-
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్ఫామ్లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్ఎస్టీఆర్) కోర్ ఏరియాలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ కలిగిన తిను బండారాలు తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పడేస్తున్నారు. వాటిని తిని జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంట వద్ద గల అటవీ చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సరఫరా చేసే వాహనాలు వెనక్కి పంపుతున్నారు. యాత్రికుల వాహనాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పడవేస్తున్నారు. దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ప్రసాదానికి జ్యూట్, కాగితంతో తయారు చేసిన బ్యాగ్లను వాడాలని, శ్రీశైలంలో గాజు బాటిళ్ల ప్యాకింగ్తో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదనంగా 20 మంది సిబ్బందిని నియమించి అటవీ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి మూడోసారి బుధవారం అటవీ, దేవస్థానం అధికారులు సున్నిపెంట బయోలేబరేటరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్జర్వేటర్ బి.ఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓలు విఘ్నేష్ అపావ్, సాయిబాబా, రేంజ్ అధికారి నరసింహులు, దేవస్థానం అధికారులు రామకృష్ణ అయ్యన్న, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్లాస్టిక్ఫ్రీ జోన్’గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. టైగర్ రిజర్వ్లో ప్లాస్టిక్ నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, మహబూబ్నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పీసీబీ సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది ప్రపంచానికే పెను సవాల్గా మారింది. భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతూనే ఉన్నారు. తాజా ఎర్త్ యాక్షన్ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు ఈ రిపోర్ట్ వెలుగులోకిచ్చింది. అమెరికా, చైనా, భారత్ సహా ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో చైనా టాప్లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. -
కిచెన్లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్కి చెక్!
మైక్రోప్లాస్టిక్లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్కు చెక్పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్ల కణాల డోస్ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
Kamana Gautam: ప్రతి ఇంటి నుంచి పచ్చటి అడుగు
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామ్నా గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్... ‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్. తన ఇన్స్పైరింగ్ మాటలతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్. బేబీ–వియరింగ్, బ్రేస్ట్ఫీడింగ్లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్ మీడియా జర్నీ మొదలైంది. ‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న. పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది. ‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్మెంట్–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కాదు మీదైన సొంత వాటర్ బాటిల్ ఉండాలి, ట్రెండ్లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!
సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే.. ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి. వీటిని ఏమని పిలుస్తారంటే.. ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్స్టోన్, ప్లాస్టిక్రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్స్టోన్లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి. ఎలా కనుగొన్నారంటే.. జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు. ఎలా ఏర్పడ్డాయంటే.. ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం. కలిగే పర్యావరణ ప్రభావాలు.. ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు. (చదవండి: కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!) -
సూపర్ మార్కెట్ల తిండి...
ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్మయం.. మనం తీసుకొనే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే రెడీమేడ్ ఆహారంతోపాటు ఫాస్ట్ఫుడ్ను ప్రయోగశాలలో క్షుణ్నంగా పరీక్షించింది. ఆహార తయారీ సమయంలోనే అందులో ప్లాస్టిక్ కలుస్తున్నట్లు గుర్తించింది... ► ఫాస్ట్ఫుడ్స్తోపాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫ్తాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్ను ఉపయోగిస్తుంటారు. పోలార్ సెల్ట్జెర్ కంపెనీ తయారు చేసిన రాస్బెర్రీ లైమ్ అనే పండ్ల రసంలో ప్లాస్టిక్ లేదని తేలింది. ► తాము పరీక్షించిన వాటిలో 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్–ఏ(బీపీఏ) అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలిందని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రకటించింది. కానీ, 2009 నాటితో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఈ కెమికల్ పరిమాణం తక్కువే ఉన్నట్లు వెల్లడించింది. ► ఆహారంలో ఫ్తాలేట్స్ స్థాయి ఎంతవరకు ఉంటే క్షేమం అనేదానిపై సైంటిస్టులు ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. అవి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. ► ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి. ► ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ► చీరియోస్, గెర్బర్ బేబీ ఫుడ్, యోప్లాయిట్ యోగర్ట్తోపాటు వెండీస్, బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల బర్గర్లు, చికెన్ నగ్గెట్స్, ఫ్రైలలో ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ► ఆహారంలో ప్లాస్టిక్ల నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని, నిబంధనలను కఠినతరం చేయాలని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రతినిధి జేమ్స్ రోజర్స్ సూచించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాస్టిక్పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్!
పెళ్లి అనగానే డిస్పోజబుల్ ప్లాస్టిక్ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్లు ‘బర్తన్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది. ఇండోర్లో మునిసిపల్ అధికారులు రెగ్యులర్గా కేటరింగ్ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను, రెస్టరెంట్లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే మొహమాటం లేకుండా ఫైన్ వేస్తారు. ఈ ఫైన్ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్కు క్లీన్ సిటీగా పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్ బ్యాంక్’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్కు పోటెత్తుతున్నారు. ఇదంతా ఎలా మొదలైంది? రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్లోని జున్జును అనే పల్లెకు నీరూ యాదవ్ అనే ఆవిడ సర్పంచ్ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్ బ్యాంక్’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్ ‘బర్తన్ బ్యాంక్’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ‘ప్లాస్టిక్ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్లు తమ గ్రామాల్లో బర్తన్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. . దీదీ బర్తన్బ్యాంక్ చత్తిస్గఢ్లోని సర్గుజా జిల్లా అంబికా పూర్లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్ బ్యాంక్’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు. ఒడిస్సాలో ఒడిస్సాలో బర్తన్ బ్యాంక్ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్ అనే పంచాయితీ సర్పంచ్ అయిన సరోజ్ దేవి అగర్వాల్ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్ బ్యాంక్లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. (చదవండి: ఎవరీ గుర్మిత్ కౌర్!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..? -
మైక్రోప్లాస్టిక్పై ప్రత్యక్ష పరిశోధన
ఏయూ క్యాంపస్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఇప్పటి దాకా కంటికి కనిపించే ప్లాస్టిక్ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్గా మారడమే. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది, జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్ను మానవులు పెద్ద ఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం, యూరోపియన్ కమిషన్ సహాయంతో పరిశోధనలు చేపట్టింది. విస్తృత పరిశోధనకు శిక్షణ ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీ 50మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్త్స్య శాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాముల్ని చేసింది. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ అయితే ఈ శిక్షణను ఏయూ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తోంది. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడుతోంది. మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్ని అధ్యయనం చేశారు. ఐదు మైక్రాన్స్ కంటే తక్కువ మందం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్ గుర్తింపు నాచుపై చేరినప్పుడు చేపలు తినడంతో నాచు, మైక్రోప్లాస్టిక్ వాటి శరీరంలోని లివర్, కిడ్నీ, పేగుల్లో పెద్ద ఎత్తున చేరుతోంది. మూడు అంశాలపై శిక్షణ సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్ ట్రాన్స్ఫామ్ ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపీ (ఎఫ్టీఐఆర్) సహాయంతో మైక్రోప్లాస్టిక్ పరిమాణాన్ని గణిస్తారు. ఇసుకలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను ఇలాగే గణిస్తారు. చేపల్లో గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపడుతున్నారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్టీఐఆర్లో పరీక్షిస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా తింటున్న పండుగప్ప, కవ్వళ్లు చేపలతో ఈ ప్రయోగం చేయగా, లివర్, కిడ్నీల్లో పెద్ద ఎత్తున మైక్రోప్లాస్టిక్ను గుర్తించారు. మంచి ఆలోచన ఎంఎల్ఆర్ విభాగంలో మూడు రోజుల శిక్షణ మంచి ఆలోచన. వర్తమాన సమస్యల్లో ఇది ప్రధానమైన అంశం. మైక్రోప్లాస్టిక్ ప్రమాదం అన్ని జీవులపై ఉంటుంది. సముద్ర జీవుల్లో ఈ అధ్యయనం ఎంతో అభినందనీయం. – డాక్టర్ వి.హేమ శైలజ, ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగం విలువైన సమాచారం మూడు రోజుల శిక్షణలో విలువైన సమాచారం, జ్ఞానం పొందాం. నిపుణుల ప్రసంగాలు, ప్రత్యక్ష శిక్షణ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – డాక్టర్ జి.శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, జీవీపీ కళాశాల కమిషన్ సహకారం మరువలేం యూరోపియన్ కమిషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. సమాజ ఉపయుక్త అంశంలో పరిశోధన చేపట్టాలని యూరోపియన్ యూనియన్ సూచించిన విధంగా పరిశోధనలు చేస్తున్నాం. అదే సమయంలో కొంత మందికి శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతున్నాం. – ఆచార్య పి.జానకీరామ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్కి ప్లాస్టిక్ కారణమా?
ప్లాస్టిక్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయని విన్నాం. కానీ దీని వల్లే పుట్టే పిల్లలకు ఇంత ప్రమాదం అని ఊహించి కూడా ఉండం. మన కంటి పాపల్లాంటి చిన్నారుల జీవితాలను ప్లాస్టిక్ పెనుభూతం చిదిమేసి మన జీవితాలను కల్లోలంగా మార్చేస్తోంది. ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో తెలియకుండానే ఒక భాగమైంది. మన నిర్లక్ష్యమో మరే ఏదైనా కారణమో గానీ జరగకూడని నష్టమే వాటిల్లుతోందని తాజా పరిశోధనల్లోషాకింగ్ విషయాలే వెల్లడయ్యాయి. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్డీ)కి ప్లాస్టిక్ కారకాలే కారణమని యూఎస్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల కాలంలో ఆటిజం, పిల్లల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది కూడా. సమాజంలో ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కారణంగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో తెలిసిందే. తాజా అధ్యయనంలో "బిస్ ఫినాల్ ఏ(బీపీఏ)" అనే ప్లాస్టిక కారణంగానే పిల్లలు ఇలాంటి రుగ్మతలు బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో వినియోగిస్తారు. యూఎస్లోని రోవాన్ విశ్వవిద్యాలయం శాస్రవేత్తలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సముహంపై గ్లుకురోనిడేషన్ అనే ప్రకియను నిర్వహించారు. అంటే..మూత్రం ద్వారా శరీరంలో చెడు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ఈ ప్రకియలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఏఎస్డీ)తో బాధపడుతున్న చిన్నారుల, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్డీ)తో బాధపడుతున్న పిల్లలు శరీరం నుంచి ప్లాస్టిక్కి సంబంధించిన మరో రూపాంతరం అయినా డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్ను బయటకు పంపించే సామర్థ్యం లేనట్లు గుర్తించారు. ఈ "బిస్ ఫినాల్ ఏ" "ప్లాస్టిక్, డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్(డీఈహెచ్పీ)" ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రుగ్మతతో ఉన్న పిల్లల శరీరాని వాటిని బయటకు పంపించే సామర్థ్యం ఉండదని తేలింది. వారి కణాజాలల్లో ఈ రెండు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండిపోతాయని పేర్కొన్నారు. ఆటిజం పిల్లలు ఈ ప్లాస్టిక్కి సంబంధించిన టాక్సిన్లను కేవలం 11 శాతం, ఏడీహెచ్డీ బాధపడుతున్న చిన్నార్లుల్లో 17 శాతం శరీరం నుంచి బయటకు పంపించగల సామర్థ్యం ఉంటుందని అన్నారు. ఆ ప్లాస్టిక్ సంబంధించిన మిగతా టాక్సిన్లన్నీ వారి శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండిపోవడాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది న్యూరాన్ అభివృద్ధిని పూర్తిగా నష్టపరుస్తోందని అన్నారు. ఈ రెండు డిజార్డ్ర్లు, జన్యుపరమైన పర్యావరణ ప్రభావాల కలయికతోనే వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడించారు. అలా అని న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ ఉన్న ప్రతి బిడ్డ బీపీఏ ప్లాస్టిక్ని తొలగించడంలో సమస్యలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం అని చెప్పారు. దీంతో కొన్ని ఇతర అంశాలు కూడా ముడిపెట్టి ఉంటాయన్నారు. వాస్తవంగా ఇది గర్భాశయంలోంచే చిన్నారుల్లో ఈ న్యూరో డెవలప్మెంట్ సమస్య వస్తుందా లేక జన్మించాక అనేది తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మాత్రం న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్కి ప్లాస్టిక్కి సంబంధించిన పర్యావరణ కాలుష్య కారకాలతో పూర్తిగా సంబంధం ఉందని రుజువైంది. ఆ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్కి ఎంతమేర ప్లాస్టిక్ కారణమనేది అంచనా వేయడం అంత అజీ కాదన్నారు. (చదవండి: షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..) -
ప్లాస్టిక్ ప్రళయం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో రెండు మిలియన్ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పండ్లలోనూ ప్లాస్టిక్ భూతమే మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. తాబేలు పొట్టలోనూ చేరుతోంది గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది. గజరాజుల పాలిట ప్లాస్టిక్ పాశం గతేడాది భారత దేశంలోని పెరియార్ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవుల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తులు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవయవాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులులతో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో సహా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి. భూసారానికి పెనుముప్పు ప్లాస్టిక్లోని మైక్రో ప్లాస్టిక్స్ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవేశించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం, ప్లాస్టిక్ను రీసైక్లింగ్పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్విల్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఎవరు? రూ.1400 కోట్ల ఆఫర్ వద్దని, భారత్కు ఏమి చేశారు?
మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మనకు ఎంతో హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవరాశుల మరణానికి కారణంగా మారుతున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీసైకిల్ చేసేందుకు విరివిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ముందడుగు వేసిన తమిళనాడులోని మదురైలోగల టీసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచమంతటా రోడ్లు వేయాలనే ఆలోచనను అందించారు. ఫలితంగా ఆయన ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందారు. అతని కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను రూపొందించిన ఈ ప్రొఫెసర్ పేరు రాజగోపాలన్ వాసుదేవన్. మధురైలోని టీసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 2002 సంవత్సరంలో త్యాగరాజర్ కళాశాల ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించడంలో వాసుదేవన్ తొలిసారి విజయం సాధించారు. వాసుదేవన్ చేస్తున్న కృషికి గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. దాదాపు పదేళ్ల కృషి అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు తన ప్రాజెక్టు తీసుకెళ్లడంతో ఈ సాంకేతికతకు గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. జయలలిత తన కృషిని మెచ్చుకున్నారని, సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వాసుదేవన్ తెలియజేశారు. వాసుదేవన్ తన ఆలోచనను ప్రపంచంతో పంచుకోవడంతో, దీనిని అతని నుంచి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే ఇందుకు వాసుదేవన్ నిరాకరించారు. తన సాంకేతికతను ఆయన ఉచితంగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మితమయ్యాయి. వాసుదేవన్ తయారు చేసిన ఈప్రాజెక్టు కొనుగోలుకు అమెరికా సుమారు రూ. 1400 కోట్లు ఆఫర్ చేసిందని అంటారు. అయితే అతను ఈ ఆఫర్ను తిరస్కరించారు. తన ఈ ఆవిష్కరణను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించారు. ఫలితంగా దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవం వచ్చింది. వాసుదేవన్ అందించిన సాంకేతికతను నేడు పంచాయతీలు, మునిసిపాలిటీలు సైతం ఉపయోగిస్తున్నాయి. అలాగే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా పెద్ద ఎత్తున వ్యర్థ ప్లాస్టిక్ను ఉపయోగించాలనే మిషన్ను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 26 వేల మందిని అనుసంధానం చేసి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించి, రోడ్డు నిర్మాణంలో వినియోగించేందుకు అనువుగా వ్యర్థ ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు. వివిధ దేశాలకూ వాసుదేవన్ సాంకేతికత భారతదేశంలో ఇప్పటికే దాదాపు 100,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు తయారయ్యాయి. పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే కాదు వాసుదేవన్ అందించిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో బాలి, సెర్బియా, బెకాసి, మకస్సర్ తదితర ప్రదేశాలతో ప్లాస్టిక్-తారు మిశ్రమాలను ఉపయోగించి ప్లాస్టిక్ రోడ్లు నిర్మితమవుతున్నాయి. నెదర్లాండ్స్ ఈశాన్య భాగంలో సైక్లిస్టుల కోసం డచ్ కంపెనీ వెర్కర్ సెల్.. ప్లాస్టిక్ రోడ్లు నిర్మించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీని పరీక్షించేందుకు యునైటెడ్ కింగ్డమ్ 1.6 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజగోపాలన్ వాసుదేవన్ ప్రతిభను ప్రపంచం మెచ్చుకుంటోంది. ఇది కూడా చదవండి: ఈ నగరంలో నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
హైదరాబాద్లో అతిపెద్ద అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ప్రారంభం
దేశంలో మూడో అతిపెద్ద ప్లాస్టిక్ ఎక్స్పో హైప్లెక్స్-2023 హైదరాబాద్లో శుక్రవారం (ఆగస్ట్ 4) ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని హైటెక్స్లో ఈ ప్రదర్శన జరగనుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత హైప్లెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఐప్లెక్స్గా వ్యవహరించేవారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్ర శేఖర్, హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈవో ప్రభుదాస్, గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. షో డైరెక్టరీ, డైలీ షో మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ చట్టం వేగవంతం చేస్తోందన్నారు. దీని కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ విజయవంతమైందని, రెండోది కావాలన్నా భూమి ఇచ్చేందుకు టీఎస్ఐఐసీ సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తాప్మా అధ్యక్షుడు విమలేష్ గుప్తా తెలిపారు. -
ఈ హోటల్లో ఫ్రీగా నచ్చినంత తినొచ్చు.. కానీ ఓ కండిషన్
ఈ హోటల్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వండి.. కడుపు నిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు! అవును మీరు కరెక్ట్గానే చదివారు. తిన్నంత తిని డబ్బులు వద్దు అంటున్నారు అని సంతోషపడిపోకండి! ఎందుకంటే డబ్బులకు బదులు ప్లాస్టిక్ ఇవ్వాలండోయ్. ప్లాస్టిక్పై నిషేధం విధించినప్పటికీ... ప్లాస్టిక్ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు... గుజరాత్లోని జునాఘడ్కు కలెక్టర్గా పనిచేస్తోన్న రచిత్ రాజ్ ‘ప్రకృతి’ పేరిట సరికొత్త కాన్సెప్ట్తో ప్లాస్టిక్ కేఫ్ను గతేడాది జూన్ ముఫ్పైన ప్రారంభించారు. ఈ కేఫ్ను ఓం శాంతి అనే సెల్ఫ్హెల్ప్ గ్రూప్నకు చెందిన రేఖా బెన్ నడిపిస్తోంది. ఇది సోంపు, నిమ్మకాయ షర్బత్, ఇడ్లీ, పోహా, డోక్లా, మేథీ థోక్లా, గుజరాతీ థాళీలను అందిస్తోంది. వీటిలో ద్రవాహారం కావాలంటే అరకేజీ, ఆహార పదార్థాలు కావాలంటే కేజీ ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉన్న కస్టమర్లు ఈ కేఫ్కు ఎగబడి వస్తున్నారు. తరచు వచ్చే కస్టమర్లతో పాటు, పబ్లిక్ హాలిడేస్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కేఫ్ లోనేగాక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లలో సైతం కేఫ్ ఆర్డర్లు అందిస్తోంది. ప్లాస్టిక్ మనీతో... ప్లాస్టిక్ను ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ... ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడం లేదు. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రచిత్ రాజ్ టీమ్ ప్లాస్టిక్ మనీ కేఫ్ను ప్రారంభించింది. ప్లాస్టిక్ వాడకంపై ఆసక్తి తగ్గించి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడం, రసాయన ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్నే ప్రజలకు అందించడం , సెల్ఫ్హెల్ప్ గ్రూపు మహిళలతో వీటిని నిర్వహించడమే లక్ష్యంతో ప్లాస్టిక్మనీతో ఈ కేఫ్ను నడిపిస్తున్నారు. ఆదాయం... ఆరోగ్యం.... డబ్బులకు బదులుగా తీసుకునే ప్లాస్టిక్ను రీసైక్లింగ్కు పంపించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. సహజసిద్ధ ఎరువులతో పండించిన ఆహారం అందించి ఆరోగ్యం కాపాడుతూ, రసాయనాలు లేని పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూపుల ద్వారా ఈ కేఫ్లను నడిపించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్లో ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వడ్డిస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంతో పాటు, అటు పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు. ఇలాంటి కేఫ్లు మరిన్ని ఏర్పాటైతే ప్లాస్టిక్ భూతాన్ని సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు ఈ కేఫ్ను ప్రశంసిస్తున్నవారు. -
ఈ తల్లులు ప్రకృతే మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునేలా జరగాలి పెళ్లంటే మరి!’ అంట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటితరం పెళ్లిళ్లు. ఏమాత్రం పర్యావరణ స్పృహలేకుండా హంగు, ఆర్భాటాలు చేస్త తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో కూడా పట్టడం లేదు. ఒకతల్లి మనసు మరో తల్లికే తెలుస్తుందేవె! అందుకే బెంగళూరుకు చెందిన ఇద్దరమ్మలు కలిసి తమ పిల్లల పెళ్లిని ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఎంతో ఘనంగా, ప్రకృతి మురిసేలా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగుళూరుకు చెందిన అనుపమ కువరుడికి, చారులత కూతురుతో వివాహం నిశ్చయమైంది. రెండు కుటుంబాలకు అన్ని విషయాల్లో సఖ్యత కుదిరింది. కానీ ‘పెళ్లిలో ప్లాస్టిక్ను అస్సలు వాడకడదు’ అని అనుపమ కండిషన్ పెట్టింది. ఇది చారులతకు నచ్చడంతో మరింత సంతోషంతో ఒప్పుకుని ‘‘ఇద్దరం కలిసి ప్లాస్టిక్ రహిత పెళ్లి చేద్దాం వదినా!’’ అని ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల పెళ్లిని మూడురోజులపాటు అంగరంగా వైభవంగా ప్లాస్టిక్ లేకుండా జరిపేందుకు నామమాత్రపు పెళ్లిపత్రికలను కొట్టించారు. కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మిగతా వారిని నేరుగా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచేటప్పుడే.. ‘‘ఎవరూ బొకేలు, బహుమతులు వంటివి తీసుకు రావద్దు’’ అని మనవి చేశారు. అరిటాకులు.. స్టీల్ ప్లేట్లు... వచ్చిన వెయ్యిమంది అతిథులకు వడ్డించేందుకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్స్ను ఎంచుకున్నారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ స్థానంలో స్టీల్ సామాన్లు వాడారు. తాజా పువ్వులు, లైట్లతో పెళ్లిమండపాన్ని అలంకరించారు. పంతొమ్మిదేళ్లనాటి పేపర్తో... అనుపమ కొడుకుకు 2004లో ఉపనయనం జరిగిన సందర్భంగా జరిపిన వేడుకలో బటర్పేపర్ను వాడారు. అప్పుడు మిగిలిన పేపర్ తో పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్ గిఫ్ట్స్ ఇచ్చారు. సహజసిద్ధ పద్ధతుల్లో రంగులద్దిన జాకెట్ ముక్కలు, కాగితం పొట్లాల్లో పసుపు, కుంకుమను పేరంటాళ్లకు పంచారు. స్టీల్ ప్లేటులు, గ్లాసులతో పెళ్లిలో డెకరేషన్ల కోసం వాడిన తాజా పువ్వులను వేడుక ముగిసిన తరువాత ముంబైలోని సహజ రంగుల తయారీ స్టూడియోకి పంపించారు. వెయ్యికేజీల వేస్ట్ నుంచి ... ప్లాస్టిక్ వాడకపోయినప్పటికీ, కొన్ని సహజసిద్ధ వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటికోసం క్యాటరింగ్ సిబ్బంది తడి, పొడి చెత్తను విడివిడిగా డ్రమ్స్లో వేసేవాళ్లు. ఈ వ్యర్థాలను కోకోపీట్ నింపిన డ్రమ్స్లో వేసేది. కాగితాలను, పువ్వులను కలెక్షన్ సెంటర్కు పంపించారు. డ్రమ్లలో వేసిన వెయ్యికేజీల వ్యర్థాల నుంచి మూడు వందల కేజీల సేంద్రియ ఎరువును తయారు చేశారు. ‘‘పెళ్లిలో ప్లాస్టిక్ వాడకుండా చేయడం మాకు చాలెంజింగ్గా అనిపించినప్పటికీ ఇద్దరం కలిసి విజయవంతం చేశాం. మా అమ్మ, అమ్మమ్మల కాలంలో పెళ్లిళ్లకు ఇలానే స్టీల్ సామాన్లు వాడేవారు. మేము అలాగే మా పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం. అందుకు అందర సహకరించడం సంతోషం’’ అని అనుపమ, చారులతలు చెప్పకొచ్చారు. (చదవండి: గూగుల్ మ్యాప్లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!
సోషల్ మీడియాలో లెక్కుమించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని వింతైనవి, మరికొన్ని అమూల్యమైనవి కూడా ఉంటాయి. అయితే గతంలో ఎవరూ కూడా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసినవారంతా కాకి ఇలాంటి పనిచేయడమేమిటంటూ, తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ వీడియో ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. అలాగే ఈ వీడియోను చూసిన వారంతా ఇకపై తాము కూడా బాధ్యతగా మెలుగుతామని కూడా చెప్పడం విశేషం. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ 20 సెకెన్ల వీడియోలో ఒక కాకి తన ముక్కుతో ఒక ప్లాసిట్ బాటిల్ పట్టుకుని, ఇటునటు ఎగరడం కనిపిస్తుంది. తరువాత దానికి ఒక డస్ట్బిన్ కనిపించగానే దానిపై కూర్చుని, పలు ప్రయత్నాల అనంతరం ఆ బాటిల్ను ఆ డస్ట్బిన్ రంధ్రంలో నుంచి లోనికి పడవేస్తుంది. ఈ కాకి చేసిన పని చూసినవారంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ విధమైన కాకిని ఎక్కడా చూడలేదని అంటున్నారు. అంత్యంత వేగంగా వైరల్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులు చేయాల్సిన పనిని ఒక పక్షిచేయడాన్ని చూసి మనమంతా సిగ్గుపడాలని అన్నారు. మరో యూజర్ పక్షులను చూసి మనం మరో గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! Be like this raven😊 pic.twitter.com/fyMhMqBWQJ — Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023 -
నాణ్యమైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి
ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు. ‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. రీసైకిల్ కీలకం.. ‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు.