళుతున్న సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రకుల్, జాకీ పెళ్లికి భగ్నానీ & సింగ్ కుటుంబం స్వాగతం పలుతుకున్న వేదిక దగ్గర్నించి, RJ లవ్బర్డ్స్ పేర్ల తొలి అక్షరాలను రాసిన కొబ్బరికాయ, గోవా చేరుకుంటున్న పలువురు సినీరంగ ప్రముఖుల ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. రకుల్ జాకీ వారి మెహందీ, సంగీత వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీత్లో వరుణ్ 'కూలీ నంబర్ 1' లోని 'హస్న్ హై సుహానా'కి డ్యాన్స్ చేయగా,. వరుణ్తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా , ఇతర కుటుంబ సభ్యులు కూడా స్టెప్పులేశారు. అంతేకాదు జాకీ భగ్నాని తన లవ్ లేడీని ఓ పాటతో సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశాడట. వారి ప్రేమకథను సూచించే బిన్ తేరే అంటూ సాగే ఈ పాట వేడుకకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిందట. ఈ పాటకు మయూర్ పూరి సాహిత్యం అందించగా, తనిష్క్ బాగ్చి కంపోజిషన్లో జహ్రా ఎస్ ఖాన్, రోమీ మతనిష్క్ బాగ్చి పాడారు. రకుల్కి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఈ పాటను ప్లాన్ చేశాడట. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) పంజాబీ వెడ్డింగ్లంటే చుడా వేడుక అతిముఖ్యమైంది. వధువు మేనమామ పాలతో శుద్ధి చేసిన గాజులను అందిస్తాడు. ఇద్దరు మేనమామలుంటే, ఎవరు ఎక్కువ గాజులు పెడతారనే అందమైన పోటీ ఉంటుంది ఇద్దరి మధ్యా. ఉదయం 'చుడా' వేడుక ఆ తర్వాత గోవా ITC గ్రాండ్ సౌత్ 'సాథ్ ఫేరా' ఉంటుందని సమాచారం. రకుల్ , జాకీ రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకలో జాకీ భగ్నాని తండ్రి వాషు భగ్నాని సన్నిహిత మిత్రుడు రాజ్కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి ఈ వేడుకలో ప్రత్యేకంగా కనిపించనున్నారు. నటుడు వరుణ్ ధావన్, భార్య నటాషా దలాల్ ఇప్పటికే గోవాలో సందడి చేస్తున్నారు. కొన్నేళ్ల డేటింగ్ తరువాత, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ తమ ప్రేమ బంధాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా 2021,అక్టోబర్ అధికారంగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. #WATCH The Gorgeous actress #PragyaJaiswal was snapped arriving at Goa airport to attend bestie #RakulPreetSingh & #JackkyBhagnani's wedding. She was seen posing with fans at the airport. The pair decided to skip overseas weddings and marry in a beautiful hotel in South Goa. pic.twitter.com/Sn2LxraSWh — E Global news (@eglobalnews23) February 20, 2024