-
పార్లమెంటులో పోలవరంపై చర్చ
-
పార్లమెంట్ లో నీట్ లొల్లి
-
సభా సంప్రదాయాలు పాటించాలి!
18వ లోక్ సభ కొలువు తీరిన వెంటనే అధికార, ప్రతిపక్షాలు తమ తమ రంగులు బయట పెట్టాయి. మాటలు పార్లమెంటు గోడలు దాటినా... పనులు పాతవే అని నిరూపించాయి. ప్రొటెం స్పీకరు ఎంపిక మొదలుకొని తమ మధ్య ముందు ముందు విభేదాలు తప్ప ఏకాభిప్రాయం ఉండబోదని తెలియజెప్పాయి.సభలో అత్యంత సీనియర్ను ప్రోటెం స్పీకరుగా ఎంచుకొని గౌరవిస్తారు. అలా అయితే విపక్షానికి చెందిన సురేష్ని నియమించాలి. కానీ అధికార పక్షం తమ పార్టీకి చెందిన సభ్యుణ్ణి నియమించింది. అలా పరిమిత అధికారం, రెండు మూడు రోజుల తాత్కాలిక పదవీ కాలం ఉన్న గౌరవ స్థానం విషయంలోనే అధికార పక్షం సంకుచితంగా ఆలోచించింది. తర్వాత పాటించాల్సిన సంప్రదాయం పట్ల కూడా మౌనం దాల్చింది.అదేమిటంటే డిప్యూటీ స్పీకరు పదవి విపక్షాలకు ఇవ్వడం! అధికార పక్షం మౌనంలో నిరాకరణ అర్థమై, స్పీకరు పదవికి పోటీ నిలబెట్టింది విపక్షం. అది కూడా సంప్రదాయానికి విరుద్ధమే. ఎలాగూ గెలిచే బలం లేదు. పెద్ద మనసుతో స్పీకరు ఎన్నికను ఏకాభిప్రాయంతో జరగనిస్తే హుందాగా ఉండేది. అధికార పక్షపు వైఖరి కన్నా మెరుగైనదిగా భావించబడేది.ఇక స్పీకరు, తన మొదటి తీర్మానంలోనే తన ఉద్దేశ్యం తెలియబర్చారు. 49 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, దేశంలో పెట్టిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం అది. ఎమర్జెన్సీని వ్యతిరేకించడం వందశాతం ఒప్పే కానీ ఇప్పుడా పని చెయ్యడం అంత ఎమర్జెన్సీయా? నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు కాంగ్రెస్ పార్టీని రక్షణలో పడేయడానికి అర్జెంటుగా పూనుకున్నట్లు ఉంది తప్పించి ఇదేమంత అత్యవసర కార్యక్రమం అనిపించలేదు.అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏకాభిప్రాయంతో మెలగనక్కర లేదు. అలా మెలగడం మంచిది కూడా కాదు. సంప్రదాయాలనూ, ఉన్న చట్టాలనూ, ఎదుటి పక్షాలనూ, వారి వాదనలోని ఔచిత్యాన్నీ గౌరవించాలి. అంతిమంగా ప్రజల పట్ల తమ బాధ్యతను గుర్తించాలి. ఈ సారి ప్రజా తీర్పు ఇరు పక్షాలకూ పాఠాలు నేర్పింది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఏకపక్ష ధోరణులు విడిచిపెట్టి ప్రజా పక్షం వహించాలని స్పష్టం చేసింది. ఆ స్ఫూర్తి ఇరు పక్షాలూ నిలపాలి. అర్థవంతమైన చర్చలకూ, ఆరోగ్యకరమైన సంప్రదాయాలకూ మరలా పట్టంగట్టాలి. – డా. డి.వి.జి శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం
ఎమర్జెన్సీ. నిన్నటికి నిన్న లోక్సభ స్పీకర్గా ఎన్నికవుతూనే ఓం బిర్లా నోట సభలో విన్పించిన మాట. గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలోనూ ప్రముఖంగా చోటుచేసుకుంది! ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా, రాజ్యాంగంపై దాడిగా రాష్ట్రపతి అభివరి్ణంచారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంపై ఇలాంటి దాడులు జరుగుతూ వచ్చాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీపై దేశమంతా భగ్గుమంది.అంతిమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించి ప్రగతి పథాన సాగుతోంది’’ అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా మాత్రమే చూడటం లేదు. దాన్ని ప్రజల చేతనలో అవిభాజ్య భాగంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం వంటి చర్యలు అందులో భాగమే’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఎమర్జెన్సీపై తరచూ విమర్శలు చేస్తూ వస్తోంది.ప్రధాని మోదీ జూన్ 24న మాట్లాడుతూ ఎమర్జెన్సీని దేశ పార్లమెంటరీ చరిత్రలో చెరగని మచ్చగా అభివ రి్ణంచారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ కూడా బుధవారం గాజియాబాద్లో ఒక కార్యక్రమంలో ఎమర్జెన్సీపై విమర్శలు గుప్పించారు. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికవుతూనే ఎమర్జెన్సీని నిరసిస్తూ లోక్సభలో ఏకంగా తీర్మానమే చేసి రాజకీయ దుమారానికి తెర తీశారు.