-
పండుగ వేళ కోనంత కుటుంబంతో స్పెషల్ చిట్ చాట్
-
అందుకు కారణం సీఎం వైఎస్ జగన్: కోన వెంకట్
‘‘ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకోవడంలో కోన వెంకట్ స్పెషలిస్ట్. కామెడీ సినిమాలు తీయడంలో నాగేశ్వర రెడ్డిది ప్రత్యేక శైలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీవీ వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ని విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సందీప్ కిషన్ నాకు మేనల్లుడితో సమానం. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే నటుడు రాజేంద్రప్రసాద్. ‘గల్లీ రౌడీ’ హిట్ అయ్యి కోన, ఎంవీవీలకు బాగా డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే నాగేశ్వర రెడ్డిగారి సినిమాలు చూడాలి’’ అని నందినీ రెడ్డి అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఇంత త్వరగా పూర్తయిందంటే కారణం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు. ఏపీలో షూటింగ్లకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారాయన. ఈ విధానంలో పూర్తయిన తొలి చిత్రం మాదే. ఇందుకు జగన్గారికి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘లేడీస్ టైలర్’కు ఎంత మంచి అభినందన వచ్చిందో ‘గల్లీ రౌడీ’కి కూడా మంచి అభినందన వస్తుంది’’ అన్నారు నటుడు డా. రాజేంద్ర ప్రసాద్. ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను, కోన వెంకట్ చేసిన ‘గీతాంజలి’ కంటే ‘గల్లీ రౌడీ’ పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ కాకపోతే నా జడ్జ్మెంట్లో రాంగ్ ఉన్నట్లే. ఆ తర్వాత నేను సినిమాలు చేయలేనేమో? అనేంత నమ్మకంతో సినిమా సక్సెస్ అవుతుందని చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నేను కథ వినేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో వింటాను. అందరి సహకారం వల్లే మా సినిమాను 60 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘అందరూ నవ్వుకునే సినిమా ‘గల్లీ రౌడీ’’ అన్నారు సందీప్ కిషన్. ఈ కార్యక్రమంలో నేహా శెట్టి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, రచయితలు భాను, నందు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలపై కేటీఆర్కు కోన వెంకట్ ట్వీట్
నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రముఖ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్లోని అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల కార్పోరేషన్ దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘సయ్యద్ నగర్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్లో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరగుతున్నాయి. మురుగు నీరు లేదు, పారిశుధ్యం లేదు, రోడ్లు లేవు. కానీ ఈ మురికి వాడల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. దయ చేసి దీనిని పరిశీలించండి’ అంటూ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ను ట్యాగ్ చేశారు. Lot of Illegal constructions are coming up in Sayyed Nagar, Road no 12, Banjarahills... No sewerage, No sanitation, No roads.. but multi storied constructions in these slums will lead to major problems in future.. Please look into this 🙏 @CommissionrGHMC @KTRTRS @GHMCOnline pic.twitter.com/rHN7uNFySC — kona venkat (@konavenkat99) February 26, 2021 -
మల్లేశ్వరి బయోపిక్ షురూ
ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు మల్లేశ్వరి. ఆమె జీవితం ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కరణం మల్లేశ్వరి జన్మ దినం (జూన్ 1) సందర్భంగా సోమవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ బయోపిక్కు కోన వెంకట్ ఒక నిర్మాతగా ఉండటంతో పాటు రచయిత కూడా. ‘‘ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్ను ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్
‘‘సినిమాలను థియేటర్స్లోనే చూడటం ఉత్తమం’’ అంటున్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్. ‘‘మేం (సినిమా పరిశ్రమకు చెందిన అందరూ) ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎంతో ఇష్టంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే మేం చేసే పనికి స్ఫూర్తి, మాకు ఆక్సిజన్. థియేటర్స్లో సినిమాను చూసే అనుభూతిని ఏదీ (డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ను ఉద్దేశించి కావొచ్చు) భర్తీ చేయలేదు. సినిమా అంటే సినిమా హాల్లోనే చూడాలి’’ అని ఆదివారం ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ సంగతి ఇలా ఉంచితే అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడసన్ ప్రధాన తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోన వెంకట్ ఇలా స్పందించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం థియేటర్స్లోనే విడుదలవుతుందని ఊహించవచ్చు. -
మహమ్మారి బారినపడ్డ వుహాన్లో అడుగుపెట్టి..
హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టిన వుహాన్కు వెళ్లడమంటేనే డేంజర్ జోన్లోకి అడుగుపెట్టినట్టుగా అందరూ భావిస్తుంటే ఆ డాక్టర్ అక్కడి బాధితులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు చైనాలోని వుహాన్కు వెళ్లి వైరస్ రోగులకు వైద్య సేవలందించి తన ఔదార్యం చాటుకున్నారు. వాషింగ్టన్ డీసీలో నివసించే తెలుగు వ్యక్తి డాక్టర్ నాగరాజు చైనాలోని వుహాన్కు వెళ్లి కరోనా రోగులకు వైద్య సేవలందించారని, ఆయన తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన అనంతరం చైనీయులు ఆయనను ప్రత్యేక విమానంలో సాగనంపారని ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు నిబ్బరంగా నిలిచే ఇలాంటి వారికి మనం శాల్యూట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ నాగరాజు చూపిన చొరవను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. చదవండి : హనీమూన్కు కొత్తజంట: కరోనా ఎఫెక్ట్తో.. -
మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ
కలెక్షన్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ! లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్(ఎదుటి వ్యక్తిపై గల ఎనలేని ప్రేమను తెలియజేయటం కోసం ‘ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్ ’ ను వాడతారు)’ అని అన్నారు. 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆయనకు పలువరు సీని, రాజకీయ ప్రముఖలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ( అందరూ బాగుండాలని... ) My nanas birthhhhhdayyyyyyy! Every year today is a celebration! You truly are one man army! Love you to the moon and back! pic.twitter.com/T83BwBCKq0 — Lakshmi Manchu (@LakshmiManchu) March 19, 2020 ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘ వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు మోహన్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు !!’ అని అన్నారు. వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు @themohanbabu గారికి జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/cGWGaP9tGT — kona venkat (@konavenkat99) March 19, 2020 కాగా, మోహన్ బాబు తన 70వ పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో కొద్ది రోజుల క్రితం ఓ లేఖను విడుదల చేశారాయన. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ( ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్బాబు ) -
‘మృగం’ స్క్రిప్ట్ రెడీ.. స్టార్ హీరోతో చేస్తా
‘‘రాహు’ సినిమాలో కథానాయికకు ఓ వ్యాధి ఉంటుంది. రక్తం చూసినప్పుడు కళ్లు కనిపించవు.. ఒత్తిడికి గురవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ప్రవేశిస్తే ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా చూపించాం’’ అన్నారు సుబ్బు వేదుల. అభిరామ్ వర్మ, కృతీ గార్గ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా సుబ్బు వేదుల చెప్పిన విశేషాలు. ♦నాది వైజాగ్. న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలోనే రచయిత కోన వెంకట్గారితో నాకు పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కొన్ని కథలకు కలిసి పనిచేశాం. ఆయన బ్యానర్లో ‘గీతాంజలి 2’ సినిమా నేను చేయాల్సి ఉంది.. కొన్ని కారణాల వల్ల మా కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాలేదు.. కానీ, ఆయన నాకు మంచి సహకారం అందించారు. ♦‘రాహు’సినిమాకి కథే హీరో. దాదాపు ఏడాది పాటు ఈ కథపై పనిచేశా. చిత్ర నిర్మాతలు కథ వినగానే సినిమా చేద్దామన్నారు. నా కథపైన నమ్మకంతో నేను కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాను. మా నిర్మాతల సహకారం మరువలేనిది. 52 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. ♦థ్రిల్లర్ జోనర్లో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా థ్రిల్ని అందించడంతో పాటు తాజా అనుభూతి ఇస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్. నేను, నా కూతురు ఈ సినిమాలో నటించాం. ‘మధుర’ శ్రీధర్గారు మాకు మంచి సహకారం అందించారు. సురేష్ బాబుగారు మా సినిమాను విడుదల చేయడం, జీ చానల్ వాళ్లు డిజిటల్ రైట్స్ తీసుకోవడం విడుదలకు ముందే మేం సాధించిన విజయాలు. ♦డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలంటే ఇష్టం. ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రం నా ఫేవరెట్. ఇళయరాజాగారి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన కథానాయకుడు అల్లు అర్జున్.. ఆయన నటన సూపర్బ్. ♦పెద్ద స్టార్ట్స్తో సినిమా చెయ్యాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి. ‘రాహు’ తర్వాత స్టార్ హీరోలను సంప్రదిస్తా. ఒక స్టార్ హీరో కోసం ‘మృగం’ అనే సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. -
గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన
మా ఇద్దరిదీ గురుశిష్యుల బంధం ‘‘గొల్లపూడి మారుతీరావుగారిది, నాది గురుశిష్యుల బంధం. ఆయన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్కి ఇటీవల నేను వెళ్లాను. తర్వాత మళ్లీ నాకు ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. నేను 1979లో ‘ఐ లవ్ యూ’ అనే సినిమా చేశాను. ఆ చిత్రనిర్మాత భవన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతీరావుగారు చాలా పెద్ద రచయిత, పాత్రికేయుడిగానూ చేశారు. సాహిత్యపరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికులు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకోమని నన్ను పంపించారు. అప్పుడు మారుతీరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాసులు తీసుకున్నారు. ఆ విధంగా ఆయన నాకు గురువనే చెప్పాలి. ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు. గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటుండేవాడిని. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఒక రకమైన శాడిజమ్, కామెడీగా ఉండే క్యారెక్టర్కి గొల్లపూడిగారు బాగుంటారనగానే నాకూ కరెక్ట్ అనిపించింది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి. ఆ తర్వాత నుంచి ‘ఆలయశిఖరం’, ‘అభిలాష’, ‘చాలెంజ్’... ఇలా ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. – నటుడు చిరంజీవి ‘హ్యాపీడేస్’ (2007) చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా కోసం యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా గొల్లపూడి మారుతీరావుగారితో పని చేశాను. గొల్లపూడిగారు నాకు ఇచి్చన సలహాలు, సూచనలు ఇప్పటికీ నాతో ఉన్నాయి. గొప్ప చిత్రాలతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి – నటుడు నిఖిల్ నన్ను హీరో అని పిలిచేవారు నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చిత్రం ‘కళ్లు’. నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి మారుతీ రావుగారు. ఆ సినిమా కథ ఆయనదే. ఆ సినిమా తర్వాత నటులుగా కూడా నేను, ఆయన చాలా సినిమాలు చేశాం. ఆయనకు ‘అరుణాచ లం’ అంటే ఇష్టం. విచిత్రంగా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ‘కళ్లు’ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకూ నన్ను ‘హీరో’ అనే పిలిచేవారు. ‘కళ్లు’ అనేది నా జీవితంలో మంచి జ్ఞాపకం. ప్రముఖ కెమెరామేన్ ఎం.వి. రఘు ఈ సినిమాతో దర్శకుడయ్యారు. గొల్లపూడిగారికి చాలా ఇష్టమైన కథ ‘కళ్లు’. ఈ సినిమాకి ‘తెల్లారింది లెగండో..’ అనే మంచి పాట రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ఆయన పెద్ద కొడుకు పేరు రాజా. నన్నూ కొడుకులా భావించి, ‘రాజా’ అనే పిలుస్తారు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు సంగీతదర్శకుడు. ఈ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్ హీరోగా తమిళంలో మొదలుపెట్టారు. రెండు మూడు రీళ్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో నన్ను హీరోగా పెట్టి తీశారు. నంది అవార్డు మాత్రమే కాదు.. అప్పుడు ఉన్న ప్రైవేట్ అవార్డులతో కలిపి నాకు పదిహేను పదహారు అవార్డులు వచ్చాయి. అలా ‘కళ్లు’ సినిమాకి చాలా విశేషాలున్నాయి. అంతటి మంచి సినిమాకి అవకాశం ఇచ్చారు. గొల్లపూడిగారు మంచి నటుడు, రచయిత. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ‘కళ్లు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదేళ్ల క్రితం ఫంక్షన్ చేశాం. ఆ ఫంక్షన్లోనే చివరిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎక్కడ తిరుగుతుంటే అక్కడ సరస్వతి తిరుగుతున్నట్లు అనిపించేది. అంతటి మహానుభావుడిని కోల్పోయాం. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – నటుడు శివాజీరాజా అది ఆయనకే సాధ్యం గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరా వుగారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన కథారచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఒక పెక్యులియర్ స్టైల్ ఉంది. టైమింగ్ ఉంది. విచిత్రమైన మాడ్యులేషన్ ఉంది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చాలెంజ్.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప రచయిత, నటుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – రచయిత, నిర్మాత కోన వెంకట్ -
‘సైలెన్స్’లో అనుష్క ఉండేది కాదట
తమిళసినిమా: సైలెన్స్ చిత్ర ప్రచారం మొదలయ్యింది. ఇది ఐదు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో నిశ్శబ్దం పేరుతోనూ , తమిళం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో సైలెన్స్ పేరుతోనూ రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నటి అనుష్క. దాదాపు రెండేళ్ల తరువాత ఆమె ముఖానికి రంగేసుకుని నటించిన చిత్రం సైలెన్స్. మాధవన్, నటి అంజలి. శాలినిపాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. దీనికి టీజీ.విశ్వప్రసాద్, రచయిత కోన వెంకట్ నిర్మాతలు. భాగమతి వంటి సంచలన చిత్రం తరువాత నటి అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సైలెన్స్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించిందని సమాచారం. అసలు ఆ చిత్రంలో అనుష్క నటించి ఉండేదే కాదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ అన్నారు. చిత్ర ప్రచారంలో ముమ్మరంగా ఉన్న ఈయన ఒక భేటీలో పేర్కొంటూ సైలెన్స్ చిత్ర కథను అసలు అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని చెప్పారు. పలువురు నటీమనులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇదని చెప్పారు. అలా అనుష్కకు కూడా కథను చెప్పినట్లు తెలిపారు. ఆమె ఇందులో నటించడానికి ముందు అంగీకరించలేదని, ఆలోచించి చెబుతానని అన్నారన్నారు. ఆ తరువాత చాలా రోజుల వరకూ అనుష్క నుంచి బదులు రాకపోవడంతో వేరే నటిని నటింపజేయడానికి సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. అలాంటి సమయంలో అనుష్క నుంచి ఫోన్ వచ్చిందని, సైలెన్స్ చిత్రంలో తాను నటిస్తాను అని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఆమె మరికాస్త ఆలస్యంగా చెప్పి ఉంటే ఈ చిత్రంలో ఉండేదే కాదని అన్నారు. కాగా సైలెన్స్ చిత్ర విడుదలకు తేదీ ఖరారు చేశారు. జనవరి 31న చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ నిశ్శబ్దం
‘‘కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు. ‘నిశ్శబ్దం’ కథ హేమంత్ రూపంలో నా దగ్గరకు వచ్చింది. కథలు మనల్ని కదిలిస్తే సినిమాలు అవుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది మూకీ సినిమా కాదు. సంభాషణలు ఉంటాయి’’ అన్నారు కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభయ్యే ముందు అనుకోని సంఘటనలు జరిగాయి. ముందు అనుష్క కాకుండా వేరే హీరోయిన్ అనుకున్నాం. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనుష్క ఫ్లైట్లో కలసినప్పుడు ఈ కథ విని సినిమా చేశారు. హేమంత్, నేను ఒక యజ్ఞంలా ఈ సినిమా చేశాం. సినిమాలో అందరూ పాత్రలే. హీరో, హీరోయిన్లు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాం. మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాం. రచయితగా నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ ‘నిశ్శబ్దం’. అనుష్క పాత్ర మాట్లాడలేదు కాబట్టి ‘నిశ్శబ్దం’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘హేమంత్ నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. ఈ కథను నేను కూడా ఫ్లైట్లోనే విన్నాను. ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు సుబ్బరాజు. ‘‘మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్. హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయాలకునేవాణ్ణి. ఈ సినిమా హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘టెక్నికల్గా ఇది కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విశ్వప్రసాద్గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం’’ అన్నారు హేమంత్. -
అందరూ..అనుమానితులే..
సాక్షి, హైదరాబాద్ : ‘భాగమతి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి అభిమానులకు మరోసారి కనువిందు చేయనుంది. అవును.. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నిశ్శబ్ధం' (సాక్షి, మ్యూట్ ఆర్టిస్ట్ ట్యాగ్లైన్) సినిమా టీజర్ను బుధవారం లాంచ్ చేసింది. మోషన్ టీజర్తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ తాజాగా టీజర్ను ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా రూపొందించారు. అంతేకాదు ఈ సినిమా టీజర్లో అనుష్క 'సాక్షి' పాత్రలో దివ్యాంగురాలిగా స్వీటీ అద్భుత నటనతో మెప్పించబోతున్నారు. గోపీ సుందర్ బీజీఎం కూడా బాగానే భయపెడుతోంది. హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యూటసన్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, ఇంగ్లిష్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ప్రమాదకరంగా పీవీ ఎక్స్ప్రెస్ హైవే: కోన వెంకట్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించటంతో మెట్రో, ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 20 వద్ద ఉన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రమాదకరంగా పెచ్చులు ఊడిపోయిన ఫ్లై ఓవర్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన కోన వెంకట్.. కేటీఆర్, తో పాటు జీహెచ్ఎంసీలకు ట్యాగ్ చేశారు. మరి కోన ట్వీట్ అధికారులు ఎలా స్పదింస్తారో చూడాలి. Damaged condition of the PVNR expressway near Pillar No : 20 , please take care before it’s too late @GHMCOnline @KTRTRS Source: Facebook friend pic.twitter.com/1Disn6bMRy — kona venkat (@konavenkat99) September 26, 2019 -
మాది తొలి హాలీవుడ్ క్రాస్ఓవర్ చిత్రం
‘‘హాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కాంబినేషన్లో వస్తున్న తొలి ‘క్రాస్ఓవర్’ (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలసి పని చేయడాన్ని క్రాస్ ఓవర్ అంటారు) చిత్రం ‘నిశ్శబ్దం’. రెండేళ్లు ప్రయాణం చేసి రికార్డ్ టైమ్లో షూటింగ్ పూర్తి చేశాం. సెప్టెంబర్లో టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ సినిమా విశేషాల గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ హిట్ చిత్రం ‘కిల్బిల్’ సినిమాలో విలన్గా నటించిన మైఖేల్ మ్యాడిసన్తో పాటు 7–8 మంది హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా మా సినిమాకు పని చేశారు. అమెరికాలోని సియోటల్ బ్యాక్డ్రాప్లో కథ మొత్తం సాగుతుంది. నలుగురు ఇండియన్స్కి అమెరికన్ పోలీసుల మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కేవలం బహుభాషా చిత్రమే కాకుండా బహు ప్రాంతాలకు చెందిన చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. గ్రాఫిక్స్కి స్కోప్ ఉన్న కథ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్లోనే విడుదల చేస్తాం. లేకపోతే జనవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
జగన్ నిజం..బాబు మోసం.. పవన్ విద్వేషం..
ఆయన కలం... హీరోతో డ్రామా పండించింది... హీరోయిన్ను దెయ్యంగా చూపించింది... విలన్తో కామెడీ కితకితలు పెట్టించింది...! ‘ఢీ’, రెడీలతో తెలుగు సినిమా దూకుడును పెంచిన ఆయనలో కథా రచయిత, నిర్మాత, దర్శకుడు, సంభాషణల రచయిత, పాటల రచయిత, నటుడు ఉన్నారు. ఆయనే... స్టార్ రైటర్ కోన వెంకట్. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన వెంకట్... రాజకీయ దిగ్గజం, మహారాష్ట్ర మాజీ గవర్నర్ కోన ప్రభాకర్రావుకు స్వయానా మనుమడు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చి రెండున్నర దశాబ్దాలుగా రాణిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై విశాఖపట్నంలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పరిస్థితిని ఆయన ఒక్క మాటలో చెబుతూ.. ‘వైఎస్ జగన్ నిజం... చంద్రబాబు మోసం.. పవన్ కల్యాణ్ గందరగోళం’ అని విశ్లేషించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... పవన్ కల్యాణ్ సినీ రంగంలో నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంతటి అనుబంధం ఉంది. కత్తి మహేష్ వివాద విషయంలో పవన్కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్ తప్పటడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశంగా స్పందిస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయ్. ఈ ఐదేళ్లలో తెలంగాణలోని హైదరాబాద్లోనే కాదు. మారుమూల పల్లెల్లో ఉంటున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. పవన్ ఇలాంటి ప్రకటనలను ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. పవన్... జగన్పై నీవు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపించు...నేను జనసేన జెండా పట్టుకు తిరుగుతా... మాయావతి వంటివారితో పొత్తు పెట్టుకున్న పవన్... ఆరోపణలు తప్ప ఒక్క కేసు కూడా నిరూపణ కాని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం విషం చిమ్మడం అన్యాయం. ఎందుకు వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని పవన్ విమర్శలు చేస్తారో అర్ధం కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలే శ్వాసగా బతికే కుటుంబం వైఎస్ జగన్ది. అటువంటి జగన్పై అకారణంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు చెబుతున్నా... పవన్ కల్యాణ్... వైఎస్ జగన్పై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కనీసం ఒక్కదానికైనా ఆధారం చూపించండి. అలా చేస్తే నేను జనసేన జెండా పట్టుకుని మీ వెంటే తిరుగుతా. మాయావతి మదర్ థెరిసాలా కనిపించిందా? పవన్కు సరిగ్గా ఎన్నికల ముందు, అర్ధాంతరంగా మాయావతితో చర్చలు జరిపి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాయావతి మీకు మదర్ థెరిసాలా కనిపించిందా? నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టిన మాయావతి వద్దకు వెళ్లి పొత్తు పెట్టుకోవడం ఏమిటో? దళితుల ఓట్లే కావాలనుకుంటే అంతకంటే నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతలు మీకు దొరకలేదా? మీ గందరగోళ రాజకీయం, తప్పటడుగులు ఇక్కడే తెలిసిపోతున్నాయి. జగన్ నవ్యాంధ్ర ఆశాజ్యోతి 2014లోనే వైఎస్ జగన్ సీఎం అయితే ప్రస్తుతం రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేది. ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. వైఎస్ జగన్ పక్షానే ఉన్నారు. అందుకు ఆయన ఎవ్వరినీ నమ్ముకోలేదు. కేవలం తన కష్టాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన తండ్రి డా.వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చేసిన ఓదార్పు యాత్రకు, ప్రజల కోసం చేసిన పాదయాత్రకు చాలా తేడా ఉంది. పాదయాత్ర జగన్లో చాలా మార్పు తెచ్చింది. ‘నాన్న నాకు అన్నీ ఇచ్చాడు.. ఇక నేను కేవలం ప్రజల కోసమే బతకాలి’ అనే లక్ష్యం వైఎస్ జగన్లో కనిపిస్తోంది. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తేనే నవ్యాంధ్ర ఇప్పటినుంచైనా బాగుపడుతుంది. అందుకే నేను జగన్ నవ్యాంధ్ర ఆశాజ్యోతి అంటాను. బాబు వంటి విలన్ను సినిమాల్లోనూ సృష్టించలేను సినీ పరిశ్రమలో నాది సుమారు రెండున్నర దశాబ్దాల ప్రస్థానం. 54 సినిమాలకు రచయితగా పనిచేశాను. అందులో 90 శాతం విజయవవంతమైనవే. సినిమాల్లో ఎన్నో విలన్ పాత్రలు సృష్టించాను. ఒక రచయితగా కామెడీ విలన్లతో పాటు క్రూర విలన్ పాత్రలనూ రాసుకున్నాను. కానీ సీఎం చంద్రబాబునాయుడు వంటి విలన్ పాత్రను ఇంతవరకు నేను సృష్టించలేకపోయా. బహుశా ఇక సృష్టించలేను కూడా. ఎందుకంటే బాబు రాజకీయం మొత్తం నీచత్వం, భ్రష్టత్వమే. మొత్తం జీవితమంతా వెన్నుపోట్లమయమే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ మొదలు... 2014 ఎన్నికల్లో సీనియర్ నేత అని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన వెన్నుపోటే పొడిచారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు నిలువెత్తు రూపం. సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పరిస్థితి ఇప్పుడు ఏమిటి? ఆయన బతికున్నారా లేదా? అని తెలియని పరిస్థితికి తెచ్చాడు. రక్త సంబంధీకులను కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. జూ.ఎన్టీఆర్ను ఎలా తొక్కొలని చూశాడో అందరికీ తెలుసు. కుమారుడు లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్ని టీడీపీకి దూరం చేసిన విషయం బహిరంగ రహస్యమే. చంద్రబాబుపై విమర్శలు ఎందుకు తగ్గాయో? చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలమయం అని గతంలో మంగళగిరి, కాకినాడ సభల్లో పవన్కల్యాణ్ చేసిన ప్రసంగానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజలు కూడా హర్షించారు. పవన్ ఇన్నాళ్లకు రాజకీయంగా సరైన దారిలోకి వచ్చారని అనుకున్నారు. మరి ఏమైందో తెలియదు? యూ టర్న్ అని చెప్పను గాని అకస్మాత్తుగా విమర్శల దాడి తగ్గించారు. అధికారపక్షాన్ని కాకుండా నిత్యం ప్రజలతో ఉండే వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. పవన్ కూడా పాదయాత్ర చేసుంటే... పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలపై మరింత అవగాహన వచ్చేది. అప్పుడు వాళ్లు చెప్పేది, వీళ్లు చెప్పేది విని మాట్లాడకుండా స్వయంగా ప్రజలతో మాట్లాడి అసలు సమస్యలేమిటో తెలుసుకునేవారు. సినీ గ్లామర్తో వెల్లువెత్తే అభిమానుల సమస్య మొదట్లో ఉన్నా, పాదయాత్ర చేసుకుంటూ పోతే అది తగ్గేది. స్టార్ హీరోల కంటే ఎక్కువ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న వైఎస్ జగన్ వేలాదిమంది పోటెత్తుతున్నా పాదయాత్ర చేశారు కదా? పవన్ కూడా అదే మాదిరి చేసుంటే ఆయనకు వర్తమాన రాజకీయాలపై స్పష్టత వచ్చేది. బ్రాహ్మణుడు చంద్రబాబుకు ఓటెయ్యకూడదు నేను సనాతన బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాను. కానీ నేను సామాజిక బాధ్యత ఉన్న రచయితను. రచయితలకు కలం తప్ప కులం ఉండదు. నాది కులాంతర వివాహం. నా పెద్ద కుమార్తెది వర్ణాంతర వివాహం. కానీ బ్రాహ్మణులకు అనాదిగా చంద్రబాబు చేస్తున్న వంచనపై కడుపుమండి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బ్రాహ్మణులు పనికిరారని చంద్రబాబు భావిస్తుంటారు. అందుకే ఏ ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వరు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 294 నియోజకవర్గాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో కూడా ఒక్క టికెట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి. జంధ్యం వేసుకుని గాయత్రీమంత్రం చదివే ఒక్క బ్రాహ్మణుడు కూడా టీడీపీకి ఓటెయ్యకూడదని నేను బహిరంగంగా పిలుపునిస్తున్నా. సిగ్గు, శరం ఉంటే టీడీపీలో ఉన్న బ్రాహ్మణ నేతలు పునరాలోచన చేసుకోవాలి. మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే వైఎస్ జగన్ బ్రాహ్మణ పక్షపాతి. అందుకే రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడతో పాటు బాపట్లలో బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లిచ్చారు. ఈ ఒక్క విషయం చాలదా? బ్రాహ్మణులను వైఎస్ జగన్ ఎంత గౌరవిస్తున్నారో. అందుకే చెబుతున్నా... బ్రాహ్మణులారా, ఒక్క ఓటు కూడా బయటకి పోకూడదు. అన్ని ఓట్లూ వైఎస్ జగన్కే వేయండి. నవరత్నాలతో అందరి జీవితాలు బాగుపడతాయి మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా చిరస్థాయి పేరు సంపాదించారు. ఆరోగ్య శ్రీ. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో వైఎస్ ఇప్పటికీ పేదల గుండెల్లో కొలువై ఉన్నారు. మళ్లీ అంతటి పాలన ఒక్క వైఎస్ జగన్ మోహన్రెడ్డితోనే చూడగలం. ఆయన ప్రకటించిన నవరత్నాల గురించి నేను క్షుణ్నంగా తెలుసుకున్నా. ఆయన ఇంట్లో కూర్చునో, ఆఫీసులో కూర్చునో, పార్టీ నేతలతో మాట్లాడో నవరత్నాలు ప్రకటించలేదు. ఎండనక, వాననక రోడ్లపై ప్రజలతో తిరిగి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ తర్వాతే ప్రకటించారు. ఈ పథకాలతో బీదాబిక్కి జనమే కాదు అందరి జీవితాలు బాగుపడతాయి. సినీ పరిశ్రమలో జగన్ మద్దతుదార్లే ఎక్కువ సినీ పరిశ్రమలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుదార్లే ఎక్కువమంది ఉన్నారు. పవన్ కల్యాణ్ను మా సినీ కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తాం. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్కు మద్దతిచ్చేవారే అధికంగా ఉన్నారు. ఇక చంద్రబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విభజన తర్వాత సినీ పరిశ్రమ బాగోగులను ఆయన కనీసం పట్టించుకోలేదు. చివరగా ఒక్కమాట... నాకు రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. నేను వైఎస్సార్సీపీ నేతను కాదు. కనీసం కార్యకర్తను కూడా కాదు. కానీ వర్తమాన రాజకీయాలపై బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక రచయితగా ప్రజలు ఏ పక్షాన నిలవాలో సూచించాల్సిన కనీస కర్తవ్యం నాపై ఉంది. చంద్రబాబు అండ్ కో గిమ్మిక్కులతో కొందరు ప్రజలు, తటస్థులు గందరగోళానికి గురవుతుంటారు. అందుకే నా వంటి వాళ్లు బహిరంగంగా మాట్లాడాల్సిన సమయమిది. మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ఈ రాష్ట్ర గతి మారుతుంది. ప్రజల జీవనవిధానం మారుతుంది. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే వైఎస్ జగన్ను సీఎం చేయాలి. – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
అనుష్క న్యూ లుక్.. ఇది జస్ట్ ఝలక్
జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.. తిరిగి స్లిమ్ లుక్లోకి వచ్చేందుకు చాలా కాలంగా కష్టపడుతోంది. ముఖ్యంగా బాహుబలి 2, సింగం 3 సినిమాల్లో అనుష్క లుక్ పైగా విమర్శలు వినిపించటంతో ఇక స్వీటీ కెరీర్ ముగిసినట్టే అని భావించారు. తరువాత వచ్చిన భాగమతిలో అనుష్క కాస్త తగ్గినట్టుగా కనిపించినా గతంలో కనిపించినంత గ్లామరస్గా మాత్రం కనిపించలేదు. దీంతో మరోసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం తన లుక్ మీద దృష్టి పెట్టింది. తాజాగా బయటకు వచ్చిన అనుష్క ఫొటోలు అభిమానులకు షాక్ ఇచ్చాయి. వైట్ డ్రెస్లో స్లిమ్ లుక్లో కనిపిస్తున్న అనుష్క లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ పై అనుష్కతో సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్ స్పందించారు. ‘ఇది జస్ట్ ఝలక్ అంతే.. సినిమాలోతన ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేయండి. స్వీటీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు అంజలి, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరపుకోనున్న ఈ చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
అనుష్క కొత్త లుక్ చూశారా?
సౌత్లో లేడీ ఓరియెంటెడ్ ట్రెండ్ను మళ్లీ సృష్టించారు మన స్వీటి అనుష్క. అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ తరువాత అనుష్క భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే మళ్లీ ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్ను పట్టాలెక్కించలేకపోయారు. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు స్వీటి ఆసక్తి చూపింస్తుండగా.. కోన వెంకట్ చెప్పిన కథకు అనుష్క ఓకే చెప్పారు. ఈ మూవీలోని అనుష్క లుక్ను కోన వెంకట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ మూవీ అనుష్కకు ఎలాంటి క్రేజ్ను తీసుకువస్తుందో చూడాలి. We are super excited with the look of Anushka in our film. This would be her best look till date. I like this look too 👍 pic.twitter.com/7aDxK0xk0D — kona venkat (@konavenkat99) 25 December 2018 -
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు. -
‘సైలెంట్’ సినిమాలో అనుష్క
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ కోన వెంకట్ ఇటీవల నిర్మాతగానూ మంచి విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణ సారధ్యంలో మరో సినిమాను ప్రకటించారు. బహు భాషా నటుడు మాధవన్, సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్కల కాంబినేషన్లో కోన వెంకట్ సహ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది. సైలెంట్ పేరుతో సైలెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మించనున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాల్లో నటించిన మాధవన్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సైలెంట్ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నారు. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్లో అలరించనున్నారు. ఈ సినిమాకు వస్తాడు నా రాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు. పలువురు అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది
‘‘ఒక క్యారెక్టర్ని నేను కంప్లీట్గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్ చేసుకోను. మంచి పెర్ఫార్మర్ అని ఆడియన్స్ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్ గోల్’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనేది ట్యాగ్లైన్. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు... ► ఇందులో కల్యాణ్ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయా? ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనే ట్యాగ్లైన్ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్గళ్’ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం. ► బ్లైండ్ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్గా అనిపించింది. హోమ్వర్క్ చేశాను. బ్లైండ్ స్కూల్స్కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్ రియాక్షన్స్, ఎమోషన్స్ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూనే కన్విన్స్ చేయగలగడం కష్టం. రిఫరెన్స్ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను. ► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్గా, ‘రంగస్థలం’లో కుమార్బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి క్యారెక్టర్ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయితే మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ► ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్ ఉంటాయి. థియేటర్స్ హౌస్ఫుల్ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ► నా యాక్టింగ్ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్ చేశావ్? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్) డైరెక్షన్లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్100’ రీమేక్ చేయబోతున్నాం. డైరెక్టర్ని, హీరోయిన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అలాగే బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్ నిర్మిస్తారు. -
తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు
‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్ వారు 100 శాతం డెడికేషన్తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. 20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్ శంకర్ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్ని, దశరథ్ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్ డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హరినాథ్. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ. -
ఈ ఫీల్డ్లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్మెంట్తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర.