-
భారత్తో స్నేహం కావాలి: పాకిస్తాన్
పొరుగుదేశం పాకిస్తాన్ తాజాగా భారత్తో స్నేహం కోసం పరితపిస్తోంది. నిరంతర శతృత్వాన్ని నమ్మబోమంటూ మిత్రత్వానికి స్వాగతం పలుకుతోంది. స్వయంగా పాక్ ఉపప్రధాని తాము భారత్తో హృదయపూర్వక స్నేహాన్ని కోరుకుంటున్నామని అనడం ఇందుకు తార్కాణంగా నిలిచింది.పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా భారత్కు స్నేహ సందేశాన్ని పంపారు. తమ దేశం నిరంతర శత్రుత్వాన్ని నమ్మబోదని ఆయన అన్నారు. భారత్లో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇస్లామాబాద్తో సత్సంబంధాలకు ప్రాధాన్యతనివ్వాలని దార్ కోరారు. ఇస్లామాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఎస్ఎస్ఐ)లో జరిగిన సెమినార్లో పీఎంఎల్-ఎన్ నేత, ఉపప్రధాని ఇషాక్ దార్ ప్రసంగించారు. పాకిస్తాన్ ఎప్పుడూ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. అయితే భారత్తో పాక్ సంబంధాలు చరిత్రలో అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, జమ్ముకశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని దార్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటున్నదన్నారు. భారత్తో పాటు పొరుగున ఉన్న అన్ని దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలను కొనసాగించడానికి పాకిస్తాన్ కృషి చేస్తుందని దార్ పేర్కొన్నారు. -
పాక్తో భారత్ తొలిపోరు
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్తో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టైటిల్ వేటను ఆరంభించనుంది. జూలై 19 నుంచి 28 వరకు శ్రీలంకలోని దంబుల్లా నగరంలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్, మలేసియా జట్లున్నాయి. జూలై 19న పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం భారత జట్టు 21న యూఏఈతో, 23న నేపాల్తో ఆడతాయి. రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి. టాప్–10లో స్మృతి, హర్మన్ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ టాప్–10లో ఉన్నారు. గతవారం మూడో స్థానంలో ఉన్న స్మృతి ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్లో నిలువగా... హర్మన్ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్కు చేరుకుంది. -
T20 World Cup 2024: బాబర్ ఆజమ్ రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత కెప్టెన్లలో అతి తక్కువ మ్యాచ్ల్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా రోహిత్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్తో సమానంగా నిలిచినప్పటికీ.. మ్యాచ్ల పరంగా బాబర్ కంటే తక్కువ మ్యాచ్ల్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. హిట్మ్యాన్ కేవలం 60 మ్యాచ్ల్లో 48 విజయాలు సాధించగా.. బాబర్కు ఈ మార్కును తాకేందుకు 85 మ్యాచ్లు అవసరమయ్యాయి. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా రోహిత్ ఈ రికార్డును సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శివాలెత్తిపోవడంతో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. హిట్మ్యాన్ వీరవిహారం (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ (31), శివమ్ దూబే (28), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విరాట్ కోహ్లి (0) మరోసారి నిరాశపరిచాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. హెడ్కు జట్టులో మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (37), మ్యాక్స్వెల్ (20), టిమ్ డేవిడ్ (15), కమిన్స్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ 2, బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్.. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. -
కేవలం భార్యలనే కాదు.. పాక్ ఆటగాళ్లపై పీసీబీ ఫైర్!
తమ ఆటగాళ్ల తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ ఖాన్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు కారణమైన కొందరు సీనియర్ క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు అతడు సిద్దమైనట్లు తెలుస్తోంది.పాక్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలని మొహ్సిన్ ఖాన్ సన్నిహిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి.‘‘త్వరలోనే కొంద మంది సీనియరల్ లెవల్ అధికారులకు స్వస్తి పలికేందుకు పీసీబీ సిద్ధమవుతోంది. అదే విధంగా భవిష్యత్తులో కొన్ని కఠినమైన నిబంధనలు రూపొందించాలనే యోచనలో ఉంది.చాలా మంది క్రికెటర్లు తమ భార్యాపిల్లల్ని మాత్రమే కాదు.. తమ తల్లిదండ్రులు, సోదరులు.. ఇతర బంధువర్గాన్ని కూడా తమతో పాటు విదేశాలకు తీసుకువెళ్లడమే గాకుండా.. టీమ్ హోటల్లోనే ఉంచారు.ఈ విషయం పట్ల చైర్మన్ పూర్తి అసంతృప్తితో ఉన్నారు. దీనికంతటికి కారణమైన సీనియర్ ఆఫీసర్లపై వేటు వేయాలని ఆయన యోచిస్తున్నారు.కేవలం టీ20 ప్రపంచకప్-2024లో పరాజయాల పట్ల మాత్రమే కాదు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో కూడా వెనుకబడటం పట్ల చైర్మన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’ అని సదరు వర్గాలు వెల్లడించాయి.కాగా ప్రపంచకప్-2024లో అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్లపై గెలిచినా సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది.దీంతో బాబర్ ఆజం బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ టోర్నీ అన్న శ్రద్ధ లేకుండా కుటుంబాలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్లినట్లు ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్లు చీవాట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ భాగమైన గ్రూప్-ఏ నుంచి టీమిండియా, అమెరికా సూపర్-8కు చేరాయి. -
పాక్లో కాంగో వైరస్ కలకలం
పాకిస్తాన్లో కాంగో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా క్వెట్టాలో మరో కేసు నమోదైంది. 32 ఏళ్ల ఫాతిమా జిన్నా.. కాంగో వైరస్ బారిన పడి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఏఆర్వై న్యూస్ పాకిస్తాన్లో వ్యాప్తిచెందుతున్న కాంగో వైరస్ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్లో 13 కాంగో వైరస్ కేసులు నమోదయ్యాయి. పెషావర్లో కాంగో వైరస్ బారిన పడిన 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. అయితే అతనితో పరిచయం కలిగినవారికి వైరస్ సోకిందీ లేనిదీ తెలియరాలేదు. ఈ వ్యాధి టిక్-బర్న్ నైరో వైరస్ వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ పశువులు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు తదితర జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.కాంగో వైరస్ లక్షణాలివే..జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, మెడ నొప్పి, వెన్నునొప్పి, కళ్లు మండటం, ఫోటోఫోబియా, వికారం, వాంతులు, అతిసారం, కడుపు నొప్పి, గొంతు నొప్పి మొదలైనవి కాంగో వైరస్ లక్షణాలు. -
ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రధాని పిలుపు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్ సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.2014, డిసెంబర్ 16న పాక్లోని పెషావర్ స్కూల్పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు. -
22 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడిన ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పారు.లాహోర్, అటాక్, షేక్పురా, ముజాఫర్ఘర్, నాన్కానా సాహిబ్, బవల్పుర్, డీజీ ఖాన్, ఫైసలాబాద్, ముల్తాన్, భవాల్నగర్, రావల్పిండి నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులు పంజాబ్లో అఘాయిత్యానికి ప్లాన్ వేశారు, రాష్ట్రంలో ఉన్న కీలక ప్రదేశాలను, వ్యక్తులను టార్గెట్ చేయాలని భావించారు.1,645 గ్రాముల బరువున్న పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఐరాసలో పెరగనున్న పాక్ ప్రభావం
లోక్సభ ఎన్నికల హడావిడిలో ఈ వార్త అంతగా దృష్టిలో పడలేదుగానీ, భద్రతా మండలిలో రెండేళ్ల కాలానికి పాకిస్తాన్ ఎన్నిక కావడం భారత్ పట్టించుకోవాల్సిన అంశమే. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదు సభ్యదేశాలు భద్రతా మండలిలో ఉండటమూ పాక్కు కలిసొచ్చేదే. కశ్మీర్పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి అది ప్రయత్నించవచ్చు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత ఐరాస ఎజెండాలో కీలకమైంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాక్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని చర్చలోకి తేగలదు. ఒక భారతీయుడిని ఐరాస నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కూడా పాక్ ప్రయత్నించవచ్చు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి పాకిస్తాన్ ఇటీవల ఎన్నికైన విషయాన్ని, భారత్లో విస్తృతంగా నివేదించి ఉంటే, అది భారతీయులను కలవరపరిచి ఉండేది. భారత్ లోక్సభ ఎన్నికల్లో కూరుకుపోవడంతో, ఐక్యరాజ్య సమితి అత్యున్నత కమిటీలో పాకిస్తాన్ స్థానం గురించిన వార్తలకు దేశంలో పెద్దగా స్పందన లభించలేదు. ఐరాసలోని 193 సభ్య దేశాలలో 182 పాకిస్తా¯Œ కు అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎన్నిక, మూడవ దఫా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారనుంది.2025 జనవరి 1న భద్రతామండలిలో రెండేళ్ల కాలానికి చేరనున్న పాకిస్తాన్, సోమాలియాల ఎంపికతో ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్’కు చెందిన ఐదు సభ్యదేశాలు ఉంటాయి. మొత్తం ప్రపంచం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిర్ణయాలు చేసే ఏకైక ఐరాస సంస్థ అయిన భద్రతామండలి ఎన్నుకున్న సభ్యుల సంఖ్యలో ఇది సగం. అటువంటి నిర్ణయాలను మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీటో ద్వారా తిరస్కరించవచ్చన్నది మరొక విషయం. ఈ సభ్యదేశాలనే పి–5 లేదా బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పుడు ఇస్లామాబాద్కు ఐరాస భద్రతామండలి తలుపులు తెరిచినంత మాత్రాన, భారత్ ఏదైనా దౌత్యపరమైన ముప్పును ఎదుర్కొంటుందని అర్థం కాదు. ప్రమాదం ఉండదు, కానీ సవాలు మాత్రం ఉంటుంది. అందువల్ల, భారత్ నిశ్చింతగా ఉండకూడదు. న్యూయార్క్లోని ఐరాస కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి పదవి ఖాళీగా ఉంది. పాకిస్తాన్ తరఫున గత ఐదేళ్లుగా ఈ పదవిని నిర్వహిస్తున్న మునీర్ అక్రమ్ ఒక ఘోరమైన రాయబారి. ఆయన అంతకుముందు కూడా 2002 నుండి ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉన్నారు. 1994లో ఐరాస మానవ హక్కుల సంఘం ఎజెండాలో కశ్మీర్ను చేర్చడంలో అక్రమ్ రహస్య దౌత్యం దాదాపుగా విజయం సాధించింది. మరుసటి సంవత్సరం, ఆయన అధికారికంగా జెనీవాలో ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులవడమే కాకుండా ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. కాబట్టి, లోక్సభ ఎన్నికల ప్రచారం మధ్యలో పదవీ విరమణ చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్థానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలి.వచ్చే ఏడాది ద్వైవార్షిక సమీక్ష కోసం కౌంటర్ టెర్రరిజం డాక్యుమెంట్ ఐక్యరాజ్యసమితి వద్దకు తిరిగి వస్తుంది. ఈ సమీక్షలోని పాఠం సరిహద్దు ఉగ్రవాద బాధితురాలిగా భారత్కు ముఖ్యమైనది. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించిన పాకిస్తాన్ వంటి మొండి రాజ్యాల కారణంగా, ఉగ్రవాదానికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రూపొందించలేకపోయారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ సమావేశంలో సోమాలియాది కూడా సందేహాస్పద వైఖరి కావడంతో, జనరల్ అసెంబ్లీపై ఈ రెండు దేశాల ప్రభావమూ పడుతుంది. అదే సమయంలో భారత్ మరో ప్రమాదం నుంచి తనను కాపాడుకోవలసి ఉంది. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదుగురు భద్రతా మండలి సభ్యులు ఒక భారతీయుడిని ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కలిసి పని చేసే అవకాశం ఉంది. వాళ్లు కచ్చితంగా భద్రతా మండలి ప్రసిద్ధ తీర్మానం 1267 ప్రకారం, ఒక హిందువును ఉగ్రవాది జాబితాలో చేరడాన్ని చూడాలనుకుంటారు. 1999లో ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం, ఉగ్రవాది జాబితాలో చేరిన అపఖ్యాతి ఒసామా బిన్ లాడెన్ది. న్యూఢిల్లీలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం ఈ విషయంలో ఓఐసీకి మేత అవగలదనే చెప్పాలి. అయితే 2024లోనూ, వచ్చే ఏడాదిలోనూ మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం భారత్లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇది చాలావరకు ఆధారపడి ఉంటుంది.1267 తీర్మానంతో ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ ద్వారా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చడంలో అమెరికాతో కలిసి పనిచేసిన భారత్ సఫలీకృతమైంది. ఆ ఘటన పాక్ రాయబారి అక్రమ్ను ఇప్పటికీ గాయపరుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు మక్కీయే కారణమని ఆ తీర్మానం ఇచ్చిన వివరణ పాక్ బాధను మరింత పెంచింది. ఈ మక్కీ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు స్వయానా బావ.రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, భద్రతా మండలిలో పాకిస్తాన్ ‘సంప్రదింపులు’ మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ప్రక్రియ మండలి సభ్యుల మధ్య అంతర్గత చర్చలను సూచిస్తుంది. ఈ చర్చల గురించి బహిరంగంగా ఎటువంటి రికార్డూ ఉండదు. ఇప్పుడు పాక్ భద్రతా మండలిలోకి ప్రవేశించిన తర్వాత, మిగతా ఓఐసీ సభ్యదేశాల మద్దతుతో కశ్మీర్పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. అవి ‘బహిరంగ సంప్రదింపుల’ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంటే వాటి గురించి మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారని అర్థం. సందర్భానుసారంగా ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కూడా ఆ చర్చల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు. భారత్ దృక్కోణం నుండి ప్రమాదం ఏమిటంటే, ఇటువంటి జిత్తులు కొనసాగుతున్నప్పుడు కశ్మీర్ సమస్యపై ఐరాస పూర్తి దృష్టి పడుతుంది. అయినప్పటికీ భద్రతా మండలిలో వీటో కలిగివున్న పి–5 దేశాలపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలి పనికి ఆటంకం కలగకుండా గతంలో భారత్, పాక్ సహజీవనం చేశాయి. రెండు దేశాలూ చివరిసారిగా 2012లో కలిసి పనిచేశాయి. కానీ తర్వాతరెండు విషయాలు మారిపోయాయి. ఐరాసలో అప్పటి పాకిస్తాన్ మిషన్ కు ‘డాన్’ మీడియా గ్రూప్ను కలిగి ఉన్న హరూన్ కుటుంబానికి చెందిన హుస్సేన్ హరూన్ నాయకత్వం వహించారు. ఆయన చాలామంది పాకిస్తాన్ కెరీర్ దౌత్యవేత్తల మాదిరిగా కాకుండా భారత్కు వ్యతిరేకంగా ఎప్పుడూ నోరు జారలేదు. రెండవ మార్పు ఏమిటంటే, అప్పట్లో 2012లో ప్రపంచం చాలా భిన్నమైనదిగానూ, తక్కువ సంక్లిష్టమైనదిగానూ ఉండేది.ఇటీవలి సంవత్సరాలలో ఐరాసలో దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు, శత్రువుల మధ్య రహస్య, బహిరంగ ఘర్షణకు అవకాశాలు పెరిగాయి. అందువల్ల, భారత్తో తన ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ కు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్యంగా ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత అనేది ఐరాస ఎజెండాలో కీలకంగా ఉంది. వివాదాలను పరిష్కరించడానికి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని గట్టిగా చర్చలోకి తీసుకురాగలదు. వారు తమ కుతంత్రాలలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇస్లామాబాద్ ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండిపోదు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికలలో యూరప్ మితవాదం వైపు దూసుకెళ్లిన తర్వాత, ఐరాస చర్చల్లో ఇస్లామోఫోబియా కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రతా మండలిలో ఓఐసీ దౌత్యవేత్తల సంఖ్య పెరగడం వారికి దేవుడిచ్చిన వరం. ఐక్యరాజ్యసమితిలో తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి పాకిస్తాన్ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.- వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- కేపీ నాయర్ -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా.. మళ్లీ పాక్ తరపున ఆడుతా: మాలిక్
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూపు స్టేజిలోనే పాక్ నిష్కమ్రించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్ల్లో గెలిచినప్పటకి అవి చెప్పుకోదగ్గ విజయాలు కావు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో గ్రూపు స్టేజి నుంచి పాక్ నిష్క్రమించడం ఇదే మొదటి సారి. అంతకుముందు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ది ఇదే పరిస్థితి.దారుణ ప్రదర్శన కనబరిచి వన్డే ప్రపంచకప్లో సైతం గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్కప్ జట్టులో చోటివ్వడాన్ని తప్పుబడుతున్నారు. వారి స్ధానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది మాజీలు అభిప్రాయపడుతున్నారు.ఇక వరుసగా రెండు వరల్డ్కప్లలో నిరాశపరిచిన పాకిస్తాన్.. వచ్చే ఏడాది తమ స్వదేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్కు ప్రాతినిథ్యం వహించాలన్న తన కోరికను మాలిక్ వ్యక్తం చేశాడు. కాగా మాలిక్ 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆ తర్వాత టీ20ల్లో మాత్రమే 42 ఏళ్ల మాలిక్ కొనసాగాడు. టీ20ల్లో కూడా పెద్దగా పాక్ తరపున ఆడే అవకాశం రాలేదు. పాకిస్తాన్ తరపున మాలిక్ చివరగా 2021లో బంగ్లాదేశ్పై ఆడాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న మాలిక్.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో మాత్రమే కొనసాగుతున్నాడు."నేను మళ్లీ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను.రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను. నాలో ఇంకా ఫిట్నెస్ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదు. నా దేశం కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నాను.పాకిస్తాన్కు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందించేందుకు నా వంతు కృషి చేయాలని భావిస్తున్నానని" పీఎన్ఎన్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. -
తాలిబన్ల ఆయుధాలపై పాక్ వణుకు!
పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)ని వేడుకుంటోంది.పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్ ఇప్పుడు పాకిస్తాన్పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్ తాజగా యూఎన్ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. -
T20 World Cup 2024: అభిమానిపైకి దూసుకెళ్లిన పాక్ పేసర్.. భార్య వారించినా..!
టీ20 వరల్డ్కప్ 2024లో పాక్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో పాక్.. భారత్, యూఎస్ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్ఏ.. భారత్తో పాటు సూపర్-8లోకి ప్రవేశించింది.ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ పోరాటం ముగిసినా ఆ జట్టు ఇంకా స్వదేశానికి తిరుగు ముఖం పట్టలేదు. మరికొద్ది రోజుల పాటు పాక్ బృందం యూఎస్ఏలోనే గడపనున్నట్లు సమాచారం.A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024అయితే ఈ మధ్యలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్కు చేదు అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు. ఆ అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ.. రౌఫ్ కోపంతో ఊగిపోయాడు. దారిన పోయేవారు.. సెక్యూరిటీ వారిండంతో రౌఫ్ ఆడిపోయాడు. ఈ లోపు రౌఫ్ను రెచ్చగొట్టిన అభిమాని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అభిమాని పట్ల రౌఫ్ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. రౌఫ్ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి వీధి రౌడీలా ప్రవర్తించాడని చివాట్లు పెడుతున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు సహజమేనని.. ఇలాంటి సందర్భాల్లో పరిణితి ప్రదర్శించి చూసీ చూడనట్లు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి భారత్తో (A1) పాటు యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
పాక్ పరాభవంపై బంగ్లాదేశ్ ఓపెనర్ ట్వీట్.. షాకివ్వనున్న పీసీబీ
గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్కు అర్హత సాధించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.కఠిన చర్యలకు సిద్ధంవన్డే వరల్డ్కప్లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లో పరాజయాలు చవిచూసింది.తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
Ind Vs Pak: భారత్లో అణ్వాయుధాలు ఎన్నో తెలుసా.. పాక్లో ఇలా..
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ కంటే భారత్లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని స్పీడన్కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో అణ్వాయుధాలను పెంచుకోవడంతో ఆసియా దేశాలు భారత్, చైనా, పాకిస్తాన్లు పోటీ పడుతున్నాయని స్పష్టం చేసింది.కాగా, సిప్రి నివేదిక ప్రకారం.. భారత్లో అణ్వాయుధాలు 172 ఉండగా పాకిస్తాన్లో 170 ఉన్నట్టు పేర్కొంది. 2023 తర్వాత రెండు దేశాలు కొత్త రకమైన న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్లను అభివృద్ధి చేయడం కొనసాగించాయని పేర్కొంది. ఇక, గతేదాడితో పోలిస్తే 2024 జనవరి నాటికి చైనాలో వార్ హెడ్స్ సంఖ్య 410 నుంచి 500 పెరిగినట్టు తెలిపింది. India possesses more nuclear weapons than Pakistan, while China has expanded its nuclear arsenal from 410 warheads in January 2023 to 500 by January 2024, according to a report by Stockholm International Peace Research Institute (SIPRI)Source : HT— Naveen Kapoor (@IamNaveenKapoor) June 18, 2024 ఇక, అణ్వాయుధ సేకరణలో భారత్ను నిరోధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రణాళికలు చేస్తున్నట్టు కీలక విషయాలను వెల్లడించింది. అలాగే, సుదీర్ఘ లక్ష్యాలను తాకే అణువార్ హెడ్లపై భారత్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే, చైనాలో అణు వార్హెడ్ల నిల్వ ఇప్పటికీ రష్యా, అమెరికా కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. మరోవైపు.. భారత్, పాక్, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణు వార్హెడ్లకు సంబంధించి కీలక విషయాలను నివేదికలో పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు(బాలిస్టిక్ క్షిపణులు) ఉన్నాయి. దీంట్లో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్లో 90 వార్హెడ్స్ ఉన్నాయని తెలిపింది. 🇨🇳 China's nuclear arsenal to reach 500 warheads in 2024, says think tankChina has increased its nuclear arsenal to a total of 500 warheads in 2024, an increase of 90 warheads in 12 months, reports the Stockholm International Peace Research Institute (SIPRI). The institute… pic.twitter.com/ifgpBQ6rLi— Barong (@Barong369) June 17, 2024కాగా, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర చేసిన నేపథ్యంలో రెండు దేశాల్లోనూ అణు బలగాలకు సంబంధించి పారదర్శకత క్షీణించిందని తెలిపింది. అలాగే, రెండు దేశాల్లో అణు భాగస్వామ్య ఏర్పాట్ల గురించి చర్చలు ఉధృతంగా పెరిగాయని పేర్కొంది. 2024 జనవరిలో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,121 వార్హెడ్స్ ఉండగా.. వాటిలో దాదాపు 9,585 సైనికుల వద్దే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. జనవరి 2023తో పోలిస్తే ఇది 60 ఎక్కువ అని స్పష్టం చేసింది. -
పాకిస్తాన్ అస్సలు జట్టే కాదు.. గ్రూపులుగా విడిపోయారు: గ్యారీ కిర్స్టన్
టీ20 వరల్డ్కప్-2024లో మాజీ ఛాంపియన్స్ పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఈ మెగా టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.టీ20 వరల్డ్కప్ చరిత్రలో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ చేరాడు. ప్రస్తుత పాక్ జట్టులో కొంచెం కూడా ఐక్యత లేదని కిర్స్టెన్ మండిపడ్డాడు. కాగా 2023 వన్డే వరల్డ్కప్ తర్వాత పాక్క్రికెట్ బోర్డు తమ కోచింగ్ బృందాన్ని మొత్తం మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్కోచ్గా కిర్స్టెన్ బాధ్యతలు చేపట్టాడు.అయితే భారత్కు వన్డే వరల్డ్కప్ను అందించిన కిర్స్టెన్.. పాక్ జట్టుతో సైతం అద్భుతాలు సృష్టిస్తాడని అందరూ భావించారు. కానీ పాక్ జట్టు మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచి తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది."పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అస్సలు జట్టే కాదు. పాక్ జట్టులో ఐక్యత లేదు. ఒకరికొకరు సపోర్ట్గా లేరు. ఎవరికి వారు నచ్చిన విధంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయారు. నేను నా కెరీర్లో చాలా జట్లతో కలిసి పనిచేశాను. కానీ ఏ జట్టులో కూడా ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అదేవిధంగా పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ కూడా అంతంతమాత్రమే అని గ్యారీ కిర్స్టన్ అన్నట్లు" పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్ పిల్లలు పాకిస్తాన్లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు. -
‘బాబర్ స్థానంలో కెప్టెన్గా రమీజ్ రాజా.. ఇప్పటికీ ఫిట్గానే’
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో చెత్త ప్రదర్శనతో ఇంటా.. బయటా విమర్శలు మూటగట్టుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఓవైపు దాయాది టీమిండియా వరుస విజయాలతో సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టగా.. పాక్ మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది.పసికూనగా భావించే ఆతిథ్య అమెరికా జట్టు చేతిలో ఓటమితో ఈ ఐసీసీ ఈవెంట్ను ఆరంభించిన బాబర్ బృందం.. తర్వాతి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. అమెరికా కెనడా, పాక్లపై గెలిచి సూపర్-8 మార్గాలను సుగమం చేసుకోగా.. ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అదృష్టం కూడా కలిసి వచ్చింది.ఈ క్రమంలో పాకిస్తాన్ను వెనక్కి నెట్టి అమెరికా తదుపరి రౌండ్కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా ఫలితం లేకుండా పోయినా.. గెలుపుతో ఈ ఈవెంట్ను ముగించగలిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఆట తీరు, కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ రమీజ్ రాజాతో భర్తీ చేయాలంటూ సరదాగా పీసీబీకి సూచించాడు.బాబర్ ఆజం బదులు రమీజ్ రాజా అయితే‘‘వాళ్లు(పాక్ జట్టు) ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రమీజ్ రాజా కాపాడేవాడు. ఈసారి కూడా జట్టుకు సీఈఓవో అవుతాడేమో ఎవరికి తెలుసు?!..రమీజ్ రాజా ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు. బాబర్ ఆజంకు బదులు రమీజ్ రాజాను కెప్టెన్గా నియమించాలి’’ అని మంజ్రేకర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా మాజీ బ్యాటర్, 61 ఏళ్ల రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్(2021-2022)గా పనిచేసిన విషయం తెలిసిందే. అతడి హయాంలో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు..2021 టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరింది. అదే విధంగా 2022లో ఫైనల్ చేరి.. రన్నరప్గా నిలిచింది. చదవండి: అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్ -
అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. అసలు అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదని అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ సూపర్-8కు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. గత ప్రపంచకప్ టోర్నీ(2022)లో రన్నరప్గా నిలిచిన బాబర్ బృందం.. ఈసారి చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్గా తొలగించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.టాపార్డర్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలిబాబర్ ఆజం టీ20 ఫార్మాట్కు తగడని.. అతడికి జట్టులో చోటే అనవసరం అని పేర్కొన్నాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలి. బాబర్ ఆజం అలాంటి ప్లేయర్ కాదు.కేవలం స్పిన్నర్ల బౌలింగ్లోనే అతడు హిట్టింగ్ ఆడగలడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో అతడు ఇలాంటి సాహసం చేయడం నేనెప్పుడూ చూడలేదు.అతడు ఆచితూచి నెమ్మదిగా ఆడటమే మనకు కనబడుతుంది. బాబర్ పరుగులు సాధిస్తున్న మాట నిజమే. కానీ అతడి స్ట్రైక్రేటును కూడా గమనించాలి కదా!అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదునాయకుడిగా ఉన్నపుడు మన ఆట వల్ల జట్టుకు ప్రయోజనం కలుగుతుందా లేదో చూసుకోవాలి. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ అయి.. తన స్థానాన్ని హిట్టింగ్ ఆడగల ప్లేయర్ల కోసం త్యాగం చేయగలగాలి.ఒకవేళ అతడు గనుక కెప్టెన్ కాకపోయి ఉంటే.. అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు.. కానీ ఇదే నిజం. ఎందుకంటే నేటి టీ20 క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లు అతడి ఆట లేనేలేదు’’ అని సెహ్వాగ్ నిక్కచ్చిగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి బాబర్ ఆజం 122 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్రేటు మాత్రం కేవలం 101.66 కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏ నుంచి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, కెనడా, ఐర్లాండ్ ఇంటిబాట పట్టాయి.చదవండి: T20 WC: కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన -
కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్కప్-2023లో వైఫల్యం తర్వాతపాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్కు ఊరట విజయం లభించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 3 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్లో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా బాబర్ రికార్డులకెక్కాడు.పొట్టి ప్రపంచకప్లో బాబర్ ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్లలో 549 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని 29 ఇన్నింగ్స్లలో 529 పరుగులు చేశాడు.తాజా మ్యాచ్తో ధోని ఆల్టైమ్ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఇక ఈ జాబితాలో బాబర్, ధోని తర్వాత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(527) ఉన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూనపై ఓటమి పాలై సూపర్-8కు చేరే అవకాశాలను పాక్ కోల్పోయింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లో పాక్ విజయం సాధించింది. -
చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్
టీ20 వరల్డ్కప్-2024ను పాకిస్తాన్ విజయంతో ముగించింది. ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన పాకిస్తాన్.. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్కు 2 వికెట్లు దక్కాయి.తీవ్రంగా శ్రమించిన పాక్..అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు పాక్ తీవ్రంగా శ్రమించింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి కెప్టెన్ బాబర్ ఆజం(32) ఆజేయంగా నిలవగా.. ఆఖరిలో షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాక్కు రెండో విజయాన్ని అందించాడు.107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు."టోర్నమెంట్ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో మేము బాగానే రాణించాము. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును ఒత్తడిలోకి నెట్టాము. ఫ్లోరిడా వికెట్ పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.కానీ బ్యాటింగ్లో మాత్రం మేము మా మార్క్ను చూపించలేకపోయాము. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఏదో విధంగా టెయిలాండర్ల సాయంతో మ్యాచ్ను ముగించాము. ఇంతకుముందు మ్యాచ్ల్లో కూడా యూఎస్ఎ, భారత్పై కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయాం. జట్టు అవసరం బట్టి నేను ఏ పొజిషన్లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అది ఓపెనింగ్ అయినా, ఫస్ట్డౌన్ అయినా కావచ్చు. ఇక జట్టులో మాత్రం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మాకు కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మేము బంగ్లాపర్యటనకు వెళ్లనున్నాం. ఈ నేపథ్యంలో మా బాయ్స్ తిగిరి కమ్బ్యాక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ టోర్నమెంట్లో ఎక్కడ తప్పు జరిగిందో అంచనా వేయాల్సిన అవసరం మాకు ఉందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు.చదవండి: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం -
T20 World Cup 2024: పాకిస్తాన్ చచ్చీ చెడి...
లాడర్హిల్ (ఫ్లోరిడా): పేలవ ఆటతో ‘సూపర్–8’ అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ అతి కష్టమ్మీద నెగ్గి టి20 వరల్డ్ కప్ను ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (19 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. ఒకవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినా... కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చివరి వరకు నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) జట్టును గట్టెక్కించాడు. టి20 ప్రపంచకప్లో నేడుబంగ్లాదేశ్ X నేపాల్వేదిక: కింగ్స్టౌన్; ఉదయం గం. 5 నుంచినెదర్లాండ్స్ X శ్రీలంక వేదిక: గ్రాస్ ఐలెట్; ఉదయం గం. 6 నుంచిన్యూజిలాండ్ X పాపువా న్యూగినీవేదిక: ట్రినిడాడ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
PAK Vs IRE: ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్కప్-2024 నుంచి ఇప్పటికే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. చివరగా తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ ఆఖరి పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పాక్ జట్టులోకి నసీం షా స్ధానంలో అబ్బాస్ అఫ్రిది రాగా...ఐరీష్ జట్టులోకి బెన్ వైట్ వచ్చాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన పాక్.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. ఐర్లాండ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా గెలుపొందలేదు.తుది జట్లుఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్ -
కోహ్లి కంటే మా తమ్ముడు ఎంతో బెటర్: పాక్ మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుస్తున్న సంగతి తెలిసింది. ఐపీఎల్-2024 టాప్ రన్స్కోరర్గా నిలిచిన కింగ్ కోహ్లి.. ఈ పొట్టి ప్రపంచకప్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన విరాట్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో బెటర్ అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి సాధించిన రికార్డులకు మా తమ్ముడు ఉమర్ అక్మల్ దగ్గరకలేకపోవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ అక్మల్ రికార్డ్స్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి. టీ20 వరల్డ్కప్లో కోహ్లి కంటే మెరుగైన స్ట్రైక్ రేట్, అత్యధిక వ్యక్తిగత స్కోరును ఉమర్ కలిగి ఉన్నాడు.కానీ కోహ్లిలా మాకు పీఆర్ ఎజెన్సీలు లేవు. అందకే మా గణాంకాలు, ప్రదర్శనలను సోషల్ మీడియాలో ప్రమోటు చేసుకోలేము. పొట్టి ప్రపంచకప్లో మా తమ్ముడు కలిగి ఉన్న గణాంకాలు ప్రస్తుత 15 మంది సభ్యుల గల భారత జట్టులో ఎవరికి లేవు. ప్రస్తుత టోర్నీల్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడు. మెనెజ్మెంట్ విరాట్ను విమర్శించిన ఆశ్చర్యపోనక్కర్లలేదని ఏఆర్వై న్యూస్ డిబీట్లో కమ్రాన్ అక్మల్ విషం చిమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో వైరలవుతోంది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ అక్మల్కు కౌంటిరిస్తున్నారు. కోహ్లితో ఉమ్రాన్కు పోలికా, అందుకే మీ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయిందని పోస్టులు పెడుతున్నారు. -
పాపం పాకిస్తాన్.. అస్సలు ఊహించలేదు! టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ తొలి రౌండ్లోనే ఇంటుముఖం పట్టింది. తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన పాక్.. ఆ తర్వాత భారత్పై పోరాడి ఓటమి పాలైంది.అనంతరం కెనడాపై తిరిగి పుంజుకుని బాబర్ సేన అద్బుత విజయం సాధించింది. దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సజీవంగా నిలుపునకుంది. అయితే పాక్ భవితవ్యం ఆతిథ్య అమెరికాపై ఆధారపడింది.ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతుందని, ఆ తర్వాత ఐర్లాండ్ను ఓడించి సూపర్-8కు వెళ్లాలని భావించిన పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.ఇదే తొలిసారి..కాగా టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టడం ఇదే తొలిసారి. ఇంతకుముందు టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో పాక్ ఒక్కసారి కూడా గ్రూపు స్టేజిలో నిష్క్రమించలేదు. 2007లో షోయబ్ మాలిక్ సారథ్యంలో రన్నరప్గా పాక్ నిలిచింది. అనంతరం 2009లో కూడా యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో ఫైనల్కు చేరింది. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది(2010), మహ్మద్ హాఫీజ్(2012) కెప్టెన్సీలో పాక్ సెమీఫైనల్స్కు చేరింది. అదే విధంగా బాబర్ ఆజం నాయకత్వంలో 2021 పొట్టి వరల్డ్కప్లో సెమీఫైనలిస్ట్గా, 2022 వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచింది.కానీ ఈ సారి మాత్రం పాక్ గ్రూపు స్టేజిని దాటలేకపోయింది. దీంతో టీ20 ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించిన తొలి పాక్ జట్టు కెప్టెన్గా బాబర్ ఆజం చెత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో బాబర్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.