-
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్హోం, లండన్లోని ట్రఫాల్గర్ స్క్వేర్లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్ను ప్రారంభించింది. ఈ హోటల్ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్కు చివరి రోజుగా ఇన్స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్లో ఆమె షేర్ చేసిన స్క్రీన్షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. -
తప్పతాగి డ్రైవింగ్.. ప్రముఖ సింగర్ అరెస్ట్!
ప్రముఖ అమెరికన్ సింగర్, గ్రామీ అవార్డ్ విన్నర్ జస్టిన్ టింబర్లేక్ అరెస్టయ్యారు. తప్పతాగి డ్రైవింగ్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్ ఐలాండ్లోని సాగ్ హార్బర్లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని స్థానికి మీడియా ధృవీకరించింది. ప్రస్తుతం ఆయన పోలీసులు కస్టడీలోనే ఉన్నారు.ప్రస్తుతం టింబర్లేక్ ఫర్గెట్ టుమారో పేరుతో గ్లోబల్ టూర్లో ఉన్నాడు. మార్చిలో ప్రారంభమైన కొత్త ఆల్బమ్ "ఎవ్రీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్" ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. వచ్చే వారంలో చికాగో, న్యూయార్క్లోని కచేరీలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత యూరప్లో టింబర్ లేక్ ప్రదర్శనలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి.కాగా.. టింబర్ లేక్ 2002లో సోలో రికార్డింగ్ వృత్తితో కెరీర్ ప్రారంభించాడు. ది సోషల్ నెట్వర్క్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అవైన్ వంటి చిత్రాలలో కనిపించాడు. తన టాలెంట్ గానూ గ్రామీ అవార్డ్ దక్కించుకున్నారు. -
106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం!
న్యూయార్క్: ప్రస్తుత టి20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆ్రస్టేలియా (అడిలైడ్)లో తయారు చేసిన ‘డ్రాప్ ఇన్’ పిచ్లతో న్యూయార్క్లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్తో కలిసి మెగా ఈవెంట్కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం ఇక్కడ లీగ్ దశనే జరుగుతుంది. న్యూయార్క్లోని నాసా స్టేడియం 8 మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో–అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్... బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ సహా నాలుగు మ్యాచ్ల్ని ఆడింది. 9న భారత్, పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు. ఇక వేదిక విషయానికొస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఈ స్టేడియం పిచ్ అత్యంత పేలవం. టి20లకు ఏమాత్రం కుదరని పిచ్లపై బ్యాట్ డీలా పడటంతో మెరుపులు, ధనాధన్ లేక టి20 ప్రపంచకప్ మ్యాచ్లే చిన్నబోయేలా చేసింది. క్రికెటర్లు, మాజీలే కాదు... విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్పై దుమ్మెత్తి పోశారు. కొసమెరుపు ఏమిటంతే ఈ నెల 1న బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి 14 (నేటి)తో కాలం చెల్లబోతుంది. -
USA: టీమిండియాను సత్కరించిన ఇండియన్ ఎంబసీ(ఫొటోలు)
-
రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ?
అమెరికాలోని ప్రఖ్యాత నగరంలోని స్టేడియం... నిర్మాణానికి దాదాపుగా 250 కోట్ల రూపాయల ఖర్చు... 34,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించేలా సీటింగ్ సామర్థ్యం..పరుగుల వరద పారుతుందని భావిస్తే టీ20 ఫార్మాట్కు భిన్నంగా లో స్కోరింగ్ మ్యాచ్లు.. బౌండరీల సంగతి దేవుడెరుగు సింగిల్స్ తీయాలన్నా కష్టంగా తోచే పిచ్. 👉తొలి మ్యాచ్లో శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా.. నమోదైన స్కోర్లు.. 77 (19.1), 80/4 (16.2). ఆరు వికెట్ల తేడాతో లంకపై సౌతాఫ్రికా విజయం.👉రెండో మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్.. స్కోర్లు 96 (16), 97/2 (12.2).. ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసిన టీమిండియా.👉ముచ్చటగా మూడో మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడ్డ కెనడా.. స్కోర్లు 137/7 (20)- 125/7 (20). 12 పరుగుల తేడాతో కెనడా గెలుపు.👉ఇక నాలుగో మ్యాచ్ నెదర్లాండ్స్- సౌతాఫ్రికా మధ్య. ఇది కూడా లో స్కోరింగ్ మ్యాచే! నెదర్లాండ్స్ 103 రన్స్ చేస్తే.. సౌతాఫ్రికా 106 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.👉ఐదో మ్యాచ్.. వరల్డ్కప్కే హైలైట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. ఇండియా 119 పరుగులకు ఆలౌట్ అయితే.. పాక్ 113 పరుగుల వద్దే నిలిచి.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.👉ఆ తర్వాత సౌతాఫ్రికా(113/6)తో బంగ్లాదేశ్(109/7) తలపడగా.. ప్రొటిస్ జట్టు బంగ్లాపై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.👉ఏడో మ్యాచ్లో కెనడా- పాకిస్తాన్ పోటీపడగా.. 106 పరుగులకే పరిమితమైన కెనడా.. 107 పరుగులు(17.3 ఓవర్లలో) చేసిన పాక్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది.ఇదే ఆఖరు.. కూల్చేయడమే తరువాయిఇక ఆఖరిసారిగా ఇక్కడ ఆతిథ్య అమెరికా జట్టు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గ్రూప్-ఏ లో ఉన్న ఈ జట్ల మధ్య జరిగే మ్యాచే ఇక్కడ జరిగే చివరి మ్యాచ్. ఆ తర్వాత దీనిని కూల్చేస్తారు.అవును.. మీరు విన్నది నిజమే. ఇదంతా న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించే! టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.20 జట్లు.. తొమ్మిది వేదికలువెస్టిండీస్తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్ఏలో మూడు వేదికల్లో మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూయార్క్- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడా- లాడర్హిల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్-టెక్సాస్లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియాలలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు.అయితే, వీటిలో నసావూ కౌంటీ స్టేడియాన్ని ఈ ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి తాత్కాలికంగా నిర్మించింది. జూన్ 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్లు పూర్తైన తర్వాత దీనిని డిస్మాంటిల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.పెదవి విరిచిన ప్రేక్షకులుఅయితే, డ్రాప్- ఇన్ పిచ్ ఉన్న ఈ స్టేడియం కోసం ఐసీసీ సుమారుగా రూ. 250 కోట్లు ఖర్చు చేసినా.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ బిగ్ ఆపిల్ సిటీలోని నసావూ కౌంటీ స్టేడియం సంగతి!!టీ20 ప్రపంచకప్-2024లో మొత్తం 20 జట్లు భాగం కాగా.. అమెరికాలో మూడు, వెస్టిండీస్(గయానా, బార్బడోస్, ఆంటిగ్వా, ట్రినిడాడ్, సెయింట్ విన్సెంట్, సెయింట్ లూసియా)లోని ఆరు నగరాలు ఇందుకు ఆతిథ్యం ఇస్తున్నాయి. చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? -
Ind vs Pak: పాక్ ఓటమి.. ఢిల్లీ పోలీస్ విభాగం పోస్ట్ వైరల్
దాయాదులు టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. చిరకాల ప్రత్యర్థులు నువ్వా- నేనా అన్నట్లు పోటీపడితే చూడాలని కోరుకుంటారు ఇరు దేశాల అభిమానులు. తామూ ఈ జాబితాలో భాగమే అంటున్నారు ఢిల్లీ పోలీసులు.టోర్నీ ఏదైనా భారత్- పాక్ మ్యాచ్ అంటే తమకూ ఆసక్తేనని.. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం అసలైన మజా అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోహిత్ సేన చేతిలో మరోసారి పరాభవం పాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టును దారుణంగా ట్రోల్ చేసింది ఢిల్లీ పోలీస్ విభాగం.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా పాకిస్తాన్తో తలపడ్డ టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 119 పరుగులకు ఆలౌట్ అయింది.అయితే, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 113 పరుగులకే పాక్ కథ ముగియగా.. టీమిండియా జయకేతనం ఎగురవేసింది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు(7) గెలుపొందిన తొలి జట్టుగా నిలిచింది.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే గెలుపోటములు మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ విభాగం తమ ఎక్స్ ఖాతాలో న్యూయార్క్ పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసింది.‘‘హే.. న్యూయార్క్ సిటీ పోలీస్. మాకు రెండు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఒకటి.. ‘ఇండియా.. ఇండియా!’.. రెండోది.. బహుశా టీవీలు పగిలిన శబ్దం అనుకుంటా. నిజమో కాదో కాస్త చెప్తారా?’’ అంటూ ఢిల్లీ పోలీస్ విభాగం చమత్కరించింది. ఈ ట్వీట్ వైరల్గా మారింది.ఇప్పటికే ఈ టోర్నీలో పసికూన యూఎస్ఏ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. తాజాగా టీమిండియా చేతిలోనూ ఓడిపోవడంతో సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బాబర్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.Hey, @NYPDnewsWe heard two loud noises. One is "Indiaaa..India!", and another is probably of broken televisions. Can you please confirm?#INDvsPAK#INDvPAK#T20WorldCup— Delhi Police (@DelhiPolice) June 9, 2024 -
IND Vs PAK: పాక్-భారత్ మ్యాచ్లో అనూహ్య పరిణామం
న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్-భారత్ మ్యాచ్కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
టీ20 వరల్డ్కప్-2024లో అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకున్నాయి. సాధరణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ జట్టు బలమెంత? బలహీనతలు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అది పిచ్ కాదు.. భూతంఈ ఏడాది పొట్టి వరల్డ్కప్నకు వెస్టిండీస్తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెలల ముందు అమెరికాలోని న్యూయర్క్లో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వరల్డ్కప్లో నసావు మైదానం వేదికగా మొత్తం 8 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా, ఐర్లాండ్- కెనడా, దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్లు జరిగాయి. ఈ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఈ వికెట్పై అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నసావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో కెనడా చేసిన 137 పరుగులకే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పిచ్పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లోని ఆరు ఇన్నింగ్స్ల్లో రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. నసావు వికెట్ ఎలా ఉందో ఈ గణాంకాలు చూస్తే మనకు అర్ధమవుతుంది. అస్సలు బ్యాటింగ్కు అనుకూలంగా లేదు. దక్షిణాఫ్రికా, భారత్ వంటి మేటి జట్లు కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అంతేకాకుండా ఆటగాళ్లు గాయాల బారిన కూడా పడుతున్నారు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఓ రాకసి బౌన్సర్ వల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే ఈ పిచ్పై రోహిత్ శర్మ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఈ వికెట్పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు కొత్త పిచ్ ఉపయెగించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొత్త పిచ్ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్నది వేచి చూడాలి. -
సర్వేలో ట్రంప్ కు షాక్.. ఏ శిక్ష పడనుంది..?
-
Ind vs Pak: అతడితో జాగ్రత్త: టీమిండియాకు కైఫ్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఆ మరుసటి మ్యాచ్లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది.ఈ మెగా ఈవెంట్కే హైలైట్గా నిలవనున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్ జూన్ 9న నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు.పాకిస్తాన్పై గెలవడం టీమిండియాకు తేలికేనన్న కైఫ్.. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాళ్లున్న దాయాదితో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనంగా ఉందని మనకు తెలుసు.కానీ ఫఖర్ జమాన్ క్రీజులో కుదురుకున్నాడంటే ఫాస్ట్గా ఆడతాడు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేయగలడు. ఇఫ్తికార్ అహ్మద్ కూడా బాగానే ఆడతాడు. మిగతావాళ్ల స్ట్రైక్రేటు 120- 125 మధ్య ఉంటుంది.కాబట్టి వాళ్ల బ్యాటింగ్ గురించి మనం అస్సలు భయపడాల్సిన పనేలేదు. అయితే, వాళ్ల బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా నసీం షా.అతడు ఇండియాలో వరల్డ్కప్ ఆడలేదు. గాయం కారణంగా అప్పుడు జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాడు. మ్యాచ్ జరిగే న్యూయార్క్ పిచ్ బౌన్సీగా కనిపిస్తోంది.నిజానికి నసీం షా మంచి బౌలర్. గత మ్యాచ్లో మెల్బోర్న్లో నసీం షా ఫస్ట్ స్పెల్ అద్భుతంగా వేసిన తీరు చూశాం కదా!’’ అంటూ మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యలు చేశాడు. -
SL vs SA: చెత్త షాట్ సెలక్షన్: ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో శ్రీలంక ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు సంధించాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ వైఫల్యం వల్లే లంక చిత్తుగా ఓడిందని అభిప్రాయపడ్డాడు.కాగా న్యూయార్క్ వేదికగా శ్రీలంక సోమవారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. బౌన్సీ పిచ్పై సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 19.1 ఓవర్లలోనే లంక కథ ముగిసిపోయింది.ఇక ఈ వికెట్పై సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తడబడినా.. ఆచితూచి ఆడి ఎట్టకేలకు గట్టెక్కారు. 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు 80 పరుగులు చేసి.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక బ్యాటర్ల తీరును తప్పుబట్టాడు. బంతి బౌన్స్ అవుతున్నా.. ఏమాత్రం ఆలోచన లేకుండా చెత్త షాట్లకు యత్నించి అవుటయ్యారని విమర్శించాడు.ఒక్క బ్యాటర్ కూడా బ్యాట్స్మన్షిప్ ప్రదర్శించలేదంటూ పెదవి విరిచాడు. వికెట్ను గమనిస్తూ బ్యాటింగ్ చేస్తే కనీసం 120 పరుగులైనా స్కోరు చేసేవారని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే జరిగితే ఈ మ్యాచ్లో శ్రీలంక కచ్చితంగా సౌతాఫ్రికాపై గెలిచేదని పేర్కొన్నాడు. అనూహ్య బౌన్స్తో బ్యాటింగ్కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్పై సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపికగా ఆడి విజయం సొంతం చేసుకున్నారని ఇర్ఫాన్ పఠాన్ ప్రొటిస్ జట్టును అభినందించాడు.వాస్తవానికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. నసావూ కౌంటీ పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనపుడు లంక కెప్టెన్ వనిందు హసరంగా బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పే చేశాడని విమర్శించాడు. ఫలితంగా శ్రీలంక తమ టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు పరిమితమైందని పఠాన్ పేర్కొన్నాడు. -
Virat Kohli: కోహ్లికి కట్టుదిట్టమైన భద్రత.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న అమెరికా ఆటగాళ్ల భద్రత విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్కు ఉగ్రముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో సెక్యూరిటీ ఆఫీసర్లు మరింత అప్రమత్తమయ్యారు.డేగ కళ్లతో భారత ఆటగాళ్లకు పహారా కాస్తున్నారు. టీమిండియా స్టార్, గ్లోబల్ ఐకాన్ విరాట్ కోహ్లి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి.. కాస్త ఆలస్యంగా న్యూయార్క్ చేరుకున్నాడు. అనంతరం టీమిండియాతో కలిసి ఒకే హోటల్లో బస చేస్తున్న కోహ్లికి ప్రత్యేకంగా భద్రత కల్పిస్తున్నారు అమెరికా పోలీసులు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. టీమిండియా జెర్సీ ధరించిన కోహ్లి.. బ్యాట్ చేతబట్టి సహచర ఆటగాళ్లను కలిసేందుకు వెళ్తుండగా.. దాదాపు ఆరు మంది భద్రతా సిబ్బంది అతడికి సెక్యూరిటీగా వచ్చారు.మరో ఇద్దరు పోలీసులు గుర్రాలపై ముందు పహారా కాస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొంత మంది అభిమానుల అత్యుత్సాహం వల్ల భద్రతా సిబ్బందికి చిక్కులు తప్పడం లేదు.ఇటీవల జూన్ 1న బంగ్లాదేశ్తో టీమిండియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చి కెప్టెన్ రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి అతడిని చుట్టుమట్టి బంధించేశారు.ఈ క్రమంలో అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించారు. దీంతో రోహిత్ శర్మ జోక్యం చేసుకుని మరీ కాస్త దయ చూపాలంటూ రిక్వెస్ట్ చేయడం గమనార్హం. ఏదేమైనా వెస్టిండీస్తో కలిసి మెగా టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న యూఎస్ఏ తమ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.Even Salman Khan doesn’t have this kind of swag https://t.co/ar86RYwJ5i— Nihari Korma (@NihariVsKorma) June 3, 2024 -
రోహిత్కు భయానక అనుభవం: జాలి చూపాలంటూ రిక్వెస్ట్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి మనసు చాటుకున్నాడు. తనకు అసౌకర్యం కల్పించినప్పటికీ.. అభిమాని పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని అమెరికా పోలీసులను కోరాడు.అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి వెస్టిండీస్తో కలిసి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా లీగ్ దశలో తమ మ్యాచ్లన్నీ ఇక్కడే ఆడనుంది.ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్ సేన శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడింది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.దంచికొట్టిన పంత్.. హార్దిక్ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్ను 60 పరుగుల తేడాతో ఓడించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి పేరిట దూరం కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(23)తో కలిసి సంజూ శాంసన్(1) ఇన్నింగ్స్ ఆరంభించాడు.ఇక రీఎంట్రీలో రిషభ్ పంత్(32 బంతుల్లో 53) అదరగొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(31), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.చెలరేగిన పేసర్లుఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీయగా.. అర్ష్దీప్ సింగ్, శివం దూబే రెండేసి వికెట్లు కూల్చారు. స్పిన్నర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ క్రమంలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసిన బంగ్లాదేశ్ టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో రోహిత్ శర్మకు అసౌకర్యం కలిగింది.రోహిత్కు భయానక అనుభవం: జాలి చూపాలంటూ హిట్మ్యాన్ రిక్వెస్ట్!ఫీల్డింగ్ చేస్తున్నవేళ ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లు గప్పి రోహిత్వైపు దూసుకువచ్చాడు. అతడిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో మైదానంలోకి దూసుకువచ్చిన పోలీసులు అతడిని కిందపడేసి.. కాస్త కఠినంగా ప్రవర్తించారు.ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుని కాస్త కూల్గా డీల్ చేయాలని.. అతడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను కోరాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు పోలీసులు కూడా మైదానంలోకి వచ్చి సదరు అభిమానిని బయటకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.- Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024 -
Ind vs Ban: ఇలాంటి పిచ్లకు అలవాటు పడాలి: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 ఫీవర్ తారస్థాయికి చేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 1(యూఎస్ కాలమానం ప్రకారం)న మొదలుకానుంది. ఆతిథ్య అమెరికా- కెనడా మధ్య డలాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది.కాగా వరల్డ్కప్ లీగ్ దశలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, అంతకంటే ముందు ఇక్కడ రోహిత్ సేన బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ ఇక్కడ ఆడలేదు కాబట్టి ముందుగా మేం పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.జూన్ 5న ఇక్కడ తొలి మ్యాచ్ ఆడే సమయానికి ఏదీ కొత్తగా అనిపించకుండా ఉండటం ముఖ్యం. డ్రాప్ ఇన్ పిచ్కు అలవాటు పడటం కూడా కీలకం. ఒక్కసారి లయ అందుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. కొత్త వేదిక చాలా బాగుంది. మైదానమంతా ఓపెన్గా ఉండటంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.న్యూయార్క్ వాసులు ఇక్కడ తొలిసారి జరుగుతున్న వరల్డ్కప్లో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల తరహాలోనే మేం కూడా మ్యాచ్ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. టోర్నీ బాగా జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ఇక అసలైన పోరు మొదలుకావడానికి ముందు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ కోసం కూడా అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించిన వివరాలు ఇవీ:టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్సమయం: భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంవేదిక: నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్ప్రత్యక్ష ప్రసారం: టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో మ్యాచ్ను వీక్షించవచ్చు. ఇక డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్స్టార్లో అందుబాటులో ఉంటుంది.జట్లుటీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్.బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుT20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 -
న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
అమెరికాలోని న్యూయార్క్లోగల బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు హఠాత్తుగా దాడికి దిగారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.అయితే పోలీసుల రాకకుముందే నిరసనకారులు బ్రూక్లిన్ మ్యూజియం వద్దకు చేరుకుని, ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి, భవనంపై ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో గల బ్యానర్లను ఎగురవేశారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్ నగర పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు అధికారులపై ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు.ఘటనా స్థలంలో పోలీసులకు, ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికిముందు పాలస్తీనా మద్దతుదారులు బార్క్లేస్ సెంటర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు డప్పులు కొడుతూ, పలు నినాదాలు చేస్తూ మ్యూజియం వైపు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్తో పాటు..
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్లో తలమునకలైంది.ఇక జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాదేశ్తో జూన్ 1 వార్మప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ మైదానంలో ఉన్న డ్రాప్- ఇన్ పిచ్(drop-in pitch)ను శుక్రవారం పరిశీలించారు. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఈ పిచ్ బ్యాటర్లకు అనూకూలించేలా ఉందని సమాచారం.ఇంతకీ డ్రాప్-ఇన్ పిచ్(drop-in pitch) అంటే ఏమిటి?మ్యాచ్ జరిగే స్టేడియంలో కాకుండా బయట పిచ్ను తయారు చేసి.. ఆ తర్వాత దానిని అక్కడికి తరలించి నిర్ణీత ప్రదేశంలో ఫిక్స్ చేస్తారు.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), అడిలైడ్ ఓవల్, పెర్త్లోని కొన్ని స్టేడియాలు ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ మైదానాల్లో కేవలం క్రికెట్ మ్యాచ్లే కాదు.. సీజన్కాని సమయంలో ఫుట్బాల్, రగ్బీ మ్యాచ్లు కూడా జరుగుతాయి.ప్రత్యేకమైన యంత్రం సాయంతోఎంసీజీలో 24 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న పిచ్ను నల్లరేగడి మట్టితో తయారు చేసి దానిపై గ్రాస్ను ఉంచుతారు. స్టీల్ ఫ్రేమ్స్లో తయారు చేస్తారు.మ్యాచ్లు ఉన్న సమయంలో కస్టమైజ్డ్ ట్రక్లో తీసుకువచ్చి ప్రత్యేకమైన యంత్రం సాయంతో పిచ్ను డ్రాప్ చేస్తారు. మ్యాచ్లు ముగియగానే అదే మెషీన్ సహాయంతో దానిని అక్కడి నుంచి తొలగిస్తారు.ఇక్కడ మొత్తం అవేఇక అమెరికా విషయానికొస్తే... తొలిసారిగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూయార్క్లో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ జరగడం కూడా ఇదే మొదటిసారి. టీమిండియా వంటి మేజర్ జట్లు ఆడే మైదానంలో డ్రాప్-ఇన్ పిచ్లను ఉపయోగిస్తున్నారు.న్యూయార్క్ మైదానంలో వాడేందుకు 10 డ్రాప్ ఇన్ పిచ్లను తయారు చేశారు. ఇందులో నాలుగు మ్యాచ్ల కోసం.. మిగతావి వార్మప్ మ్యాచ్ల కోసం వినియోగిస్తారు.తయారు చేసింది వీళ్లేఅమెరికాలోకి తొలిసారి మేజర్ ఈవెంట్ జరుగనున్న తరుణంలో గతేడాది నుంచే పిచ్ల తయారీ మొదలుపెట్టారు. అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ గత డిసెంబరు నుంచి.. న్యూయార్క్ స్టేడియం కోసం ఫ్లోరిడాలో పిచ్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.ఇందుకోసం డ్రాప్-ఇన్ ట్రేలను అడిలైడ్లో తయారు చేయించి.. ఓడల ద్వారా ఫ్లోరిడాకు తరలించారు. కాగా ఈ ట్రేలను స్థానికంగా దొరికే మట్టితో నింపి.. బెర్ముడా గ్రాస్ను దానిపై పరిచారు. తర్వాత ఫ్లోరిడాలో దాన్ని ఇంక్యుబేట్ చేసి పూర్తిస్థాయి పిచ్గా తయారు చేశారు.తర్వాత వీటిని రోడ్డు మార్గం ద్వారా 20 సెమీ ట్రేలర్ ట్రక్కులలో జాగ్రత్తగా న్యూయార్క్కు తరలించారు. ఇక ఈ న్యూయార్క్ నసావూ కౌంటీ స్టేడియం కోసం లాండ్టెక్ గ్రూప్ అవుట్ఫీల్డ్ను తయారు చేసి ఇచ్చింది.పక్కా టీ20 టైపే!ఈ విషయం గురించి అడిలైడ్ ఓవల్ హెడ్ ప్రధాన క్యూరేటర్ డామియన్ హో ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘అనుకున్నట్లుగా పక్కా టీ20 తరహా పిచ్లు తయారు చేశామనే అనుకుంటున్నాం.పేస్, బౌన్స్కు అనుకూలించడంతో పాటు పరుగులు రాబట్టేందుకు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. బ్యాటర్లు మైదానం నలుమూలలా బంతిని తరలించేలా.. షాట్లు ఆడేందుకు వీలుగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదీ న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ దాగుందన్న మాట!!అమెరికాలో టీ20 వరల్డ్కప్ వేదికలు👉న్యూయార్క్- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం👉ఫ్లోరిడా- లాడర్హిల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం👉డల్లాస్-టెక్సాస్లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియంలీగ్ దశలో న్యూయార్క్లో 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్లు జరుగనున్నాయి. హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్(జూన్ 9)కు కూడా ఇదే వేదిక కావడం విశేషం. చదవండి: T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు -
Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కాగా ఈ స్టార్ ఆల్రౌండర్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్-2024 సీజన్లో పగ్గాలు చేపట్టిన పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ వేటు వేసి అతడి స్థానంలో పాండ్యాను తీసుకువచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.అడుగడుగునా హార్దిక్ పాండ్యా, ముంబై యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. పదో స్థానంతో ఈ సీజన్ను ముగించింది.ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతడి భార్య నటాషా స్టాంకోవిక్తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 ముగియగానే హార్దిక్ పాండ్యా ఒంటరిగానే లండన్కు వెళ్లి సెలవులను గడిపినట్లు సమాచారం. అనంతరం.. అమెరికాకు వచ్చిన టీమిండియాతో అతడు చేరినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్ షురూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మెగా టోర్నీ కోసం న్యూయార్క్లో రావడం ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా బాగా కాస్తోంది’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘జాతీయ జట్టు తరఫున విధుల్లో ఇలా’’ అంటూ తన ఫొటోలను హార్దిక్ పాండ్యా ఇన్స్టాలో షేర్ చేశాడు. నటాషాతో విడాకుల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఈ పేస్ ఆల్రౌండర్ తొలిసారిగా ఇలా తన ఒక్కడి ఫొటోలు షేర్ చేయడం విశేషం.చదవండి: T20 WC: ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
T20 WC 2024: న్యూయార్క్ చేరుకున్న టీమిండియా.. వీడియో
ఐపీఎల్-2024 సీజన్కు తెరపడిన వారం రోజుల వ్యవధిలోపే మరో టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరో మహా సంగ్రామానికి తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1 మొదలుకానుంది.ఈ ఐసీసీ టోర్నీలో ఈసారి ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్నకు సిద్ధమయ్యే క్రమంలో ఇప్పటికే అమెరికాకు బయల్దేరిన టీమిండియా సోమవారం న్యూయార్క్లో ల్యాండ్ అయింది.కాగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఆదివారమే విమానం ఎక్కేసిన విషయం తెలిసిందే.ముంబైలో నుంచి వీళ్లంతా అమెరికాకు బయల్దేరగా అక్కడి సిబ్బంది కేక్ కట్ చేసి ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సెండాఫ్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం టీమిండియా న్యూయార్క్లో అడుగుపెట్టినట్లు తెలుపుతూ బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది.కాగా మిగిలిన ఆటగాళ్లలో స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యజువేంద్ర చహల్, రింకూ సింగ్ తదితరులు రెండో బ్యాచ్లో అమెరికాకు పయనం కానున్నట్లు సమాచారం.ఇక జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్ సందర్భంగా భారత జట్టు తమ వరల్డ్కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది. అంతకు ముందు బంగ్లాదేశ్తో జూన్ 1 వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.రిజర్వ్: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.✈️ Touchdown New York! 🇺🇸👋#TeamIndia 🇮🇳 have arrived for the #T20WorldCup 😎 pic.twitter.com/3aBla48S6T— BCCI (@BCCI) May 27, 2024 -
అమెరికాలో మరో విషాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బెలెం అచ్యుత్ (సన్నీ) బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.న్యూయార్క్లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్’లో చదువుతున్న అచ్చుత్ బైక్పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Saddened to learn about the untimely demise of Shri Belem Atchyuth, a student at SUNY who met with a bike accident and passed away yesterday evening; our deepest condolences to the family; @IndiainNewYork is in touch with the bereaved family & local agencies to extend all…— India in New York (@IndiainNewYork) May 23, 2024 అచ్యుత్ మృతి పట్ల అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. అతని మృతదేహాన్నిభారతదేశానికి తిరిగి పంపడం లాంటి ఇతర సహాయాన్ని అందించడానికి వారి కుటుంబ సభ్యులు, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. కాగా అమెరికాలో 2024లోనే పదకొండు మందికి పైగా విద్యార్థులు మరణించారు . అనేక మంది తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. ఇటీవల జార్జియాలోని అల్ఫారెట్టా నగరంలో జరిగిన ఘోరురోడ్డు కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. -
IND vs PAK: ఒక్క టికెట్ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్ మోదీ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్ 1 ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్తో కలిసి వరల్డ్కప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్ఏ.. ఇప్పటికే మ్యాచ్లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్ మ్యాచ్లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. జూన్ 5 న ఐర్లాండ్తో మ్యాచ్ ద్వారా తాజా ఎడిషన్లో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. జూన్ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్ మ్యాచ్కు వేదికైన న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్కప్లో ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో డైమండ్ క్లబ్ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్కప్ నిర్వహిస్తోంది క్రికెట్కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్ మోదీ ఎక్స్ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్ మోదీ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ టికెట్ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించిన లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024 -
సమితిపై సంస్కరణల ఒత్తిడి
భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రపంచ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఇంకో పక్క భారత్ సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతామండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతర సభ్యులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతోంది..అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రాతినిధ్యం లేకపోవడం సమితి లక్ష్యసిద్ధిలో పెద్ద అడ్డంకి అని చెప్పక తప్పదు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా అవి ఫలవంతం కావటం లేదు. సమితిలో సంస్కరణలు జరగాలని అధికశాతం దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వీటో పవర్ ఉన్న దేశాలు సమితి కృషికి పీటముడులు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఎవరికీ పెద్దగా తెలియని, అస్పష్టమైన దౌత్య ప్రక్రియ ఆ చర్చలన్నవి. అయినప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఓ చరిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం కుదిరే దిశగా ఈ సమావేశం ముందడుగైతే వేసింది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు కూడా అద్దం పడుతోంది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు... ఐరాస వ్యవస్థ ప్రభావం తగ్గిపోతూండటం, అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐరాసకు లేకపోవడం వంటివి మళ్లీ మళ్లీ చర్చకు వచ్చేలా చేస్తున్నాయి. భద్రతా మండలిలోని ఐదు దేశాలకూ వీటో అధికారాలు ఉండటం అన్నది రెండో ప్రపంచ యుద్ధ విజేతలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు భాగస్వామ్యం లేదు. ఆ ప్రాంత దేశాల ప్రతినిధులు ఐరాసలో నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు అంతే. 