-
బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా?
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటిన న్యూజిలాండ్ పాకిస్తాన్ అవకాశాలను గల్లంతు చేసింది. లీగ్ దశలో ఆఖరిగా శ్రీలంకతో మ్యాచ్లో 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మొత్తంగా 10 పాయింట్లు తమ ఖాతాలో జమచేసుకుంది. దీంతో పాక్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే, కివీస్- లంక మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత కూడా బాబర్ ఆజం బృందం సెమీస్ రేసులో నిలవాలని భావిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం జరగాల్సిందే. అద్భుతం జరగాల్సిందే పాకిస్తాన్ తమకు మిగిలిన మ్యాచ్లో ఇంగ్లండ్పై గెలిస్తే న్యూజిలాండ్ మాదిరే 10 పాయింట్లు సాధిస్తుంది. కానీ రన్రేటు పరంగా ఎంతో ముందున్న కివీస్ జట్టును దాటాలంటే.. కోల్కతాలో శనివారం నాటి మ్యాచ్లో ఇంగ్లండ్పై పాక్ ఏకంగా 287 పరుగుల తేడాతో గెలవాలి. కర్మకాలి ఇంగ్లండ్ గనుక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే అక్కడే పాక్ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంగ్లండ్ ఎంతటి లక్ష్యం విధించినా దానిని మూడు ఓవర్లలోపే పాక్ ఛేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనైతే కాదు! కాబట్టి భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్-2023 నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ జట్టును తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. సురక్షితంగా వెళ్లండి.. బైబై ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా.. ‘‘బై బై పాకిస్తాన్’’ అని రాసి ఉన్న అక్షరాల ఫొటోను హైలైట్ చేస్తూ..‘‘పాకిస్తాన్ జిందా‘భాగ్’(పారిపోండి అన్న అర్థంలో) ! మీరింతే.. ఇక్కడి దాకా రాగలరంతే! ఇక్కడి బిర్యానీ రుచి, ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదించారనే అనుకుంటున్నా. విమానంలో సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. బై బై పాకిస్తాన్’’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దాయాది జట్టును ఉద్దేశించి ఈ మాజీ ఓపెనర్ చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. కాగా వన్డే వరల్డ్కప్ ఆడేందుకు తొలుత హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల అభిమానానికి ఫిదా అయిన కెప్టెన్ బాబర్ ఆజం, పేసర్ షాహిన్ ఆఫ్రిది తదితరులు కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఇక ఆ తర్వాత వెళ్లిన ప్రతిచోటా హోటల్ నుంచి కాకుండా పాక్ ఆటగాళ్లు.. బయట నుంచి బిర్యానీలు ఆర్డర్ చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వరుస ఓటముల నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ ఆశలు గల్లంతైన తరుణంలో సెహ్వాగ్ ఈ మేరకు పోస్టు పెట్టడం గమనార్హం. మీ స్థాయికి తగునా? అయితే, చాలా మంది నెటిజన్లు వీరేంద్ర సెహ్వాగ్ తీరును తప్పుబడుతున్నారు. ‘‘శత్రువుకు కూడా ప్రేమను పంచే దేశానికి మీరు.. మీ స్థాయిని మరచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు సర్. గొప్ప క్రికెటర్గా చరిత్రలో స్థానం సంపాదించిన మీకు ఆటను ఆటలాగే చూడాలని తెలియదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరి వాళ్లు అన్నపుడు ఏం చేశారు? అయితే, వీరూ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘భయ్యా అన్నదాంట్లో తప్పేముంది? మన జట్టును ఉద్దేశించి పాక్ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు మీకు కనిపించవా?’’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పాక్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్ విరాట్ కోహ్లిని సెల్ఫిష్ అంటూ చేసిన కామెంట్లు, భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇచ్చారన్న రజా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సెహ్వాగ్ చేసిన పోస్టు నెట్టింట ఇలా చర్చకు దారితీసింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
శ్రీలంకకు మరో భారీ షాక్! ఘోర పరాభవంతో నిష్క్రమణ.. అదొక్కటేనా?
ICC WC 2023- NZ vs SL: వన్డే వరల్డ్కప్-2023లో మాజీ చాంపియన్ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్ ఎడిషన్లో ఏడో పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కాగా భారత్ వేదికగా జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక తొలుత క్వాలిఫయర్స్ ఆడింది. జింబాబ్వేలో జరిగిన ఈ ఈవెంట్లో గెలిచి.. నెదర్లాండ్స్తో కలిసి టాప్-10లో చేరి ప్రపంచకప్-2023లో అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో 102 పరుగులతో చిత్తుగా ఓడిన శ్రీలంకను తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన లంక తర్వాత ఇంగ్లండ్పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. మళ్లీ పాత కథే తర్వాత నెద్లాండ్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా మళ్లీ పాత కథనే పునరావృతం చేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తై భంగపడింది. ఇక ఈ టోర్నీలో అన్నింటికంటే శ్రీలంకకు అతిపెద్ద ఓటమి ఎదురైంది మాత్రం టీమిండియా చేతిలోనే! ఆసియా కప్-2023 ఫైనల్లో కొలంబోలో లంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ప్రపంచకప్లో ముంబై వేదికగా మరోసారి మట్టికరిపించింది. ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించి ఆధిపత్యం చాటుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి.. ఈ దెబ్బకు సెమీస్ అన్న మాటను పూర్తిగా మరిచిపోయిన లంకన్ టీమ్.. కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025కైనా అర్హత సాధించాలని భావించింది. లీగ్ దశలో తమకు మిగిలిన మ్యాచ్లో గెలుపొందాలని బెంగళూరులో బరిలోకి దిగింది. అయితే, న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కావడం.. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 23.2 ఓవర్లలోనే ఛేదించడంతో మరోసారి ఓటమే ఎదురైంది. ఆ మ్యాచ్ ఫలితం తేలిన తర్వాతే దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదోస్థానంలో నిలిచింది శ్రీలంక. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్ల జాబితా నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్, ఇంగ్లండ్- పాకిస్తాన్, ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచ్ల ఫలితం తర్వాత శ్రీలంక భవితవ్యం పూర్తిగా తేలనుంది. రన్రేటు పరంగానూ వెనుకబడి ఉన్న కారణంగా ఈ మ్యాచ్ల ఫలితాలు ఎలా ఉన్నా శ్రీలంక ఆశలు వదులుకోవాల్సిందే! వన్డే వరల్డ్కప్లో అండర్డాగ్గా బరిలోకి దిగిన శ్రీలంకను గాయాల సమస్య వేధించింది. కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. మాజీ చాంపియన్కు అవమానకరరీతిలో ఇలాంటి తరుణంలో పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ నాయకుడిగా సఫలం కాలేకపోయాడు. వరుస ఓటములతో డీలా పడ్డ జట్టును పరాజయాల ఊబి నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాక చేతులెత్తేశాడు. కాగా వరల్డ్కప్-1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన శ్రీలంక ట్రోఫీ గెలిచింది. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. కానీ ఈసారి ఇలా.. అవమానకరరీతిలో ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! నాడు పాక్లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా -
శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్ బెర్త్ ఖారారు!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ బెర్త్ను కివీస్ దాదాపు ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్కు నాలుగో జట్టుగా కివీస్ అర్హత సాధించే ఛాన్స్ ఉంది. అయితే అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్ల ఫలితాల తర్వాత సెమీస్కు వచ్చే నాలుగో జట్టు ఏదో అధికారికంగా తేలనుంది. 172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్లు(45), రచిన్ రవీంద్ర(42) పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిచెల్(43) పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. లంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు సాధించగా.. థీక్షణ,చమీరా ఒక్క వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరెరా(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో థీక్షణ(38) పరుగులతో రాణించాడు. చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో రవీంద్ర ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రవీంద్ర 42 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. సచిన్ రికార్డు బద్దలు.. ఈ మెగా టోర్నీలో రవీంద్ర ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో 565 పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరట ఉండేది. 1996 వరల్డ్కప్ ఎడిషన్లో సచిన్ 523 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో సచిన్ 27 ఏళ్ల రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది వరల్డ్కప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రవీంద్రనే ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి. -
వరల్డ్కప్లో అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్ మామ
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో న్యూజిలాండ్ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక కేవలం 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పేస్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ను మరోసారి బౌలింగ్ ఎటాక్లోకి తీసుకువచ్చాడు. లంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన ఫెర్గూసన్ మూడో బంతికి కరుణరత్నేను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చమీరాకు ఫెర్గూసన్.. నాలుగో బంతిని ఫుల్టాస్గా సంధించాడు. అయితే బంతి ఇన్్సైడ్ ఎడ్జ్ తీసుకుని చమీరా ప్యాడ్కు తాకింది. కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎల్బీకి అప్పీలు చేశారు. ఈ క్రమంలో ఫస్ట్స్లిప్లో ఉన్న డార్లీ మిచెల్ మాత్రం కాన్ఫిడెన్స్తో రివ్యూ తీసుకోమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను సూచించాడు. దీంతో సీనియర్ ఆటగాడి మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో క్లియర్గా బాల్ బ్యాట్కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన కివీస్ ప్లేయర్స్ ఒక్కసారిగా నవ్వుకున్నారు. కివీస్ కెప్టెన్ నవ్వు అపుకోలేక తన చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by ICC (@icc) pic.twitter.com/xdW1vDR2kv — Cricket Videos Here (@CricketVideos98) November 9, 2023 pic.twitter.com/xdW1vDR2kv — Cricket Videos Here (@CricketVideos98) November 9, 2023 -
సెమీస్ లక్ష్యంగా! న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్
ICC Cricket World Cup 2023- New Zealand vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జట్టుకు శుభారంభం అందించారు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. నాలుగో స్థానం కోసం కివీస్ పోరాడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ పాతుమ్ నిసాంక(2)ను టిమ్ సౌథీ పెవిలియన్కు పంపగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(6)ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. అంతేకాదు.. నాలుగో స్థానంలో వచ్చిన సమరవిక్రమ(1), ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక(8)ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ కుశాల్ పెరీరా పట్టుదలగా నిలబడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్తో అర్థ శతకం సాధించి.. లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెరీరాకు సహకారం కరువైంది. దీంతో లంక స్కోరు బోర్డు నత్తనడకన సాగుతుండగా.. పెరీరా వికెట్ తీసి లాకీ ఫెర్గూసన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్ మూడో బంతికి ఫెర్గూసన్ బౌలింగ్లో మిచెల్ సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరీరా వెనుదిరిగాడు. దీంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడు. పవర్ ప్లే ముగిసే లోపే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్ పెరీరా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 74 పరుగులు చేసిన శ్రీలంకను.. ఆ తర్వాత కివీస్ బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు పడగొట్టారు. అయితే మహీశ్ తీక్షణ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 46.4 ఓవర్లలో 171 పరుగులకు లంక ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ మూడు, ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని వీలైనన్ని తక్కువ బంతుల్లో ఛేదించి రన్రేటు మెరుగుపరచుకోవడంపైనే న్యూజిలాండ్ దృష్టి సారించింది. అయితే, ఓవైపు ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు.. గత ముఖాముఖి పోరు ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు ప్రస్తుతానికి వరుణుడు, లంక బౌలర్ల ప్రదర్శన తీరుపైనే ఆధారపడి ఉన్నాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. తొలి కివీస్ బౌలర్గా
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50కు పైగా వికెట్లు సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్గా బౌల్ట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో కుశాల్ మెండిస్ను ఔట్ చేసిన బౌల్ట్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్కప్లో టోర్నీలో బౌల్ట్ ఇప్పటివరకు 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా బౌల్ట్ నిలిచాడు. బౌల్ట్ కంటే ముందు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు వసీం అక్రమ్, మిచిల్ స్టార్క్ ఈ ఘనత సాధించారు. ఇక ఓవరాల్గా ఈ రికార్డు సాధించిన లిస్ట్లో బౌల్ట్ ఆరో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్(71 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్(68), స్టార్క్(59), లసిత్ మలింగ(56), వసీం అక్రమ్(55) ఉన్నారు. చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by ICC (@icc) -
శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ ఫిప్టి
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్పై శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరెరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై పెరెరా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ ఫిప్టి చేసిన ఆటగాడిగా పెరీరా నిలిచాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో హెడ్ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్తో హెడ్ రికార్డును కుశాల్ బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 51 పరుగులు చేసిన పెరీరా.. ఫెర్గూసన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో కేవలం 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు, సౌథీ, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించాడు. చదవండి: అందుకే కోహ్లిని ప్రతిసారి ‘సెల్ఫిష్’ అంటున్నావా?: పాక్ మాజీ కెప్టెన్కు కౌంటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు లంక విలవిల.. నామమాత్రపు స్కోరు
CWC 2023- NZ vs SL Updates: న్యూజిలాండ్తో మ్యాచ్లో శ్రీలంక 171 పరగులకు ఆలౌట్ అయింది. కివీస్తో మ్యాచ్.. కష్టాల్లో శ్రీలంక జట్టు 32.1: రచిన్ రవీంద్ర బౌలింగ్లో బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి చమీర అవుట్(1). 33 ఓవర్లలో లంక స్కోరు: 132-9 ► 25 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు: 114-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 23.3: ఫెర్గూసన్ బౌలింగ్లో లాథమ్కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నె అవుట్(6). లంక స్కోరు: 113/8 (23.3) 19 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 105-7 ►18.3: సాంట్నర్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ధనంజయ(19) ►16.4: సాంట్నర్ బౌలింగ్లో మథ్యూస్(16) అవుట్.. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక పవర్ ప్లేలో అతడొక్కడే న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక రెండు పరుగులకే అవుట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 6 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధ శతకం(51) సాధించగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన సమర విక్రమ 1, చరిత్ అసలంక 8, పరుగులు మాత్రమే చేశారు. దీంతో పవర్ప్లే(10 ఓవర్లు) ముగిసే సరికి లంక కేవలం 74 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ ఒక్కో వికెట్ పడగొట్టారు. వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (నవంబర్ 9) జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ కివీస్ తుది జట్టులోకి రాగా.. కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే లంక ప్లేయింగ్ ఎలెవెన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు.. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక -
శ్రీలంకతో మ్యాచ్.. కివీస్ను కలవరపెడుతున్న గతం.. మరోవైపు..
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకకు నామమాత్రమే కాగా.. సెమీస్ రేసులో ఉన్న న్యూజిలాండ్కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఇందులో న్యూజిలాండ్ భారీ తేడాతో గెలిస్తే పాక్, ఆఫ్ఘనిస్తాన్లతో సంబంధం లేకుండా సెమీస్కు చేరుకుంటుంది. బలాబలాలు, ప్రస్తుత ఫామ్ ప్రకారం కివీస్తో పోలిస్తే శ్రీలంక బలహీనమైన ప్రత్యర్దిగా ఉంది కాబట్టి, ఈ మ్యాచ్లో కివీస్ గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు కివీస్ను రెండు అంశాలు కలవరపెడుతున్నాయి. అందులో ఒకటి వరుణ గండం కాగా.. రెండోది శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్. వరుణ గండం విషయానికొస్తే.. లంకతో మ్యాచ్కు వేదిక అయిన బెంగళూరులో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఒకటి, రెండుసార్లు మ్యాచ్కు అంతరాయం కలిగించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అ యితే మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించడం కివీస్కు అంత మంచిది కాదు. పూర్తి మ్యాచ్ జరిగితేనే ఆ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి. కివీస్ ఎంత బాగా ఆడినా వరుణుడు అడ్డుతగిలితే ఏమవుతుందో పాక్తో జరిగిన మ్యాచ్లో మనం చూశాం. అందుకే ఈ మ్యాచ్ పూర్తిగా సాగాలని కివీస్ కోరుకుంటుంది. మరోవైపు వరల్డ్కప్ టోర్నీల్లో శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్ కివీస్ను భయపెడుతుంది. 2007, 2011 వరల్డ్కప్ టోర్నీల్లో శ్రీలంక.. కివీస్ పాలిట కొరకరాని కొయ్యలా ఉండింది. ఈ రెండు వరల్డ్కప్ ఎడిషన్ల సెమీస్లో శ్రీలంక కివీస్ను మట్టికరిపించింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని కివీస్ అభిమానులు కలవరపడుతున్నారు. దీనికి తోడు మెగా టోర్నీల్లో దురదృష్టం, కీలక ఆటగాళ్ల గాయాలు కివీస్కు ప్రతికూలంగా మారాయి. వరుణ గండాన్ని, సెంటిమెంట్ను అధిగమించి లంకపై భారీ తేడాతో గెలవాలని కివీస్ ఆటగాళ్లు అనుకుంటున్నారు. -
CWC 2023 Semis Race: కివీస్.. శ్రీలంక చేతిలో ఓడినా పర్లేదు.. !
వన్డే వరల్డ్కప్ 2023లో ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్లో శ్రీలంక,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేసులో ముందువరుసలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. లంకపై కివీస్ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోటీ ఉండదు. ఆయా జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్కు చేరుకుంటుంది. లంక చేతితో ఓడినా సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది.. ఒకవేళ ఇవాళ జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్.. శ్రీలంక చేతిలో ఓడినా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదెలా అంటే.. సెమీస్ రేసులో ఉన్న మిగతా రెండు జట్లు తమతమ ప్రత్యర్దుల చేతుల్లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్, పాక్, ఆఫ్ఘనిస్తాన్కు సమానంగా 8 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుంటుంది. ఎవరు గెలిచినా సెమీస్లో టీమిండియానే ప్రత్యర్ధి.. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న మూడు జట్లలో (కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్) ఏ జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించినా అక్కడ వారి ప్రత్యర్ది టీమిండియానే అవుతుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తలపడాల్సి ఉంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు మరో సెమీస్లో తలపడతాయి. ప్రస్తుత ఎడిషన్లో వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిచిన భారత్.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే నిలుస్తుంది. అలాగే రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సైతం మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. గెలుపోటములు వారి స్థానాలపై ప్రభావం చూపవు. కాబట్టి రెండో సెమీస్లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖరారైపోయింది. సెమీస్ ఎప్పుడు, ఎక్కడ అంటే.. ప్రస్తుత వరల్డ్కప్లో రెండో సెమీస్లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. తొలి సెమీస్లో భారత్తో తలపడబోయే జట్టు ఏదో తేలాల్సి ఉంది. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్లలో ఏ జట్టు సెమీస్కు చేరినా ముంబై వేదికగా నవంబర్ 15న భారత్తో తలపడాల్సి ఉంటుంది. కోల్కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీస్లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖాయమైపోయింది. ఈ రెండు సెమీస్లలో గెలిచే జట్లు నవంబర్ 19న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
న్యూజిలాండ్కు షాక్ తప్పదా? బ్యాడ్న్యూస్ ఏమిటంటే..?
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4లో నిలిచేందుకు న్యూజిలాండ్, పాకిస్తాన్లతో పాటు.. అఫ్గనిస్తాన్ కూడా పోటీ పడుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఈ మూడు జట్లు నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే, రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లను దాటి నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో ఈ మూడు జట్లకు మిగిలిన ఒక్క మ్యాచ్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్లలో న్యూజిలాండ్, పాక్, అఫ్గన్ విజయం సాధిస్తే రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్లో అడుగుపెడుతుంది. ముందుగా న్యూజిలాండ్ బరిలోకి ఈ క్రమంలో ముందుగా... న్యూజిలాండ్ శ్రీలంకతో గురువారం మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో కివీస్ భారీ విజయం గనుక సాధిస్తే సులువుగానే సెమీస్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే, వర్షం రూపంలో కివీస్ జట్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. accuweather సైట్ వివరాల ప్రకారం గురువారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా.. లేదంటే దురదృష్టవశాత్తూ లంక చేతిలో ఓడినా కివీస్కు ఎదురుదెబ్బ తప్పదు. అలా అయితే పాక్, అఫ్గన్ మరింత ముందుకు కాగా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే కివీస్, లంకకు చెరో పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే అపుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం పడక అంతా సవ్యంగా సాగి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల తర్వాతే సెమీస్ బెర్తు ఖాయమైంది లేనిదీ తెలుస్తుంది. అయితే, శ్రీలంకతో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం అఫ్గన్, పాకిస్తాన్ రేసులో మరో ముందడుగు వేస్తాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ -
WC 2023: వన్డే వరల్డ్కప్లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే
ICC ODI World Cup 2023 All Final Squads: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా అక్టోబరు 5న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరుతో మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్.. మొత్తంగా పది జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచే వామప్ మ్యాచ్లు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే వరల్డ్కప్-2023 కోసం ఆయా మేనేజ్మెంట్లు ఖరారు చేసిన ఫైనల్ టీమ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్. పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం. అఫ్గనిస్తాన్ హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్. ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్. ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. సౌతాఫ్రికా తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్. శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ -
WC 2023: ఈసారి వరల్డ్కప్ ఫేవరెట్లు ఆ ఐదు జట్లే! కానీ..
ICC World Cup 2023: వన్డే వరల్డ్కప్-2023కి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 5న ఈ ఐసీసీ ఈవెంట్ 13వ ఎడిషన్ మొదలుకానుంది. పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్య ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ తదితర పది జట్లు పాల్గొనబోతున్నాయి. 2011లో.. తర్వాత మళ్లీ ఇప్పుడే ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ రాకతో మరింత పటిష్టంగా మారగా.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బార్డ్) వరల్డ్కప్-2023లో ఫేవరెట్లు ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ ఐదు జట్లు ఫేవరెట్.. కానీ ‘‘వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ ర్యాంకులో ఉంది. అదీగాకుండా ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగనుంది. కాబట్టి వాళ్లకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉంది. కాబట్టి ఆసీస్ జట్టు కూడా ఎప్పుడూ బలమైన పోటీదారే. పాకిస్తాన్ కూడా తనదైన రోజున అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. పాక్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా కూడా గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతోంది. సమతూకమైన జట్టుగానూ ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక కూడా సవాల్ విసరగలుగుతాయి. అయితే, ఐసీసీ వరల్డ్కప్ విజేత ఎవరన్న అంశంపై అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్ దృష్ట్యానే ఈ టీమ్లను ఎంచుకోవడం జరిగింది’’ అని బార్డ్ సమాధానమిచ్చింది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
శ్రీలంకతో న్యూజిలాండ్ మూడో టీ20.. మ్యాచ్ మధ్యలో విమానం
NZ VS SL 3rd T20: క్వీన్స్టౌన్లోని జాన్ డేవిస్ మైదానంలో ఇవాళ (ఏప్రిల్ 10) న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ మరో బంతి మిగిల్చి లక్ష్యాన్ని చేరుకుంది (19.5 ఓవర్లలో 183/6). న్యూజిలాండ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. చాప్మన్ తొలి బంతికే సిక్సర్ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ.. కివీస్ మరుసటి 3 బంతులకు 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది. అయితే 19వ ఓవర్ ఐదో బంతికి రచిన్ రవీంద్ర 2 పరుగులు తీయడంతో న్యూజిలాండ్ మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంక బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుండగానే, ఇంచుమించు చేతికందేంత ఎత్తులో ఓ విమానం టేకాఫ్ అయ్యింది. ఇది పెద్దగా పట్టించుకోకుండా ఆటగాళ్లు ఆటను కొనసాగించగా.. మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఏమాత్రం బెరుకు లేకుండా ఆటను ఆస్వాధిస్తూ కనిపించారు. విమానం మ్యాచ్ మధ్యలో టేకాఫ్ అవుతున్న దృశ్యం సోషల్మీడియాలో వైరలవగా.. విషయం తెలియని వారు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. జనాలకు ఇంత దగ్గరలో విమానాలు వెళితే ఎంత ప్రమాదమని కొందరంటుంటే, ఇంకొందరేమో ఇది కెమెరా ట్రిక్ అని లైట్గా తీసుకుంటున్నారు. వాస్తవ విషయం ఏంటంటే, జాన్ డేవిస్ మైదానం పక్కనే ఎయిర్పోర్ట్ రన్వే ఉంది. అనునిత్యం ఇక్కడి నుంచి విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. గతంలో చాలా సందర్భాల్లో మ్యాచ్లు జరుగుతుండగా విమానలు టేకాఫ్ అయ్యాయి. -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్ను కూడా ఆతిథ్య కివీస్కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్ను గెలుపుబాట పట్టించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
థండర్బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్
శ్రీలంకతో రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే దుమ్ము రేపాడు. ఐదు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల బ్యాటింగ్ కోటా పూర్తి చేసిన మిల్నే.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్లు కూల్చాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(9)ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి కివీస్కు శుభారంభం అందించిన మిల్నే.. కుశాల్ పెరెరా(35), చరిత్ అసలంక(24) సహా ఆఖర్లో ప్రమోద్ మదుషాన్(1), దిల్షాన్ మదుషంక(0)లను పెవిలియన్కు పంపాడు. మిల్నే విజృంభణ.. దంచి కొట్టిన సీఫర్ట్ మిల్నే విజృంభణతో డునెడిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య కివీస్ .. లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసి టార్గెట్ను ఛేదించింది. దసున్ షనక విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 9 వికెట్లతో గెలుపొంది.. తొలి టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. సిరీస్ను 1-1తో సమం చేసింది. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది ఇదిలా ఉంటే.. తన అద్భుత బౌలింగ్తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్ డెలివరీతో పాతుమ్ నిసాంక బ్యాట్ను విరగ్గొట్టిన తీరు ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంకకు ఆరంభంలోనే ఈ మేరకు తన పేస్ పదును చూపించాడు మిల్నే. తొలి ఓవర్లోనే మిల్నే దెబ్బకు పాతుమ్ నిసాంక బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా న్యూజిలాండ్- శ్రీలంక రెండో టీ20లో మిల్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 8న నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. చదవండి: వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు 🚨 BROKEN BAT 🚨 Adam Milne with a ☄️ breaking Nissanka’s bat 😮 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/F2uI6NiUni — Spark Sport (@sparknzsport) April 5, 2023 Pathum Nissanka's bat 🤯#SparkSport #NZvSL pic.twitter.com/t2cLh9w9Iq — Spark Sport (@sparknzsport) April 5, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్లో
ఆక్లాండ్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 థ్రిల్లర్ సినిమాను తలపించింది. సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్లో అంతిమంగా విజయం శ్రీలంకనే వరించింది. 197 విజయ లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్ను వేసే బాధ్యత లంక కెప్టెన్ స్పిన్నర్ తీక్షణకు అప్పజెప్పాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక 9 పరుగుల లక్క్ష్యంతో దిగిన శ్రీలంక.. మూడు బంతుల్లోనే ఛేదించింది. లంక బ్యాటర్ అసలంక సిక్స్, ఫోర్తో మ్యాచ్ ఫినిస్ చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అసలంక, పెరీరా సూపర్ ఇన్నింగ్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(45 బంతుల్లో 53), అసలంక(41 బంతుల్లో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 197 పరుగుల లక్క్ష్య చేధనలో కివీస్ కూడా ధీటుగా బదులిచ్చింది. డారిల్ మిచెల్(66), ఆఖరిలో సోధి(4 బంతుల్లో 10 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ మ్యాచ్ను టైగా ముగించింది. అయితే సూపర్ ఓవర్లో మాత్రం విజయం లంకవైపే నిలిచింది. ఇక ఈ ఏడాది కివీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి లంక బదులు తీర్చుకున్నట్లైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డునెడిన్ వేదికగా ఏప్రిల్ 5న జరగనుంది. చదవండి: భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్రౌండర్ మృతి -
WC 2023: 44 ఏళ్ల తర్వాత.. తొలిసారి! లంకకు ఏంటీ దుస్థితి? కివీస్ వల్లే..
Sri Lanka Failed To Qualify ICC ODI WC 2023 Directly: 1996 వరల్డ్కప్ ఛాంపియన్స్.. 2007, 2011 ప్రపంచకప్ రన్నరప్.. ఇవీ వన్డే క్రికెట్లో శ్రీలంక సాధించిన అద్బుతాలు. అయితే ఇదంతా గతం. కట్చేస్తే .. 2023 వన్డే వరల్డ్కప్నకు నేరుగా అర్హత సాధించని జట్టుగా లంక అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, చమిందా వాస్ సహా ఎందరో హేమాహేమీలను అందించిన శ్రీలంక క్రికెట్ ఇప్పుడు కనీసం వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవ్వడం అందరిని విస్మయపరిచింది. 44 ఏళ్ల తర్వాత లంక మళ్లీ వన్డే వరల్డ్కప్లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. వరుస ఓటములు లంక అవకాశాలను దెబ్బకొట్టాయి. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడలా.. ఇప్పుడిలా అడ్డుకున్న కివీస్ ఇందులో భాగంగా రెండు టెస్టుల్లో పోరాడి ఓడిన లంక జట్టు.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఫలితం నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. తొలి మ్యాచ్లో కేవలం రెండు వికెట్లతో ఓటమి పాలైన కరుణ రత్నె బృందం.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్.. తాజాగా వన్డే ప్రపంచకప్లో నేరుగా అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసింది. తొలి వన్డేలో 198 పరుగులతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. శుక్రవారం నాటి మూడో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. షనక బృందం అవుట్ కాగా రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో వన్డే సిరీస్ కోల్పోయిన దసున్ షనక బృందం ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశం కూడా చేజార్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేలో జూన్లో జరుగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. కాగా కివీస్తో మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే సూపర్లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్కు సౌతాఫ్రికా నుంచి ప్రమాదం పొంచి ఉంది. నెదర్లాండ్స్తో సిరీస్లో సత్తా చాటితే ప్రొటిస్ విండీస్ను వెనక్కినెట్టి రేసులో మరో ముందడుగు వేస్తుంది. కాగా భారత్ వేదికగా అక్టోబరులో వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: IPL 2023 Captains Salaries: సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! వీరి గురించి తెలుసా? పాపం అతడొక్కడే! -
శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు.. కివీస్తో రెండో వన్డే వర్షార్పణం, అంతలోనే మరో షాక్
2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు. 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లాలని భావించిన ఆ జట్టును ఆతిధ్య దేశం చావుదెబ్బకొట్టగా.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్తో ఇవాళ (మార్చి 28) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం కావడంతో వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించే అశలను పూర్తిగా వదిలేసుకుంది. ఇంతలోనే ఆ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. కివీస్తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ ఆ జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. దీంతో శ్రీలంక అధికారికంగా వరల్డ్కప్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చిన్న జట్లతో క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడి వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, క్రైస్ట్చర్చ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో శ్రీలంక సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే తొలి వన్డేలో నెగ్గిన కివీస్ 3 మ్యాచ్ల సిరీస్లో 2 వన్డేల అనంతరం 1-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ శ్రీలంక ఆఖరి వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. మూడో వన్డే మార్చి 31న హామిల్టన్ వేదికగా జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. -
న్యూజిలాండ్ కెప్టెన్గా టామ్ లాథమ్.. ఇద్దరు క్రికెటర్ల ఎంట్రీ!
శ్రీలంక, పాకిస్తాన్తో టీ20 సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లకు రెండు వెర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ రెండు సిరీస్లకు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ దూరమయ్యారు. ఐపీఎల్లో పాల్గొనేందుకు వీరిద్దరూ భారత్కు రానుండడంతో ఈ సిరీస్లకు దూరమయ్యారు. ఇక ఈ రెండు సిరీస్లకు కివీస్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. అదే విధంగా చాడ్ బోవ్స్, షిప్లీ తొలి సారి న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా న్యూజిలాండ్ స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఏప్రిల్ 2న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం కివీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో కివీస్ ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి 24 వరకు జరగనుంది. శ్రీలంక సిరీస్కు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. పాకిస్తాన్ సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. డేన్ క్లీవర్, కోల్ మెక్కాన్చీ, బ్లెయిర్ టిక్నర్. చదవండి: BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
క్లియర్గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కివీస్ పేసర్ల దాటికి కేవలం 76 పరుగులకే కూప్పకూలింది. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్, టిక్నర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్లో నాలుగో బంతిని ఆడిన కరుణరత్నే వెంటనే సింగిల్ తీయడానికి తీయడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న కివీస్ ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. బంతిని అందుకున్న టిక్నర్ వెంటనే స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్కు చేశాడు. రిప్లేలో టిక్నర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు దూరంలో ఉన్నాడు. దీంతో కరుణరత్నే ఔట్ అని అంతా భావించారు. అయితే ఇక్కడే కరుణరత్నేని అదృష్టం వెంటాడింది. బంతి స్టంప్స్ తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. వాటిలో బ్యాటరీలు అయిపోయాయి. దీంతో రూల్స్ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయం చూసిన కివీస్ ఆటగాళ్లు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా రనౌట్ విషయంలో బెయిల్స్ వెలగకపోవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Virat Kohli: ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్ Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd — Spark Sport (@sparknzsport) March 25, 2023 -
కివీస్ చేతిలో ఓటమి.. వరల్డ్కప్ రేసు నుంచి శ్రీలంక ఔట్..!
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పరుగుల పరంగా శ్రీలంకపై కివీస్కు ఇది అతి పెద్ద విజయం. ఈ గెలుపుతో న్యూజిలాండ్ వరల్డ్కప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. వన్డే వరల్డ్కప్కు నేరుగా క్వాలిఫై కావాలన్న శ్రీలంక ఆశలు ఆవిరయ్యాయి. శ్రీలంకతో 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లోనూ న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఆడగా రెండింటిలో ఫలితం రాకపోగా.. 15 గెలిచి, ఐదింటిలో ఓడింది. దీంతో ఆ జట్టు ఖాతాలోకి 160 పాయింట్లు చేరాయి. New Zealand have topped the @MRFWorldwide ICC Men’s @cricketworldcup Super League table 💥#NZvSL report 👇https://t.co/PyjYWvuA3G — ICC (@ICC) March 25, 2023 న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండ్ (155), ఇండియా (139), బంగ్లాదేశ్ (130), పాకిస్తాన్ (130), ఆస్ట్రేలియా (120), ఆఫ్ఘనిస్తాన్ (112) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్కప్-2023కు ఈ 7 జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. మిగిలిన మరో స్థానం కోసం శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్లు పోటీపడుతున్నాయి. సీజన్ ముగిసే సమయానికి 8వ స్థానంలో ఉండే జట్టు నేరుగా వరల్డ్కప్కు అర్హత సాధిస్తుంది. తొలి వన్డేలో కివీస్ చేతిలో భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో శ్రీలంక 10వ స్థానానికి పడిపోయి వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఒకవేళ లంకేయులు కివీస్పై రెండు, మూడు వన్డేల్లో గెలిచినా ఇతర మ్యాచ్ల ఫలితాలపై వరల్డ్కప్ క్వాలిఫయింగ్ ఛాన్సస్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం స్టాండింగ్స్లో ఉన్న 9వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. త్వరలో నెదర్లాండ్స్తో జరుగబోయే రెండు వన్డేల్లో విజయం సాధిస్తే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం శ్రీలంకతో పాటు 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్, 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ కూడా వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా కోల్పోయాయి. ఒకవేళ సౌతాఫ్రికా వరల్డ్కప్కు నేరుగా క్వాలిఫై అయితే వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ తదితర జట్లతో కలిసి క్వాలిఫయర్ పోటీల్లో తలపడాల్సి ఉంటుంది. ఈ పోటీలు జూన్ 8న మొదలవుతాయి. -
నిప్పులు చెరిగిన షిప్లే.. వణికిపోయిన లంకేయులు
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 25) జరిగిన తొలి వన్డేలో ఆతిధ్య న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ హెన్రీ షిప్లే నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా 275 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. షిప్లే ధాటికి లంక ఆటగాళ్లు వణికిపోయారు. ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టాడు. A maiden international five-wicket bag for Henry Shipley! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/VJv6zEepHG — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 మెరుపు వేగంతో షిప్లే సంధించిన బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొనేందుకు లంక ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. షిప్లే నిస్సంకను క్లీన్బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. షిప్లేకు జతగా డారిల్ మిచెల్ (2/12), బ్లెయిర్ టిక్నర్ (2/20) కూడా రాణించడంతో 20 ఓవర్లలోపే లంకేయుల ఖేల్ ఖతమైంది. ఈ విజయంతో 3 మ్యాచ్ల ఈ సిరీస్లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. What a ball Mr Shipley 👏 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport#SparkSport #NZvSL pic.twitter.com/zHv8yZvr4M — Spark Sport (@sparknzsport) March 25, 2023 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ (51) హాఫ్ సెంచరీతో రాణించగా.. డారిల్ మిచెల్ (47), గ్లెన్ ఫిలిప్స్ (39), రచిన్ రవీంద్ర (49) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమిక కరుణరత్నే 4 వికెట్లు పడగొట్టగా.. రజిత, లహీరు కుమార తలో 2 వికెట్లు, మధుశంక, షనక చెరో వికెట్ దక్కించుకున్నారు. A special moment at @edenparknz. A Moment of Acknowledgment at the 14.2 over mark to honour all those affected by Cyclone Gabriel and the floods - along with those helping with the recovery. Text DONATE to 540 to donate to the @NZRedCross Disaster Relief Fund. #CricketNation pic.twitter.com/QfSepLT1ma — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 ఈ మ్యాచ్ ద్వారా లభించే మొత్తాన్ని కివీస్ క్రికెటర్లు ఇటీవల విధ్వంసం సృష్టించిన గాబ్రియెల్ సైక్లోన్ బాధితులకు అందజేయనున్నారు. తుఫాను బాధితులకు సంఘీభావంగా ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు 14.2 ఓవర్ తర్వాత లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా కివీస్ ఆటగాడు బ్లెయిర్ టిక్నర్ కంటతడి పెట్టుకోవడం అందరిని కలచివేసింది.