-
న్యూ ఇయర్ రోజున ఇవి తింటే..అదృష్టానికి, డబ్బుకి ఢోకా ఉండదట!
కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఈ న్యూ ఇయర్ని తమదైన పద్ధతిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సంతోషకరంగా సాగిపోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే మంచిగా ప్లాన్ చేసుకుంటారు కూడా. అయితే కొత్త ఏడాది రోజున ఇవి తింటే ఏడాదంతా అదృష్టం కలిసొచ్చి సంతోషకరంగా సాగుతుందని కొన్ని దేశాల ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందామా! ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అంతా కలిసి సెలబ్రెట్ చేసుకునేది మాత్రం న్యూ ఇయర్ నాడే. ఈ రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ న్యూ ఇయర్ని ప్రారంభిస్తే ఆ ఏడాదంతా బావుండటమే కాకుండా అదృష్టం వస్తుందని కొందరి ప్రగాఢి నమ్మకం. ఇంతకీ మరీ ఈ రోజు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలంటే.. ద్రాక్ష ప్రేమను: స్పెయిన్, లాటిన్ అమెరిక దేశాలలో న్యూఇయర్ రోజున వీటిని తినడం అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా న్యూ ఇయర్ రోజు ద్రాక్ష తింటే ప్రతి నెలా అదృష్ట కలిసొస్తుందని ఒక నమ్మకం కూడా. అంతేగాదు సోషల్ మీడియాలో దాదాపు 12 ద్రాక్ష పండ్లను తింటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలుస్తారనే ట్రెండ్ తెగ నడుస్తోంది కూడా. కాయధాన్యాలు దీర్ఘాయుష్షును: ఈ రోజున పప్పుతో చేసిన రెసిపీలు లేదా సూప్ తినడం మంచిదట. ముఖ్యంగా ఇలా తింటే ఆర్థిక సమృద్ధి పుష్కలంగా ఉంటుందని భావిస్తారు. ఇటలీలో ఎక్కువగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దానిమ్మ పండు సంతానం: గ్రీకు సంప్రదాయంలో దానిమ్మని సంతానోత్పత్తి, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్ రోజున ఇవి తింటే సంతానం, సంపద, అదృష్టం వస్తాయని ఎక్కువమంది నమ్ముతారు. చేపలు తింటే లక్కు: వివిధ సంస్కృతుల్లో చేపలను అదృష్టవంతమైన వాటిగా పరిగణిస్తారు. అవి పురోగతి, సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారట. అందుకే కొన్ని ప్రదేశాల్లో నూతన సంవత్సరం రోజున చేపలు తినడంతో ప్రారంభిస్తారట కూడా. ఆకుకూరలు సంపదలు ఇస్తాయి: యూఎస్ఏలోని అనేక కుటుంబాలు కొల్లార్డ్ గ్రీన్స్ లేదా క్యాబేజీ వంటి ఆకుకూరలను తినడంతో న్యూ ఇయర్ రోజుని ప్రారంభిస్తారు. అలా చేస్తే సంపదలు పెరుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ఆకుపచ్చ రంగును సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆరోజు ఆకుకూరలు తింటే ఆర్థిక సమస్యలనేవే ఉండవనేది వారి విశ్వాసం. నూడుల్స్ అదృష్టాన్ని తెస్తాయి: చైనాలో పొడవైన నూడుల్స్ దీర్ఘాయువును సూచిస్తాయి. అందువల్ల న్యూ ఇయర్ రోజున న్యూడిల్స్ తింటే దీర్ఘాఆయుష్షు ఉంటుందనేది వారి నమ్మకం. చైనా సంస్కృతి ప్రకారం ఆ రోజు ఇవి తింటే అదృష్టం వస్తుందని చెబుతారు. కేక్ లేదా డోనట్స్: గుండ్రని ఆకారంలో మధ్యలో చిల్లు ఉండే ఇవి తింటే సంవత్సరాంతం బాగుటుందని, లక్ కలిసోస్తుందని కొందరూ భావిస్తారు. (చదవండి: 'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్! వీడియో వైరల్) -
Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం! -
కొత్త సంవత్సరంలో సీమా హైదర్ ప్లానేమిటి?
2023 ముగిసింది. 2024 నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అందరూ తమ ఆశలు, అంచనాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. 2023లో వార్తల్లో కనిపించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ కూడా కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. 2023 తనకు ఎంతో మంచి చేసిందని సీమా హైదర్ మీడియాకు తెలిపారు. 2024లో తన సమస్యలన్నీ తొలగిపోతాయని, కుటుంబంతో కలిసి భారతదేశంలో స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్నానని ఆమె పేర్కొన్నారు. మే 2023లో నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో సహా యూపీ చేరుకున్న సీమా హైదర్ ప్రస్తుతం రబుపురా గ్రామంలోని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనే నిబంధన ఉందని, అందుకే ఇంటిలోనే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నానని సీమా తెలిపారు. తనకు బయటకు వెళ్లే అవకాశం దొరికినప్పుడు దేశమంతా పర్యటించాలని కోరుకుంటున్నానని, తన భర్త, పిల్లలు ఇంటి బయట నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అయితే తన నలుగురు పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే వారు ట్యూషన్కు వెళుతున్నారని ఆమె తెలిపారు. అయితే 2024లో తన పిల్లలను బడికి పంపించే అవకాశం దక్కుతుందనుకుంటున్నానని సీమ పేర్కొన్నారు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి 2023, మే 13న నేపాల్ మీదుగా భారత్కు తరలివచ్చారు. తరువాత రబుపురా గ్రామం చేరుకుని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. కాగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాపై గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను, సచిన్, సచిన్ తండ్రిని అరెస్ట్ చేశారు. ముగ్గురినీ గత జూలై 4న అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురికీ బెయిల్ మంజూరైంది. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు -
హైదరాబాద్ లోని ఆలయాలకు నూతన సంవత్సర శోభ
-
#Welcome2024 : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా కొత్త సంవత్సరం వేడుకలు
-
ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో గ్రాండ్గా న్యూ ఇయర్ వేడుకలు
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్ ఏర్పాటు చేసి.. సంగీత విభావరి, బెల్లీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని 2023కి వీడ్కోలు పలికారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఎఫ్ఎన్సీసీ సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ.. "గతంలోని కమిటీ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ని ఎంతో అభివృద్ధి చేసింది. మేము కూడా అదే దిశగా ముందుకు తీసుకెళతాం. దక్షిణాదిలో నంబర్ వన్ కల్చరల్ సెంటర్గా తీర్చిదిద్దుతాం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ బి రాజశేఖరరెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ , శైలజా జుజల, బాలరాజు, గోపాలరావు, ఏడిద రాజా మోహన్ వడ్లపట్ల, ఇంద్రపాల్రెడ్డి, వరప్రసాదరావు పాల్గొన్నారు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
#NewYear2024 : తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు (ఫొటోలు)
-
2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది. చర్చిలో మహిళా మతాధికారులు కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చంద్రునిపైకి నలుగురు మానవులు 2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది. అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ సూపర్కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది. అతిపెద్ద వ్యోమనౌక అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి. మూడవసారి పారిస్లో ఒలింపిక్స్ 2024లో పారిస్లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్లో జరిగే ఒలింపిక్స్కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు -
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు
దేశవ్యాప్తంగా ప్రజలంతా 2024 నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. ఆదివారం అర్ధరాత్రి రాత్రి 12 గంటలకు ప్రజలంతా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమదైన రీతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. #WATCH | Karnataka: People celebrate the New Year at Bengaluru's MG Road pic.twitter.com/dQTJoQkl0o — ANI (@ANI) December 31, 2023 పలువురు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పర్యాటక ప్రదేశాలకు వెళ్లగా, మరికొందరు తమ నగరంలోనే ఉంటూ నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. పలుచోట్ల నూతన సంవత్సరాన్ని బాణసంచా వెలుగులలో జరుపుకోవడం కనిపించింది. పలు ప్రాంతాల్లోని ప్రజలు కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. #WATCH | Fireworks in Odisha's Bhubaneswar to welcome the New Year 2024 pic.twitter.com/GkbPfHLtr3 — ANI (@ANI) December 31, 2023 కర్ణాటకలోని బెంగళూరులో జనం వీధుల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడి ఎంజీ రోడ్డులో జనం ఎంతో ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at Lucknow's Hazratganj to welcome the New Year 2024 pic.twitter.com/ptHN0Tm2gE — ANI (@ANI) December 31, 2023 ఒడిశాలోని భువనేశ్వర్లో బాణాసంచా వెలిగించి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ బాణాసంచా వెలుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వివిధ నగరాల్లోని వివిధ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలోని హజ్రత్గంజ్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. నోయిడాలో కూడా ప్రజలు తమదైన శైలిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. #WATCH | People celebrate the beginning of the New Year in Uttar Pradesh's Noida pic.twitter.com/f0BUmiOrpJ — ANI (@ANI) December 31, 2023 కొందరు సంగీత, నృత్యాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా, మరికొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఝండేవాలన్ ఆలయంలో నూతన సంవత్సర హారతిలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. #WATCH | Delhi: Hundreds of devotees welcome the new year by participating in the New Year's aarti at Jhandewalan Devi Temple https://t.co/iPbigtn2Lw pic.twitter.com/AyHhkoE7gb — ANI (@ANI) December 31, 2023 న్యూ ఇయర్ సందర్బంగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తూ కనిపించారు. ఢిల్లీలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Delhi: Security heightened in the National Capital as people celebrate the beginning of the New Year. (Visuals from Hauz Khas village) pic.twitter.com/6NvnRUqrOe — ANI (@ANI) December 31, 2023 -
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్లో ఎఫ్పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
కొత్త సంవత్సరం..కొత్త ఆశలు, ఆశయాలు
సాధారణంగా కొత్త సంవత్సరం వస్తోంది అంటే ఎన్నో సంబరాలు. సంవత్సరంతో పాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇళ్ళని, వీధులని, నగరాలని అలంకరిస్తారు. అలంకారాలు, దీపాలు, టపాకాయలు, కొత్తబట్టలు, మిఠాయిలు (ఎక్కువగా కేకు) పంచుకోవటాలు, విందులు, వినోదాలు, శుభాకాంక్షలు. అంటే రాబోయే కాలం ఆనంద దాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటమే వీటిలోని అసలు అర్థం. మనిషి ఆలోచించటం మొదలుపెట్టినప్పటి నుండి లెక్కించటం కూడా ప్రారంభించాడు. ప్రకృతిలో వస్తున్న మార్పులని పరిశీలించి, తదనుగుణంగా ఉండటం కోసం కాలాన్ని కూడా గణించటం ప్రారంభించాడు. కాలగణనకి ప్రమాణం ప్రకృతిలో జరిగే పరిణామాలే. కొద్దికాలం జరిగిన తరవాత మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టే ప్రకృతి కనపడితే ఈ క్రమం ఏమిటి? అన్నది అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనిషి కాలాన్ని లెక్కపెట్టటం జరిగింది. లెక్కపెట్టటం ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు మొదలుపెట్టాలి. ఒక్కొక్క ప్రాంతం వారు వారికి అనుకూలంగా ఉన్న సమయం నుండి లెక్కపెట్టటం మొదలుపెట్టారు. కాలక్రమంలో దానిలో ఒక హేతుబద్ధతని అవలంబించారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండే సమయాన్ని కాలాన్ని లెక్కకట్టటానికి మొదలుగా తీసుకున్నారు. పాశ్చాత్యులకి ఆహ్లాదకరంగా ఉండే వసంతం (స్ప్రింగ్) మార్చ్, ఏప్రిల్ నెలలు. మార్చ్ 23 ని సంవత్సర మానానికి ఆదిగా పరిగణించేవారు. తరువాత నెల మధ్యలో ఎందుకని ఏప్రిల్ 1 ని సంవత్సరాదిగా జరుపుకునే వారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అది జనవరి 1 కి మారింది. మార్చ్ మొదటి నెల కనుక డిసెంబర్ 10 వ నెల, నవంబర్ 9 వ నెల, అక్టోబర్ 8 వ నెల, సెప్టెంబర్ 7 వ నెల అయ్యాయి. ఆ పేర్లే నెలల సంఖ్యని తెలియ చేస్తున్నాయి. ఈ కాలెండర్ ని గ్రెగేరియన్ కాలెండర్ అంటారు. అందరికీ తమ కాలెండర్ ఉన్నా, ఇప్పుడు ప్రపంచం అంతా ఈ కాలెండర్నే అనుసరిస్తోంది. ఈ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తారీకుతో కొత్త సంవత్సరం మొదలు అవుతుంది. సౌరమానాన్ని అనుసరించి ఒక సంవత్సరంలో 365 1/3 రోజులు ఉంటాయి. అందుకని నాలుగు సంవత్సరాలకి ఒక మారు లీప్ ఇయర్ అని ఒక రోజు అధికంగా వస్తుంది. ఆ రోజు తక్కువ రోజులు ఉండే ఫిబ్రవరికి వెడుతుంది. అయితే ఆనందోత్సాహాలు ఎందుకు? ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు. ఆ విధంగా గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు. సంవత్సరంలో మొదటి రోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాము. అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికి రానివాటిని పక్కకి పెట్టి, అవసరమైన వాటిని చేపట్టటానికి నిర్ణయించుకో వలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్లో ఎన్ఎఫ్వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
వినూతన వేడుకలు..
కొత్త సంవత్సరం వచ్చిందంటే.. ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పాత ఏడాది ఇచ్చిన చేదు అనుభవాలను మరిచిపోయి.. తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని సరికొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుగుతుంటాయి. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. ప్రపంచమంతా క్రమంగా 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలికిన తరుణంలో.. వివిధ దేశాల ప్రజలు జరుపుకునే వేడుకలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు.. ♦ డెన్మార్క్లో ప్రజలు తమ ఇళ్లలోని పింగాణీ పాత్రలను గది తలుపులపైకి విసిరేస్తారు. అవి పగిలి.. ఎన్ని ముక్కలైతే కొత్త ఏడాది అంత అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ♦ గ్రీస్ ప్రజలు ‘వాసిలోపిటా’ అనే కేక్లో ఒక నాణాన్ని కనిపించకుండా పెడతారు. ఎవరికైతే ఆ నాణెం ఉన్న కేక్ భాగం వస్తుందో.. వారికి ఆ ఏడాదంతా అదృష్టం కలిసి వస్తుందని విశ్వసిస్తారు. ♦ నూతన సంవత్సరం అంటేనే పాతకు వీడ్కోలు చెప్పడం. దీనికి సూచికగా దక్షిణాఫ్రికా ప్రజలు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి పాత వస్తువులను కిటికీల నుంచి బయటకు విసిరేస్తారు. ♦ స్కాట్లాండ్లో అర్ధరాత్రి దాటాక తమ ఇంట్లోకి మొదటగా ఎవరు అడుగు పెడతారో.. వారి వల్ల అదృష్టం వస్తుందని విశ్వసిస్తూ బహుమతులు ఇచ్చుకుంటారు. ♦ స్పెయిన్లో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే.. 12 ద్రాక్ష పండ్లు తినడం సంప్రదాయం. ఒక్కో పండు ఒక్కో నెలకు సంకేతం. ఇలా తినటం వల్ల అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. ♦ జపాన్లో ప్రజలు అర్ధరాత్రి వేళ బౌద్ధ దేవాలయాలకు వెళ్లి 108 సార్లు గంటలు మోగిస్తారు. ♦ బ్రెజిల్లో జనం తెలుపు రంగు దుస్తులు ధరించి సముద్ర దేవత యెమాంజకు నైవేద్యంగా సముద్రంలోకి పూలను విసిరి పాటలు పాడతారు. ♦ ఫిలిప్పీన్స్లో గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువులు, దుస్తులు అదృష్టం తెచ్చిపెడతాయని విశ్వసిస్తారు. అందువల్ల అక్కడి వారు నూతన సంవత్సరాన్ని ఆహా్వనిస్తూ గుండ్రని చుక్కలు ఉన్న దుస్తులు ధరిస్తారు. ఆ రోజు గుండ్రని పండ్లు తింటారు. ♦ రష్యాలో కాగితంపై న్యూ ఇయర్ విషెస్ రాసి దానిని కాల్చి ఆ పొడిని అర్ధరాత్రి షాంపైన్లో కలుపుకొని తాగుతారు. ♦ అమెరికాలోని న్యూయార్క్లో అర్ధరాత్రి 12 గంటలకు టైమ్ బాల్ను కిందకు వదులుతారు. దీన్ని ‘బాల్ డ్రాప్’ అంటారు. అలా వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. కిరిబతిలోనే తొలి సంబరం.. ప్రపంచంలో అందరికంటే ముందు పసిఫిక్ సముద్రంలోని కిరిబతి దీవుల్లోనే కొత్త సంవత్సరం వస్తుంది. భారత కాలమానం ప్రకారమైతే డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకే ఆ ప్రాంతం నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియా దేశాల్లో మనకంటే ఆరేడు గంటల ముందే మొదలవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మనకంటే మూడున్నర గంటల ముందే అడుగుపెడతాయి. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్లు భారత్ కంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. చైనాలో వేడుకలు ఉండవు.. జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకోని దేశాలు కూడా ఉన్నాయి. చైనాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవు. వారి క్యాలెండర్ ప్రకారమే అక్కడ కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. చైనా ప్రజలు ఫిబ్రవరి నెలలో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ♦ న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ♦ ఆస్ట్రేలియా.. మనకు సాయంత్రం 6.30 ♦ జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ♦ చైనా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్.. మనకు రాత్రి 9.30 ♦ థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ♦ యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 1.30 ♦ గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 3.30 ♦ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ♦ యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు మనకు జనవరి 1 తెల్లవారుజామున 5.30 ♦ బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ♦ ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ♦ అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ♦ మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ♦ అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ♦ హవాయ్.. మనకు జనవరి 1 మధ్యాహ్నం ఉదయం 3.30 ♦ సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ♦ బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ♦ ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా ఆధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలుంటే.. రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. -
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కాలగతిలో కొత్త వేకువ
మార్పు ప్రకృతి సహజ లక్షణం. చరాచర ప్రపంచంలో మారనిదంటూ ఏదీ ఉండదు. కాలం అనుక్షణం మారుతూనే ఉంటుంది. రోజులుగా, నెలలుగా, ఏడాదులుగా మారే కాలానికి కొత్త సంవత్సరం ఒక కొండగుర్తు. కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త కేలండర్లు వస్తాయి. కొత్త డైరీలు వస్తాయి. కొందరు అదృష్టవంతులకు ఒకరోజు సెలవు దొరుకుతుంది. కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా స్వాగతించడానికి ముందురోజు రాత్రి జనాలు సందడి సందడిగా మందు విందులతో ఊరూరా అట్టహాసంగా వేడుకలు జరుపుకొంటారు. గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గడచిపోయిన సంవత్సరంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమంటూ కొందరు భీషణ తీర్మానాలు కూడా చేసుకుంటారు. అలాగని కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రపంచం అమాంతంగా మారిపోదు.లోకంలో మనుషులు ఎప్పటిలాగానే ఉంటారు. మనుషుల స్వభావాలు ఎప్పటి మాదిరిగానే ఉంటాయి. భూమి గోళాకారంలోనే ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన నింగి నుంచి చుక్కలు రాలిపడిపోవడం, దిక్కులు ఏకమైపోవడం వంటి ఆకస్మిక అనర్థాలేవీ సంభవించవు. ప్రపంచంలో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధాలు కొన సాగుతూనే ఉంటాయి. దేశాల మధ్య సంక్షోభాలు రగులుతూనే ఉంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో వినిపించే కేరింతల హోరులో అభాగ్యుల ఆర్తనాదాలు వినిపించకుండా ఉంటాయంతే! ప్రపంచమంతా అలాగే ఉన్నప్పుడు మరి మారినదేమిటంటారా? మార్పు మన కళ్ల ముందే జరిగిపోతూ ఉంటుంది. ప్రచార పటాటోప కాంతులకు కళ్లుబైర్లు కమ్మిన దివాంధత్వంలో మనం వెనువెంటనే మార్పును గుర్తించలేం. కొంచెం తెప్పరిల్లిన తర్వాతనే మార్పు మనకు అర్థమవుతుంది. అనుభవంలోకి వస్తుంది. ‘మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు’ అని గ్రీకు తత్త్వవేత్త హెరా క్లిటస్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే చెప్పాడు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సాహంలో, వేడుకల సంరంభంలో మునిగిపోయిన జనానికి ఆ సమయంలో జరిగే మార్పులేవీ గోచరించవు. కేలండరు మారుతున్న వేళలోనే ఎక్కడో ఒకచోట ఒక మొక్క మొలకెత్తవచ్చు. ఒక మహావృక్షం నేలకూలిపోవచ్చు. కొత్తగా ఒక శిశువు ఈ భూమ్మీదకు రావచ్చు. పాతబడిన ఒక పండుటాకు రాలిపోవచ్చు. మరెక్కడో ఒకచోట నిశ్శబ్దంగా ఒక కొత్త ఆవిష్కరణ జరగవచ్చు. ఒక విధ్వంసానికి కొత్తగా ధ్వంసరచన జరుగుతూ ఉండవచ్చు. వార్తలకెక్కితే తప్ప మార్పులను గుర్తించడం మానేశాం మనం. అయినా వార్తలతో నిమిత్తం లేకుండా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అసలు మనం జరుపుకొనే ఈ కొత్త సంవత్సరం వేడుకలు కూడా నానా మార్పుల ఫలితమే! ఇప్పటి మన నాగరికత, మన వేషభాషలు, మన సాంకేతిక పరిజ్ఞానం, మన కళానైపుణ్యాలు, మన ఆటపాటలు, మన తిండితిప్పలు వంటివన్నీ ఎన్నో మార్పుల ఫలితమే! ఎంతటి నియంతలకైనా మార్పును నివారించడం సాధ్యం కాదు. అనంత కాలవాహినిలో మార్పులు అలల్లా వచ్చిపోతుంటాయి. మంచి చెడులు మార్పులకూ వర్తిస్తాయి. మంచి మార్పులు వికాసానికి, చెడు మార్పులు వినాశానికి దారులు వేస్తాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే నిన్నటితో ముగిసిపోయిన సంవత్సరంలోనూ కొన్ని గణనీయమైన మార్పులే చోటు చేసుకున్నాయి. నిన్నటితో ముగిసిన ఏడాదిలో మానవాళికి మేలు చేసే పదమూడు మార్పులు జరిగినట్లు ‘టైమ్’ మ్యాగజైన్ కథనం చెబుతోంది. ఇదొక ఆశాజనకమైన విషయం. లోకంలో ఎక్కడో ఒకచోట అపశ్రుతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కేవలం వాటినే భూతద్దంలో చూపిస్తూ, ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వగచే వారికి ప్రపంచంలోని ఆశాజనకమైన మార్పులు అగుపడవు. అయితే, ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అని మహాకవి గురజాడ చెప్పిన మాటలు మరువరాదు. ప్రపంచమంతా శరవేగంగా మారిపోతున్నా, కొందరు యథాతథవాదులు మాత్రం మార్పును కోరుకోరు. తాము మారాలనుకోరు. లోకం తమ కళ్లముందే మారిపోతుండటాన్ని చూసి వారు ఏమాత్రం సహించలేరు. మార్పులను నివారించడానికి శాయశక్తులా విఫలయత్నాలు చేస్తుంటారు. కాలంచెల్లిన మనుషులు కాలం పరుగును వెనక్కు మళ్లించడానికి నానా విన్యాసాలు చేస్తుంటారు. విఫలయత్నాలు, విన్యాసాలు వికటించి మార్పులు అనివార్యమనే సంగతి అనుభవంలోకి వచ్చినా జీర్ణించుకోలేరు. కాలంతో కలసి ముందుకు సాగేవారిని, మార్పులను మనసారా స్వాగతించే వారిని, మార్పులకు దోహదపడేవారిని అక్కసుకొద్ది ఆడిపోసుకుంటారు. ఎవరేమనుకున్నా లోకం తన మానాన తాను మారుతూనే ఉంటుంది. మార్పు తన శాశ్వతత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ జనాలు తమ జీవితాల్లో మేలి మార్పుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం కాలం మరింతగా అనుకూలించాలని, కష్టాలు కడతేరాలని, ప్రపంచంలో యుద్ధాలు సమసిపోవాలని, శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలని, మానవాళికి మేలు కలగాలని, ప్రగతి దిశగా కాలం పరుగు వేగం పుంజుకోవాలని కోరుకుందాం. కొత్త సంవత్సరం కొత్త వేకువ ఉదయించాలని కోరుకుందాం. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కొత్త సంవత్సరం ఒక చక్కని సందర్భం. ఈ సందర్భాన్ని సార్థకం చేసుకుందాం. -
‘గుర్తింపు’ ముందు అనేక సవాళ్లు!
పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సంస్థలో ఏడోసారి జరిగిన ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై 1,983 ఓట్ల మెజారిటీతో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరకు విజయాన్ని ౖకైవసం చేసుకుంది. సంస్థ వ్యాప్తంగా ఆరు ఏరియాల్లో ఐఎన్టీయూసీ, ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచాయి. ఈక్రమంలో ప్రధాన డిమాండ్ల సాధన బాధ్యత గెలిచిన యూనియన్పై సవాల్ విసురుతోంది. సొంతింటి పథకం, మారుపేర్ల మార్పు, నూతన భూగర్భగనుల తవ్వకం తదితర డిమాండ్ల సాధన అంతసులువు కానప్పటికీ.. పోరాటాల చరిత్ర కలిగిన గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ భవిష్యత్లో ఎలా ముందుకు సాగుతుందోనని సింగరేణి కార్మికులను ఆలోచింపజేస్తోంది. ఏఐటీయూసీ ఎన్నికల మెనిఫెస్టో ఇదీ.. సింగరేణిలో రాజకీయ జోక్యం నియంత్రిస్తాం. ఆర్థిక దుబారాను అరికడతాం. కోలిండియా మాదిరిగా పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. కార్మికుల పిల్లల ఉద్యోగ వయోపరిమితి 35ఏళ్ల నుంచి 40ఏళ్లకు పెంచుతాం. సొంతింటి పథకం కింద 250గజాల ఇంటి స్థలం, రూ.20లక్షల వడ్డీలేని రుణం మంజూరు చేయిస్తాం. నూతన భూగర్భగనులు తవ్వించి ఉద్యోగాలు పెంచడం బొగ్గు వెలికితీసే ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించి పర్మినెంట్ కార్మికులను నియమించడం. మైనింగ్స్టాఫ్, ట్రేడ్స్మెన్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు, ఈపీ ఆపరేటర్లకు సర్ఫేస్లో అదే హోదా కల్పన. ప్లేడే, పీహెచ్డీలకు ఎన్–వన్ విధానం తొలగించి పాత పద్ధతి కొనసాగిస్తాం. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు డబ్బులు లేకుండా అందరికీ అన్ఫిట్ చేయిస్తాం సంస్థ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చి సూపర్స్పెషాలిటీ వైద్యం అందించేలా కృషి చేస్తాం. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యా బోధన అందుబాటులోకి తెస్తాం. సీహెచ్పీల్లో పనిచేసే కార్మికులకు డస్ట్ అలవెన్స్ ఇప్పిస్తాం. రిటైర్డ్ రోజునే కార్మికులకు టర్మినల్ బెనిఫిట్స్ అందేలా చూస్తాం. చదువుకున్న కార్మికులకు సూటబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. మహిళా కార్మికులను భూగర్బగనుల్లోకి దింపకుండా చూస్తాం. అన్నిఏరియాల్లో కార్మికులకు డబుల్బెడ్రూమ్లు ఇచ్చేలా చూస్తాం. క్యాంటీన్లలో నాణ్యమైన టిఫిన్స్ అందించేలా చూస్తాం. గని ప్రమాదాల్లో ఇంక్రిమెంట్లు కోల్పోయిన వారికి వన్టైం సెటిల్మెంట్కింద ఇంక్రిమెంట్ ఇప్పిస్తాం. తెలంగాణ ఇంక్రిమెంట్ బేసిక్లో కల్పించేలా చూస్తాం. సింగరేణి డీఎంఎఫ్ఐటీ, సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసేలా చూస్తాం. మారుపేర్ల కార్మికులను సొంత పేర్లపై రెగ్యులరైజ్ చేసేలా చూస్తాం. 2022లో జరిగిన 9డిమాండ్ల ఒప్పందం అమలయ్యేలా చూస్తాం. కార్మికుల పక్షాన పోరు! మాపై నమ్మకంలో ఎన్నికల్లో గుర్తింపు యూనియన్గా గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు. వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతాం. పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ, సొంతింటి కల నెర వేర్చుతాం. మారుపేర్లతో నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను వన్టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేసేలా చూస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా దృష్టి సారిస్తాం. – సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం!
సాక్షి, పెద్దపల్లి: జిల్లావాసులు గతం మరిచి కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2023 మిగిల్చిన చేదు అనుభవాలను పక్కన పెట్టి.. నూతన వసంతాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నాతాధికారులు ఈఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనేక ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున అవన్నీ నెరవేరాలని కోరుకున్నారు. తాము చేపట్టే పనులు, తీసుకున్న నిర్ణయాలు, లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే.. ప్రజలకు పథకాల ప్రయోజనాలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరువ చేస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హులైన ప్రతీఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానంగా జిల్లాలో విద్య, వైద్యం మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకుంటాం. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం, స్వచ్ఛత పనులు పకడ్బందీగా నిర్వహిస్తాం. – ముజిమ్మిల్ఖాన్, కలెక్టర్ ప్రగతిని పరుగులు పెట్టిస్తాం అధికారుల సహాయ సహకారాలతో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నాం. ఇలాగే త్వరలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించాయి. వచ్చేఏడాదిలో సైతం అవార్డులు సాధించడంలో ముందుండేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాం. ప్రగతిని పరుగులు పెట్టిస్తాం. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అందరికీ అభివృద్ధి ఫలాలు కొత్తప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషిచేస్తాం. అభివృద్ధి పనులను వేగవంతంచేసి సకాలంలో పూర్తియ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా పెండింగ్లోని భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటాం. ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణ చేసి పనులు వేగవంతం చేస్తాం. – శ్యాంలాల్ ప్రసాద్, అదనపు కలెక్టర్ మహిళల భద్రతకు పెద్దపీట మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. మహిళలు, పిల్లలపై దాడుల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. 2024 లో రోడ్డు ప్రమాదాలు, సై బర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడతాం. ప్రతీఇంట్లో, ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వాటితో నేరాల విచారణ ఎంతో సులభమవుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగహన కల్పిస్తున్నాం. – డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లి -
సెంటిమెంట్ దేవత.. పర్వతాపూర్ మైసమ్మ
నవాబుపేట: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ఇటు జిల్లాకేంద్రానికి, అటు మండల కేంద్రానికి మధ్యలో 9 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. కొత్త వాహనాలకు పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల సమయంలోనూ వివిధ పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. ఈ ఆలయం కూడా కొత్త సంవత్సరం వేళ రద్దీగా ఉంటుంది. కృష్ణాతీరంలో.. కొల్లాపూర్:జనవరి ఒకటో తేదీన నియోజకవర్గంలోని కృష్ణా తీర ప్రాంతాలు, నదీతీర ఆలయాలను దర్శించుకునేందుకు ప్రజలు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. అనంతరం ఏపీ సరిహద్దు ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయానికి వెళ్తుంటారు. సోమశిలలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సింగోటం లక్ష్మీనర్సింహ్మస్వామి, మంచాలకట్ట రామలింగేశ్వరస్వామి, కొల్లాపూర్ రామ మందిరం, శివాలయం, వరిదెల హనుమాన్, మాధవస్వామి ఆలయాలకు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సోమశిల, అమరగిరి సమీపంలోని కృష్ణానదిలో విహరించేందుకు బోట్లు అందుబాటులో ఉంటాయి. జటప్రోల్ సమీ పంలోని కత్వ వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు. -
24 గంటల్లో 16 న్యూ ఇయర్స్
కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైమ్జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్ : కంట్రీ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలు (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్ క్లబ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్లో న్యూఇయర్ సందడి (ఫొటోలు)
-
New Year: విశాఖ, విజయవాడలో ఆంక్షలు ఇవే..
సాక్షి, విశాఖ/విజయవాడ: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విశాఖపట్నం, విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈవెంట్స్, బార్స్, రెస్టారెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతిచ్చారు. రూల్స్ ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు.. రేపు ఉదయం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్లు, రోడ్లు మూసివేత బీఆర్టీఎస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హనమంత వాక నుంచి అడవివరం జంక్షన్ వరకు ట్రాపిక్ ఆంక్షలు. పెందుర్తి జంక్షన్ నుంచి ఎన్ఏడీ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మూసివేత. ఈవెంట్స్, బార్స్, రెస్టారెంట్లకు ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి. రూల్స్ ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు. విశాఖ బీచ్ రోడ్లోకి వాహనాలకు అనుమతి నిరాకరణ. విజయవాడలో పోలీసుల ఆంక్షలు విజయవాడ సీపీ మాట్లాడుతూ.. పోలీసు యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. డీజేలకు ఎలాంటి అనుమతి లేదు. నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేత. బందర్రోడ్లో వాహనాలకు అనుమతి లేదు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు. -
నూతన ఏడాదికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ‘రైతు మహిళ యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్ వెల్లడించారు. కాగా, కొత్త ఏడాది సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..‘మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్దరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి.. వారి భవిష్యత్కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరం 'రైతు మహిళ యువత నామ సంవత్సరం'గా సంకల్పం తీసుకున్నాం. గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించాం. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం. ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గత పాలన కాదు.. జన పాలన. ప్రతీ పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా.. అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ.. ఈ నూతన సంవత్సరంలో ప్రతీ పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతీ గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి. ప్రతీ ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ తెలిపారు.