పరీక్షల విధానంలో సంస్కరణలున్యూఢిల్లీ: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు ముర్ము గుర్రపు బగ్గీలో సంప్రదాయ రీతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. గజ ద్వారం వద్ద ధన్ఖడ్, ప్రధాని మోదీ, బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముర్ము తన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వ ప్రాథమ్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిరతకే పట్టం కట్టారు’’ అన్నారు.‘‘లోక్సభ సభ్యులుగా మీరంతా ప్రజల నమ్మకం చూరగొని నెగ్గారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. భారత్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా వేయి కళ్లతో గమనిస్తోందన్న విషయాన్ని సభ్యులు గుర్తెరగాలన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీనిపై పారీ్టలకు అతీతంగా దేశవ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ దిశగా పరీక్షల విధానంలోనే సమూల సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలను బలోపేతం చేసి వాటిల్లో సీట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులంతా ‘నీట్, నీట్’ అంటూ జోరుగా నినాదాలు చేశారు. పలు ఇతర అంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...⇒ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్నీ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈవీఎంలు సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు దాకా అన్ని పరీక్షల్లోనూ నెగ్గి విశ్వసనీయతను నిరూపించుకున్నాయి. ⇒ కొన్నాళ్లుగా భారత్ అనుసరిస్తున్న సమర్థమైన విదేశీ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అంతర్జాతీయ సమస్యపైనా తక్షణం స్పందిస్తూ క్రమంగా విశ్వబంధుగా పరిణతి చెందుతోంది. భారత్–మధ్య ప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ 21వ శతాబ్దంలో అతి పెద్ద గేమ్ చేంజర్గా మారనుంది. ⇒ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు. పార్లమెంటు కార్యకలాపాలను ఆటంకపరచడం వేరు. ఇది పూర్తిగా తప్పుడు చర్య. పార్లమెంటు సజావుగా సాగినప్పుడే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు సాధ్యమని అన్ని పారీ్టలూ గుర్తుంచుకోవాలి. ⇒ కశ్మీర్ లోయలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. తద్వారా శత్రు దేశాలకు కశ్మీరీ ప్రజలు దిమ్మతిరిగే జవాబిచ్చారు. ఆరి్టకల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచి్చన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు ఎంతగానో మెరుగుపడుతున్నాయి. ⇒ మౌలికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల్లో బులెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ⇒ తప్పుడు సమాచార వ్యాప్తి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు విభజన శక్తులు దీన్ని ఆయుధంగా వాడుతున్నాయి. ఈ బెడద నివారణకు కొత్త మార్గాలు వెదకాల్సిన అవసరం చాలా ఉంది. ⇒ దేశ విభజనతో సర్వం కోల్పోయిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పౌరసత్వ సవరణ చట్టం దోహదపడుతుంది. ⇒ శిక్షించడమే ప్రధానోద్దేశంగా రూపొందిన బ్రిటిష్ వలస పాలన నాటి శిక్షా స్మృతులు స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగడం దారుణం. న్యాయం శిక్షగా మారకూడదన్నదే లక్ష్యంగా, భారతీయతే మూలమంత్రంగా నూతన నేర న్యాయ చట్టాల రూపకల్పన జరిగింది. జూలై 1 నుంచి అవి ప్రజలకు సరైన న్యాయాన్ని సత్వరంగా అందించనున్నాయి. ⇒ అభివృద్ధితో పాటు దేశ ఘన వారసత్వానికీ మోదీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. మహిళల సారథ్యంలో అభివృద్ధికి కట్టుబడి ఉంది. చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల వంటి నిర్ణయాలు ఈ దిశగా ముందడుగులు. ⇒ రక్షణ రంగంలో భారీ సంస్కరణలు మరింత వేగంతో కొనసాగుతాయి. పదేళ్లలో రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగాయి. అదే సమయంలో గతేడాది మన రక్షణ కొనుగోళ్లలో 70 శాతం స్వదేశీ సంస్థల నుంచే జరిగింది! ఈ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరగనుంది. ⇒ సుపరిపాలనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. పలు ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల రద్దు, స్వీయ ధ్రువీకరణ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు. ⇒ సంస్కరణల పథాన్ని వేగవంతం చేసే దిశగా వచ్చే బడ్జెట్లో చరిత్రాత్మక చర్యలుంటాయి. -
తాడేపల్లి వైఎస్సార్ సీపీ కార్యాలయం కూల్చివేతపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్
-
పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
-
అఖిలేష్పై డింపుల్ కళ్లు.. ‘సభ’లో సూపర్ సీన్
18వ లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి సెషన్లో మూడో రోజు బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. అయితే ఈ సమయంలో సభలో ఓ దృశ్యం తళుక్కున మెరిసింది. ఓం బిర్లాకు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. సమాజ్వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఈ సమయంలో అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ అతని వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అఖిలేష్ మాట్లాడుతున్నంత సేపు ఆమె దృష్టి భర్తపైనే నిలిచింది. అఖిలేష్ నూతన స్పీకర్ ఓం బిర్లాను అభినందిస్తూ.. కొత్త పార్లమెంటు- పాత పార్లమెంట్ అనే తేడాలు చూపిస్తూ మాట్లాడారు. కొత్త సభలో స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉందని, పాత పార్లమెంటులో కుర్చీ ఎత్తు తక్కువని అన్నారు. ‘స్పీకర్ సార్ మీకు అభినందనలు. మీకు స్పీకర్గా ఐదేళ్ల అనుభవం ఉంది. మీకు పాత, కొత్త సభలతో పరిచయం ఉంది.మీరు కూర్చున్న స్థానం ఎంతో విలువైనది. అద్భుత సంప్రదాయాలు కలిగినది. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని, వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు ప్రతీ ఎంపీకి, ప్రతీ పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని అనుకుంటున్నాం. నిష్పాక్షికత అనేది ఈ స్థానానికున్న ప్రధాన బాధ్యత. మీరు లోక్సభలో ప్రధాన న్యాయమూర్తి తరహాలో కూర్చున్నారు. ఎవరి గొంతునూ అణచివేయకూడదు. అలాగని ఎవరినీ బహిష్కరించకూడదు.మీ నియంత్రణ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై కూడా ఉండాలి. మీ సూచనల మేరకు సభ నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా ఉండకూడదు. నేను మొదటిసారి సభకు వచ్చాను. మీ స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను..స్పీకర్ సార్’అని అఖిలేష్ అన్నారు. అఖిలేష్ సభలో మాట్లాడుతున్నంత సేపు అతని భార్య డింపుల్ చిరునవ్వులు చిందిస్తూ భర్తను చూస్తూనే ఉన్నారు.భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా బుధవారం లోక్సభ స్పీకర్గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రొటెం స్పీకర్ (యాక్టింగ్ స్పీకర్) భర్తిహరి మహతాబ్ సభలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. అనంతరం లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు తాత్కాలిక స్పీకర్ మహతాబ్ ప్రకటించారు. -
నిజ్జర్కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల నిజ్జర్కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిజ్జర్కు నివాళా?.. కెనడాకు భారత్ ‘కనిష్క’ కౌంటర్
ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించటంపై భారత్ స్పందించింది. ఈ మేరకు వాంకోవర్లోని భారత్ కాన్సలేట్ జనరల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఉగ్రవాద ముప్పును ఎదుర్కొవటంలో భారత్ ముందజంలో ఉంది. అదీకాక, ఉగ్రవాద ముప్పు పరిష్కారానికి ప్రపంచ దేశాలతో కలసి పనిచేస్తాం. 1985లో ఎయిరిండియా విమానం 182 (కనిష్క)పై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడి ఘటనకు జూన్ 23తో 39 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ దాడిలో 86 మంది చిన్నారులతో సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు. .. ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిరిండియా విమానంపై చేసిన బాంబ్ దాడిలో మృతి చెందినవారికి స్మారకంగా నివాళులు అర్పిస్తాం. జూన్ 23న స్టాన్లీ పార్క్లోని సెపర్లీ ప్లేగ్రౌండ్లో జరిగే ఈ స్మారక కార్యకమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలి’ అని భారత్ కాన్సలేట్ జనరల్ పేర్కొంది.India stands at the forefront of countering the menace of terrorism and works closely with all nations to tackle this global threat. (1/3)— India in Vancouver (@cgivancouver) June 18, 2024 ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం కెనడా పార్లమెంట్( హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించింది.ఖలిస్తానీ టైగర్ ఫోర్స్( కేటీఎఫ్) చీఫ్ హర్దిప్ సింగ్ నిజ్జర్ గతేడి జూన్ 18 కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం. నిజ్జర్ను హత్య చేసిన వారిలో నలుగురు భరతీయులు.. కరణ్ బ్రార్, అమన్దీప్ సింగ్, కమల్ప్రీత్ సింగ్, కరణ్ప్రీత్ సింగ్ నిందితులుగా ఉన్నారు.తీవ్రవాది హర్దిప్ హత్యతో భారత్ హస్తం ఉందిన కెనడా ఆరోపలు చేసింది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక.. అప్పటి నుంచి ఇరు దేశాల దౌత్య పరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.ఇక.. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 సమ్మిట్లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రూడో తెలిపారు.ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరింది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే హత్య చేయబడ్డారు. -
పార్లిమెంట్ నేతలతో నేడు జగన్ కీలక సమావేశం
-
వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..
రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024 కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కెనడా ఎంపీ.. కన్నడలో ప్రమాణం
ఒట్టావా: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయడం, ప్రసంగించడం తరచుగా చూస్తుంటాం. కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస కన్నడిగుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేసి మాతృభాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు ఆయనను సీట్లలో నుంచి లేచి అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోనుద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. pic.twitter.com/lYW3RDH4vO— Harish Itagi (@HarishSItagi) June 9, 2024 -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.ఫ్రాన్స్లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. -
ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్లోకి చొరబడేందుకు..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. నకిలీ ఆధార్తో పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఖసిం, మోనిస్, షోయాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని స్టేషన్ కు తరలించి.. విచారిస్తున్నారు. ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్న ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
పార్లమెంట్ లోకి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం
-
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
British Parliament Dissolve: బ్రిటన్ పార్లమెంట్ రద్దు..
బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా పార్లమెంట్ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేశారు. #BreakingNews #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024ఇక బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. -
పార్లమెంట్ సెక్యూరిటీపై కేంద్రం కీలక నిర్ణయం
-
పార్లమెంట్లో డిష్యుం.. డిష్యుం
చట్ట సభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. ఒక్కోసారి అవి శ్రుతి మంచి దాడులకు దారి తీసిన దాఖలాలు లేకపోలేదు. అయితే తైవాన్లో ఆ పరిస్థితి ముష్టి యుద్ధానికి దారి తీసింది. పార్లమెంట్లోనే చట్ట సభ్యులు తన్నుకున్న వీడియోలు ఎక్స్లో వైరల్ అవుతోంది. నూతన సంస్కరణలపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.పార్లమెంట్లో తప్పుడు ప్రకటనలు చేసే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేసిన తైవాన్ పార్లమెంట్ చట్టం చేయాలనుకుంది. ఇందుకుగానూ చట్ట సభ్యులకు అధిక అధికారం కట్టబెట్టే చట్ట ప్రాతిపాదనలపై శుక్రవారం చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం డిష్యుం.. డిష్యుంకి దారి తీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. ఇష్టానుసారం తన్నుకున్నారు. รัฐสภาไต้หวันวุ่น นักการเมืองทะเลาะกันนัว หลังไม่มีพรรคใดครองเสียงข้างมากกระทบการลงมติ #ทันโลกกับไทยพีบีเอส #ThaiPBS #ไต้หวัน #taiwan pic.twitter.com/M2Fkmf5f5T— ทันโลกกับThaiPBS (@TanlokeThaiPBS) May 18, 2024 మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగం అయ్యారు. జుట్టు జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. కిందపడి పడి గుద్దులు గుద్దుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఎంపీ అక్కడి బిల్లు సంబంధిత ఫైల్స్ను తీసుకుని బయటకు పరిగెత్తడం బాగా వైరల్ అయ్యింది. 🚨🇹🇼#BREAKING: A member of Taiwan's parliament stole a bill and ran off with it to prevent it from being passed.LMFAOOOOOO 😭😭😭pic.twitter.com/CxcmWCusAI— Censored Men (@CensoredMen) May 17, 2024డెమొక్రటిక్ ప్రొగెసివ్ పార్టీ, కువోమింటాంగ్ పార్టీ ఎంపీల మధ్య చర్చ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘర్షణలకు కారణమైంది. మరికొందరు స్పీకర్ కుర్చీ చుట్టు చేరడం, టేబుళ్ల మీద నుంచి దూకడం ఆ వీడియోలలో చూడొచ్చు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ గలాట.. మధ్యాహ్నం దాకా కొనసాగింది. తైవాన్ పార్లమెంట్లో 113 సీట్లు ఉన్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగ్ టె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందే పార్లమెంట్ రణరంగంగా మారడం గమనార్హం. విశేషం ఏంటంటే.. చట్ట సభలో మెజారిటీ లేకున్నా చింగ్ టె అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం.డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో.. టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది. -
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
‘మా ప్రాంతంలోని పేదల కష్టాలే నన్ను పెద్దలతో తలపడేలా చేస్తున్నాయి’ అంటోంది దాసరి భారతి.కోవిడ్ సమయంలో నర్స్గా పని చేసి ఎందరికో సేవ చేసిన భారతిబాధితులకు న్యాయం జరగాలంటే చట్టం తెలియాలని ఎల్.ఎల్.బి. చదువుతోంది.జోగులాంబ జిల్లా మేడికొండకు చెందిన 26 ఏళ్ల ఈ దళిత యువతినాగర్ కర్నూల్ ΄ార్లమెంట్ స్థానం నుంచి అధికారికంగా పోటీలో ఉంది.‘జనం కోసం గొంతెత్తకుండా ఉండలేక΄ోతున్నాను’ అంటున్న భారతి పరిచయం.‘నేను హైదరాబాద్ అ΄ోలో నర్సింగ్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చదివాను. ఎమ్మెస్సీ నర్సింగ్ చేయాలని ఉండేది. నాకు మెరిట్ ఉన్నా సీట్ వచ్చినా కేవలం డబ్బుల్లేక ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత పాండిచ్చేరి జిప్మర్లో ఎమ్మెస్సీ నర్సింగ్ చదివాను. నాలా ఎందరో పేదింటి, దళిత, వెనుకబడ్డ వర్గాల యువతీ యువకులు చదువు కోసం బాధలు పడుతున్నారు. వారిని పట్టించుకునేది ఎవరు? వారి కోసం గొంతెత్తాలని ఎన్నికలలో నిలుచున్నాను’ అంటుంది దాసరి భారతి.26 ఏళ్ల ఈ దళిత అమ్మాయి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ‘విడుదలై చిరుతైగల్ కట్చి’ (వి.సి.కె.) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు ‘టీవీ రిమోట్’ను ఎన్నికల చిహ్నంగా కేటాయించారు. పాండిచ్చేరిలో చదివేటప్పుడు వి.సి.కె. పార్టీ కార్యక్రమాలు గమనించాను. అది దళితుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న పార్టీ. ఒక దళిత యువతిగా నేను ఆ పార్టీతో కలిసి పని చేయాలని భావించాను’ అని తెలిపింది భారతి.జోగులాంబ జిల్లా మేడికొండ భారతి ఊరు. తండ్రి దాసరి రాములు కౌలు రైతు. తల్లి పద్మావతి గృహిణి. ‘మా నాన్న చనిపోయాడు. మేము నలుగురం పిల్లలం. చదువుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చింది’ అంది భారతి.‘నా బాల్యం నుంచి చూస్తున్నాను. మా ఊరికి ఇప్పటికీ సరైన రోడ్డు లేదు. రోగాలొచ్చినా ఏమొచ్చినా చాలా కష్టం. ఒక నిండు చూలాలు అంబులెన్స్ ఎక్కి రోడ్డు గతుకుల వల్ల దారిలోనే డెలివరీ అయ్యి చని΄ోయిన సంఘటన కళ్లారా చూశాను. నిధులన్నీ ఏమవుతున్నాయి? ఎం.ఎల్.ఏలు, ఎం.పి.లు, మంత్రులు ఏం చేస్తుంటారు? ఎందుకు పరిస్థితులు మార్చరు? కృష్ణ, తుంగభద్రల తీరంలో ఉండేదే మా ్ర΄ాంతం. కాని పశువులు తాగడానికి కూడా చుక్క నీరు ఇప్పుడు లేదు. రాజకీయ చైతన్యం ఉన్న యువత ఈ పరిస్థితిని ప్రశ్నించే వరకు మార్పు రాదు. అందుకే నేను ఎన్నికలలో నిలుచున్నాను’ అంది భారతి.నాగర్ కర్నూల్లో పార్లమెంట్ స్థానానికి ప్రవీణ్ కుమార్ (బి.ఆర్.ఎస్), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ కుమార్ (బి.జె.పి) పోటీలో ఉన్నారు. భారతి దగ్గర మందీ మార్బలం లేకపోయినా కేవలం తన ధర్మాగ్రహంతో వీరితో తలపడనుంది.‘కోవిడ్ కాలంలో టిమ్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేశాను. పేదలు సరైన వైద్యం అందక, కార్పొరేట్ ఆస్పత్రులకు పోలేక మరణించారు. నాకు ముందు నుంచి కూడా విద్యార్థి రాజకీయాలన్నా, ఉద్యమాలన్నా ఇష్టం. నా విస్తృతి పెరగాలంటే నర్స్గా ఉంటే సరి΄ోదనిపించింది. అందుకే ఇప్పుడు ఎల్.ఎల్.బి. చదువు తున్నాను. నేను ఎలక్షన్లలో పోటీ చేస్తున్నానని తెలిసి మావాళ్లంతా సంతోషపడుతున్నారు. నాలాంటి వాళ్లు గెలిచి పేదలకు మేలు జరిగినప్పుడే కదా నిజమైన సంతోషం’ అని ముగించింది భారతి. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్లో ఇంతవరకూ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు. -
Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు
పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభ అభ్యర్ధి, తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపిన ఈడీ.. తాజాగా మరోసారి పంపింది. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మహువా మొయిత్రాను ఈడీ అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్స్ట్రనల్ (ఎన్ఆర్ఈ), అకౌంట్స్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు (foreign remittance)చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు. గతంలో రెండు సార్లు గత ఏడాది మహువా మొయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్వర్డ్ను ఇచ్చారని అనంత్ ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు. అంతేకాకుండా, డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహువా మొయిత్రాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజులకే ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. రూ.2 కోట్ల వరకు తాజాగా, పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, అలాగే లగ్జరీ ఐటమ్స్ తీసుకున్నారని, ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్సైట్ లాగిన్ వివరాలను దర్శన్ హీరానందానీకి షేర్ చేశారని, ఇదే అంశంపై ఈడీ హీరానందనీని సైతం విచారణ కోసం పిలిపించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, క్యాష్ ఫర్ క్వైరీ ఆరోపణల్ని మోయిత్రా ఖండించారు (కానీ ఆమె వెబ్సైట్ ఆధారాలను పంచుకున్నారని, ఇది ఎంపీలలో సాధారణ పద్ధతి అని వాదించారు). మేలో ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. -
‘లోక్సభ’లో స్వతంత్రులు విజేతలా? పరాజితులా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇదిలా ఉండగా కొన్ని పార్టీలలో టిక్కెట్లు ఆశించి, భంగపడినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి వ్యవహారం దేశంలో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. మొదటి లోక్సభ ఎన్నికల్లో.. 1951-52లో మొదటి లోక్సభ ఎన్నికలు జరిగాయి. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 37 మంది స్వతంత్ర ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. రెండో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య పెరిగింది. 1957లో రెండో లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 42 మంది స్వతంత్ర ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. 1962లో స్వతంత్రుల హవా మూడో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య సగానికి పైగా తగ్గింది. 1962లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలు అయ్యారు. నాలుగో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య తిరిగి పెరిగింది. 1967లో జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్ర ఎంపీలు ఎన్నికయ్యారు. 1971లో ఐదవ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రుల సంఖ్య తగ్గింది. ఈ ఎన్నికల్లో 14 మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ‘ఎమర్జెన్సీ ’ తర్వాత.. దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన 1977 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం తగ్గింది. ఆరో లోక్సభలో కేవలం తొమ్మిది మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ఏడో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. 1980లో తొమ్మిదిమంది స్వతంత్రులు లోక్సభ ఎంపీలు అయ్యారు. స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం 1984లో మెరుగుపడింది. ఎనిమిదో లోక్సభలో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర ఎంపీల సంఖ్య 1989లో స్వల్పంగా తగ్గింది. 10వ లోక్సభకు ఒక్కరే.. తొమ్మిదో లోక్సభలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పార్లమెంట్ దిగువ సభకు చేరుకున్నారు. 1991 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయింది. 10వ లోక్సభకు ఒక స్వతంత్ర ఎంపీ మాత్రమే ఎన్నికయ్యారు. అత్యల్ప సంఖ్యలో స్వతంత్ర ఎంపీలు 1991లో ఎన్నికయ్యారు. 11వ లోక్సభలో పార్లమెంటులో స్వతంత్ర ఎంపీల వాటా మరోసారి పెరిగింది. 1996లో జరిగిన ఎన్నికల్లో తొమ్మదిమంది స్వతంత్రులు లోక్సభ ఎంపీలు అయ్యారు. 14వ, 15వ లోక్సభ ఎన్నికల్లో.. 12వ లోక్సభలో అంటే 1998లో స్వతంత్ర ఎంపీల సంఖ్య ఆరుకి తగ్గింది. 1999లో 13వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆరుగురు స్వతంత్రులు పార్లమెంటుకు చేరుకున్నారు. 14వ లోక్సభలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ లోక్సభ ఎన్నికలు 2004లో జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల సంఖ్య తొమ్మది. 3,449 మంది డిపాజిట్లు గల్లంతు 16వ లోక్సభకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేవలం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 8,054 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో 3,461 మంది స్వతంత్రులు. వీరిలో 3,449 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం నలుగురు స్వతంత్రులు మాత్రమే పార్లమెంటుకు చేరుకున్నారు. విజేతల ఓట్లు.. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. అసోంలోని కోక్రాజార్ లోక్సభ స్థానం నుంచి 37,786 ఓట్లతో విజయం సాధించి నబ కుమార్ సరానియా పార్లమెంటుకు చేరుకున్నారు. దాద్రా అండ్ నగర్ హవేలీ స్థానం నుంచి డెల్కర్ మోహన్భాయ్ సంజీభాయ్ 9,001 ఓట్లతో గెలుపొందారు. కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి సుమలత అంబరీష్ 1,25,876 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. -
Kolkata: మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. క్యాష్ ఫర్ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్సభ ఎథిక్స్ కమిటీ ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు -
Malkajgiri Lok Sabha: అందరి దృష్టి ఆ సీటుపైనే
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి. ఇప్పుడు దానిపైనే అందరి గురి. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ తమదే అధికారమని చెబుతున్న బీజేపీ నేతలు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్.. రాష్ట్రంలో గెలుపుతోనే తమ లక్ష్యం పూర్తి కాలేదని లోక్సభలోనూ బలం చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. అన్ని పారీ్టలకూ హాట్ సీట్ అన్ని పారీ్టలూ వేటికవి మల్కాజిగిరిలో గెలుపుతో బలం చాటుకోవాలని ఆరాటపడుతున్నాయి. టికెట్ కోసం మాత్రం కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న వారితో పాటు కొత్తగా చేరుతున్న వారు సైతం దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం హామీలిస్తుందో లేదో కానీ ఎవరికి వారుగా ఈ సీటును దక్కించుకోవాలనే తలంపుతోనే ప్రస్తుతం కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే రేవంత్రెడ్డి అటు పీసీసీ అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి కావడంతో సెంటిమెంట్ పరంగానూ భారీ డిమాండ్ ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహించే రేవంత్ వారసుడెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందరెందరో.. మల్కాజిగిరి లోక్సభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, బొంతు రామ్మోహన్, సింగిరెడ్డి హరివర్ధ¯న్రెడ్డిలతో పాటు ఇంకా కాంగ్రెస్లో చేరనివారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. సినీనటుడు అల్లు అర్జున్కు మామ కావడంతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో చంద్రశేఖరరెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన భువనగిరి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న చోట కాకుండా మహేశ్వరం టికెట్ ఇవ్వడంతో ఓటమిపాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈసారి ఎంపీ సీటు కోసం ప్రయతి్నస్తున్నట్లు వినికిడి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి ఎంటీ టికెట్ కోసం ప్రయతి్నస్తున్నట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో కాంగ్రెస్లో చేరనున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త, బీఆర్ఎస్ నేత మోతె శోభన్రెడ్డి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణలు సైతం మల్కాజిగిరి టికెట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి ఇటు.. ప్రముఖ వ్యాపారి, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేకు కూడా కాంగ్రెసే ఆఫర్ ఇచి్చనట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్ను వీడి వస్తే ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం పార్టీ మారి తిరిగి ఎంపీగా పోటీకి సిద్ధమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏయే పారీ్టల నుంచి కాంగ్రెస్లోకి వస్తారో.. రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపీ టిక్కెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!