1950లో ప్రపంచ జనాభాలో సగం ఆసియాలోనే ఉండగా... ఇరవై శాతం ఆర్థిక లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నా భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం ఒక్క దేశానికి మాత్రమే దక్కింది. ఇది అన్యాయమే. అలాగని ఆశ్చర్యపోవడానికీ ఏమీ లేదు. కాగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం నిస్సందేహంగా చాలా మారి పోయింది. ప్రాతినిధ్యం విషయంలోనూ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆసియా జనాభా ప్రపంచ జనాభాలో 60 శాతం. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం భాగస్వామ్యం కూడా ఈ ఖండానిదే. ఐరాస సభ్యదేశాల్లో 25 శాతం ఇక్కడివే. కానీ... భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం 20 శాతమే. ఈ నేపథ్యంలోనే భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి ఉన్న డిమాండ్ను మనం గుర్తు చేసుకోవాలి. దాదాపుగా ఈ సమయంలోనే ఆర్థిక, సామాజిక కౌన్సిల్ సభ్యత్వాన్ని 18 నుంచి 27కు, ఆ తరువాత 54కు పెంచారు. 2015లో కొన్ని నిర్దిష్ట సూచనలతో భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరిపేందుకు ఒక అంగీకారం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అవి ముందుకు కదల్లేదు. చర్చల తీరుతెన్నులపై స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశం మాత్రమే ఈ ప్రక్రియ కాస్త ముందుకు కదిలేందుకు మార్గం చూపింది. కారణాలు అనేకం!భద్రతా మండలి సంస్కరణలు స్తంభించిపోయేందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఇండియా, జర్మనీ, జపాన్ , బ్రెజిల్లతో కూడిన జి–4 కూటమి తమను (మరో ఇద్దరు ఆఫ్రికన్ ప్రతినిధులతో కలిపి) భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్, జి–4 దేశాలు వీటో అధికారం లేకుండానే భద్రతామండలిలో చేరేందుకు ఓకే అనవచ్చు. ఈ అంశంపై 15 ఏళ్ల తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేలా చూస్తారు. ఇంకో పక్క భారత్ కూడా సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతరులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. ఐరాస సభ్యదేశాల్లో అత్యధికులు భద్రతా మండలి శాశ్వత, ఇతర సభ్యుల సంఖ్యను పెంచేందుకు అంగీకారం తెలుపుతూండగా కాఫీ క్లబ్గా పేరుగాంచిన ‘యునైటెడ్ ఫర్ కన్సెన్సస్’ గ్రూపు ఆ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇటలీ, పాకిస్థాన్ , అర్జెంటీనా వంటి దేశాల నేతృత్వంలో పని చేస్తున్న ఈ గ్రూపు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. భారత్, జర్మనీ, బ్రెజిల్ వంటి స్థానిక శత్రువులది పైచేయి కాకుండా అన్నమాట. ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు అమెరికా, యూకే, ఫ్రాన్ ్స, రష్యాలు మాత్రం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకో అడుగు ముందుకేసి భద్రతా మండలి సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటనైతే చేశారు కానీ ఆచరణలో మాత్రం ఆయన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంకో విషయం... ఆఫ్రికా గ్రూపులో ఏకాభిప్రాయం లేకపోవడంతో భద్రతామండలి సభ్యదేశంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సమితి నిర్ణయించుకోలేక పోతోంది. వివరంగా చర్చిస్తే భేదాభిప్రాయాలు వస్తాయని ఆఫ్రికా దేశాలు భయపడుతున్నాయి. అడ్డంకి ఉండనే ఉంది!భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పెరిగేందుకు, ఇతర సభ్యుల చేరికకు ఉన్న అతిపెద్ద అడ్డంకి చైనా. భద్రతామండలి విస్తరణపై వ్యాఖ్య చేయని శాశ్వత సభ్య దేశం ఇదొక్కటే. ఆసియాకు మెరుగైన ప్రాతినిధ్యం లభించేందుకు ఆసియా దేశమే ఒకటి అడ్డుగా నిలవడం విచిత్రం. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే... అసలు రాజీ మార్గమన్నది ఏమాత్రం కనిపించకుండా పోతుంది. శాశ్వత సభ్యుల సంఖ్యను 11కు పెంచడం ఇందుకు ఒక మార్గం. ప్రస్తుత శాశ్వత సభ్యులు ఐదుగురితోపాటు జి–4 సభ్యులు, ఇద్దరు ఆఫ్రికా ప్రతినిధులు అన్నమాట. దీంతోపాటే ఇతర సభ్యుల సంఖ్యను కూడా తగుమాత్రంలో పెంచాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వీటో అధికారం స్థానంలో కొంతమంది శాశ్వత సభ్యులకు అభ్యంతరం ద్వారా తీర్మానాన్ని అడ్డుకునే అధికారం కల్పించడం ఒక ఏర్పాటు అవుతుంది. ఇలాంటి ఏర్పాటు ప్రస్తుత శాశ్వత సభ్యులకూ అంగీకారయోగ్యం కావచ్చు. ఈ ఏర్పాటు ఒకటి రూపుదిద్దుకునేలోగా ఐరాస నిష్క్రియాపరత్వం పాటించడం కూడా ఐరాస ఏర్పాటు అసలు ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేదే. యుద్ధనష్టాలు భవిష్యత్ తరాలకు సోకకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఐరాసాదే! అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికల అమలు, సామాజిక పురోగతి, మానవీయతలను కాపాడటం కూడా ఐరాస ఏర్పాటు ఉద్దేశాలలో కొన్ని అన్నది మరచిపోరాదు. ఈ లక్ష్యాలన్నీ ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా మారే ఆఫ్రికన్ గ్రూపు లేదా జి–20 వంటి వ్యవస్థలకూ వర్తిస్తాయి. గత ఏడాది భారత్ నేతృత్వంలో జరిగిన జి–20 సమావేశాల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఐరాస తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందాలంటే ప్రపంచం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకానీ... ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రపంచానికి ప్రతినిధిగా కాదు.ధ్రువ జైశంకర్ వ్యాసకర్త ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా(‘హిందూస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!
న్యూయార్క్లోని భారత కాన్సులేట్ అత్యవసర సేవల కోసం ఏడాది పొడవున తెరచి ఉంటుందని పేర్కొంది. ఇది ప్రజల అత్యవసర అవసరాలను పరిష్కరించడానికి వారాంతాల్లో, ఇతర సెలవులతో సహా ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని భారత కాన్సులేట్ ప్రకటించింది. మే 10 నుంచి అమలులోకి వచ్చే అన్ని సెలవు దినాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటుందని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు మే 10, 2024 నుంచి సాధారణ ప్రజల అత్యవసర అవసరాలను తీర్చేందుకు అన్ని సెలవు దినాల్లో(శనివారం/ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాలతో సహా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాన్సులేట్ తెరిచి ఉంటుందని ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కోసం అని, సాదారణ కాన్సులర్ సేవల కోసం కాదని తెలిపింది. అలాగే ఏదైనా అత్యవసర సేవ కోసం కాన్సులేట్కు వచ్చే ముందు అత్యవసర హెల్ప్లైన్ నంబర్: 1-917-815-7066కు కాల్ చేయాలని భారతీయ కాన్సులేట్ దరఖాస్తుదారులకు సూచించింది. ఈ సేవలు అవసరమైన డాక్యుమెంట్ల ఆవశక్యతకు సంబంధించి, అలాగే తదుపరి పని దినానికి వాయిదా వేయలేని అత్యవసర పనులు., వంటి వాటికి వర్తిస్తాయి. ముఖ్యంగా అత్యవసర వీసా, ఎమర్జెన్సీ సర్టిఫికేట్(అదే రోజు భారతదేశానికి ప్రయాణించడం కోసం) అదే రోజు పంపబడే మృతదేహాలను రవాణా చేయడం వంటి ప్రయాణ పత్రాల అత్యవసర అవసరాల కోసం మాత్రమే. దరఖాస్తుదారు నుంచి అత్యవసర సేవా రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అత్యవసర వీసా సేవలు కూడా ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ పేర్కొంది. 📣New announcement Consulate General of India, New York to remain open 365 days for emergency services.@binaysrikant76 @MEAIndia @IndianEmbassyUS @IndianDiplomacy @ANI @PIB_India @ITVGold @tvasianetwork @CPVIndia @Newsweek pic.twitter.com/1FFvgOxiFC— India in New York (@IndiainNewYork) May 10, 2024 (చదవండి: డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం) -
అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!
ప్రపంచంలోనే అత్యధిక మిలియర్లు ఉన్న నగరాల జాబితాను ఏటా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్నర్స్ ఇస్తుంది. సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్ దాదాపు మూడు లక్షల మిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నివాసితులు ప్రపంచంలోని ఇతర మెట్రో నగరాల కంటే దాదాపు మూడు డాలర్ల ట్రిలయన్లకు పైగా సంపదను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక్కడ మిలియనీర్ల సంఖ్య సుమారు 4% పెరిగినట్లు తెలిపింది. న్యూయార్క్లో 2013 నుంచి ఇప్పటి వరకు అంత్యంత సంపన్నుల సంఖ్యలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 60 బిలియనీర్లు ఉన్నారని, వారిలో చాలామంది దాదాపు రూ. 800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలరని వెల్లడించింది. ఇక శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియాలో మాత్రం మూడు లక్షల మంది కోట్లల్లో నికర విలువ కలిగి ఉండటంతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇక ఈ అత్యధిక మిలియనీర్స్ జాబితాలో టోక్యో మూడో స్థానంలో ఉండగా, సింగపూర్ నాల్గో స్థానంలో ఉంది. కాగా హెన్లీ & పార్ట్నర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుర్గ్ స్టెఫెన్ ప్రకారం గత కొన్ని ఏళ్లలో ఆర్థిక మార్కెట్లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని కొన్ని అత్యంత సంపన్న నగరాల వృద్దిని పెంచింది. పైగా వాటి గ్లోబల్ ఈక్విటీలు 2023లోనే సుమారు 20% పెరగగా, ఈ ఏడాది ఏకంగా 7% పెరిగాయి. దీంతో కొన్ని ప్రపంచ నగరాల అదృష్టం తారుమారయ్యిందని చెబుతోంది హెన్లీ & పార్ట్నర్స్ సర్వే. గత దశాబ్దంలో లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని యూకే తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. అలాగే చైనా మహమ్మారి టైంలో విధించిన ఆంక్షలు కారణంతో సంపన్న ప్రవాసులు సింగపూర్కు తరలిరావడంతో హాంకాంగ్ దాని మిలియనీర్ ర్యాంక్లలో 4% క్షీణతను చవి చూసింది. ఇదే సమయంలో కొన్ని నగరాల్లో మిలియనీర్ల వృద్ది అనూహ్యంగా పెరిగింది వాటిలో షెన్జెన్ కూడా ఉంది, ఇక్కడ గత దశాబ్దంలో మిలియనీర్ల సంఖ్య సుమారు 140% పెరిగింది. ఇక గత 10 ఏళ్లలో రెట్టింపుకు పైగా మిలియనీర్ జనాభా పెరిగిన నగరాలు వరుసగా భారతదేశంలోని బెంగళూరు, హో చి మిన్ సిటీ, వియత్నాం, యూఎస్లో అరిజోనాలోని స్కాట్స్డేల్ వంటి నగరాలు. కాగా ఆ జాబితాలో సంపన్న నగరంగా దుబాయ్ 21వ స్థానం దక్కించుకోగా, మొనాకో నెంబర్ 1 స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారని హెన్లీ & పార్ట్నర్స్ సర్వే చెబుతోంది. (చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ)