-
ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నరేళ్లకే తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఎంబీ బీఎస్ ఫీజును ఐదేళ్లకు కాకుండా నాలుగున్నరేళ్లకే తీసుకోవాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రైవేట్ కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర ఏళ్లు మాత్రమేనని, అందుకు తగ్గట్టుగానే ఫీజు తీసుకోవాలని సూచించింది. కొన్ని కాలేజీలు ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి స్పష్టతను ఇస్తున్నామని తెలిపింది. ఉదాహరణకు కోర్సు ఫీజు ఏడాదికి రూ. 14.5 లక్షలు అనుకుంటే, మొత్తం నాలుగున్నర ఏళ్లకు కలిపి రూ. 65.25 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్లలో విద్యార్థుల నుంచి తీసుకోవాలని, ఒక్కో ఇన్స్టాల్మెంట్కు రూ. 13.05 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. దీనివల్ల ఆరు నెలలు అదనంగా వసూలు చేస్తున్న ఫీజుల భారం విద్యార్థులపై పడదని తెలిపింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజును ఐదు సమాన వాయిదాలలో వసూలు చేయాలని, మేనేజ్మెంట్లు ముందుగా ఫీజును వసూలు చేయరాదని కమిటీ సిఫార్సు చేసింది. అంటే ఎంబీబీఎస్ విద్యార్థుల వద్ద కోర్సు మొత్తానికి ఒకేసారి ఫీజు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఫీజు రెగ్యులేటరీ కమిటీ హెచ్చరించింది. ఏ యేడాది ఫీజును ఆ ఏడాది మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, ప్రతీ ఏడాది టీఏఎఫ్ఆర్సీ ఇలా ఆదేశాలు ఇస్తున్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లెక్కచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
నీట్ పేపర్ లీకేజీ.. ఎన్టీఏ ప్రైవేట్ సంస్థనా?!
ఢిల్లీ, సాక్షి : వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024’లో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.నీట్ పేపర్ లీకేజీతో అప్రమత్తమైన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. లీకేజీకి పాల్పడిన నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశాలు జారీ చేసింది. అలా ఇప్పటి వరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.అదే సమయంలో ఎన్టీఏ చీఫ్ను తొలగించింది. పరీక్షల నిర్వహణపై ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అయినప్పటికీ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నీట్ పేపర్ లీకేజీపై తమ ఆందోళనల్ని తెలుపుతూ వస్తున్నారు.ఈ తరుణంలో ఎన్టీఏ ప్రైవేట్ సంస్థ అని,ఎన్టీఏ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయ్యిందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి అందులో నిజమెంత? అనేది తెలియాల్సి ఉంది.సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అంటేసొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అనేది బ్రిటీష్ ఇండియాలో ఒక చట్టం. ఇది సాధారణంగా సమాజ శ్రేయస్సు కోరేలా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు సంబంధించిన సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. -
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
NEET UG 2024: ‘నీట్’ గ్రేసు మార్కులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం.. ‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఏమిటీ వివాదం? ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్గఢ్, సూరత్, చండీగఢ్లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు. కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. -
ఎంబీబీఎస్కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశముంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్ సీట్లు వచ్చాయన్న విషయమై విద్యార్థులు ఆరా తీస్తున్నారు. లక్షల్లో ర్యాంకు వచ్చినా.. గతేడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్ జాతీయ స్థాయిలో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్లోని సీఎంఆర్ మెడికల్ కాలేజీలో బీసీ సీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంక్కు సీటు వచ్చింది. అలాగే 2.62 లక్షల ర్యాంకు పొందిన బీసీ సీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్ధికి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డిలోని టీఆర్ఆర్ కాలేజీలో బీసీ సీ కేటగరీకే చెందిన విద్యార్థికి 2.58 లక్షల ర్యాంక్ వచ్చినా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇక ఓపెన్ కేటగిరీ లోకల్ కోటాలో వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో 1.60 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు లభించింది. ఓపెన్ కేటగిరీలోని అన్ రిజర్వ్డ్ కోటాలో సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 58,727 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు లభించింది. పెరిగిన సీట్లతో ఈసారి విస్త్రుత అవకాశాలు... రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెరిగాయి. 2023–24 వైద్య విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద కేటాయిస్తారు. మరోవైపు ఈ ఏడాది కూడా మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2024–25 విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు రానున్నాయి. వాటికి సంబంధించి ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈసారి ఆరు కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని.. ఈ లెక్కన కనీసం 300 సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే ఆ మేరకు ఎంబీబీఎస్లో విద్యార్థుల చేరికలకు అవకాశాలు పెరగనున్నాయి. 15 శాతం ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో.. తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు 15 శాతం కోటా కింద పదేళ్లపాటు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన ఏపీ పునర్విభజన చట్టం–2014లోని నిబంధన గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ నిబంధన వల్ల 2014 నుంచి 2022 వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 15 శాతం సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి కోటా కింద వర్తింపజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను రద్దు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటాను అమలు చేసింది. ఆయా కాలేజీల్లో 1,950 కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే అందులో 200కుపైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో ఇకపై ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇలా కూడా అదనంగా సీట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి 3 లక్షల ర్యాంక్ పొందిన విద్యార్ధికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభిస్తుందని కాళోజీ నారాయణరావు వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉస్మానియా, గాం«దీ, కాకతీయల్లో ఏ ర్యాంక్కు సీట్లు వచ్చాయంటే? – ఉస్మానియా మెడికల్ కాలేజీ ఓపెన్ కేటగిరీలోని లోకల్ కింద 19,239 ర్యాంకుకు, అన్ రిజర్వుడ్లో 7,943 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 30,522 ర్యాంకు వరకు కూడా సీటు లభించింది. ఎస్సీ విద్యార్థులకు లోకల్ కేటగిరీలో 89,253 ర్యాంకు సాధించినా సీటు వచ్చింది. అన్రిజర్వ్డ్లో 48,358 ర్యాంకర్కు సీటు వచ్చింది. ఎస్టీ లోకల్ కేటగిరీలో 90,658 ర్యాంకర్కు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 73,500 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు వచ్చింది. బీసీ ఏలో లోకల్ కేటగిరీ కింద 79,611 ర్యాంకు, అన్రిజర్వ్డ్లో 42,349 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చాయి. బీసీ బీలో లోకల్కు 30,944... అన్ రిజర్వుడుకు 12,788 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ సీలో లోకల్కు 69,344... అన్ రిజర్వ్డ్లో 21,822 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ డీలో లోకల్కు 30,465... అన్ రిజర్వ్డ్లో 20,069 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ–ఈలో లోకల్కు 34,482... అన్ రిజర్వ్డ్లో 20,497 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. – గాంధీ మెడికల్ కాలేజీలో ఓపెన్ కోటాలో లోకల్ కేటగిరీ కింద 8,164 ర్యాంకుకు, అన్ రిజర్వ్డ్లో 3,225 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 26,245 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కోటాలో లోకల్ కేటగిరీ కింద 80,215 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది. అన్ రిజర్వ్డ్లో 39,519 ర్యాంకర్కు సీటు వచ్చింది. ఎస్టీలో లోకల్కు 78,656... అన్ రిజర్వ్డ్కు 47,860 ర్యాంకుకు సీటు వచ్చింది. బీసీ–ఏ లోకల్ కేటగిరీలో 36,691 ర్యాంకుకు సీటురాగా బీసీ–బీలో లోకల్ కింద 15,625 ర్యాంకర్కు సీటు వచ్చింది. అలాగే బీసీ–సీలో లోకల్కు 55,674 ర్యాంకుకు సీటు లభించింది. బీసీ–డీలో లోకల్కు 14,598 ర్యాంకుకు... అన్ రిజర్వ్డ్లో 8,257 ర్యాంకుకు సీట్లు వచ్చాయి. బీసీ–ఈలో లోకల్కు 30,495... అన్ రిజర్వ్డ్లో 5,737 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. – వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓపెన్లోని లోకల్ కేటగిరీలో 36,905 ర్యాంకుకు, అన్ రిజర్వ్డ్లో 25,305 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 47,684 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీల్లో లోకల్ కేటగిరీలో 1.14 లక్షల ర్యాంకుకు సీటు వచ్చింది. అన్ రిజర్వ్డ్లో 98,658 ర్యాంకుకు సీటు వచ్చింది. ఎస్టీ కోటాలో లోకల్ కింద 1.07 లక్షల ర్యాంకు వచ్చిన వారికి... అన్ రిజర్వ్డ్లో 95,831 ర్యాంకర్కు సీటు వచ్చింది. బీసీ–ఏ లోకల్ కేటగిరీలో 1.09 లక్షల ర్యాంకుకు... అన్ రిజర్వ్డ్లో 66,831 ర్యాంకులకు సీట్లు వచ్చాయి. బీసీ–బీలో లోకల్కు 43,616... అన్ రిజర్వ్డ్కు 37,381 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ–సీలో లోకల్కు 94,902 ర్యాంకర్కు సీటు వచ్చింది. బీసీ–డీలో లోకల్కు 42,838, బీసీ–ఈలో లోకల్ కోటా కింద 50,030 ర్యాంక్ పొందిన వారికి సీట్లు లభించాయి. -
నీట్లో ఏపీ విజయదుందుభి
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 23,33,297 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13,16,268 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 64,931 మంది పరీక్ష రాయగా 43,858 మంది అర్హులుగా నిలిచారు. అలాగే తెలంగాణలో 77,849 మందికి గాను 47,371 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 9.98 లక్షల మంది అబ్బాయిలు నీట్ రాయగా 5.47 లక్షల మంది, 13.34 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 7.69 లక్షల మంది అర్హులుగా నిలిచారు. గత నెల 5న దేశవ్యాప్తంగా 571 నగరాలు, పట్టణాలతోపాటు విదేశాల్లో 14 నగరాల్లో నీట్ యూజీని నిర్వహించారు.సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులునీట్ రాసిన విద్యార్థుల్లో 68 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. కాగా, మహారాష్ట్రకు చెందిన వి.సునీల్ షిండే, తమిళనాడుకు చెందిన సయ్యద్ ఆరి్ఫన్ యూసఫ్.ఎం, ఢిల్లీకి చెందిన ఎం.ఎం.ఆనంద్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కె. సందీప్ చౌదరి (21వ స్థాన), జి. భానుతేజ సాయి(29వ స్థానం), పోరెడ్డి ప్రవీణ్కుమార్ రెడ్డి(56వ స్థానం), వి. ముకేష్ చౌదరి(60వ స్థానం)లో నిలిచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ వీరే టాప్ ర్యాంకర్లుగా ఉన్నారు. పెరిగిన కటాఫ్లు నీట్–2023తో పోలిస్తే ఈ ఏడాది అన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. అన్ రిజర్వుడ్ /ఈడబ్ల్యూఎస్ విభాగంలో గతేడాది 720–137 కటాఫ్ మార్కులు ఉండగా ఈ ఏడాది 720–164 మధ్య ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 136–107 నుంచి 163–129కు కటాఫ్లు పెరిగాయి. పీహెచ్ యూఆర్/ఈడబ్ల్యూఎస్ విభాగంలో 136–121 నుంచి 163–146, పీహెచ్ ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో 120–107 నుంచి 145–129కు, పీహెచ్ ఎస్టీలో 120–108 నుంచి 145–129కు కటాఫ్ మార్కులు ఎగబాకాయి. -
కిర్గిస్తాన్కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కిర్గిస్తాన్లో జరిగింది చిన్న గొడవేకిర్గిస్తాన్లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టల్కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. కిర్గిస్తాన్కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?కిర్గిస్తాన్.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి కిర్గిస్తాన్కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్లో యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.కిర్గిస్తాన్ కరెన్సీ విలువఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిస్తాన్ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఖర్చుల పరంగా చూస్తే మనదేశం కంటే అక్కడ కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికి.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.కిర్గిస్తాన్కు ఆదాయం ఎలా?కిర్గిస్తాన్లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్కు అత్యంత కీలకంగా మారాయి. ఇండియన్ మెడిసిన్ కేరాఫ్ కిర్గిస్తాన్కిర్గిస్తాన్లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్ డాక్టర్ల టీచింగ్ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్కు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం కిర్గిస్తాన్లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో మంచి ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్లోనే కోచింగ్ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. -
తమ్ముడి ‘నీట్’ రాసేందుకు ఎంబీబీఎస్ అన్న.. తరువాత?
దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. రాజస్థాన్లోని బార్మర్లో గల అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రంలో చీటింగ్ కేసు వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే జోధ్పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న భగీరథ్ రామ్ తన తమ్ముడి స్థానంలో నీట్ పరీక్ష రాయడానికి అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు వచ్చాడు. అతనిని చూసిన ఎగ్జామినర్కు అనుమానం రావడంతో ఆరా తీశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు భగీరథరామ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చానని తన తప్పును ఒప్పుకున్నాడు.నీట్ పరీక్ష నిర్వహణకు బార్మర్లోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆంత్రి దేవి స్కూల్లో నకిలీ అభ్యర్థిని గుర్తించినట్టు తమకు సమాచారం అందిందని బార్మర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్రామ్ బోస్ తెలిపారు. పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకుని నకిలీ అభ్యర్థిని విచారించగా, నిందితుడు డమ్మీ అభ్యర్థి అని తేలింది. ఈ ఉదంతంలో పోలీసులు భగీరథ్ రామ్, అతని తమ్ముడు గోపాల్రామ్లను అరెస్ట్ చేశారు.భగీరథ రామ్ జోధ్పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి. తమ్ముడిని డాక్టర్ని చేసేందుకు మున్నా భాయ్ తరహాలో నకిలీ అభ్యర్థిగా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చాడు. అయితే ఇంతలోనే పోలీసులకు పట్టబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సోదరులిద్దరినీ విచారిస్తున్నారు. -
నేడు నీట్ యూజీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ–2024)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.పెన్ అండ్ పేపర్ మోడ్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది, నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు, పలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.24 లక్షల మందికి పైగా..ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ యూజీ రాయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. అయితే గతేడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 42,836 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది 70 వేల మందికిపైగా పరీక్ష రాసే అవకాశం ఉంది. 706 కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లునీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5,360 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మరో 500 సీట్లు కొత్తగా సమకూరనున్నాయి.విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు∗ పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి.∗ ఆధార్, పాన్, ఓటరు ఐడీ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.∗ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.∗ ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు. -
నీట్ ర్యాంకు.. మాక్ టెస్టులే కీలకం
సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీని మే 5న నిర్వహించనున్నారు. పరీక్షకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మంచి ర్యాంక్ సాధించడంలో మాక్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థులు రోజుకు ఒకటి చొప్పున మాక్ టెస్ట్ రాయడం మంచిదంటున్నారు. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత స్వయంవిశ్లేషణ చేసుకుని.. బలహీనంగా ఉన్న విభాగాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో ప్రయోజనం.. ఈ ఏడాది నీట్ సిలబస్లో చాలా మార్పులు చేశారు. దాదాపు 18 అంశాలను సిలబస్ నుంచి తొలగించారు. బయాలజీ, కెమిస్ట్రీల్లో కొన్ని కొత్త అంశాలను జోడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్లో లేని అంశాల జోలికి విద్యార్థులు వెళ్లకపోవడం ఉత్తమం. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు నీట్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని.. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి 70 వేల మంది.. నీట్ యూజీ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 23.80 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. గతేడాది 20.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 68 వేల మంది నీట్ రాయగా 42 వేల మంది అర్హత సాధించారు. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 70 వేల మందికిపైగా నీట్ రాసే అవకాశాలున్నాయి. గతేడాది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరుణ్ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. తరచూ పునశ్చరణ చేయాలి.. ఎన్సీఈఆర్టీ బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలతో షార్ట్స్ నోట్స్ రాసుకోవాలి. వాటిని తరచూ పునశ్చరణ చేస్తూ ఉండాలి. బయాలజీలో ప్లాంట్ అండ్ యానిమల్, హ్యూమన్ ఫిజియాలజీ, మార్ఫాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, బయోటెక్నాలజీ, రీప్రొడక్షన్ వంటివి ముఖ్యమైన అధ్యాయాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. పరీక్షకు తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త విషయాలు, అంశాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడం ఉత్తమం. – కె. రవీంద్రకుమార్, నీట్ కోచింగ్ నిపుణులు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ రోజు సిలబస్ ఆ రోజే పూర్తి చేయాలి.. పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా సది్వనియోగం చేసుకోవాలి. ఏ రోజు సిలబస్ను ఆ రోజే పూర్తి చేస్తే ఒత్తిడి ఉండదు. నా స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీ చేసేవాడిని. వారితో కలిసి మాక్ టెస్ట్లు రాయడం వల్ల మాలో మాకు మంచి పోటీ ఉండేది. అత్యుత్తమ ప్రతిభ కనబరచడంలో గ్రూప్ స్టడీ నాకు ఎంతో మేలును చేకూర్చింది. ప్రశ్నను చదవడం, అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయొద్దు. పరీక్ష రాసేప్పుడు తొలుత బయాలజీ సెక్షన్ పూర్తి చేసి, తర్వాత ఫిజిక్స్, చివరలో కెమిస్ట్రీ రాయడం మంచిదని నా అభిప్రాయం. – వరుణ్ చక్రవర్తి, నీట్ యూజీ–2023, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ -
యుద్ధం నీడలో ‘వైద్యం’ పూర్తి!
దేశంకాని దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు రెక్కలు కట్టుకొని వెళ్లారు.. ఓ కాలేజీలో తొలి సెమిస్టర్ పూర్తి చేసి రెండో సెమిస్టర్లోకి అడుగుపెట్టారు. అంతలోనే ఒక్కసారిగా దేశమంతా బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో విలవిల్లాడారు.. కేంద్రం చొరవతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశం చేరుకున్నా ఆగిన చదువును కొనసాగించాలన్న పట్టుదలతో తొలుత 2–3 నెలలు ఆన్లైన్ చదువులు చదివి.. ఆ తర్వాత కన్నవారిని, కేంద్రాన్ని ఒప్పించి మరో దేశంలోని కాలేజీలో కోర్సును పూర్తిచేసి స్వదేశానికి తిరిగొచ్చారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తాలూకు మనోవేదనను అధిగమించి.. అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించిన 210 మంది వైద్య విద్యార్థుల విజయగాథ ఇది. లక్డీకాపూల్: ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేపట్టిన ఎంబీబీఎస్ కోర్సును.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉజ్బెకిస్తాన్లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తిచేసిన 10 రాష్ట్రాలకు చెందిన 210 మంది విద్యార్థులకు మంగళవారం హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా పట్టాల పంపిణీ జరిగింది. 86 మంది విద్యార్థినులు సహా మొత్తం 210 మంది ఉజ్బెకిస్తాన్ వెళ్లి కోర్సు పూర్తిచేశారు. అయితే జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) సూచనల మేరకు మొత్తం 210 మంది విద్యార్థులకు.. వారు ఎంబీబీఎస్ కోర్సు మొదలుపెట్టిన ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచే పట్టాలు రావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్ పాసైన విద్యార్థుల్లో 110 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయగా 81 మంది తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. వారిలోనూ 34 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ విద్యార్థులది అపార కృషి: ఉజ్బెకిస్తాన్ రాయబారి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత్లో ఉజ్బెకిస్తాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్ మాట్లాడుతూ విద్యార్థులంతా అపార కృషితోపాటు అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మరీ విజయం సాధించారన్నారు. వాళ్ల విజయంలో తమ దేశం పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. యుద్ధ కాలంలో విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేలా చొరవ చూపడంతోపాటు తిరిగి వారిని ఉబ్జెకిస్తాన్ పంపడంలో కీలకపాత్ర పోషించిన నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్రెడ్డిని అభినందించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన అనుమతులు ఇచ్చిన కేంద్రానికి, జాతీయ మెడికల్ కౌన్సిల్కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్మన్ పి. విజయబాబు, డాక్టర్ దివ్యారాజ్రెడ్డి, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్. సుయరొవ్, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ కౌన్సిలర్ ఐ. సొలియెవ్, నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ సందీప్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
ఇది కదా...‘తగ్గేదేలే’ అంటే .. సలాం డాక్టర్!
తనశారీరక వైకల్యాన్ని వెక్కిరించినా పట్టువీడలేదు. కోర్టుకు వెళ్లి మరీ తన కల నెరవేర్చుకున్నాడు. సంకల్పం ఉంటే కాదేదీ అసాధ్యం అని నిరూపించాడు గుజరాత్కు చెందిన ఒక యువ వైద్యుడు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా ప్రపంచ రికార్డుకు అర్హత సాధించాడు. ఇంతకీ ఎవరా వైద్యుడు? ఏమా కథ. అత్యంత స్ఫూర్తి దాయకమైన ఈ స్టోరీ తెలుసుకుందాం రండి..! గుజరాత్, గోరఖి గ్రామానికి చెందిన గణేష్ బరయ్యకు పుట్టుకతోనే ఒక సమస్య ఉంది. 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధ పడుతున్నాడు. అందుకే 23 ఏళ్లు వచ్చినా తగినంత ఎత్తు, బరువూ పెరగలేదు. ప్రస్తుతం అతని ఎత్తు 3 అడుగులు. బరువు 18 కేజీలు మాత్రమే. చిన్నతనంలో కూడా తన పరిస్థితి గురించి బాధపడుతూ కూర్చోలేదు. తొలుత 10వ తరగతి , తర్వాత ఇంటర్ విద్యను కంప్లీట్ చేశాడు.. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్లో 233 మార్కులు సాధించాడు. ఇక్కడే ఆయన జీవితంలో అనుకోని పరిణామం ఎదురైంది. తన పరిస్థితే తన కలలకు, కరియర్కు అడ్డంకిగా మారుతుందని అస్సలు ఊహించలేదు. #WATCH | Dr Ganesh Baraiya says, " The committee of Medical Council of India had rejected me saying that my height is 3 feet and I won't be able to handle emergency cases...with the direction of Bhavnagar collector, I went to Gujarat HC...after 2 months, we lost the case...we… https://t.co/ALEjkaaZsk pic.twitter.com/zjMfZQE7pz — ANI (@ANI) March 6, 2024 అసమానతలను ధిక్కరించి, MBBS ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, ప్రవేశపరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా, కేవలం ఎత్తు కారణంగా ఎంబీబీఎస్లో ప్రవేశానికి నిరాకరించారు. ఎత్తు కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అత్యవసర కేసులను నిర్వహించలేవంటూ భారత వైద్య మండలి కమిటీ తిరస్కరించింది. #WATCH | Gujarat: 3-foot tall Ganesh Baraiya defies the odds, becomes a doctor at Bhavnagar Government hospital (06/03) pic.twitter.com/37op1R2X1t — ANI (@ANI) March 6, 2024 కానీ దృఢ సంకల్పంతో భావ్నగర్ కలెక్టర్ సలహా మేరకు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఈ కేసు ఓడిపోయాడు. అయినా ఏమాత్రం నిరాశచెందకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఆయనకు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చని సుప్రీం సూచించింది. మెడికల్ విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్న్ డాక్టర్గా సేవలందిస్తూ, తిరుగులేని నిబద్ధతతతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్నాడు. ఒక సాధారణ రైతు కొడుకు గణేష్కి ఎనిమిది మంది తోబుట్టువులు. వారంతా 10వ తరగతితోనే చదువు ఆపేశారు.వారి కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన తొలి వ్యక్తిగా, ఇపుడు తొలిడాక్టర్గా చరిత్ర సృష్టించారు. మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ టైటిల్కు అర్హత సాధించడం విశేషం. తనకు సాయం చేసిన, ధైర్యం చెప్పిన అందరికీ గణేష్ కృతజ్ఞతలు తెలిపాడు గణేష్. -
వైద్య విద్యలో నవశకం
సొంతూరిలోనే మెడిసిన్.. మాది నంద్యాల. సీఎం జగన్ నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో కౌన్సెలింగ్లో మొదటి ప్రయారిటీ ఇచ్చా. అక్కడే సీటు వచ్చింది. ఉంటున్న ఊళ్లోనే ఎంబీబీఎస్ చదవడం నా అదృష్టం. కొత్త వైద్య కళాశాలల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో తాముంటున్న చోట వైద్య విద్య చదవాలన్న నాలాంటి విద్యార్థుల కలలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. – వినయ్ కుమార్రెడ్డి, వైద్య విద్యార్థి, నంద్యాల వైద్య కళాశాల సాక్షి, అమరావతి: ఇప్పుడు వైద్య సేవలే కాదు.. వైద్య విద్య కూడా మనకు చేరువైంది. ఒకపక్క ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మరోపక్క మన విద్యార్థుల వైద్య విద్య కలలను సైతం సాకారం చేశారు. కోట్లుంటేనే డాక్టర్ కోటు సాధ్యమనే నానుడిని తొలగిస్తూ ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కాలేజీల ఏర్పాటుతో మెడికల్ మిరాకిల్ చేశారు! స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల సంఖ్య 11. గత నాలుగున్నరేళ్ల కృషి ఫలితంగా కొత్తగా సాకారమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఏకంగా 17. వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందో చెప్పేందుకు ఇది చాలు! ‘పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది..’ ఈ సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మనిషి ప్రాణం విలువ తెలిసిన మనసున్న పాలకుడిగా ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నారు. గత సర్కారు హయాంలో నరకానికి నకళ్లుగా మారిన ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చడానికి రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులను రప్పించి మారుమూల ప్రాంతాలవారికీ వ్యయ ప్రయాసలు లేకుండా ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ సంపూర్ణ వైద్య భరోసా కల్పిస్తున్నారు. ఇక అందిన ద్రాక్ష.. అందని ద్రాక్ష లాంటి వైద్య విద్యను పేద, మధ్య తరగతి విద్యార్థులకు చేరువచేస్తూ రూ.8,480 కోట్లతో రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. ఇప్పటికే 5 కొత్త మెడికల్ కళాశాలలను ప్రారంభించగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు ఆరంభం కానున్నాయి. మిగిలిన 7 కాలేజీలను 2025–26లో ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. కొత్త మెడికల్ కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు చేపట్టి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు 96 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్ నిబద్ధత, దార్శనికతకు నిదర్శనం. రెండు రకాల లాభాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఇప్పటివరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా నిపుణులైన వైద్యుల సేవలు పేద ప్రజలకు అందనున్నాయి. ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తై బయటకు వచ్చే సమయానికి ప్రతి కొత్త వైద్య కళాశాలలో 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. గత ఏడాది ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలకు అనుసంధానంగా నడిచే బోధనాస్పత్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డియాలజీ, క్యాన్సర్ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్లు ఏర్పాటు కావడంతో వైద్యం, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ రకాల వ్యాధులు, జబ్బులపై పరిశోధన జరుగుతుంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం హౌస్ సర్జన్లుగా అందుబాటులోకి వస్తారు. వీరు 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో రోగులకు నిరంతరాయంగా సేవలు అందుతాయి. అంతేకాకుండా ఐదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా వస్తాయి. వీటి ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలోనే పెద్దాస్పత్రులు సమకూరడంతో ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ, ఖర్చు ఉండదు. నాడు ప్రైవేట్కు పట్టం.. నాకంటే విజనరీ ఎవరున్నారు? అంటూ తరచూ బుకాయించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగినా కూడా విద్య, వైద్య రంగాల అభివృద్ధికి చేసిన కృషి శూన్యం. 2014 నుంచి నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని కూడా ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలనూ తేలేదు. కనీసం ఆ ప్రయత్నమూ చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహించారు. ‘ప్రభుత్వ రంగంలో కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ.350 కోట్లు అవుతుంది. ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాలి. మేం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటును ప్రోత్సహిస్తాం’ అని చంద్రబాబు సర్కారులో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగాలు.. ఉపాధి కొత్త మెడికల్ కాలేజీల రాకతో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రతి చోటా అత్యాధునిక బోధనాస్పత్రి, వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టులను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం ద్వారా ఉద్యోగాలు లభిస్తాయి. నిర్మాణం, ఇతర రంగాలపై ఆధారపడిన వారికి ఉపాధి సమకూరుతుంది. విప్లవాత్మక నిర్ణయం 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కళాశాలలు రెట్టింపవుతాయి. ఇది ప్రజారోగ్య పరిరక్షణలో విప్లవాత్మక నిర్ణయం. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. గిరిజన జనాభా అత్యధికంగా ఉండే పాడేరు ప్రాంతంలో సీఎం జగన్ కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తుండటం హర్షించదగ్గ విషయం. – డాక్టర్ బాబ్జీ, వీసీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పక్క జిల్లాలోనే సీటు.. మాది శ్రీకాకుళం. పొరుగు జిల్లాలోని వైద్య కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేవడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. నాకు పక్క జిల్లాలోనే సీటు వచ్చింది. మా కాలేజీలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. కార్పొరేట్ కళాశాలలకంటే మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. – బడగాల మనస్వని, వైద్య విద్యార్థిని, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
వైద్య విద్యలో ‘వెనుకబాటు’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అణగారిన వర్గాల సంఖ్య తక్కువగా ఉంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఇతర మైనారిటీలు తక్కువగా ఉంటున్నారు. ఎంబీబీఎస్లో కొంతమేరకు ఫర్వాలేదు కానీ, ఆపై స్థాయి మెడికల్ కోర్సుల్లో ఆయా వర్గాల శాతం తక్కువగా ఉండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఓసీలు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 2021–22లో వైద్య కోర్సుల్లో పాసైన వారిని ఆధారం గా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 75 శాతం కాలేజీలను సర్వే చేశారు. ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నా, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వచ్చేసరికి వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఆ కోర్సులు సాధించడం, వాటిని పూర్తి చేయడానికి వయసు మీద పడటం ఒక కారణంగా చెబుతుండగా, పెళ్లి, పిల్లలు తదితర కారణాల వల్ల కూడా వాటిని చదవడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్లో ఓబీసీలు 24.4% సర్వేలో భాగంగా ఎంబీబీఎస్ పాసైన 54,547 మందిని ఎంపిక చేశారు. వారిలో పురుషులు 26,474 మంది (49 శాతం), మహిళలు 28,073 (51 శాతం) మంది ఉన్నారు. ఎంబీబీఎస్లో ఎస్సీలు 4,539 మంది (పురుషులు 2,310 మంది, మహిళలు 2,229 మంది) ఉండగా, వీరి శాతం 8.3గా ఉంది. ఇక ఎస్టీలు 2,100 మంది (పురుషులు 1008, మహిళలు 1092 మంది) ఉన్నారు. వీరి శాతం 3.8 శాతంగా ఉంది. ఓబీసీల్లో మొత్తం 13,350 మంది (పురుషులు 6,682, మహిళలు 6,668 మంది) ఉండగా, వీరు 24.4 శాతంగా ఉన్నారు. దివ్యాంగులు 112 (0.2 శాతం) మంది ఉన్నారు. ముస్లింలు 2,005 మంది ఉన్నారు. వారిలో పురుషులు 929 మంది, మహిళలు 1079 మంది ఉన్నారు. వీరి శాతం 3.6 శాతంగా ఉంది. ఇతర మైనారిటీలు 1,178 (2.1శాతం) ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో 210 (0.4 శాతం) మంది ఉన్నారు. ఇక ఓసీలు 57 శాతం మంది ఉన్నారు. ఎండీల్లో ఎస్సీ, ఎస్టీలు 11.3% ఎండీ కోర్సుల్లో జనరల్ మెడిసిన్, అనెస్థీíÙయా, చెస్ట్, రేడియాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్ వంటివి వస్తాయి. ఎండీ కోర్సుల్లో 15,732 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 7,343 (46 శాతం), మహిళలు 8,389 (54 శాతం) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1220 (7.7 శాతం) మంది, ఎస్టీలు 561 (3.6 శాతం) మంది, ఓబీసీలు 3,404 (22 శాతం) మంది, దివ్యాంగులు 12 (0.08%) మంది, ముస్లింలు 543 (3.5%) మంది, ఇతర మైనారిటీలు 357 (2.2%) మంది, ఈడబ్ల్యూఎస్ 187 (1.2%) మంది ఉన్నారు. ఓసీలు 59 శాతంగా ఉన్నారు. ఎంఎస్ కోర్సుల్లో ముస్లింలు 3.3% ఎంఎస్ కోర్సుల్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, చెవి, ముక్కు, కంటి తదితర సర్జరీ కోర్సులు వస్తాయి. ఎంఎస్లో 4,713 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 2,521 (53%) మంది, మహిళలు 2,192 (47%) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 337 (7.1%) మంది, ఎస్టీలు 128 (2.7%), ఓబీసీలో 1021 (21.6%) మంది, ముస్లింలు 155 (3.3%) మంది, ఇతర మైనారిటీలు 102 (2.1%) మంది, ఈడబ్ల్యూఎఎస్లో 8 (0.2%) మంది ఉండగా, ఓసీలు 63 శాతంగా ఉన్నారు. డీఎం కోర్సుల్లో ఓసీలు 89 శాతం మెడికల్ సూపర్ స్పెషాలిటీ (డీఎం కోర్సులు)ల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర కోర్సులు వస్తాయి. వీటిల్లో 469 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 362 (77%), మహిళలు 107 (23%) మంది ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (1.49%), ఎస్టీలు ముగ్గురు (0.6%), ఓబీసీలు 29 (6%), ముస్లింలు 0.6%, ఇతర మైనారిటీలు 9 (1.91%) మంది ఉండగా, ఓసీలు 89 శాతం మంది ఉన్నారు. ఎంసీహెచ్ కోర్సుల్లో మహిళలు 15 శాతమే ఎంసీహెచ్ (సర్జికల్ సూపర్ స్పెషాలిటీలు) జీర్ణకోశ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, వ్యాసు్కలర్ సర్జరీ తదితర కోర్సులు ఉంటాయి. వీటిల్లో 337 మందిని సర్వే చేశారు. పురుషులు 287 (85%), కేవలం మహిళలు 50(15) మంది మాత్రమే ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (2%), ఎస్టీలు ముగ్గురు (1%), ఓబీసీలు 15 (4.4%), ముస్లింలు ఒకరు, ఇతర మైనారిటీలు ముగ్గురు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో ఒకరు ఉండగా, ఓసీలు 90 శాతంగా ఉన్నారు. సూపర్ స్పెషాలిటీల్లో తగ్గుతున్న మహిళలు: డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా చేరుతుంటే, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో పురుషుల శాతమే ఎక్కువగా ఉంటోందని నివేదిక చెబుతోంది. ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వెళ్లేసరికి మహిళల శాతం చాలా తక్కువగా ఉంటోంది. దీనికిగల కారణాలను అన్వేషించాల్సిన అవసరముంది. ఆ మేరకు మహిళలకు వెసులుబాటు కల్పించాలి. దీనిపై జాతీయ మెడికల్ కమిషన్ దృష్టిసారించాలి. -
సడెన్గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల.. కారణం ఇదే!
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన చిత్రాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో శ్రీలలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘గుంటూరు కారం ’మీదే ఉన్నాయి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుంది. దీంతో పాటు పాటు మరో రెండు సినిమాల్లోనూ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇలా షూటింగ్, ప్రమోషన్స్తో బిజీగా ఉండే శ్రీలీల.. సడన్గా సినిమాకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండనుంది. దానికి బలమైన కారణం ఉంది. శ్రీలల యాక్టర్ మాత్రమే కూడా డాక్టర్ కూడా కాబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన వైద్యవిద్యను పూర్తి చేస్తోంది. త్వరలోనే శ్రీలీలకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయబోతుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని కోసమే శ్రీలీల ముంబై వెళ్లారట. పరీక్షలు పూర్తయ్యే వరకు శ్రీలీల ఏ సినిమా షూటింగ్లోనూ పాల్గొనరట. అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. శ్రీలీల తల్లి కూడా వైద్యురాలే. కూతురు కెరీర్ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. శ్రీలీలకు కూడా డాక్టర్గా కొనసాగడడమే ఇష్టం. అందుకే ఎంబీబీఎస్ తర్వాత కూడా చదువును కంటిన్యూ చేయాలనుకోంటోంది. హాయ్యర్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తోనట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఇకపై శ్రీలీల సినిమాల్లో నటించడం కష్టమే. -
10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు.. 2025–26 నుంచి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలుచేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ వి.వానికర్ బుధవారం ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది మన రాష్ట్రానికి రావాల్సిన ఐదు వైద్యకళాశాలలకు అనుమతికి మార్గం సుగమమైంది. 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2024–25 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్లో ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ నిబంధనతో ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అవకాశంలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంతోపాటు అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువ చేయడం, మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడం కోసం సీఎం జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2023–24 విద్యాసంవత్సరంలో ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. 2024–25లో మరో ఐదు వైద్యకళాశాలల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తాజా నిబంధనలు అమలు చేస్తామన్న నేపథ్యంలో వీటిపై ఎన్ఎంసీ పునఃసమీక్షించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్తోపాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు. ఈ వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలను 2025–26 నుంచి అమలు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించడం గమనార్హం. -
వైద్యులకు స్టైపెండ్ అందడం లేదు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ ఇంటర్న్లకు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదని తేలింది. ఈ సమస్యపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలో గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా 70 శాతం మంది యూజీ ఇంటర్న్లకు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్ అందడం లేదని తేలింది. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని స్టైఫండ్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10,178 మందితో ఆన్లైన్ సర్వే... ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్లు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించే సమస్యపై గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే జరిగింది. పీజీ విద్యార్థుల నుంచి మొత్తం 10,178 మంది నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందులో 7,901 మంది వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలోని 213 ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరించారు. అందులో 2,110 మంది పీజీ విద్యార్థులు తమకు స్టైపెండ్ అందడం లేదని స్పష్టం చేశారు. 4,288 మంది విద్యార్థులు తమకు చెల్లించే స్టైపెండ్ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చెల్లిస్తున్న స్టైపెండ్తో సమానంగా ఉండటం లేదని వెల్లడించారు. తమకు వచ్చే స్టైపెండ్ను ఆయా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలే వెనక్కు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనేక కాలేజీలు కాగితాలపై మాత్రం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తున్నట్లు రాసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా వారికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. ఆందోళనలకు సిద్ధమవుతున్న జూ.డాక్టర్లు... తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ చెల్లింపులో జాప్యంపై సమ్మెకు సిద్ధమవుతున్నారు. మెజారిటీ ప్రైవేట్ కాలేజీలు స్టైపెండ్లు చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎన్ఎంసీని ఆశ్రయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల విద్యా ర్థులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారు యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు సహించడంలేదు. గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వస్తుందని హైదరా బాద్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన ఒక జూనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టైపెండ్ వచ్చేలా ఆందోళనలు చేస్తామని కొందరు విద్యార్థులు అంటున్నారు. కాగా, వైద్య విద్యార్థులకు స్టైపెండ్చెల్లించక పోవడంపై వైద్యవిద్య అధికారులను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికా రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
మెడికల్ కాలేజీల్లో ఆగని ర్యాగింగ్ !
సాక్షి, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో జూనియర్లపై సీనియర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట సీనియర్లు వేధిస్తున్నారు. మొదటి ఏడాది తరగతులు ప్రారంభమైన వారం పది రోజుల్లోనే గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు సీనియర్లు ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ గదులకు రప్పించి బలవంతంగా మద్యం, సిగరెట్ తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు తాము పడిన హింసను వివరించారు. కొందరితో దుస్తులు విప్పించి డ్యాన్స్లు చేయించారని జూనియర్లు వాపోయారు. కొందరు విద్యార్థినులపై కూడా ర్యాగింగ్ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 10 మంది సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు పడింది. అయినా అక్కడ ర్యాగింగ్ ఆగడం లేదు. ఇటీవల కూడా మరికొందరు జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. దీంతో మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కడం లేదని, ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ జరుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ, మహబూబాబాద్ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ సంఘటనలు వెలుగుచూశాయి. కొన్నిచోట్ల మందలించి వదిలేయగా, కొన్నిచోట్ల సీనియర్లను సస్పెండ్ చేశారు. అయినా ర్యాగింగ్ ఆగడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. నిఘా వ్యవస్థ కరువు రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచే ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి రావడం ప్రారంభమయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ స్పందించింది. ర్యాగింగ్కు పాల్పడుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. మరోవైపు స్థానిక పోలీసులకూ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్ వరకే పరిమితం అవుతున్నామని వైద్య విద్య వర్గాలు హెచ్చరించాయి. కానీ ర్యాగింగ్ను నివారించేందుకు, వైద్య కళాశాలల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీలుగా సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ర్యాగింగ్ జరుగుతున్నా కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది. గాంధీ, కాకతీయ సహా పలు కాలేజీల్లో సీసీ కెమెరాలు లేవన్న విమర్శలు విన్పిస్తున్నాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నా అవి అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయని అంటున్నారు. కాగా డీఎంఈ కార్యాలయం మాత్రం ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీలను ఆదేశించింది. ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఎక్కడైనా కమిటీలు లేకపోతే తక్షణమే ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని స్పష్టం చేసింది. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది. స్టైపెండ్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్బంధ కారి్మకులు కాదని తేలి్చచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీని ఆదేశించింది. -
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
మీలా తప్పకుండా సమాజ సేవ చేస్తాం సార్..
-
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
మద్యం పోసి... సిగరెట్లు తాగించి
సాక్షి, హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఇటీవల జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి... సిగరెట్లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికార వర్గాలు చేపట్టిన విచారణలో విస్మయకర నిజాలు వెలుగుచూశాయి. కొందరిని బట్టలు విప్పించి డ్యాన్స్లు చేయించారని కూడా అంటున్నారు. బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కాగా, కొందరు విద్యార్థినులను కూడా ర్యాగింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమేనా కాదా అన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ ర్యాగింగ్ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్పై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధక కమిటీల పటిష్టం... రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కొందరు సీని యర్ విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడుతున్న ఘటనలు అధికా రుల దృష్టికి వచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ల్లోనూ ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న భావనతో చూసీచూడనట్లుగా వదిలేశారు. కానీ గాంధీ ఘటన నేపథ్యంలో ఇకపై ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశించింది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఇప్పటికీ లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, హాస్టళ్ల వద్ద రాత్రి వేళ నిఘా పెంచాలని సూచించింది. మరోవైపు ర్యాగింగ్కు గురైన విద్యార్థుల ఫిర్యాదు నిమిత్తం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు, ఈ మెయిల్ ఐడీని రూపొందించాలని కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు యోచిస్తున్నారు. -
‘గాంధీ’లో ర్యాగింగ్కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు.