Parvathipuram manyam District Latest News
-
ఆడాళ్లా మజాకా..!
వీరఘట్టం: మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో ప్రారంభించిన వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ప్రగతి పథంలో నడుస్తోంది. జిల్లాలోని వీరఘట్టం మండల కేంద్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మార్ట్లో మార్కెట్ ధరల కంటే తక్కువకే నాణ్యమైన సరుకులను ప్రజలకు విక్రయిస్తుండడంతో ప్రారంభించిన మూడు నెలల్లోనే రూ.60 లక్షల వ్యాపారం జరిగింది. ఈ లెక్కన చూస్తే లాభాలు బాగా వచ్చే అవకాశం ఉందని మార్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. వీరఘట్టం పట్టణంలో తొలి మహిళా మార్ట్ను డ్వాక్రా సంఘాల సౌజన్యంతో ఈ ఏడాది జనవరి 12న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్ ప్రారంభించి ఆయనే మొదట కొనుగోలు చేశారు. ప్రారంభించిన రోజున కలెక్టర్ నిషాంత్కుమార్ ఆకాంక్షించిన విధంగానే ఈ మార్ట్ వ్యాపారాభివృద్ధి చెందింది. మార్ట్ ఏర్పాటు ఇలా.. వీరఘట్టం మండలంలోని 1600 మహిళా సంఘాల్లో ఉన్న 15 వేల మంది సభ్యులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున పెట్టుబడితో రూ.30 లక్షలు పోగు చేశారు. ఈ డబ్బుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు మరి కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో సరుకులను మార్కెటింగ్ చేశారు. మరి కొన్ని సరుకులను హోల్సేల్ షాపుల్లో ఖరీదు చేశారు. ఇలా వివిధ రకాలుగా ఖరీదు చేసిన సరుకులను వీరఘట్టం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మార్ట్ ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో అటు డ్వాకా సంఘాల సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్లో సరుకులు కొనుగోలు చేస్తుండడంతో మార్ట్లో వ్యాపారం జోరందుకుంది. 60 శాతం లాభాలు పెట్టుబడి పెట్టిన మహిళలకే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన మహిళలకు 60 శాతం లాభాలను ఇవ్వనున్నారు. అలాగే 40 శాతం లాభాలను వ్యాపారాభివృద్ధికి పెట్టుబడి పెడతారు. ఈ వ్యాపారంలో కేవలం రూ.200 పెట్టుబడి పెట్టిన 15 వేల మంది మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. మరి కొద్దిరోజుల్లో వ్యాపారంలో వచ్చిన లాభాలను ఆయా సంఘాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. వీరఘట్టంలో పాటు గరుగుబిల్లి, సీతంపేట,జియ్యమ్మవలస,వంగర మండలాల ప్రజలు నిత్యం వస్తూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపూ ఈ మహిళా మార్ట్పైనే పడింది. ప్రగతిపథంలో దూసుకుపోతున్న మహిళా మార్ట్ ప్రారంభించిన మూడు నెలల్లో రూ.60 లక్షల వ్యాపారంరోజుకు రూ.60 వేల వ్యాపారం మాకు తెలియని వ్యాపారం ఇది. అయినా సరే ప్రభుత్వం చొరవతో మార్ట్ ఏర్పాటు చేశాం. సరుకుల ధరలు ఎంతో తెలిసేవి కాదు.మహిళా సంఘాల సభ్యులందరి సహకారంతో సరుకులు విక్రయిస్తున్నాం.బయట నుంచి తెచ్చిన పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేస్తున్నాం. షాపును అందంగా తీర్చిదిద్దడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బాగా వస్తున్నారు.ప్రస్తుతం రోజుకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. దాసరి పుణ్యవతి, అధ్యక్షురాలు, వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్, వీరఘట్టం మూడు నెలల్లో రూ.60 లక్షల వ్యాపారం.. 15 మంది మహిళా కమిటీ సభ్యులతో వీరఘట్టంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ మూడు నెలల్లోనే రూ.60 లక్షల వ్యాపారం చేయడంపై అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎటువంటి వ్యాపార అనుభవం లేని వీరు ఇంత పెద్ద బాధ్యతను ఎలా చేపట్టగలరని తొలుత సందేహాలు వ్యక్తం చేసిన వారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. జిల్లాలో మరికొన్ని మార్ట్ల ఏర్పాటుకు వీరఘట్టం మార్ట్ రోల్మోడల్గా మారిందని ప్రశంసిస్తున్నారు. -
సారాతో వ్యక్తి అరెస్టు
సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్ పట్నాయక్, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిపై కత్తితో దాడి వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులైన్స్లో నడపబడుతున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్, ఫిజిక్స్ బయాలజీతో పాటూ ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెజ్యూమ్ తీసుకుని ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో డీఎడ్ హాల్టికెట్లువిజయనగరం అర్బన్: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్ మూడవ సెమిస్టర్ (2022–24 బ్యాచ్ మరియు ఒన్స్ ఫైల్డ్), మొదటి సెమిస్టర్ (2023–25 బ్యాచ్ మరియు ఒన్స ఫైల్డ్) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు వెబ్సైట్లో పొందుపరచామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాలికపై లైంగిక దాడి డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని బాలుడి మృతిరాజాం సిటీ : రాజాం పట్టణం చీపురుపల్లి రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లచ్చయ్యపేటకు చెందిన గొండేటి భరద్వాజ్(10) అనే బాలుడు మృతి చెందాడు. రాజాం వైపు వస్తున్న ఓ వాహనం టిఫిన్ నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన బాలుడిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ప్రైవేట్ వాహనంలో రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సను అందిస్తుండగానే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు సంతు, వెంకటేష్లు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజాం సీఐ మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
No Headline
కొత్తవలస: తిమ్మిని బమ్మిని చేయడం.. బమ్మిని తిమ్మిని చేయడం వంటి కనికట్టు విద్యల్లో తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకి మించిన వారు ప్రపంచంలోనే ఉండరు. అధికార దర్పణంతో ప్రజాధనాన్ని లూటీ చేయడం.. తమ సామాజిక వర్గానికి మేలు చేయడంలో ఆయన మించిన వారు మరొకరు లేరు. వాస్తవాలను మరుగున పెట్టి మోసం చేయడంలో ఆయన దిట్ట. ఇదే తరహాలో ఎస్.కోట నియోజకవర్గ ప్రజలను నిలువునా ముంచేశారు. కొత్తవలస ప్రాంతంలో గిరిజన వర్సిటీ పేరుతో చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున భూ వ్యాపారాలు చేపట్టారు. తమదైన శైలిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపారు. ఈ ప్రాంతీయుల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. కారుచౌకగా ఉన్న స్థలాలను అధిక ధరలకు విక్రయించి మోసం చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాకతో వాస్తవాలు వెలుగులోకి... 2019లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజన వర్సిటీ నిర్మాణ విషయంలో కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక బహిర్గతమైంది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పును గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు గిరిజన వర్సిటీని గిరిజన ప్రాంతంలో నిర్మాణానికి చర్యలు చేపట్టింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా అచ్చ మైన రిజర్వ్డ్ పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రాంతమైన సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు 561.88 ఎకరాలను సేకరించింది. గిరిజన వర్సిటీకి 2023 ఆగస్టు 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంప్రధాన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థుల చదువుల ఆశయం నెరవేర్చేలా వర్సిటీ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. తొలుత రూ.60కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు. ఇంకా ముంచేసేందుకు... చంద్రబాబు అండ్ కో చేసిన రియల్ ఎస్టేట్ మోసం అందరికీ తెలిసిపోవడంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్థికంగా నష్టపోయిన వందలాది మంది టీడీపీ నాయకులను ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. దీంతో ఇటీవల ఎస్.కోట పర్యటనలో భాగంగా ఎల్.కోట మండలం సోంపురం కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన వర్సిటీని మళ్లీ కొత్తవలస తీసుకొస్తామంటూ నారా లోకేశ్ సత్యదూరపు ప్రకటన చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వంతపాడారు. అంటే... రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ స్థాయిలో జరిపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొనుగోలు చేసేవారు ఉంటే ముంచేసేందుకు లోకేశ్తో పాటు లలితకుమారి సిద్ధంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లోనే కేంద్రం మంజూరు చేసినా తూతూ మంత్రంగా పనులు సొంత సామాజిక వర్గ రియల్ ఎస్టేట్ కోసం వర్సిటీ ఆశయానికి గండి గిరిజన ప్రాంతానికి చేరువగా ఉండాల్సిన ప్రాంగణాన్ని విశాఖకు చేరువలో ఏర్పాటు రూ.5 కోట్ల ఖర్చుతో ప్రహరీ పనులు బినామీలకు అప్పగింత అమరావతి తరహాలో భూ పందేరం వర్సిటీ పేరుతో సొమ్ముచేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వర్సిటీ ఆశయానికి అనుగుణంగా చర్యలు సాలూరు నియోజకవర్గంలో 561.88 ఎకరాల భూమి సేకరణ రైతులకు పరిహారం చెల్లించిన తర్వాత ముఖ్యంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన రూ.60కోట్లతో మౌలిక వసతులు -
వాస్తవం ఇది..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్డ్ అసంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు. -
అప్పుల భయంతో వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: అప్పులు తీర్చలేనన్న భయంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన ఉయ్యాల నూకందొర అలియాస్ ఆది (45) విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు ఇంట్లో భార్యకు తెలియకుండా రూ.50వేల వరకు అప్పులు చేశాడు. ఈ మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై బుధవారం ఉదయం అరటి తోట వద్ద పురుగుల మందు తాగి వాంతులు చేసుకొంటూ ఇంటికి చేరుకున్నాడు. భార్య పద్మ చూసి ఏమైందని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో కుటుంబీకుల సహాయంతో 108 ద్వారా స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి తల్లి అప్పలనర్సమ్మ, భార్య పద్మ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకుంటున్న అపర సంజీవని
విజయనగరం ఫోర్ట్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటినొప్పులు వచ్చే సమయంలో ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లే గర్బిణులు, ఊపిరి ఆడక ఇబ్బంది పడే రోగులు, పాము కాటుకు గురైన బాధితులు, గుండె పోటు, పక్షవాతం వచ్చిన వారు, తీవ్రమైన కడుపు నొప్పి ఇలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చి 108 అంబులెన్సు పునర్జన్మ ప్రసాదిస్తోంది. గడిచిన ఐదేళ్లలో లక్షలాది మందికి 108 అంబులెన్సుల ద్వారా సిబ్బంది సేవలు అందించారు. శిథిలావస్థకు చేరిన 108 అంబులెన్సులను 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మార్చేసి అత్యాధునిక వసతులతో కూడిన కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచింది. అంతేకాకుండా నవజాత శిశువుల కోసం నియోనేటల్ ప్రత్యేక అంబులెన్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపద జరిగిందని ఫోన్ వచ్చిన క్షణాల్లో సంఘటన స్థలానికి కుయ్కుయ్ మంటూ 108 అంబులెన్సు వాలిపోయి బాధితులను అస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతోంది. కొత్త వాహనాలను జిల్లాలో 2020 లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 2,17,460 మందికి సేవలు అందించారు. ఏడాదికి 50 వేల నుంచి 80 వేల మంది 108 అంబులెన్సుల సేవలు పొందుతున్నారు. లక్షలాది మందికి సేవలందిస్తున్న 108 వాహనాలు -
నేత్రదానంతో పునర్జన్మ
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి అమ్మవారి కాలనీకి చెందిన పెంకి వరహాలమ్మ (80)నేత్రదానంతో పునర్జన్మ పొందింది. బుధవారం ఆమె మృతి చెందడంతో కుమారులు పెంకి గౌరీశ్వరరావు, వెంకటరావు, మనుమడు పెంకి చైతన్యకుమార్లు ఆమె నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో శ్రీకాకుళం రెడ్క్రాస్కు సమాచారం అందించారు. వరహాలమ్మ నుంచి సేకరించిన కార్నియాను విశాఖపట్నం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందించనున్నామని మగటపల్లి శ్రీధర్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన టెక్నీషియన్ కల్యాణి తెలిపారు. నేత్రదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను రాజాం రెడ్క్రాస్ చైర్మన్ కొత్తా సాయిప్రశాంత్కుమార్తో పాటు పట్టణవాసులు అభినందించారు. నగదు స్వాధీనం పాలకొండ రూరల్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండలంలోని చిన మంగళాపురం కూడలి(విశాఖ రహదారి)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టు వద్ద ఎన్నికల నిర్వహణ ఫ్లయింగ్ స్క్వాడ్ బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం నుంచి వస్తున్న స్వస్తిక్ ఎంటర్ప్రైజస్ ఏజెంటు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.2లక్షల 50వేలను స్వాధీనపర్చుకున్నారు. సదరు నగదుకు సంబంఽధించి సరైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచిస్తూ అఽధికారులు రసీదును అందించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రాజాం సిటీ: పట్టణ పరిధి జీఎంఆర్ ఐటీ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాలకొండ వైపు నుంచి రాజాం వస్తున్న ద్విచక్ర వాహనం, రాజాం నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న పాలకొండకు చెందిన బంకి సంపత్కు కాలి మడమకు తీవ్ర గాయాలు కాగా, వెనుక ఉన్న సంతకవిటి మండలం చిన్నయ్యపేటకు చెందిన చిత్తిరి ఈశ్వరరావు కుడికాలు విరిగిపోయింది. వీరిని స్థానికులు 108 ద్వారా జీఎంఆర్ కేర్కు తరలించి చికిత్సనందించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సంతకవిటి ఎస్ఐ శంకర్ తెలిపారు. అన్వేషిక సైన్స్ సెంటర్ ప్రారంభంవిజయనగరం అర్బన్: భౌతిక శాస్త్రంలోని ప్రయోగాలను సులభంగా అర్ధం కావడానికి అవసరమైన అన్వేషిక సైన్స్ సెంటర్ను స్థానిక కామాక్షినగర్లో కాన్పూర్ నుంచి వర్చువల్ ద్వారా పద్మశ్రీ ప్రొఫెసర్ హెచ్సీవర్మ బుధవారం ప్రారంభించారు. నేషనల్ అన్వేషిక నెట్వర్క్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డేను పురస్కరించుకొని నూతనంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ జోగా చంద్రశేఖరరావు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్వేషిక సెంటర్లతో అనుసంధానం చేసి విదార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభిరుచిని, ఆసక్తి, పెంపొందించడానికి ఈ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని కఠినతర అంశాలను సులుభతరంగా ప్రయోగాత్మకంగా చెప్పి నేర్పించడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. అన్వేషిక సెంటర్ ప్రయోజనాలను సంబంధిత ఫిజిక్స్ లెక్చరర్స్ విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఖాళీ సమయంలో సెలవు సమయాల్లోనూ అన్వేషిక సెంటర్ తెరచి ఉంటుందన్నారు. నిత్య జీవితంలో జరిగే ఉదాహరణలు తీసుకుని భౌతిక శాస్త్రాన్ని బోధించినట్లయితే విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం భౌతిక శాస్త్ర అంశాలకు సంబంధించిన పలు ప్రయోగాలను చేసి చూపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ డీబీ రాధాకృష్ణమూర్తికి ‘అన్వేషిక ఆచార్య అవార్ఢు–2024’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. -
ఇదే..మొదటిసారి..!
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ ఏర్పడి ఐదు దశాబ్దాలైంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించలేదు. తొలిసారిగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇక్కడి ఐటీడీఏలో జరగనుంది. ఈ ఐటీడీఏ అన్నిరకాల మౌలికవసతులు కలిగి ఉండడం, ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావడంతో సీతంపేట ఐటీడీఏలో నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈనెల 18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీనిలో భాగంగా నామినేషన్ల పర్వం ఐటీడీఏలోనే కొనసాగనుంది. అధికారులు ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల దాఖలు..రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో సహా ఐదుగురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. నామినేషన్ పరిశీలన..అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఒక ప్రతిపాదికుడు, మరో వ్యక్తి (న్యాయవాది కావచ్చు) పరిశీలనకు వెళ్లవచ్చు. దీనికి అభ్యర్థి రాతపూర్వకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలివే..అభ్యర్థి కాని పార్టీ కాని కులమత భాషా విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ప్రసంగించడం చేయరాదు. విధానాలు, కార్యక్రమాలపై ప్రసంగాలు, విమర్శలు ఉండాలి. వ్యక్తిగత జీవితంపై విమర్శలు ఉండకూడదు. కుల, మత ప్రాతిపదికపై ఓటు అడగకూడదు. ప్రార్థనా ప్రదేశాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించకూడదు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, బెదిరించడం నిషేధం. యజమానులు లేకుండా వారి భూమి, బిల్డింగులను ప్రచారానికి ఉపయోగించరాదు. ఇతర పార్టీ ఎన్నికల ప్రచార మీటింగ్లకు ఆటంకం కలిగించరాదు. ప్రచారం నిబంధనలువిద్యాసంస్థలు, వాటి మైదానాలను ప్రచారానికి వాడకూడదు. ప్రైవేట్ భూములు, భవనాల యజమానుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్కు ఇచ్చాకే వాల్పోస్టర్లు అంటించాలి. కరపత్రాలు, పోస్టర్లపై ముద్రణాలయాల పేరు, చిరునామా ముద్రించాలి. ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వవచ్చు. అయితే వాటిని ఎన్నికల ఖర్చులో చూపించాలి. దేవుళ్ల ఫొటోలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లను ప్రచురించరాదు. వాహనాల స్టెఫినీ కవర్లపై కుల, మత సంబంధిత ఫొటోలు, అభ్యర్థి ఫొటోలు ఉండడానికి వీలులేదు. ఎన్ని వాహనాలైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించవచ్చు. అయితే రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకుని ఒరిజనల్ అనుమతి పత్రాన్ని వాహనానికి అంటించాలి. ఇంకొకరు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటారు. తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, పోలింగ్ స్టేషన్లకు 200మీటర్ల మీటర్లలోపు అభ్యర్థుల తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదు. కార్యాలయంపై పార్టీ జెండా, బ్యానర్, పార్టీ చిహ్నాన్ని పెట్టుకోవచ్చు. రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు మైకులు, లౌడ్ స్పీకర్లు వాడకూడదు. రాత్రి 10 గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్లు నిలిపివేయాలి. సీతంపేట ఐటీడీఏలో నామినేషన్ల స్వీకరణ నేడే ఎన్నికల నోటిఫికేషన్ -
నామినేషన్ల ప్రక్రియకు సిద్ధం
● ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ● కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● పార్వతీపురం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిషాంత్ కుమార్ సాక్షి, పార్వతీపురం మన్యం: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుందని, వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్వతీపురం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఆర్వో నిషాంత్కుమార్ తెలిపారు. ఆంధ్రా–ఒడిశా (ఏఓబీ) సరిహద్దు ప్రాంతం కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ సంభవించకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ నిషాంత్కుమార్ ‘సాక్షి’ ముఖాముఖిలో బుధవారం పలు విషయాలను ఆయన వెల్లడించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతోపాటు, అల్లూరి సీతారామరా జు జిల్లాలోని రంపచోడవరం, అరకు, పాడేరుకు సంబంధించి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు పార్వతీపురం కలెక్టరేట్లోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. నేను ఆర్వోగా నూ, సంయుక్త కలెక్టర్ ఏఆర్వోగానూ వ్యవహరిస్తాం. మరో 10 మందితో టీమ్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఎలక్టోరల్స్ అందరికీ ఇచ్చాం. రంపచోడవరంలోని 11 మండలాల కు సంబంధించి పోలింగ్ పూర్తయిన వెంటనే ఈవీఎంలను అక్కడే భద్రపరిచి, కౌంటింగ్ చేపడతాం. పాడేరు, అరకులకు సంబంధించి పాడేరులో లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. 70 శాతం వరకు నెట్ సిగ్నల్ సమస్య ఉంటుంది. దీనికితో డు సరిహద్దు, మావోయిస్టు ప్రభావ ప్రాంతాలు కావడంతో అదనపు భద్రతను కోరుతున్నాం. అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలు కలిపి 20 వరకూ సీఆర్పీఎఫ్ కంపెనీలు ఉన్నాయి. అక్కడి కలెక్టర్, ఎస్పీలతో ఓసారి సమావేశమై సమన్వయం చేసుకుంటాం. జిల్లాలో నామినేషన్ల సమర్పణ కేంద్రాలు ఎక్కడెక్కడ? అరకు పార్లమెంట్కు సంబంధించి పార్వతీపురం కలెక్టరేట్లోని రెండో అంతస్తు వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి సీతంపేట ఐటీడీఏ, పార్వతీపురం నియో జకవర్గానికి సంబంధించి పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం, సాలూరు నియోజకవర్గం వారైతే సాలూరు తహసీల్దార్ కార్యాలయం, కురుపాం నియోజకవర్గం వారు కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలి. నామినేషన్ వేసేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలి? అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి. పార్లమెంట్ నియోజకవర్గం కోసం ఫారం–2ఎ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఫారం –2బి సమర్పించాలి. పబ్లిక్ సెలవు దినాల్లో మినహా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తాం. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలను అనుమతిస్తాం. అభ్యర్థితో సహా ఐదుగురు వ్యక్తులు లోపలికి రావచ్చు. ర్యాలీగా వచ్చేవారు ముంద స్తు అనుమతి తీసుకోవాలి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు చెప్పగలరా? అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది జనవరి 22వ తేదీన విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం మన్యం జిల్లాలో 7,75,590 మంది ఓటర్లు ఉన్నారు. అల్లూరి సీతా రామరాజు జిల్లా పరిధిలో 7,61,255 మంది ఓట ర్లు ఉన్నారు. మన్యం జిల్లాలో 1031, ఏఎస్ఆర్ జిల్లాలో 1021 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల సన్నద్ధత ఎంతవరకు వచ్చింది? జిల్లాలో 1,031 పోలింగ్ కేంద్రాలున్నాయి. 1,230 మంది పీవోలు, 1,230 మంది ఓపీవోలను నియమించి వారికి ఒక దఫా శిక్షణ పూర్తి చేశాం. ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించి అవసరమైన శిక్షణ ఇచ్చాం. మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. ఈ ప్రకారం ఈవీఎంల ను నియోజకవర్గాలకు తరలించి భద్రపరిచాం. మొత్తం 1,235 బ్యాలెట్లు, 1,235 కంట్రోల్ యూనిట్లు, 1,238 వీవీ ప్యాట్లను తరలించాం. పాలకొండ (ప్రభుత్వ జూనియర్ కళాశాల), కురుపాం(ప్రభుత్వ జూనియర్ కళాశాల), పార్వతీపురం(ప్రభుత్వ కళాశాల), సాలూరు (ప్రభు త్వ కళాశాల)లలోని స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని భద్రపరిచాం. 24 గంటలూ పూర్తి భద్రత ఉంటుంది. సాలూరు నియోజకవర్గం పరిధి మెంటాడలో 50 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ 50 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది అవసరం. పోలింగ్ సిబ్బందిని విజయనగరం జిల్లా అధికారులు చూసుకుంటారు. ఎన్నిక ముగిసిన తర్వాత ఈవీఎంల తరలింపు, లెక్కింపు ప్రక్రియ మన్యం జిల్లాలోనే జరుగుతుంది. మొత్తంగా ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిఘా విభాగాలు ఎలా పని చేస్తున్నాయి? 48 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. ప్రతి మండలానికీ మూడు టీమ్లు 24 గంటలూ పనిచేస్తాయి. సి–విజిల్లో ఇప్పటి వరకు 91 ఫిర్యా దులు రాగా..90 పరిష్కరించాం. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్రూం 24 గంటలూ పనిచేస్తోంది. 1950 నంబరుకు 21 ఫిర్యాదులు, మీడియా నుంచి 39 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 342 ఫిర్యాదులు రాగా.. ఎన్నికల కమిషన్ పోర్టల్లో నమోదైన 171 ఫిర్యాదుల్లో 166 పరిష్కారమయ్యాయి. మరో మూడు విచారణలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 10 వరకు చెక్పోస్టులు పెట్టాం. అక్రమ రవాణాదారుల నుంచి 22,246 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశాం. 28.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు అవకాశం ఉందా? 85 ఏళ్లు పైబడి, 40 శాతం వికలాంగత్వం దాటిన వారికి ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇటువంటి వారు జిల్లాలో 16 వేల వరకూ ఉన్నట్లు గుర్తించాం. దరఖాస్తులు 400 వరకే వచ్చాయి. ఎవరైనా వస్తే అవకాశం కల్పిస్తాం. ఓటర్లకు మీరిచ్చే సందేశం? ఎక్కడైనా పోలింగ్ సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రధానంగా 18–25 ఏళ్ల యువత ఓటింగ్లో పాల్గొనడం లేదు. జీవితంలో గుర్తుండిపోయే ఓటు హక్కును వారు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు ద్వారా మనకు నచ్చిన నాయకుడిని మనమే ఎన్నుకోవచ్చు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి. -
బట్లభద్ర చెరువులో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని బట్లభద్ర చెరువు, పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఈ క్రమంలో పామాయిల్, అరటి పంటలు, వరి చేలలో తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రాత్రివేళ వెంకటరాజపురం, సీమనాయుడువలస, బిత్రపాడు పరిసర ప్రాంతాల్లోని పామాయిల్ తోటలో ఏనుగులు తిష్ఠ వేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వెంకటరాజపురం, బట్లభద్ర, బిత్రపాడు గ్రామాలకు రాత్రి సమయాన వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉన్నందున పంట పొలాలకు వెళ్లే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. 108లో గిరిజన మహిళ ప్రసవంసీతంపేట: మండలంలోని తలైబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఎస్.రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి 108లో ప్రసవించింది. నాలుగవ కాన్పులో పురిటినొప్పులతో ఆమె బాధపడుతుండగా కుటుంబసభ్యులు 108కి సమాచారం అందజేశారు. దీంతో ఈఎంటీ రమేష్, పైలెట్ శంకరరావులు గ్రామానికి వచ్చి ఆస్పత్రికి ఆమెను వాహనంలో తరలిస్తుండగా పురిటినొప్పులు తీవ్రం కావడంతో సపర్యలు చేస్తున్న క్రమంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిలో తల్లీబిడ్డలను 108 సిబ్బంది చేర్పించారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు 108 సిబ్బందిని అభినందించారు. సివిల్స్ విజేతకు ఎమ్మెల్యే అభినందన పార్వతీపురంటౌన్: సివిల్స్లో సత్తాచాటిన దోనక పృథ్వీరాజ్ను ఎమ్మెల్యే అలజంగి జోగారావు బుధవారం తన చాంబర్లో అభినందించారు. ఆలిండియా స్థాయిలో 493 ర్యాంక్ సాధించి ఈ ప్రాంతానికి ఖ్యాతి తీసుకొచ్చారని ప్రశంసించారు. ఉద్యోగ నిర్వహణలో మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్ర మంలో దొనక విజయ్కుమార్ పాల్గొన్నారు. పల్లకి సేవలో ఎమ్మెల్యే జోగారావు పార్వతీపురంటౌన్: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధి కొత్తవలసలో నిర్వహించిన స్వామివారి పల్లకి ఊరేగింపులో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని పల్లకి మోశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశా రు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల ఫ్లాగ్మార్చ్ సాలూరు రూరల్: మండలంలోని మామిడిపల్లి గ్రామంలో రూరల్ ఎస్సై వెంకటరమణ ఆధ్వ ర్యంలో పోలీసులు బుధవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించేవారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
కనుల పండువగా..
రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు..కమనీయ కాంతులతో జానకి మాత..వరమాలలతో కల్యాణ వేదికపైకి అరుదెంచిన సమయాన..కల్యాణ ఘడియలు దగ్గర పడిన వేళ..భక్తజనం కనులారా తిలకించేందుకు తోటపల్లి చేరుకున్నారు. కల్యాణ క్రతువును ఆద్యంతం తిలకించిన భక్తజనం అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జానకి మెడలో తాళిబొట్టు కడుతున్న సుందర ఘట్టాన్ని వీక్షించి తమ జన్మ ధన్యమైందని ఆనంద బాష్పాలు రాల్చారు. ఆదిదంపతుల అద్భుతమైన వివాహ ఘట్టాన్ని మదినిండా ప్రోది చేసుకుని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తి తన్మయత్వంలో మునకలేశారు.● సీతారాముల పెళ్లి వేడుక ●తోటపల్లికి తరలివచ్చిన భక్తజనం -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
పార్వతీపురం: అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేసి సిద్ధగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నిషాంత్కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గల సహాయ రిటర్నింగ్ అధికారులు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంత్కుమార్ మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దులవద్ద గట్టి నిఘా ఏర్పాటుచేయాలని, చెక్పోస్టులు నిరంతరం పనిచేయాలని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ బృందాలు పటిష్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంఽధించి ఎలాంటి లోపాలు జరగకుండా ప్రశాంతంగా, సజావుగా జరగాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అనుమతులకు సువిధ పోర్టల్లో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఒక నోడల్ అధికారిని నియమించామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల అధికారి విజయసునీత మాట్లాడుతూ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రంపచోడవరం గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అరకు, పాడేరు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి పాడేరులో లెక్కింపు జరుగుతుందని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఎస్డీసీ ఆర్వీ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఆర్ఓ నిషాంత్కుమార్ -
No Headline
గరుగుబిల్లి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం శ్రీ సీతారామస్వామివారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడికి శ్రీరామ సుప్రభాతసేవ, ఆరాధన, మంగళాశాసనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, మత్సంగ్రహణం, అంకురారోపణం తదితర పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీసీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకుడు వీవీ.అప్పలాచార్యులు సీతారామస్వామి కల్యాణం జరిపించారు. స్వామివారి కల్యాణంలో పరిసరగ్రామాలకు చెందిన పలువురు దంపతులు పాల్గొన్నారు. పూజాసామగ్రి, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులు, అర్చకులకు దీక్షావస్త్రాలను పలువురు దాతలు సమకుర్చారు. భక్తులకు పానకం, వడపప్పు, పులిహోరను వితరణ చేశారు. అనంతరం కల్యాణ వేడుకకు హాజరైన భక్తులకు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కల్యాణంలో పాల్గొన్న దంపతులకు ప్రసాదాలు, శేషవస్త్రాలను ఆలయ సిబ్బంది అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ వీవీ.సూర్యనారాయణ, ఆలయ చైర్మన్ ఎం.సత్యనారాయణ, కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం సాయంత్రం శ్రీస్వామివారి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
జగదానందకారకా..
నెల్లిమర్ల రూరల్: జై శ్రీరామ్ నామంతో రామతీర్థం పులకించింది. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణ నడుమ సీతారామచంద్రస్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు దశరథ పుత్రుడు శ్రీరామచంద్రస్వామి వారి పెళ్లి తంతు కొనసాగింది. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారు సీతమ్మతల్లి మెడలో మాంగళ్యధారణ చేశారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజనులు మహాఘట్టాన్ని చూసి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 3 గంటలకు ఆరాధన, బాలభోగం, సేవాకాలం కార్యక్రమాలను నిర్వహించారు. 6 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి చేపట్టారు. తరువాత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాల నడుమ కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. సిరి కల్యాణపు బొట్టును పెట్టి... కల్యాణ మండపం మధ్య భాగంలో అమ్మవారిని, స్వామివారిని ఆశీనులను చేశారు. శ్రీరామచంద్ర ప్రభువుకు ఏకాంతంగా అవతార సర్గ విన్నపం నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు అత్యంత వైభవంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఫల రసాలు, సముద్ర నదీ జలాలతో అభిషేకం చేశారు. అర్చకస్వాములు ప్రతీ తంతుకు వేద మంత్రాన్ని పఠిస్తూ కల్యాణ ఘట్టాన్ని కొనసాగించారు. కల్యాణ తంతులో భాగంగా స్వామివారికి ‘కన్యావరణ’ ‘యజ్ఞోపవీతధారణ’ జరిపించారు. వధూవరుల వంశ గోత్ర నామాలను ప్రవచించారు. ఆశీర్వచనం, పాదప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి వరపూజ చేశారు. అనంతరం స్వామివార్లకు నూతన వస్త్రాలంకరణ చేశారు. జీలకర్ర–బెల్లం వేద పండితులు వేద మంత్రోచ్ఛరణ చేస్తూ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వార్ల శిరస్సుపై ఉంచారు. అనంతరం అర్చకస్వాములు మంత్రాలను జపిస్తూ శాస్త్రోక్తంగా సాక్షాత్తు సీతమ్మ తల్లి మంగళసూత్రాలను భక్త జనులకు చూపించి మాంగళ్యధారణ గావించారు. కల్యాణం జరుగుతున్నంత సేపు నంద్యాలకు చెందిన వ్యాఖ్యాతకర్త సుదర్శన జీవీ హాయ గ్రీవాచార్యులు స్వామివారి కల్యాణ గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. ఆణిముత్యములే తలంబ్రాలుగా... కల్యాణ ఘట్టం అనంతరం ప్రధాన ఘట్టమైన తలంబ్రాల వేడుక కనులపండువగా సాగింది. గోటితో ఒలిచిన పవిత్ర తలంబ్రాల్లో మంచిముత్యాలు కలిపి సీతారాముల శిరస్సుపై నుంచి వేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణ నడుమ తలంబ్రాల సేవను జరిపించారు. కల్యాణ వేడుక జరుగుతున్నంత వరుకు ప్రాంగణమంతా రామనామస్మరణతో మార్మోగింది. కల్యాణం అనంతరం స్వామివారి తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను తీసుకొని భక్తులు తిరిగి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. పట్టువస్త్రాలను సమర్పించిన సింహాచలం ఈఓ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచలం దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి నవమి వేడుకులకు హాజరై తిరుపతి, సింహాచలం దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలు, తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. విశాఖ, విజయనగరం జిల్లా న్యాయమూర్తులు గిరిధర్, చక్రవర్తి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, శ్రీరాములనాయుడు దంపతులు, జేసీ కె.కార్తీక్, ఆర్డీఓ సూర్యకళ తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారామ స్వామివారికి ఆనవాయితీగా పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణవేదిక వద్ద వేంచేసి ఉన్న సీతారాములను దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. సతివాడ పీహెచ్సీ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈఓ శ్రీనివాసరావు, శ్రీనివాసనంద సరస్వతి, శ్రవణ చైతన్య చినస్వామీజీ, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సీతారాముల పరిణయం కనులారా వీక్షించి పులకించిన భక్త జనం జై శ్రీరామ్ అంటూ మార్మోగిన రామతీర్థం -
కూటమిని తరిమికొడదాం
వీరఘట్టం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అందనీయకుండా అడ్డుపడుతున్న టీడీపీ కూటమని మే 13న జరగనున్న ఎన్నికల్లో తరిమికొడదామని పాలకొండ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భామిని మండలంలోని లివిరి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి వీరఘట్టం మండలంలోని వండవ గ్రామంలో ఆమె పార్టీ కండువాలు వేసి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. లివిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గౌడు చంటి, బిరాట్, గోపాల్, సంతోష్, కై లాష్, చౌదరి, చిన్ని, బలక,నరేష్, రాము,రమేష్, బుల్లు,కన్నా, మల్లేష్, చక్రపాణి, శ్రీధర్, మిట్టు, సురేంద్ర, నరేంద్ర,ప్రకాశ్ తదితరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎదురుగా నిలబడి ఎదిరించే దమ్ములేని ప్రతిపక్షాలు చివరకు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. అధికార దాహంతో ప్రతిపక్ష నేతలు నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుని పచ్చమీడియాతో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలంతా జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఈనెల 19న సీతంపేటలో నామినేషన్ వేయనున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భామిని మండల వైఎస్సార్సీపీ నాయకుడు గెల్లంకి రమేష్తో పాటు లివిరి గ్రామసర్పంచ్, ఎంపీటీసీ పాల్గొన్నారు. పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి వైఎస్సార్సీపీలో చేరిన 20 టీడీపీ కుటుంబాలు -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన ఐటీడీఏ పీఓ
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్రూమ్ను ఐటీడీఏ పీఓ, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి విష్ణుచరణ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల రికార్డులు తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయ సమీపంలో బారికేడ్లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
చేగొడియాలు చేసేస్తా.. ఓటర్లను మెప్పిస్తా..
రాజాం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ రాజాం మున్సిపాల్టీ పరిధిలోని చెరువుగట్టు వార్డులో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఒక వీధిలోని అగ్నిగంగమ్మ చేగొడియాలు ఫ్యాక్టరీలో మహిళలతో కలసి చేగొడియాలు తయారుచేస్తూ ప్రచారం చేపట్టారు. జగనన్న తోడు, చేదోడు, ఆసరా, చేయూత వంటి పథకాలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆర్థిక భరోసా కల్పించారని, ఫ్యాన్గుర్తుపై ఓటేసి మరోసారి సీఎంను చేయాలని కోరారు. అంబకండి అయ్యప్ప ఆలయంలో పూజలు రేగిడి: మండలంలోని అంబఖండి గ్రామ అయ్యప్పస్వామి ఆలయంలో భక్తులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్పస్వామికి అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు రేజేటి సత్తిబాబుశర్మ, వంశీకృష్ణ శర్మ భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
సై
గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024సార్వత్రిక సమరానికి... పేరు: డాక్టర్ గుమ్మ తనూజారాణి పార్లమెంట్ నియోజకవర్గం : అరకు నామినేషన్ వేసే తేదీ: 24.04.2024 నామినేషన్ వేసే ప్రాంతం: పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం నామినేషన్ వేసే సమయం: ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట మధ్య సమయంలో... పేరు: పీడిక రాజన్నదొర అసెంబ్లీ నియోజకవర్గం : సాలూరు (ఎస్టీ) నామినేషన్ ప్రదేశం: సాలూరు తహసీల్దార్ కార్యాలయం నామినేషన్ తేదీ: 19.04.2024 నామినేషన్ వేసే సమయం: ఉదయం 11గంటల సమయంలో... ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సాలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 19న సాధారణంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. 24వ తేదీ ఉదయం 10.45 నిమిషాలకు పార్టీ నాయకు లు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మ రోసెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పేరు: అలజంగి జోగారావు అసెంబ్లీ నియోజకవర్గం: పార్వతీపురం (ఎస్సీ) నామినేషన్ వేసే తేదీ 24.04.2024 నామినేషన్ వేసే ప్రాంతం: పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయం నామినేషన్ వేసే సమయం:ఉదయం 11గంట ల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో... వైఎస్సార్సీపీ పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థిగా అలజంగి జోగారావు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక సమరానికి తెరలేచింది. గురువా రం విడుదల కానున్న 2024 సాధారణ ఎన్నికల నోటిఫికేషన్తో సమరశంఖం పూరించే సమయం వచ్చేసింది. రాష్ట్రంలో సంక్షేమ పాలన, అభివృద్ధి పథం విజయవంతంగా కొనసాగించాలంటే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్నే మళ్లీ తెచ్చుకోవాలనే సత్సంకల్పంతో ఆ పార్టీ నాయకులంతా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగుతున్నారు. గతంలో సుదీర్ఘకాలం పరిపాలించినా చెప్పుకోవడానికి మంచి పనులేవీ కనిపించక, జెండాలతో జతకట్టినా ఏమి చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పలేక ఎదుటివారిపై దుమ్మెత్తిపోయడమే ఏకై క ఎజెండాగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నుంచి ఆ పార్టీ చిన్నా చితకా నాయకుల వరకూ ఎన్నికల బరిలోకి వస్తున్నారు. మొదటి లిస్టే సూపర్ హిట్ అంటూ నెలరోజుల కిందటే హడావుడి చేసినా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి టికెట్ గ్యారెంటో చెప్పలేని టీడీ పీ నాయకులు... తమకు ఇంకేమి భరోసా ఇస్తారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాబలాన్నే నమ్ముకున్న వైఎస్సార్సీపీ హవా ముందు టీడీపీ నాయకు ల వ్యూహాలు, దుష్టపన్నాగాలు తేలిపోతున్నాయి. ఒక స్పష్టమైన విజన్తో, నిర్దిష్టమైన ప్రణాళికతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 2019లో ప్రకటించిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలుచేసి మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. మరికొద్ది రోజుల్లో మేమంతా సిద్ధం బస్సుయాత్రతో జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానున్న తరుణంలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు సర్వసన్నద్ధమయ్యారు. ఈనెల 25వ తేదీలోగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేయనున్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒకే ఒక్క జాబితాతో టికెట్లన్నీ ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన భరోసాతో సమర శంఖం పూరించుతున్నారు. సమరోత్సాహంతో కార్యస్థలిలో అడుగెడుతున్నారు.న్యూస్రీల్ నేటి నుంచి 25 వరకు నామినేషన్లకు ఏర్పాట్లు నామినేషన్ల దాఖలుకు నాయకుల ఏర్పాట్లు ఒకేదఫాలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఖరారు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసాతో సమరోత్సాహం పేరు: పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీ నియోజకవర్గం: కురుపాం (ఎస్టీ) నామినేషన్ వేసే ప్రదేశం: కురుపాం తహసీల్దార్ కార్యాలయం నామినేషన్ తేదీ: 19.04.2024 నామినేషన్ సమయం:ఉదయం 10 గంటలకు.. ఉదయం 9 గంటలకు జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోనున్న కోటదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కురుపాం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. పేరు: విశ్వాసరాయి కళావతి అసెంబ్లీ నియోజకవర్గం: పాలకొండ (ఎస్టీ) నామినేషన్ వేసే ప్రదేశం: ఐటీడీఏ కార్యాలయం, సీతంపేట నామినేషన్ తేదీ: 19.04.2024 నామినేషన్ సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు.. ఉదయం 9 గంటలకు పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీతంపేట చేరుకుంటారు. అక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పూజల అనంతరం ర్యాలీగా సీతంపేట సంత మార్కెట్ నుంచి ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేయనున్నారు. -
20 ఎకరాల గడ్డివాములు దగ్ధం
రేగిడి: మండలంలోని ఆమదాలవలస గ్రామంలో గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన రుంకు అప్పలనాయుడు, వెంకన్న, వెంకటరమణ, శాసుబిల్లి రాంబాబులు కళ్లాల్లో పశువుల మేత నిమిత్తం ఉంచిన 20 ఎకరాలకు చెందిన గడ్డివాములు సోమవారం రాత్రి కాలిపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటి విలువ రూ.2 లక్షల వరకూ ఉంటుందని రైతులు తెలిపారు. సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపకసిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. రెండు పశువుల శాలలు.. జామి: మండలంలోని అలమండగ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పశువుల పాకలు, ఒక గడ్డివాము దగ్ధమయ్యాయి. అలమండ నుంచి నారాయణపురం వెళ్లే రహాదారిలో ఉన్న యాళ్ల వారి చెరువు కళ్లాల వద్ద పశువుల పాకలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బీల చిన్నప్పలనాయుడు, మిడతాన అప్పలసత్యానికి చెందిన పాకలు, ఒక గడ్డివాము దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.యాభై వేల ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేశారు. ఈ సమాచారం తెలుసుకున్న వైస్ ఎంపీపీ గేదెల వెంకటరావు, సర్పంచ్ కోట పాపమ్మ, ఉపసర్పంచ్ లగుడు దేముడు తదితరులు బాధితులను పరామర్శించారు. జీడి మామిడి తోటల్లో అగ్నిప్రమాదంవేపాడ: మండలంలోని వేపాడ రెవెన్యూలో రాయుడుపేట గ్రామ సమీపంలో ఉన్న జీడి, మామిడి తోటల్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సమచారం తెలుసుకున్న ఎస్.కోట అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. సైబర్ యాక్ట్ కింద కేసు నమోదువిజయనగరం క్రైమ్: మొబైల్లో వచ్చిన మెసేజ్కు స్పందించి లింక్ ఓపెన్ చేసి, ఓటీపీ చెప్పడంతో బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు విత్ డ్రా అయింది. ఈ మేరకు బాధితురాలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వన్టౌన్ సీఐ బి.వెంకటరావు మంగళవారం కేసు నమోదు చేసి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రదీప్నగర్కు చెందిన ఎం.శేషుకుమారి సెల్ఫోన్కు సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మెసెజ్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ పేరుతో వచ్చిన మెసేజ్లో రివార్డ్ పాయింట్స్ పోతాయని, లింక్ ఆధారంగా వాటిని తీసుకోవాలని పేర్కొనడంతో ఆమె లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసింది. ఓటీపీ చెప్పడంతో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.లక్షా 98వేల 645 నగదు మాయమైంది. దీంతో వెంటనే ఆమె వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. 38 మద్యం బాటిల్స్తో వ్యక్తి అరెస్టునెల్లిమర్ల: మండలంలోని సతివాడ గ్రామ శివారులో అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్సై డి రామగణేష్ తెలిపిన వివరాల ప్రకారం 38 మద్యం బాటిల్స్ కలిగిఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నామినేషన్లకు 13 రకాల డాక్యుమెంట్లు తప్పనిసరి : పీఓ సాలూరు: నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు 13 రకాల డాక్యుమెంట్లు తీసుకురావాలని, ఆ డాక్యుమెంట్లన్ని సక్రమంగా ఉంటే నామినేషన్లు అనుమతించడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విష్ణుచరణ్ అన్నారు. ఈ నెల 18 నుండి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ఏర్పాట్లును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. నాటి నుండి ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 26న నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. -
రారండోయ్..!
రాములోరి పెళ్లికినెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి పెళ్లి కళ వచ్చేసింది. శ్రీ సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. రామస్వామి వారి దేవస్థానం సమీపంలోని స్వామివారి కల్యాణ మంటపంలో బుధవారం ఉదయం 10.30గంటల నుంచి 12.30 గంటల వరకు సీతారామస్వామివారి పరిణయం జరగనుంది. కల్యాణం నిర్వహించే వేదికను సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచే ఆలయ ప్రాంగణం కల్యాణ శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 25మంది రుత్విక్కులు నిర్విరామంగా పారాయణాలు నిర్వహించారు. లక్ష తులసీదళార్చన, కుంకుమార్చన పూజలు చేపట్టారు. ● శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సీతారాముల కల్యాణం బుధవారం నిర్వహించ నున్నారు. ఉదయం 10 గంటల నుంచి జరగనున్న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చలువ పందిళ్లతో పాటు దర్శనం కోసం భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రత దష్ట్యా కల్యాణ ప్రాంగణంలో భారీ స్థాయిలో టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు అందించనున్నారు. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వైద్యశిబిరం, భక్తులకు అందించేందుకు తలంబ్రాలను సిద్ధం చేశారు. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే తలంబ్రాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి పట్టువస్త్రాలు ఏటా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలకు తిరుపతి నుంచి పట్టు వస్త్రాలు అందించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. తిరుమల దేవస్థానానికి చెందిన వేదపండితులు బుధవారం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ప్రత్యేక ఆకర్షణగా గోటి తలంబ్రాల సేవ శ్రీరామనవమి వేడుకల్లో స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను వినియోగించనున్నారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలువురు భక్తులు గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర తలంబ్రాలు రామతీర్థం శ్రీరామస్వామివారి దేవస్థానానికి ఇటీవల చేరుకున్నాయి. దేవస్థానానికి చేరుకోవడం ఇలా.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 20కిలోమీటర్లు ప్రయాణం చేసి రామతీర్థం చేరుకోవచ్చు. ఆటోల్లో వచ్చే వారు కోట జంక్షన్ నుంచి నెల్లిమర్లలోని రామతీర్థం జంక్షన్కు చేరుకుని అక్కడి నుంచి 5కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రణస్థలం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి సతివాడ మీదుగా రామతీర్థానికి చేరుకోవాలి. ఏర్పాట్లు పూర్తి చేశాం ప్రభుత్వ లాంఛనాలతో స్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కల్యాణ వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. భక్తుల కోసం 10వేల లీటర్ల మజ్జిగను సిద్ధం చేశాం. తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూల ఏర్పాటు, ఉచిత ప్రసాదాల పంపిణీ తదితర సౌకర్యాలను అందిస్తున్నాం. – వై శ్రీనివాసరావు, ఈఓ, రామదేవస్థానంగట్టి బందోబస్తు ఏర్పాటు శ్రీరామనవమి రోజున రామతీర్థంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అందరి అధికారుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. 150మంది పోలీసులతో పాటు ఒక డీఎస్పీ స్థాయి అధికారి, పది మంది ఎస్సైలు, ఐదుగురు సీఐలు విధులు నిర్వహించనున్నారు. సుమారు 15వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. కల్యాణం సజావుగా సాగేందుకు భక్తులు సహకరించాలి. – రామగణేష్, ఎస్సై, నెల్లిమర్ల నేడే రామతీర్థంలో సీతారాముల కల్యాణం ప్రభుత్వ లాంఛనాలతో వేడుక అందరికీ ఆహ్వానం ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులువరుడు: శ్రీరామయ్య వధువు: సీతమ్మ వేదిక: సీతారామస్వామివారి కల్యాణ మంటపం, రామతీర్థం సమయం: శ్రీ కోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు సుముహూర్తం: 12గంటలకు అభిజిత్ లగ్నం అభ్యర్థన: వేద పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ కనీవిని ఎరుగని రీతిలో జరిగే సీతారామచంద్ర ప్రభువు వివాహాన్ని కనులారా తిలకించి సీతాసమేత రామస్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మనవి. -
సివిల్స్లో విజయకేతనం
అప్పుడు 772.. ఇప్పుడు 590.. ● సివిల్స్ ఫలితాల్లో 493వ ర్యాంకు ● మూడో ప్రయత్నంలోనే సాధించిన దొనక పృథ్వీరాజ్ ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చూపారు. ఐఆర్ఎస్లో శిక్షణలో ఉంటూ ఒకరు.. పట్టువీడని విక్రమార్కుడిలా మూడో ప్రయత్నంలో మరొకరు విజేతలుగా నిలిచారు. యువతకు స్ఫూర్తి మంత్రం వినిపించారు. పార్వతీపురం టౌన్/కురుపాం: పార్వతీపురం యువకుడు.. సివిల్స్లో సత్తా చాటాడు. ఆలిండియా స్థాయిలో 493వ ర్యాంకు సాధించాడు. మూడో ప్రయత్నం.. రెండో ఇంటర్వ్యూలోనే.. ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోకుండానే లక్ష్యాన్ని అందుకోవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో పార్వతీపురం పట్టణంలో నివాసం ఉంటున్న దొనక విజయ్కుమార్, వెంకటరత్నంల కుమారుడు 23 ఏళ్ల దొనక పృథ్వీరాజ్ ఉత్తమ ర్యాంకు సాధించాడు. దీంతో ఆ కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన పృథ్వీ.. లక్ష్యం కోసం రోజుకు 8 గంటలకుపైగా కష్టపడ్డానని చెప్పాడు. అతని మాటల్లోనే... తండ్రిని చూసి స్ఫూర్తి పొందా.. మాది స్వప్రాంతం కురుపాం. చిన్నతనంలోనే పార్వతీపురం వచ్చి స్థిరపడ్డాం. అప్పట్లోనే నాన్న ఎంఈఓగా పని చేశారు. ప్రభుత్వ శాఖల్లో పరిపాలన, ప్రజలకు సేవ చేసే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచి ప్రభుత్వ సర్వీసుల్లోకి రావాలని అనుకున్నా. పదో తరగతి వరకు పార్వతీపురంలో, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో చదివా. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్(ఆర్ట్స్) చదువుతున్నప్పుడే పూర్తిస్థాయిలో సివిల్స్పై దృష్టి సారించా. కోచింగ్ లేదు.. ఇంటి వద్దే కష్టపడ్డా సివిల్స్ లక్ష్య సాధన కోసం ఎక్కడా ప్రత్యేకించి కోచింగ్ తీసుకోలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ను ఆప్షనల్గా తీసుకున్నా. రోజుకు 8 గంటలు ఇంటి వద్దే ఉండి కష్టపడి చదివా. పరీక్షల సమయంలోనే 10–11 గంటల సమయం వెచ్చించా. మూడో ప్రయత్నంలోనే సాధించా. ఇది రెండో ఇంటర్వ్యూ. ఎక్కువగా మెయిన్స్ మీద దృష్టి సారించా. ఈ ఏడాది స్కోరింగ్ రావాలని కష్టపడ్డాను. ప్రజెంటేషన్, ఇతర అంశాలపై దృష్టి సారించి విజయం సాధించాను. సివిల్స్ లక్ష్యంగా చదువుతున్న వారూ ఇదే దృష్టిలో పెట్టుకుంటే మంచిది. త్వరగా గమ్యం చేరుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... నా విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. వారు అడుగడుగునా అండగా నిలిచారు. ప్రస్తుతం నాన్న ఎం.ఆర్.నగరం జెడ్పీహెచ్ఎస్లో హెచ్ఎంగా చేస్తున్నారు. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గంట్యాడ: సివిల్స్లో పెదవేమలి గ్రామానికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్ సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 590 సాధించాడు. గతేడాది ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 772 ర్యాంక్ సాధించి ముస్సోరిలో ఐఆర్ఎస్లో శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది మళ్లీ పరీక్షకు సిద్ధమై మంచి ర్యాంకు సాధించాడు. ఆయన తల్లి పద్మ గృహణికాగా, తండ్రి సత్యం విజయనగరం ఆర్టీసీలో సెక్యూరిటీ సూపర్ వైజర్గా పనిచేస్తున్నారు. చెల్లి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ప్రిపరేషన్లో ఉంది. చాలా ఆనందంగా ఉంది.. మా అబ్బాయికి సివిల్స్ ఫలితాల్లో 590 ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఓబీసీ కోటాలో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి చదవులో ముందుండేవాడు. అందుకు అనుగుణంగా మా అబ్బాయిని ప్రోత్సహిస్తూ వస్తున్నాం. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ర్యాంకు తేచ్చుకోవడం సంతోషంగా ఉంది. – పొటుపురెడ్డి సత్యం, పద్మ (భార్గవ్ తల్లిదండ్రులు) -
స్వామివారి దర్శనం ఇలా..
ఆలయ ఉత్తర రాజగోపురం ద్వారా రూ.50 టికెట్లు తీసుకునే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శన కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ● శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు వివిధ రకాల సదుపాయాలను కల్పించారు. ● పార్కింగ్: ఆలయ ప్రాంగణం వద్ద, కల్యాణ వేదిక ప్రారంభం వద్ద ● తలంబ్రాల కౌంటర్: స్వామివారి కల్యాణ వేదిక వద్ద ఎడమ భాగాన ● ప్రాథమిక చికిత్స కేంద్రం: కల్యాణ వేదిక ప్రాంగణం ● ప్రసాదాల కౌంటర్: తూర్పు రాజగోపురం వద్ద వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జీడి రైతుకు వెన్నుదన్ను
● పంటకు గిట్టుబాటు ధర కల్పన ● విపత్తుల సమయంలో పరిహారం ● జీడి తోటలు సాగుచేసే భూములకు హక్కుల కల్పన ● వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం ● గిరిజన రైతులను ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుమ్మలక్ష్మీపురం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జీడిమామిడి సాగుచేసే రైతుల్లో కొత్త వెలుగు కనిపిస్తోంది. ఊరూరా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి సాగు సూచనలు అందుతున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మొక్కలు ఉచితంగా సరఫరా అవుతున్నాయి. విపత్తుల సమయంలో పరిహారం రైతుల ఖాతాలకే జమవుతోంది. జీడితోటలు సాగుచేసే రైతుల చేతికి శాశ్వత హక్కుపత్రాలు అందాయి. ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందుతోంది. రైతన్నకు అన్నివిధాలా భరోసా దొరికింది. అందుకే జీడిసాగుపై రైతులకు మక్కువ పెరిగింది. గత టీడీపీ ప్రభుత్వ ఏనాడూ జీడితోటలు సాగుచేసే రైతులను ఆదుకోలేదు. తిత్లీ తుఫాన్ సమయంలో అరకొర పరిహారం అందజేసి చేతులు దులుపుకుంది. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక తిత్లీ తుఫాన్ బాధిత రైతులకు పరిహారం అందజేశారు. అందుకే.. ఏ రైతును అడిగినా.. నాడు వైఎస్సార్, నేడు జగన్మోహన్రెడ్డి హయాంలోనే మేలు జరిగిందని చెబుతున్నారు. దీనిని చూసి ఓర్వలేని ఎల్లోమీడియా.. ఎన్నికల వేళ అబద్ధాలను ప్రచారం చేస్తూ గిరిజనుల్లో అపోహలు కల్పించే యత్నం చేస్తోంది. జీడి రైతులను ఆదుకోని టీడీపీ.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని జే.కే పాడు కాలనీ, ఇరిడి గ్రామాల్లో 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఎంపీ ల్యాడ్ నిధులు రూ.6.50 లక్షలు చొప్పున వెచ్చించి జీడి రైతులను ప్రోత్సాహించేందుకు జీడి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పింది. విలువైన యంత్రాలు సమకూర్చడంతో పాటు రైతులకు శిక్షణ సైతం ఇప్పించింది. అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జీడి రైతుల సంక్షేమాన్ని విస్మరించింది. వారిని కష్టాలకు గురిచేసింది. 2015లో జే.కే పాడు కాలనీకి చెందిన కొంత మంది రైతులు వారు పడించిన జీడిపిక్కలను సమకూర్చుకుని జీడి ప్రాసెసింగ్ను చేపట్టారు. కనీస ఆదాయం రాకపోవడం, విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో రావడం, అప్పటి టీడీపీ ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడంతో నిర్వహణ భారంతో యూనిట్ను మూసేయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక జీడిసాగుపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో 14,500 ఎకరాలు, కురుపాంలో 12,500, జియ్యమ్మవలసలో 4వేలు, కొమరాడలో 3,500, సాలూరులో 4వేలు, మక్కువలో 2వేలు, పార్వతీపురం మండలంలో 1500, సీతంపేటలో 7,500, భామినిలో 958, వీరఘట్టాంలో 1286, పాలకొండలో 350 ఎకరాల్లో జీడిపంటను రైతులు సాగు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.. 2015లో మా గ్రామంలోని జీడి ప్రాసెసింగ్ సెంటర్ను ఐటీడీఏ అధికారుల సూచనల మేరకు జీడి రైతులమంతా ఐక్యంగా నిర్వహించేవారం. విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చేవి. అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ రాయితీ కల్పించలేదు. నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. ఎలాంటి ప్రోత్సాహమూ అందించలేదు. దీంతో ప్రాసెసింగ్ యూనిట్ను మూసేయాల్సి వచ్చింది. – బిడ్డిక అగ్గన్న, జీడి ప్రాసెసింగ్ యూనిట్ సభ్యుడు, జె.కె.పాడు గ్రామం -
సైకిల్ మరి తొక్కలేం బాబూ..!
● వైఎస్సార్సీపీలో జోరుగా టీడీపీ కుటుంబాల చేరికకొత్తవలస: సార్వత్రిక ఎన్నికలు ఎన్నికలు సమీపించడంతో వైఎస్సార్ సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ఆయా నియోజక వర్గాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తవలస పట్టణంలోని నాలుగు ఆటోస్టాండ్లకు చెందిన యూనియన్ నాయకుడు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర థియేటర్ యజమాని పాలకుర్తి హరినాథ్ల ఆధ్వర్యంలో 45 మంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో మంగళవారం చేరారు. వారికి కొత్తవలసలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని పార్టీలోకి చేరిన వారంతా ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకాడ రాంబాబు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మోపాడ కుమార్, పార్టీ ఎస్.కోట పట్టణ అధ్యక్షుడు రెహమాన్, పార్టీ నాయుకులు ఎలమంచిలి అప్పారావు, కోసూరు భారతి తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో 35 కుటుంబాలు.. గజపతినగరం: దత్తిరాజేరు మండలంలోని ఎస్.బూర్జివలస గ్రామానికి చెందిన 35కుటుంబాల వారు (ఎస్సీ, యాత) గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కంది తిరుపతి నాయుడు సహాయంతో వైఎస్సార్సీపీ కండువాలు వేసుకుని పార్టీలో మంగళవారం చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకుల్లో బూర్జివలస గ్రామానికి చెందిన కిక్కర భాస్కరరావు, గొబ్బి సత్యం, గొబ్బి తాత, గొబ్బి అప్పన్న, గొబ్బి రామకృష్ణ, మొల్లి నూకరాజు, బోనితిరుపతి రావు, బొబ్బిలి రామకృష్ణ, కొయ్యాన అప్పలస్వామి తదితర 35కుటుంబాల వారున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కె.ఆదినారాయణ, పురిటిపెంట వైస్ సర్పంచ్ మండల సురేష్, కె.రామునాయుడు, లింగాలవలస అప్పలనాయుడు, రేగ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో 25 కుటుంబాలు.. పార్వతీపురంటౌన్: పార్వతీపురం మండలంలోని డోకిశీల పంచాయతీ చెలంవలస గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు టీడీిపీని వీడి ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో మంగళవారం చేరారు. పార్టీలో చేరిన వారిలో బురిడి నాగేశ్వరరావు, వెంపటాపు రామారావు, శంభాన శ్రీనివాసరావు, రెడ్డి సంతోష్, పెద్దింటి తమ్మినాయుడు, మంగళ అప్పన్న, బెవర అప్పారావులతో పాటు వారి కుటుంబాల వారున్నారు. వారందరికీ ఎమ్మెల్యే జోగారావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, పార్టీ నాయకులు బలగ నాగేశ్వరరావు, మజ్జి శేఖర్, సర్పంచ్ శంపంగి జగదీష్, మర్రాపు వాసుదేవరావు, మడక విశ్వనాథం, సచివాలయం కన్వీనర్లు బొమ్మి కోటినాయుడు, నీలాపు గోపాల్, మహాపాత్రో గణేష్, నీలపు బలరాం పాల్గొన్నారు. గుర్లలో ఐదు కుటుంబాలు.. గుర్ల: మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో మంగళవారం చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొట్నూరు సన్యాసినాయుడు ఆహ్వానించారు. శృంగవరపుకోటలో 35 మంది శృంగవరపుకోట: మండల పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ స్వామి నేతృత్వంలో 35మంది పెయింటర్స్ కుటుంబాలు ఎమ్మెల్యే కడుమడి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. అలాగే స్థానిక పందిరప్పన్న జంక్సన్కు చెందిన 25మంది యువకులు పంచాయతీ 7వవార్డు సభ్యుడు గనివాడ శ్రీను నేతృత్వంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే హైమావతి, పార్టీ మండల అధ్యక్షుడు మోపాడ కుమార్, షేక్ రహ్మాన్, వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, ఫోక్ అకాడమీ డైరెక్టర్ వి.రాంబాబు పాల్గొన్నారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
మక్కువ: మండలంలోని కొయ్యానపేట గ్రామంలోని ఉమారామలింగేశ్వరాలయంలో మంగళవారం ఉదయం శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ప్రధాన అర్చకుడు ఉమాస్వామి ఆలయంలో పూజల నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని సూర్యకిరణాలు స్పర్శించాయి. వీటిని చూసిన భక్తులు తన్మయత్వం పొందారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 19న గురుకుల సీట్లకు స్పాట్ అడ్మిషన్లు భామిని: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల19వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని భామిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె.విజయనిర్మల మంగళవారం తెలి పారు. 2024–25 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5వ తరగతి సీట్లను భర్తీచేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి సీట్లు రానివారు శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలని కోరారు. భామిని గురుకులంలో 5వ తరగతిలో 47 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కన్నపుదొరవలసలో ఏనుగులు జియ్యమ్మవలస: మండలంలోని కన్నపుదొరవలస గ్రామ సమీపంలోని అరటి తోటలో ఏనుగుల గుంపు మంగళవారం సంచరించింది. రాత్రి సమయంలో గవరమ్మపేట, సుభద్రమ్మవలస, రామినాయుడువలస తదితర గ్రామాల్లోని పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాములోరి పెళ్లికి.. మండపేట బొండాలు నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్న స్వామి వారి కల్యాణానికి మండపేట బొండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి రామతీర్థం సేవా సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన కొబ్బరి బొండాలను తీసుకువచ్చారు. మండపేటకు చెందిన రామ భక్తుడు అచ్యుతరామరెడ్డి శ్రేష్టమైన బొండాలను సేకరించి వాటికి రంగు రాళ్లు, పూసలు, రిబ్బన్లతో సుందరంగా అలంకరించారు. సీతారాముల పేర్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాటిని సేవా సంఘం ప్రతినిధులు మంగళవారం ఆలయ అర్చకులకు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, సేవా సంఘం కార్యదర్శి విజయ్కుమార్ పాల్గొన్నారు.