-
ఏపీలో విద్యుత్ నష్టాలు తక్కువ
సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన సేవలందించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలుస్తోంది. ఆ కోవలోనే విద్యుత్ రంగంలో విప్లవాత్మక చర్యలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమేగాక జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటోంది. తాజాగా టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలను తగ్గించడంలో ఏపీ ముందంజలో నిలిచి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో బుధవారం కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వర్చువల్గా సమీక్షించారు. రాష్ట్రాల వారీగా విద్యుత్ సంస్థల పనితీరు, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) పురోగతిపై చర్చించారు. ఆర్డీఎస్ఎస్లో ప్రధానంగా పరిగణించే ఏటీసీ నష్టాలు మన రాష్ట్రంలో 2018–19లో 16.36 శాతం ఉండేవి. 2021–22లో అవి 11.21 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో మూడుశాతానికిపైగా నష్టాలను తగ్గించిన రాష్ట్రాల జాబితాను కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, హరియాణ, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. 5.15 శాతం నష్టాల తగ్గింపుతో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2024–2025 నాటికి ఏటీసీ నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడే చేరుకున్నాయి. ఉదయ్ డ్యాష్బోర్డ్ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 12 రాష్ట్రాల్లో ఏటీసీ నష్టాలు 25 శాతం కంటే ఎక్కువ, ఆరు రాష్ట్రాలలో 15–25 శాతం మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును అంచనా వేయడానికి కేంద్రం ఈ ఏటీసీ నష్టాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది. అవి తక్కువగా ఉన్న, వేగంగా తగ్గించుకుంటున్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్డీఎస్ఎస్ ద్వారా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ప్రీపెయిడ్ మోడ్లో స్మార్ట్మీటర్లు అమర్చడంపైనా మంత్రి ఆరాతీశారు. వ్యవసాయ ఫీడర్లకు సౌరవిద్యుత్ వినియోగం ప్రయోజనకరమని తెలిపారు. ఏపీ ఈ దిశగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట తక్కువ ఖర్చుతో విద్యుత్ను అందించవచ్చని మంత్రి వెల్లడించారు. 7 పోక్సో కోర్టులకు జడ్జీలు గుంటూరు లీగల్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఏడు పోక్సో కోర్టులకు జిల్లా జడ్జీలను బదిలీపై నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) సునీత బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా జిల్లా జడ్జీలను అక్కడే ఉన్న పోక్సో కోర్టులకు బదిలీ చేశారు. అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ, ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి.రాజ్యలక్ష్మి, చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజులుల్లా, నెల్లూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి సిరిపిరెడ్డి సుమ, ఒంగోలులోని ప్రత్యేక మహిళా కోర్టు, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, విశాఖపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది, ఏలూరులోని ల్యాండ్ రీఫామ్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఉమసునందలను పోక్సో కోర్టులకు జడ్జీలుగా బదిలీ చేశారు. బదిలీ అయిన వారు పోక్సో కోర్టులకు జడ్జీలుగా కొనసాగుతూనే, ప్రస్తుతం వారు పనిచేస్తున్న జిల్లా కోర్టులకు ఫుల్ అడిషనల్ చార్జి జడ్జిగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. జనరల్ బదిలీలు జరిగే వరకు ఫుల్ అడిషనల్ చార్జి జడ్జీలుగా కొనసాగాలని తెలిపారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
విజయవాడ స్పోర్ట్స్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితకాల(మరణించే వరకు) కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని బుధవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని భవానీపురానికి చెందిన మహిళకు మచిలీపట్టణానికి చెందిన వ్యక్తితో 2005లో వివాహం జరిగింది. అనివార్య కారణాలతో ఆమె భర్త నుంచి విడిపోయి భవానీపురంలోని తల్లి ఇంట్లో ఇద్దరు పిల్లలు(12 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప)తో కలిసి జీవిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. 2021 జనవరి 30న యధావిధిగానే పిల్లలను తన తల్లికి అప్పజెప్పి కూలీకి వెళ్లింది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని అదే ప్రాంతంలో ఉండే షేక్ అయాజ్ అహ్మద్(49) పిలిచి తన ఇంటికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి అదే రోజు విజయవాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని మరుసటి రోజు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. బాధితుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి.నారాయణరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ జి.కల్యాణి న్యాయస్థానానికి వాదనలు వినిపించారు. 15 మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు అయాజ్ అహ్మద్కు జీవితకాల కఠినకారాగార శిక్ష, రూ.2.31 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన నగదులో రూ.1.66 లక్షలను బాధితురాలికి అందజేయాలని, అలాగే నిందితుడు మరో రూ.5 లక్షలు బాధితురాలికి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా బాధితురాలికి రూ.4 లక్షలు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. -
నేరానికి శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: నేరాల కట్టడితోపాటు నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయడానికి రాష్ట్ర పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేసుల నమోదుతో సరిపెట్టకుండా నేరాన్ని రుజువు చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ‘కన్విక్షన్ బేస్ పోలీసింగ్’ విధానం మంచి ఫలితాలనిస్తోంది. ఈ విధానం కింద కేసుల నమోదుతోపాటు నేర నిరూపణ వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఇందుకోసం పోలీస్ స్టేషన్ స్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) నుంచి జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ వరకు స్వీయ పర్యవేక్షణ (రివ్యూ) బాధ్యతలు అప్పగించారు. వీటిలో బాలికలు, మహిళలపై జరిగిన నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఏడాది జూన్ నుంచి అమలులోకి తెచ్చిన ఈ విధానంతో కేవలం ఆరు నెలల్లోనే ఏకంగా 90 పోక్సో కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగారు. ఇందులో 42 కేసుల్లో జీవిత ఖైదు పడటం ఓ రికార్డు. మరొక నేరస్తుడికి చనిపోయే వరకు శిక్ష విధించగా, 11 మందికి 16 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు శిక్షలు, తొమ్మిది మందికి 10 నుంచి 15 ఏళ్లలోపు శిక్షలు పడ్డాయి. పోలీసు శాఖలో సమూల మార్పులు గతంలో కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా నేరాల విచారణ జరిగేది. దీనివల్ల కేసుల దర్యాప్తు, సాక్ష్యాల నమోదు తదితర విషయాల్లో తీవ్ర జాప్యం జరిగేది. అతి తక్కువ కేసుల్లోనే శిక్షలు పడేవి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేర నిరూపణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసు శాఖలో సమూల మార్పులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానాన్ని తెచ్చారు. దీని కింద రోజువారీగా కేసుల నమోదుతోపాటు దర్యాప్తు, న్యాయస్థానాల్లో వాయిదాలు, సాక్ష్యాలను ప్రవేశపెట్టడం, నేర నిరూపణకు చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ పక్కా కార్యాచరణ చేపట్టింది. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ అయిదు ప్రధాన కేసులను రోజువారీగా స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో కేసు విచారణ పురోగతిని సమీక్షిస్తున్నారు. నేరస్తులు తప్పించుకోకుండా చేయడంతోపాటు బలమైన సాక్ష్యాలను పెట్టడం, సాక్షులకు రక్షణపై దృష్టి పెట్టారు. తద్వారా త్వరితగతిన నేర నిరూపణ జరిగి, నేరస్తులకు శిక్షలు పడుతున్నాయి. నేర నిరూపణకు ప్రాధాన్యం రాష్ట్రంలో కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకు ప్రత్యేక దృష్టి సారించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పక్కా కార్యాచరణ చేపట్టాం. ప్రధానంగా బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాల్లో శిక్షలు పడేలా దృష్టి పెట్టాం. గతంలో ‘కోర్టు మానిటరింగ్ సిస్టం’తో కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికే పరిమితమయ్యేవారు. దీని వల్ల శిక్షల శాతం పెరగలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ సిస్టమ్ను ప్రక్షాళన చేసి కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్లో సమూల మార్పులు తెస్తున్నాం. నేరం జరిగితే కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు వేసి బాధ్యత తీరిందని సరిపెట్టుకోకుండా నేర నిరూపణ వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించేలా చేశాం. దీనిపై రోజువారీగా జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిచడంతో ఆరు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. – కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, డీజీపీ -
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.రామ శ్రీనివాసరావు సోమవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలు చిన్నారి కావడంతో నిబంధనల ప్రకారం నాలుగు లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు సారిక వెంకటరమణ (66) విశాఖపట్నంలోని హెచ్బీ కాలనీలో ఉంటున్నాడు. అతను ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగి. సమీపంలోని చిన్నారులను తరచూ తన ఇంటికి పిలిచి తినుబండారాలు, చాక్లెట్లు ఇచ్చేవాడు. బాధితురాలు (7) కూడా అదే ప్రాంతంలో ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంటికి సమీపంలోని ఒక అపార్ట్మెంటులోని వాచ్మన్గా పనిచేస్తూ దుస్తులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి దగ్గరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదివేది. ఈ క్రమంలో 2020 డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో నిందితుడు వెంకటరమణ ఆ బాలికకు చాక్లెట్లు ఇస్తా.. అని ఆశచూపి తన ఇంటికి రప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లిన చిన్నారిని చిత్రహింసలు పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమ కుమారై కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల వెదికారు. బాలిక నీరసంగా ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువుకావడంతో సారిక వెంకటరమణకు 20 ఏళ్ల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు
ముంబై: మైనర్ బాలికను ‘ఐటమ్’ అని పిలిచినందుకు ఓ యువకుడికి ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. అబ్బాయిలు లైంగిక వేధింపుల ఉద్ధేశ్యంతో మాత్రమే అమ్మాయిని ఐటమ్ అని కామెంట్ చేయడం జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్ను 2015లో ఓ వ్యక్తి టీజ్ చేసిన కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2015 జూలై 14న విద్యార్థిని స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ’ఏయ్ ఐటమ్.. ఎక్కడికి వెళ్తున్నవ్’ అంటూ స్థానికంగా నివాసముండే 25 ఏళ్ల యువకుడు కామెంట్ చేశాడు. దీంతో బాలిక తనను వేధించవద్దని కోరగా.. మరింత రెచ్చిపోయిన వ్యక్తి ఆమె జుట్టుపట్టుకొని లాగి దుర్భాషలాడాడు. బైక్పై వెంబడించాడు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్లైన్ 100కు కాల్ చేసి జరిగింది చెప్పింది. పోలీసులు వచ్చేలోపు పోకిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 354, 354(డీ), 506, 504 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైంది. దీనిపై ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. అబ్బాయిలు ఉద్ధేశపూర్వకంగా అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే ఈ పదం(ఐటమ్) ఉపయోగిస్తారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే అన్సారీ పేర్కొన్నారు. మైనర్ బాలికపై వేధింపుల కేసు కాబట్టి నిందితుడి విషయంలో కనికరం చూపే ప్రసక్తే లేదని తెలిపారు. అమ్మాయిని అలా అల్లడి వెనక నిందితుడి ఉద్ధేశ్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. రోడ్డు సైడ్ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, ఇలాంటి నేరాలను కఠినంగా శిక్షించాలని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి: విద్యార్థులతో ఆడిపాడిన చిన్నారి.. ఉన్నట్టుండి కుప్పకూలడంతో... -
బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఓ బాలికపై లైంగిక దాడి కేసులో 73 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తల్లితో కలిసి నివాసముంటోంది. ఒక రోజు పాఠశాల నుంచి వచ్చి ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన కోలాటి బాలయోగి (73) బాలికకు మాయమాటలు చెప్పి అతడి ఇంటికి తీసుకువెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా సుమారు ఐదు నెలల పాటు బాలికను హింసించాడు. బాలికకు తరచూ కడుపునొప్పి వస్తుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్య పరీక్షలో అసలు విషయం తేలింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. దిశా పోలీస్స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి.ప్రేమ్కాజల్ దర్యాప్తు చేసి నిందితుడు బాలయోగిని అరెస్టు చేసి పూర్తి ఆధారాలతో పోక్సో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.రామశ్రీనివాస్ ముద్దాయి బాలయోగికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వాలని తీర్పు వెలువరించారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో మరణించే వరకు జైలు శిక్ష
విజయవాడ స్పోర్ట్స్: ఏడేళ్ల బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష (మరణించే వరకు జైలు) విధిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి రజిని సోమవారం తీర్పు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నున్నకి చెందిన బాలిక(7) ఈ ఏడాది ఫిబ్రవరి 26న స్కూలుకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఉంది. ఆ ఇంటి సమీపంలోనే ఉంటున్న అనీల్(30) ఆ బాలికకు నెమలి ఈకలు ఇస్తానని ఆశ చూపి తాను పని చేస్తున్న టెంట్ హౌస్కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనీల్ అత్యాచారం చేశాడని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కేసును దిశా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దిశా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా శిక్ష, రూ.3 వేలు జరిమానా విధించారు. బాలిక కుటుంబానికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు. -
సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష
తిరువనంతపురం: అత్యాచారం కేసులో కేరళలోని పతనంతిట్టా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల చిన్నారిపై రెండేళ్లకుపైగా లైంగిక దాడికి పాల్పడిన 41 ఏళ్ల మానవ మృగానికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. నిందితుడు మరో మూడేళ్లు జైలులో ఉండాలని పోక్సో న్యాయస్థానం స్పష్టం చేసింది. పోక్సో కేసులో ఓ వ్యక్తికి విధించిన గరిష్ఠ శిక్షగా అధికారులు తెలిపారు. 2019 నుంచి 2021 మధ్య రెండేళ్ల పాటు 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు 2021, మార్చి 20న తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నందన్ పీఆర్ అలియాస్ బాబు బాధితురాలి కుటుంబానికి దూరపు బంధువు, వారి ఇంటిలోనే ఉండటంతో ఈ విషయం బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. ‘బాధితుల తరఫున పోక్సో ప్రాసిక్యూటర్ అడ్వకేట్ జాసన్ మాథ్యూ వాదనలు వినిపించారు. సాక్షుల వాంగ్మూలం, మెడికల్ రికార్డులు, ఇతర ఆధారాలు ప్రాసిక్యూషన్కు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. తిరువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ హరిలాల్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది’ అని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి.. 10 ఏళ్ల బాలుడు మృతి -
బాలుడిపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు
విజయవాడ స్పోర్ట్స్: బాలుడిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు(స్పీడ్ ట్రయిల్ కోర్టు) న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని బుధవారం తీర్పు ఇచ్చారు. విజయవాడలోని అజిత్సింగ్నగర్కు చెందిన 11 ఏళ్ల బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు పతకమూరి కాంతారావు(20) 2018, జూన్ 30వ తేదీన లైంగిక దాడి చేశాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేసి వెంటనే చార్జ్షీట్ దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీ నారాయణరెడ్డి బాధితుడి తరఫున వాదించి 11 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో పతకమూరి కాంతారావుకు 20ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితుడికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. -
మురుఘ మఠాధిపతికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
సాక్షి,బెంగళూరు: రాష్ట్రమంతటా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి రాజేంద్ర శివమూర్తి స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైస్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మురుగ మఠానికి చెందిన శివమూర్తి మురుగ శరణారావుకు.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మురుగ మఠాధదిపతి శివమూర్తికి ఛాతీలో నొప్పి రావడంతో భారీ బందోబస్తు మధ్య చిత్రదుర్గ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత అనంతపురం జిల్లా జైలుకు తరలించనున్నట్లు చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ పరశురాం తెలిపారు. కాగా గురువారం రాత్రి మురుఘ రాజేంద్ర మఠంలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించారు. గత నెల 26న చిత్రదుర్గలోని మురఘశ్రీ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు స్వామీజీపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారంరోజుల ఉత్కంఠ వారం రోజులుగా ఈ విషయం రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో స్వామీజీ చేసుకున్న దరఖాస్తుపై విచారణ కూడా శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు మఠం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చివరకు రాత్రి హైడ్రామా మధ్య స్వామీజీ అరెస్ట్ను ప్రకటించారు. ఇదివరకే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. శుక్రవారం నుంచి స్వామీజీని పోలీసులు విచారించనున్నారు. స్వామీజీకి మద్దతుగా, వ్యతిరేకంగా పలువురు నేతలు ప్రకటనలు చేశారు. చదవండి: కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే.. -
కామాంధుడికి జీవిత ఖైదు
విజయవాడ లీగల్: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితకాల జైలుశిక్షతో పాటు రు.10 వేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమారులు. ఇదేప్రాంతంలో అమరావతి తిరుపతిరావు (32) నివశిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 22న రాఖీ పండుగ రోజు తన ఇద్దరు కుమారులతో కలసి తల్లి తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఐదేళ్ల రెండోకుమారుడు ఆరుబ యట ఆడుకుంటుండగా తిరుపతిరావు ఆ బాలుడికి మాయమాటలుచెప్పి ఎదురుగా నిర్మిస్తున్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలుడి శరీరభాగాల్లో రాళ్లను జొప్పించాడు. కొద్దిసేపటి తర్వాత నోటి నుంచి రక్తం కారుతూ నడవలేని స్థితిలో చేతులతో పాకుతూ వస్తున్న కుమారుడిని చూసిన తల్లి పడిపోయాడని భావించింది. స్నానం చేయించేందుకు దుస్తులు విప్పగా రక్తం కారుతుండటం గమనించి.. ఏం జరిగిందని ఆరా తీసింది. బాలుడు జరిగింది చెప్పడంతో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 29న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో అమరావతి తిరుపతిరావుకు న్యాయమూర్తి పైన పేర్కొన్న శిక్షను విధిస్తూ.. బాలుడికి రూ.5 లక్షలు వచ్చేటట్లు చూడాలని మండల న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు. -
ఆంధ్రప్రదేశ్లో 12 ఫాస్ట్ట్రాక్ కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం (పోక్సో) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో 12 ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం దేశంలో 1,023 ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్లో నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో కలిపి లక్షకుపైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఏపీ హైకోర్టులో ఐదు జడ్జి పోస్టులు ఖాళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేవలం ఆరుగురు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయాల్సి ఉందని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు జవాబిచ్చారు. ఏపీ హైకోర్టులో ఆమోదించిన శాశ్వత, అదనపు న్యాయమూర్తుల సంఖ్య 37 అని తెలిపారు. ఖాళీగా ఉన్న ఐదు జడ్జి పోస్టులకు కొలీజియం నుంచి సిఫార్సులు రాలేదన్నారు. రిజర్వేషన్లు వర్తించవు ఆర్టికల్ 124, 217, 224 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఉంటుందని, అయితే కులాలు, వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేయలేదని కిరణ్ రిజిజు తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలను సిఫార్సు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కేంద్రం కోరుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు సమాధానమిచ్చారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ సీటును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కోరుతూ 2020 ఫిబ్రవరిలో ఏపీ సీఎం ప్రతిపాదనలు పంపించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. హైకోర్టును తరలించాలంటే రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే ఉంటుందని, తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. ఆ తర్వాత తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పూర్తి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద పెండింగ్లో లేదన్నారు. అయితే హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించేందుకు బాధ్యత వహిస్తారని చెప్పారు. -
హైదరాబాద్: కార్పొరేటర్ తనయుడి నిర్వాకం.. ప్రేమించాలంటూ బాలికకు..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ బాలికను వేధిస్తున్న కార్పొరేటర్ తనయుడిపై మీర్పేట పోలీసులు పోక్సో, నిర్భయ కేసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్పేట బీజేవైఎం అధ్యక్షుడు బచ్చనమోని ముఖేష్యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణాషాప్నకు వెళ్తుండగా ముఖేష్యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్యాదవ్పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ముఖేష్పై మరో కేసు కూడా నమోదైందని, విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు. చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
బాలికతో ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఓ బాలికకు ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన విజయవాడ నున్న ప్రాంతంలో జరిగింది. కృష్ణలంక సీఐ సత్యానందం కథనం మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బాలిక నూజివీడులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆంజనేయులుతో ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయిని కలవడానికని ఆంజనేయులు శనివారం బెజవాడ వచ్చాడు. ఉదయం 11 గంటలకు ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి ఆ అమ్మాయి నూజివీడు నుంచి బెజవాడ వచ్చి ఆంజనేయులును కలుసుకుంది. సాయంత్రం 6 గంటల తర్వాత స్వగ్రామం బయలుదేరింది. ఆంజనేయులు ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని రాత్రికి ఇక్కడే ఉండిపోయాడు. మళ్లీ రాత్రి 10 గంటలకు ఆ బాలిక బస్సులో విజయవాడకు చేరుకుని ఆంజనేయులుకు ఫోన్ చేసింది. అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో ఎక్కడ బస చేశాడో తెలుసుకోవడానికి సింగ్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ షేక్ ఖదీర్ ఆటోను కిరాయికి మాట్లాడుకుని లాడ్జిల్లో వాకబు మొదలు పెట్టింది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం వరకూ వాకబు చేసినా ఆంజనేయులు ఆచూకీ లభించలేదు. దీంతో తన ఇంటికి రమ్మని బాలికకు ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మి ఆ బాలిక బయలుదేరగా ఆటోను నున్న సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తప్పించుకుని సమీపంలోని ఓ ఇంటికి చేరుకుంది. వారు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. 5 నిమిషాలలోనే పోలీసులు బాలికను రక్షించారు. ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సోమవారం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం – టి.కె.రాణా, విజయవాడ పోలీస్ కమిషనర్ 112కు కాల్ రాగానే పోలీసులు ఘటనా స్థలానికి 5 నిమిషాల్లోనే చేరుకుని ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొంటే, ఆపద సమయంలో ఆ యాప్ ఉపయోగపడుతుంది. ముఖ పరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తే ఉపేక్షించం. మహిళలు ఒంటరిగా వేళగాని వేళలో బయటకు వచ్చేటప్పుడు, కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. -
అతడికి 60.. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై కన్నేసి..
అనంతపురం క్రైం: బాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన శుక్రవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నగర్లో బాబూరావు (60) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కూతురు హైదరాబాదులో నివాసం ఉంటోంది. బాబూరావు మద్యానికి బానిసయ్యాడు. ఇరుగుపొరుగు వారు ఇచ్చే భోజనం తిని, యాచిస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. శుక్రవారం నివాస ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక ఒంటరిగా కనిపించడంతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో బాలిక తల్లి అక్కడికి వచ్చి.. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున చేరుకున్నారు. డయల్ 100కు సమాచారం అందించారు. త్రీటౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. కేసును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిశ పోలీస్ స్టేషన్కు బదలాయించారు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వృద్ధుడు బాబూరావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: చక్రం తిప్పిన దివ్య హాగరగి.. హోం మంత్రి సంచలన ప్రకటన -
లైంగిక వేధింపులు బయట పడుతాయని హత్య.. నిందితుడికి ఉరిశిక్ష
సేలం( తమిళనాడు): మైనర్ తల నరికి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష, రూ. 25 వేలు జరిమానా విధిస్తూ సేలం కోర్టు మంగళవారం తీర్పిచ్చింది. వివరాలు.. సేలం జిల్లా, ఆత్తూర్ సమీపంలో తలవాయ్పట్టి గ్రామానికి చెందిన దినేష్కుమార్ (33) వరికోత వాహనంలో పని చేస్తున్నాడు. ఇతను 2018, అక్టోబర్ 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదేప్రాంతంలో ఉన్న దళిత వర్గానికి చెందిన సామువేల్ కుమార్తె అయిన మైనర్ పువ్వులు కట్టడానికి దారం కోసం వచ్చింది. అప్పుడు దినేష్కుమార్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు చెబుతానంటూ వెళ్లిపో యింది. లైంగిక వేధింపుల విషయం ఎక్కడ బయట పడిపోతుందోననే భయంతో దినేష్ కుమార్ ఆమెను ఇంటికి వెళ్లి దూషించాడు. అంతటితో ఆగకుండా తల్లి కళ్ల ఎదుటే ఆమె తలను తెగనరికి హత్య చేశాడు. తర్వాత ఆత్తూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యపై పోలీసులు ఐదు విభాగాల కింద కేసు నమోదు చేసి దినేష్ కుమార్ను అరెస్టు చేశారు. దళిత వర్గానికి చెందిన మైనర్ దారుణ హత్యకు గురైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ కేసుపై సేలం ఫోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది ఎ.ఆసైతంబి వాదించారు. మరెవరికీ.. కేసు విచారణ ముగిసి మంగళవారం న్యాయమూర్తి ఎం.మురుగానంద్ తుది తీర్పు ఇచ్చారు. హత్య చేసినందుకు దినేష్ కుమార్కు ఉరిశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా జీవిత ఖైదు, రూ. 5 వేలు జరిమానా, మరో మూడు విభాగాల కింద 10, 6 సంవత్సరాలు, 4 నెలలు జైలు శిక్షను, తలా రూ. 5 వేలు వంతున జరిమానా విధించారు. మైనర్ తల్లిదండ్రులు సామువేల్, చిన్నపొన్ను మాట్లాడుతూ.. తమ కుమార్తెకు జరిగిన దారుణం మరెవరికీ జరగకూడదని, ఈ తీర్పు తమకు కాస్త ఊరట నిచ్చినట్లు తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: కనికరించలేదు.. సింగపూర్లో ‘మానసిక వికలాంగుడు’ నాగేంద్రన్ను ఉరి తీశారు -
లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
కాకినాడ లీగల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలిక (16)పై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరు గ్రామం, శౠంతినగర్కు చెందిన బాలిక నగరంలోని ఒక వస్త్ర దుకాణంలో పని చేసేది. షాపులో పని పూర్తయ్యాక తిరిగి రాత్రి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. నగరంలోని ఆర్యాపురానికి చెందిన ఆటో డ్రైవర్ తానేటి రామచంద్ర వరప్రసాద్ ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో మరో ఆటో డ్రైవర్ తానేటి సుధాకర్బాబును కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. వారిద్దరూ కలిసి ఆ బాలికను నేరుగా కాతేరు వెళ్లే రోడ్డులో కాకుండా పేపర్ మిల్లు వెనుక ఉన్న గోదావరి గట్టు వైపు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు దుర్మార్గులు తనను బ్లేడు, కత్తితో బెదిరించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక 2016 జూన్ 6న రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు రామచంద్ర వరప్రసాద్, సుధాకర్బాబుపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్ దర్యాప్తు చేపట్టారు. కోర్టు విచారణలో తానేటి సుధాకర్బాబుపై నేరం రుజువు కావడంతో ఐపీసీ 376 (2)ఎన్ ప్రకారం పదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా, ఐపీసీ 376డి ప్రకారం 20 ఏళ్ల జైలు, రూ.1,000 జరిమానా, ఐపీసీ 377 ప్రకారం ఐదేళ్ల జైలు, రూ.1000 జరిమానా, ఐపీసీ 506 ప్రకారం ఏడాది జైలు, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నాలుగు సెక్షన్లకు ఏకకాలంలో జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేకపోవడంలో తానేటి రామచంద్ర వరప్రసాద్పై కేసు కొట్టి వేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ అక్బర్ అజాం ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
కూతురిని పొట్టన పెట్టుకున్నాడని.. నిందితుడిని కాల్చి చంపి..
సాక్షి, జవహర్నగర్/బీబీ నగర్: ఓ యువకుడిని ఎక్కడో దారుణంగా హత్య చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ శివారులో కాల్చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పరిధిలోని డీజేఆర్ కాలనీ జోహర్నగర్ నివసిస్తున్న మోట రాము(35) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే కాలనీలో నివాసముంటున్న చీర వెంకటలక్ష్మి కుటుంబంతో గొడవలు ఉన్నాయి. కూతురు ఆత్మహత్యకు కారకుడయ్యాడని.. చీర వెంకటలక్ష్మి కూతురు భార్గవిని రాము కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాము వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన భార్గవి ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు రాము వేధింపులే కారణమని వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు భరత్లు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామును సోమవారం మేడ్చల్ పరిధిలోనే దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో వేసుకుని బీబీనగర్ మండలం రాయరావుపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. అనంతరం వెంకటలక్ష్మి, భరత్ నేరుగా ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రామును తామే హత్య చేసి కాల్చేశామని నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు రాయరావుపేట శివారులో రాము మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలాన్ని భువనగిరి ఏసీపీ వెంకట్రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పోక్సో కోర్టులతో సత్వర న్యాయం
మహబూబాబాద్ రూరల్/జనగామ: జిల్లాల్లో పోక్సో కోర్టుల ఏర్పాటు ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ అన్నారు. మహబూబాబాద్, జనగామలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టులను సోమవారం ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వర్చువల్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి నవీన్రావు, వరంగల్ నుంచి ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు పాల్గొన్నారు. మహబూబాబాద్ గిరిజన జిల్లాలో ఇలాంటి కోర్టు అత్యవసరమన్నారు. పునర్విభజనలో ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా పూర్తిస్థాయి కోర్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె.శశాంక, జడ్జి అనిల్ కిరణ్కుమార్, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ..
సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం): ప్రేమ పేరుతో ఓ బాలికను దారుణంగా వంచించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన బాలిక (17) పిఠాపురంలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఎంఎల్టీ ఒకేషనల్ కోర్సు చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కుక్కా రామకృష్ణ ప్రేమ పేరుతో రెండేళ్లు ఆమె వెంట పడ్డాడు. తాను ఇంకా చదువుకోవాలని, తనకు ప్రేమ ఇష్టం లేదని చెప్పినా వినేవాడు కాదు. తనను ప్రేమించకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ బెదిరించాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తేనే ప్రేమిస్తానని ఆ బాలిక చెప్పగా అంగీకరిస్తున్నానని నమ్మించిన రామకృష్ణ ఆమెను లొంగదీసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. ఎంత వారించినా వినకుండా తన సెల్ ఫోన్లో ఆమె ఫొటోలు తీసేవాడు. చదవండి: (వంటగదిలో ప్రియుడితో భార్య.. భర్తకు మెలకువచ్చి ప్రశ్నించగా) తల్లిదండ్రులు ఆ బాలికకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. రామకృష్ణ తన వద్ద ఉన్న ఫొటోలను పెళ్లికొడుకు తరఫు వారికి పంపించి సంబంధాలు చెడగొట్టేవాడు. అలాగైతే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె గట్టిగా నిలదీయడంతో తన తల్లి కుక్కా గంగా సత్యవతి, అన్న మురళి అడ్డం పడుతున్నారని చెప్పాడు. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు స్థానిక పెద్దల వద్ద గత ఏడాది డిసెంబర్ 30న పంచాయతీ పెట్టారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో ఆ బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. -
ఏపీకి 18 ఈ-పోక్సో కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్కు 18 ఈ–పోక్సో కోర్టులు కేటాయించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్రిజుజు శుక్రవారం లోక్సభలో తెలిపారు. వీటిలో 10 ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిచేయ తలపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు సాగరమాలలో భాగంగా ఆర్థికసాయం ఇవ్వడం లేదని కేంద్ర నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మూడు నాన్–మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టుల్లో ఏఐ జస్టిస్ డెలివరీ సిస్టమ్ సామర్థ్యం పెంచడానికి సాంకేతికతతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్రిజుజు తెలిపారు. ఈ–కోర్టు రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, వంగా గీతావిశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భర్తీకాని 1,425 పీజీ సీట్లు 2020–21లో 1,425 మెడికల్ పీజీ సీట్లు భర్తీకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. వీటిలో 1,365 బ్రాడ్–స్పెషాలిటీ సీట్లు, 60 డిప్లొమా సీట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏపీలో 12,859 మంది ఔషధ మొక్కల సాగు ఆంధ్రప్రదేశ్లో 12,859 మంది రైతులు ఔషధ మొక్కలు సాగుచేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయా రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్లో నర్సింగ్ కళాశాల మంగళగిరి ఎయిమ్స్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాల ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా,దేశవ్యాప్తంగా మంగళగిరి సహా 13 ఎయిమ్స్ల్లో 7,500 పడకలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత వ్యాక్సిన్కు రూ.27,945.14 కోట్లు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి 2021–22లో రూ.35 వేల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి 7 నాటికి రూ.27,945.14 కోట్లు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. 2022–23 బడ్జెట్లో కూడా వ్యాక్సినేషన్కు రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల సంఖ్య పెంచే ప్రతిపాదన లేదు కేంద్ర మంత్రుల సంఖ్య పెంచడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్రిజుజు.. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
బుద్ది తెలుసుకొని ఉన్న ఉద్యోగం పీకేశారు.. మళ్లీ నగ్నఫొటోలు, వీడియోలు..
సాక్షి, హైదరాబాద్: ఓ మైనర్ బాలికకు అసభ్యకరంగా మెసేజ్లు పంపించిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ వివరాల ప్రకారం.. జగిత్యాల్కు చెందిన రేగొండ వెంకట సాయి (31) ప్రైవేట్ స్కూల్ టీచర్. విద్యార్థినుల ఫోన్ నంబర్లను సేకరించి ప్రతి రోజూ వాళ్లతో చాటింగ్ చేసేవాడు. అతని అసభ్య ప్రవర్తన యాజమాన్యం దృష్టికి రావటంతో అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ క్రమంలో వెంకట సాయి తన ఫోన్లో మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వర్చువల్ నంబర్లను తీసుకున్నాడు. వాట్సాప్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తిగా మైనర్ బాలికకు మెసేజ్లు చేయడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా తనను ప్రేమిస్తున్నాని చెప్పడంతో అప్పటి నుంచి సదరు బాలిక రిప్లై ఇవ్వటం మానేసింది. దీంతో కక్ష గట్టిన వెంకటసాయి సదరు బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫొటోలు, వీడియోలను పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం వెంకటసాయిని అరెస్ట్ చేశారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
బన్సీలాల్పేట్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా విధించింది. బుధవారం పోక్సో కేసు ప్రత్యేక జడ్జి జి.ప్రేమలత ఈ మేరకు తీర్పునిచ్చారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్రావు కథనం ప్రకారం..2017 సంవత్సరంలో కవాడిగూడ సింగాడికుంటకు చెందిన ఆకుల రాము(29) గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా...బాలిక గర్భం దాల్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఇన్స్పెక్టర్ ఎ. సంజీవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుమారు ఐదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తూ వస్తున్నది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. నాటి ఇన్స్పెక్టర్, నేటి డీఎస్పీ ఎ.సంజీవరావు బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి ప్రాసిక్యూషన్ ముందు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశామన్నారు. బాలికకు జన్మించిన పసికందు మృతిచెందాడని, పసివాడి డీఎన్ఏ సేకరించి నిందితుడి డీఎన్ఏతో పోల్చి..పక్కా ఆధారాలు సేకరించి ప్రాసిక్యూషన్ ముందు నిరూపించామన్నారు. చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
Serial Molester: చిన్నారులను అపహరించి లైంగికంగా వేధిస్తున్న అగంతకుడు ఎట్టకేలకు అరెస్ట్!!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చిన్నారులపై వరుస వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ఎట్టకేలకు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ బృందం అరెస్ట్ చేసింది. ఈ వరుస వేధింపులతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం.. 5వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీలోని పహర్గంజ్కు చెందిన యష్ ( 27)గా గుర్తించారు. నిందితుడు యశ్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. నవంబర్ 23న 10 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికను నేరస్థుడు బలవంతంగా అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసులో నేరస్థుడిని విచారించగా, అతనిపై ఇప్పటికే ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోక్సో చట్టం కింద అనేక కేసులు నమోదైనట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు నేరస్థుడిపై ఐపీసీ సెక్షన్ 363, 354, 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడికి 20 ఏళ్లు జైలు
పెదకాకాని(పొన్నూరు): బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి సోమవారం కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పెదకాకాని పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని ప్రాంతానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళుతున్న ఆ బాలికకు ఆటో డ్రైవర్ సాగర్బాబు మాయ మాటలు చెప్పి 2015 డిసెంబర్ 15న ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సాగర్బాబుతో పాటు అతడికి సహకరించిన వేల్పుల కిషోర్బాబు, కొండేటి శ్రీనివాసరావు, రాణిలపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలికపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడు సాగర్బాబుకు గుంటూరులోని పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి ఆర్.శ్రీలత.. 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్టు పోలీసులు చెప్పారు. మిగిలిన ముగ్గురిపై నేరం రుజువు కానందున వారిపై కేసు కొట్టేసినట్టు తెలిపారు. కేసులో పీపీగా శ్యామల వాదనలు వినిపించారు.