-
దర్శన్కు సపోర్ట్గా విజయలక్ష్మి కామెంట్
రేణుకాస్వామి హత్యకేసులో నిందితునిగా ఉన్న సినీ హీరో దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో 2011లో భార్యపై దాడికి పాల్పడిన కేసులో ఇదే జైలుకు తొలిసారిగా వచ్చి 20 రోజులకు పైగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత రెండోసారి మళ్లీ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడ సమేతంగా పరప్పన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శన్ను సతీమణి విజయలక్ష్మి తన కుమారుడితో వెళ్లి కలుసుకున్నారు.దర్శన్, విజయలక్ష్మి మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారని సమాచారం. అయితే, దర్శన్ కష్టాల్లో ఉండటంతో ఆయనకు అండగా నిలబడేందుకు ఆమె సిద్ధం అయింది. ఈ క్రమంలో ఇటీవలే కుమారుడు వినీష్తో కలిసి జైలుకు వెళ్లి సుమారు రెండు గంటలపాటు దర్శన్తో మాట్లాడారు ఆమె. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కేసులో దర్శన్కు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని, అంతవరకూ ఆయనకు అండగా ఉందామని, అభిమానులు ఓపికతో ఉండాలని పోస్ట్ చేశారు. ఇది పరీక్షా సమయమని, సహనం కోల్పోయి మాట్లాడినా, పోస్టులు పెట్టినా దర్శన్కు ఇబ్బంది కలుగుతుందన్నారు. అభిమానుల అంతరంగాన్ని మీ తరఫున దర్శన్కు వివరించాను. కోర్టులపై నమ్మకం ఉంచి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. -
మేకప్లో పవిత్ర గౌడ.. పోలీస్ అధికారికి నోటీసులు
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ (A1) ఉన్నారు. అతని హత్యలో ఆమె కీలకమని పోలీసులు కూడా నిర్ధారించారు. రేణుకాస్వామిని హతమార్చే కుట్రలో ఆమె ప్రధాన కారణమని తెలినట్లు పోలీసుల వాదన ఉంది. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నటి పవిత్ర ఉన్నారు. అంతకు ముందు 10 రోజుల పాటు ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలుకు వెళ్లకు ముందు విచారణ కోసం ఆమె రోజూ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చేది. విచారణ అనంతరం మడివాలలోని మహిళా కేంద్రంలో ఆమెను పోలీసులు ఉంచేవారు. అలా 10 రోజుల పాటు పవిత్రను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం పవిత్ర గౌడ మేకప్తో కనిపించేది. పోలీస్స్టేషన్లో ఆమె కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్తో పాటు ఆమె మేకప్ వేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కన్నడ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎతున్న చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగానే ఎలా మేకప్ వేసుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు కాస్మోటిక్స్ మహిళా పోలీసులే అందించారని చర్చ జరుగుతుంది. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్లోని మహిళా సబ్ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఆమె ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా అనే వాదనలు కూడా వస్తున్నాయి.ఈ క్రమంలో డీసీపీ గిరీష్ ఈ అంశంలో ఫైర్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్స్టిక్తో పాటు కాస్మోటిక్స్ ఎలా వచ్చాయనేది చెప్పాలని మహిళా పీఎస్ఐకి మెమో ఇచ్చారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో పవిత్ర గౌడ ప్రతిరోజూ మడివాలలోని మహిళా కేంద్రం నుంచి విచారణకు వచ్చేదని, అక్కడే దుస్తులు మార్చుకుని అవకాశాన్ని ఆమెకు అధికారులు కల్పించారని తెలుస్తోంది. అక్కడికి ప్రతిరోజు ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవారని సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఆమె మేకప్ వేసుకునే సౌలభ్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. పరప్పన అగ్రహార జైలులో తాజాగా పవిత్ర గౌడ తల్లి, సోదరుడు, కూతురు ఆమెతో మాట్లాడారు.పవిత్ర గౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రేణుకాస్వామి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంహత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
జైలులో 'పవిత్ర గౌడ' గొంతెమ్మ కోరికలు.. తీర్చాలంటూ గొడవ
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.జైల్లో పవిత్ర గౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు ఒక దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది. జైలులో ఉండి కూడా అది కావాలి, ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. దీంతో పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట.దర్శన్కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చిని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. భద్రత కోసం దర్శన్ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. -
దర్శన్ గురించి సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన డాక్టర్
కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 4 వరకు పరప్పన అగ్రహారం జైలులో ఆయన ఉండనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ A2 అని పోలీసులు నిర్ధారించారు. ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 అని తెలిపారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దర్శన్ మానసిక పరిస్థితి గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి.దర్శన్ ఆరోగ్యంపై అనుమానాలుదర్శన్కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్ గొడవపడిన ఘటనలు, షూటింగ్లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూస్తే మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. గతంలో దర్శన్కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని చెప్పారు. చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్డమ్ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు. బెయిల్ కోసం డ్రామా..?దర్శన్ 13 ఏళ్ల కిందట భార్యపై దాడి కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు. మరోవైపు బెయిల్ కోసమే దర్శన్ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మానసిక పరిస్థితి బాగులేదనే అధికారికంగా ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే తప్పకుండా దర్శన్కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెయిల్ కోసమే ఇలా కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
జైలుకు దర్శన్.. బెయిల్ కోసం రంగంలోకి దిగిన టాప్ లాయర్లు
కర్ణాటకలో సంచలనం రేపిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హత్య కేసులో గత 12రోజులుగా ఆయన్ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన ప్రదేశంతో పాటు పలు చోట్ల 139 వస్తువులను సాక్ష్యాలుగా పోలీసులు సేకరించారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్లో చాటింగ్ చేసిన మెసేజ్లు కేసులో కీలకంగా మారనున్నాయి. రేణుకాస్వామిపై దర్శన్ దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.దర్శన్తో పాటు అతని సహచరులు వినయ్, ప్రదుష్, ధనరాజ్లను శనివారం నగరంలోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. దర్శన్తో పాటు ఆయన ముఠాను జులై 04 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ తాజాగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేణుకాస్వామి దారుణ హత్య నేపథ్యంలో ఏ1 నిందితురాలు పవిత్రగౌడ్తో పాటు మరో 13 మంది ఇప్పటికే పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు దర్శన్ గ్యాంగ్ కూడా పరప్పన అగ్రహారంలో చేరారు, అందువల్ల హత్య కేసులో ప్రమేయం ఉన్న 17 మంది నిందితులకు జులై 4 వరకు కస్టడీ విధించారు.దర్శన్ బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు రేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్రెడ్డి అనే లాయర్లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్స్టేషన్కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. -
దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే?
కన్నడ హీరో దర్శన్ కేసు శాండల్వుడ్లో హాట్ టాపిక్గా మారింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మిని సైతం పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆమె ఉంటున్న ఫ్లాట్లో దర్శన్ షూస్ గుర్తించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నప్పటికీ ఆమె నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో ఆమెను ప్రశ్నించారు.అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రేణుకాస్వామి హత్యం అనంతరం దర్శన్ తన భార్య విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడే భార్యతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత దర్శన్ మైసూరుకు వెళ్లిపోయాడు. అయితే ఈ కేసులో ఆయన భార్యను దాదాపు ఐదుగంటల పాటు విచారించిన పోలీసులు ఆమె పేరును సాక్షిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈనెల 9న బెంగళూరులో రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హీరో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. -
దర్శన్ నా గురువు.. ఆయన ఇలా చేశారంటే..: హీరోయిన్
కొద్దిరోజులుగా హీరో దర్శన్ పేరు మారుమోగిపోతోంది. తనేదో మంచి పని చేసినందుకు కాదు.. తన గ్యాంగ్తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి క్రూరంగా చంపినందుకు! జూన్ 11న రేణుకాస్వామి హత్య జరగ్గా.. ఈ కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు పలువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి కన్నడ హీరోయిన్ రచితా రామ్ తాజాగా స్పందించింది. ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. దర్శన్.. గురువుదర్శన్.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. న్యాయం గెలుస్తుందిరేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం ధైర్యాన్ని కూడదీసుకోవాలి. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు. కన్నడలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'సూపర్ మచ్చి' మూవీతో పలకరించింది. View this post on Instagram A post shared by Rachitaa Ram (@rachita_instaofficial)చదవండి: షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్? బిగ్బీని తక్కువ చేసి.. -
కన్నడ హీరో దర్శన్ కేసు.. అతని భార్యకు నోటీసులు!
ప్రస్తుతం శాండల్వుడ్ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. అయితే హీరో దర్శన్కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు. -
పవిత్ర గౌడకు అస్వస్థత.. పోలీసుల ప్రశ్నలే కారణమా..?
కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడను గత కొద్దిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. రేణుకాస్వామి తనకు అసభ్య మెసేజ్లు పెడుతున్నట్లు తన ప్రియుడు హీరో దర్శన్కు చెప్పడంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వద్ద ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవిత్ర గౌడను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆమె తీవ్రంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పవిత్ర గౌడను గత 10 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం కాస్త దెబ్బతినడంతో చికిత్స కోసం బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును ఇది వరకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది.ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపాడు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఆ సినిమాలను తీసుకోని ఓటీటీలు.. అదే కారణమా?
777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్కు దగ్గరైన శాండల్వుడ్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్ రిలీజ్ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో రక్షిత్ శెట్టి ఓటీటీ ఫ్లాట్ఫామ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సినిమాలకు విలువ లేదా అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.రక్షిత్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'జనవరి 2020లో ఏకమ్ సిరీస్ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్కి అదే సరైన సమయం అనిపించింది. ఆ తర్వాక కరోనా మహమ్మారి అంతా తలకిందులైంది. దీంతో మే ఏకం సిరీస్ వాయిదా వేసుకున్నాం. అక్టోబర్ 2021లో ఏకమ్ ఫైనల్ కాపీ చూశాను. అది చూసి థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత దాన్ని ప్రపంచానికి చూపించడానికి రెడీ అయ్యాను. కానీ గత రెండేళ్లలో ఏకం సిరీస్ కోసం మేము ప్రయత్నించని ఓటీటీ లేదు. ప్రతిసారీ మాకు నిరాశే ఎదురైంది. ఏదేమైనా కంటెంట్ సత్తాను నిర్ణయించే హక్కు ప్రేక్షకులకు మాత్రమే ఉందని నమ్మాను. అందుకే మా సొంత వేదికపై తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీనిని అందరు గుర్తించి మెచ్చుకోవాలి.' అని రాసుకొచ్చారు. అయితే కన్నడ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం మొదటిసారి కాదని రక్షిత్ శెట్టి అన్నారు. కన్నడ పరిశ్రమ కంటెంట్ను ఓటీటీ ప్లాట్ఫారమ్లు ఎందుకు తీసుకోవడం లేదన్న విషయంపై కన్నడ డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడారు. 2022కి ముందు కన్నడ కంటెంట్ కొనుగోలు చేయడంలో విముఖత ఉన్న మాట నిజమే.. కానీ.. ఆ ఏడాది నుంచే కన్నడ సినిమాకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు గుర్తింపు దక్కిందన్నారు.అయితే కన్నడ సినిమా కంటెంట్పై ఉన్న నమ్మకం కొంతవరకు కోల్పోయామని గతంలోనే సప్త సాగరాలు దాటే ఎల్లో మూవీ దర్శకుడు హేమంత్ రావు అన్నారు. కన్నడ కంటే మలయాళం, హిందీ, తమిళ, తెలుగు కంటెంట్కే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కన్నడ కంటెంట్ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా కర్ణాటకతో పాటు మలయాళంలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్క శాండల్వుడ్లో మాత్రమే వెనక ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ కన్నడ చిత్రాలకు రావడం లేదని వెల్లడించారు. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్వుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్కు చెందిన బెంగళూరు ఫామ్హౌస్ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం శాండల్వుడ్లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్టాపిక్గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్తో రిలేషన్లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ఆమె కూతురు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవిత్ర 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్తో రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) -
విచారణలో మౌనంగానే దర్శన్.. ఛాన్స్ ఉన్నా తప్పించుకోని రేణుకాస్వామి
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరైస్టెన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.నగదు సీజ్రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు.అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామిరేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు. -
హత్యపై దర్శన్ కుమారుడు కామెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కారణంగానే ఈ హత్య జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పవిత్ర వల్లే తన అభిమాన హీరో జీవితం నాశనం అవుతుందని రేణుకాస్వామి భావించాడు. ఆమె వల్లే భార్యను దర్శన్ దూరం చేసుకున్నాడని భావించిన రేణుకాస్వామి పవిత్రకు రేణుకాస్వామి వార్నింగ్ మెసేజ్లు పెట్టినట్లు తెలుస్తోంది.కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ ప్రియురాలుపోలీసుల విచారణలో నటి పవిత్ర కన్నీరు పెట్టుకుంది. తను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. 'చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి నాకు అసభ్య మెసేజ్లతో పాటు అశ్లీల చిత్రాలను పంపేవాడు. ఈ విషయాన్ని దర్శన్కు చెప్పి తప్పు చేశాను. ఒకవేళ రేణుకాస్వామి విషయాన్ని ముందుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింటే ఈ హత్య జరిగేది కాదు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.నా తండ్రిని దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు: దర్శన్ కుమారుడురేణుకాస్వామి హత్యకేసులో అరెస్ట్ అయిన తన తండ్రి దర్శన్ గురించి 'వినీశ్ తూగుదీ' (15) ఒక పోస్ట్ పెట్టాడు. నా తండ్రి దర్శన్తో పాటు తల్లి విజయలక్ష్మికి మానసిక ప్రశాంతత అవసరం ఉంది. నా తండ్రిని భూతులతో దూషిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. నా తండ్రి హత్య చేసి ఉంటాడని నేను నమ్మడం లేదు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. అంతవరకు కాస్త ఓపిక పట్టండి.' అని ఆవేదనతో దర్శన్ కుమారుడు వినీశ్ చెప్పుకొచ్చాడు. -
దర్శన్ కేసులో మరో నటుడు అరెస్ట్
ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో అరెస్టులు పెరుగుతున్నాయి. క్రమంగా మరింతమంది పాత్ర బయటపడుతోంది. పోలీసులు తాజాగా ప్రదోశ్ అనే నటున్ని అరెస్టు చేశారు. దీంతో అరైస్టెన నిందితుల సంఖ్య 14కు చేరింది. ప్రదోశ్ పలు కన్నడ చిత్రాలలో సహాయక నటునిగా నటించాడు. దర్శన్తో కలిసి బృందావన, బుల్ బుల్ సినిమాలలో నటించాడు. దర్శన్ గ్యాంగ్లో ప్రదోశ్ ఒకడిగా పేరుంది. గతంలో ఓ బీజేపీ మంత్రి వద్ద పని చేశాడు, ఆ పార్టీ ఐటీ విభాగంలోనూ ముఖ్యునిగా ఉండేవాడు. రేణుకాచార్య హత్య తరువాత దర్శన్ ప్రదోశ్కు రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్ చేయమని సూచించాడు. ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితులు జగదీష్, రవి, రాజు ఉన్నారని, పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, రేణుకాచార్య మృతదేహానికి బౌరింగ్ ఆస్పత్రిలో జరిపిన పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతనికి ప్రైవేటు భాగాల్లో తీవ్రంగా హింసించారని, శరీరంలో అనేకచోట్ల గాయాలై ఎముకలు విరిగి ఉన్నాయని తెలిపారు.ఠాణా చుట్టూ నిషేధాజ్ఞలుదర్శన్, పవిత్రగౌడ, ఇతర నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్స్టేషన్లో కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో దర్శన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అందుకే పోలీస్ స్టేషన్ను షామియానాతో మూసివేసి భద్రత పెంచారు. స్టేషన్ కాంపౌండ్ను పరదాలతో కప్పేసారు. సామాన్య ప్రజలను ఎంతో అవసరమైతే కానీ లోపలకు అనుమతించడం లేదు. లోపల ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టూ 144 నిషేధాజ్ఞలు, అలాగే 200 మీటర్ల చుట్టూ కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17 వరకు ఇవి అమలులో ఉంటాయి. బాడీ తరలించిన స్కార్పియో సీజ్కామాక్షిపాళ్యలోని పట్టణగెరెలో షెడ్ నుంచి రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించడానికి వాడిన స్కార్పియో కారుని కామాక్షిపాళ్య పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఆర్ నగర దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుని ఇంటి వద్ద ఈ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వాహనం పునీత్ అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయ్యింది. షెడ్ నుండి శవాన్ని తరలించడానికి సహాయపడిన గ్యారేజ్ మంజు కోసం పోలీసులు వెతుకుతున్నారు.భార్య ఇన్స్టా ఖాతా డిలిట్దర్శన్ భార్య విజయలక్ష్మి తన ఇన్స్టా ఖాతాను క్లోజ్ చేసి డిలిట్ చేశారు. దర్శన్ అరెస్టు కాగానే భర్తను ఇన్స్టా లో అన్ఫాలో చేశారు. ఇప్పుడు దర్శన్కు మద్దతుగా, వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లు, పోస్టులతో ఏకంగా ఇన్స్టా నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. విజయలక్ష్మికి ముందునుంచి భర్తతో గొడవలు ఉండడం తెలిసిందే. ఈ కేసులతో విడాకులు తీసుకోవచ్చని సమాచారం.దర్శన్ను సస్పెండ్ చేయలేదుహత్య కేసులో అరైస్టెన దర్శన్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అందరితో చర్చించి చర్యలు తీసుకుంటామని కన్నడ సినిమా వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్ తెలిపారు. కన్నడ ఆర్టిస్టుల సంఘం,వాణిజ్య మండలి, ఇతర సినీ పెద్దలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దర్శన్ను కన్నడ చిత్ర రంగం నుంచి సస్పెండ్ చేశారనే వార్త అవాస్తవమన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, వాణిజ్య మండలి ఎవరి తరఫున మాట్లాడదని అన్నారు. దర్శన్పై ఆరోపణ మాత్రమే ఉందని, కోర్టులో తీర్పు తరువాతే ఆయన నేరం చేశాడా, కాదా అనేది తెలుస్తుందన్నారు. మరోవైపు దర్శన్కు వ్యతిరేకంగా మండ్య సహా పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి. -
సినిమాను మించిన ట్విస్ట్లు.. దర్శన్ కేసులో విస్తుపోయే నిజాలు!
ఇటీవలే కాటేరా మూవీతో హిట్ కొట్టిన శాండల్వుడ్ హీరో దర్శన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని(28) హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడం కన్నడ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. అయితే ఈ కేసులో మరో నటి, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు ఇదంతా చూస్తుంటే ఓ క్రైమ్ సినిమాను తలపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు అసలు పవిత్ర గౌడ ఎవరు? అని తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఆమెకు, దర్శన్కు మధ్య రిలేషన్ ఏంటని శాండల్వుడ్లో చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా సహజీవనం చేస్తున్నారా? అన్న విషయాలపై నెట్టింట తెగ వెతికేస్తున్నారు.నటిగా ఎంట్రీ ఇచ్చి...మొదట టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవిత్ర సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవలే ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. మా బంధానికి పదేళ్లు అంటూ దర్శన్తో ఉన్న ఫోటోలను పవిత్ర పంచుకుంది.దర్శన్కు పెళ్లి.. పవిత్ర గౌడతో సహజీవనంమరోవైపు ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్కు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్ వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు పోస్ట్ చేేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్ తమకు ఆఫర్ ఇచ్చాడని ముగ్గురు నిందితులు వెల్లడించారు. -
దునియా విజయ్ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్లో ఉత్కంఠ
మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని కన్నడ హీరో దునియా విజయ్ 2018లోనే కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, నేడు తుది తీర్పును కోర్టు వెళ్లడించనుంది. దీంతో ఆయన ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. వీర సింహా రెడ్డి చిత్రంలో విలన్గా నటించిన ఆయన తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.నాగరత్న,దునియా విజయ్, అతని రెండవ భార్య కీర్తి మధ్య అప్పట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎప్పుడూ వారు వార్తల్లో నిలిచేవారు. కుటుంబ గొడవలు వీధినపడటంతో మంచిది కాదని భావించిన విజయ్ నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించి బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నాడు. ఆపై 2019లో దునియా విజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. నాగరత్నతో కలిసి జీవించలేనని పేర్కొన్నాడు. ఆ సమయం నుంచి విజయ్ తన రెండో భార్య కీర్తితోనే ఉన్నాడు. దాదాపు 6 ఏళ్లుగా కోర్టులో వీరి విడాకుల కేసు విచారణ జరుగుతుండగా.. ఈ సాయింత్రం తుది తీర్పు వెలువడనుంది.నాగరత్నతో దూరంగా ఉన్న విజయ్ పిల్లల బాధ్యత మాత్రం తనే తీసుకుంటానని ఆప్పట్లోనే తెలిపాడు. నాగరత్నకు భరణం కూడా చెల్లించినట్లు ఆయన గతంలో చెప్పాడు. అయితే, కోర్టుకు వచ్చిన ప్రతిసారీ తనకు భర్త కావాలని నాగరత్న చెప్పేదని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్ తన పిల్లలను ఇతర దేశాల్లోనే చదవించాడు. కొద్దిరోజుల క్రితం విజయ్ పెద్ద కూతురు రితన్య మొదటి సినిమాని ప్రకటించింది. రెండో కూతురు మోనిక విదేశాల్లో చదువుకుంటుంది. కుమారుడు సామ్రాట్ కూటా తన చదువు పూర్తి అయిన తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఖాకీ కస్టడీలో హీరో
సినిమాలో కంటే నిజజీవితంలో జరిగే సంఘటనలే మరింత నాటకీయంగా ఉంటాయని మళ్లీ రుజువైంది. షూటింగ్లో ఉండగా ప్రముఖ నటున్ని పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆయన సన్నిహితురాలిని కూడా నిర్బంధించడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. గతంలో కుటుంబ కలహాలతో వార్తల్లోకెక్కిన దర్శన్ ఇప్పుడు హత్య కేసులో నిందితుడు అయ్యాడు.దొడ్డబళ్లాపురం: ఓ యువకుని హత్యకు సంబంధించి ప్రముఖ హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్, మరో నటి, ఆయన సన్నిహితురాలు పవిత్రగౌడతో పాటు 10 మంది బౌన్సర్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మైసూరులో దర్శన్ను అరెస్టు చేసి రాజధానికి తరలించారు. దర్శన్ అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు కామాక్షిపాళ్య పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాస్.. బాస్.. ది బాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ నగరలోని దర్శన్ నివాసంతో పాటు పలుచోట్ల పోలీసులు భద్రతను పెంచారు. పవిత్రపై అసభ్య మెసేజ్లు... పోలీసు కమిషనర్ బి.దయానంద చెప్పిన ప్రకారం... సోషల్ మీడియాలో పవిత్రగౌడ ఫోటోలపై రేణుకాస్వామి తరచూ అసభ్యంగా మెసేజ్లు పెట్టేవాడు. ఆమె దర్శన్కు చెప్పడంతో రేణుకాస్వామిని గుర్తించి పట్టుకుని జూన్ 8న రాత్రి కామాక్షిపాళ్య వద్ద ఉన్న దర్శన్ అనుచరుడు వినయ్కు చెందిన షెడ్లోకి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. అప్పుడు దర్శన్ అక్కడే ఉన్నారు. తరువాత మృతదేహాన్ని దగ్గరలో కాలువలోకి విసిరేశారు. జూన్ 9న సుమ్మనహళ్లి వద్ద ఉన్న రాజకాలువలో రేణుకాస్వామి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రేణుకాస్వామిదిగా గుర్తించి విచారణ చేపట్టారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు డబ్బు గొడవలతో ఈ హత్య చేసినట్టు చెప్పుకుని పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే వారి వాంగ్మూలాలలో తేడా గమనించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించగా దర్శన్ పేరు చెప్పారు. చిత్రదుర్గ నుంచి ఇలా రప్పించారు చిత్రదుర్గలో కేఈబీ రిటైర్డ్ ఇంజినీర్ కాశినాథ్ శివనగౌడ, రత్నప్రభ దంపతుల కుమారుడు రేణుకాస్వామి. గత ఏడాది సహనా అనే యువతితో పెళ్లయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. అతడు కూడా దర్శన్కు అభిమాని. ఈ నేపథ్యంలో రేణుకాస్వామిని మాయమాటలతో బెంగళూరులో నిందితుల వద్దకు తీసుకువచ్చిన చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసారు. గత శనివారం దర్శన్ పిలుస్తున్నాడని చెప్పి రేణుకాస్వామిని రాఘవేంద్ర బెంగళూరుకు తీసుకువెళ్లాడు. శనివారం మధ్యాహ్నం తల్లితండ్రులకు ఫోన్ చేసిన రేణుకాస్వామి తాను స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత రేణుకాస్వామి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యుల్లో భయం నెలకొంది. చిత్రదుర్గ చెళ్లకెరె గేట్ వద్ద బాలాజీ బార్ వద్ద బైక్ లభ్యమైంది. సోమవారం మధ్యాహ్నం కామాక్షిపాళ్య పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుని హత్య వార్త తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలుచోట్ల భద్రత పెంపు పోలీసులు దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపి తరువాత తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది నిర్బంధంలో ఉన్నారు. దర్శన్ను పోలీసులు అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే తీసుకెళ్లారని ఆయన లాయర్ నారాయణస్వామి మీడియాకు తెలిపారు. దర్శన్ను వెస్ట్ డీసీపీ గిరీశ్ విచారిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ వ్యవహారం రాష్ట్ర సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. పలువురు సెలబ్రిటీలు విస్మయం వ్యక్తంచేశారు.దర్శన్ ప్రమేయంపై విచారణ : హోంమంత్రిశివాజీనగర: ఓ హత్య కేసులో నటుడు దర్శన్ పాత్ర గురించి విచారణ జరుగుతోంది, ఆ తరువాతనే స్పష్టత వస్తుందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో ఆయన మాట్లాడుతూ చిత్రదుర్గకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో దర్శన్ పేరు వినిపించింది. అందుచేత విచారణ కోసం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా అరెస్ట్ అయిన నిందితులు దర్శన్ పేరు చెప్పారు. ఏ కారణానికి హత్య జరిగింది? దర్శన్ పేరు ఎందుకు వచ్చింది అనేది దర్యాప్తు తరువాతనే స్పష్టమవుతుంది అని చెప్పారు. -
బిగ్బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!
బిగ్బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్గా వీరి వివాహం జరిగింది. హనీమూన్కు నెదర్లాండ్కు వెళ్లి వచ్చారు.ట్విస్ట్ ఇచ్చిన జంటసోషల్ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్, నివేదిత గౌడ స్పందించనేలేదు.బిగ్బాస్ షోలో..కాగా చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్లే, పొగరు, చూ మంతర్ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్బాస్ ఐదో సీజన్లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్లో నివేదిత కూడా పార్టిసిపేట్ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. -
పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)
-
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
కన్నడ నటుడు చేతన్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు. నటుడిపై దాడితిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్ డ్యామేజ్ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్లో ఓ మహిళ కూడా ఉంది.న్యాయం కావాలితనకు జరిగిన అన్యాయాన్ని చేతన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.నిందితుడు అరెస్ట్చేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Chetan Chanddrra (@chetan_chanddrra) -
తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్.. భార్యతో కలిసి గుడ్న్యూస్ చెప్పిన హీరో
ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.తెలుగువారికి సుపరిచితుడే!చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.చందన్పై బ్యాన్అయితే ఈ సీరియల్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇటీవలే కొత్త బిజినెస్కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by K A V I T H A (@iam.kavitha_official) -
కొత్త కారు కొన్న స్టార్ హీరో సతీమణి.. ధర ఎంతో తెలిస్తే
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన 'యువ' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పిఆర్కె ప్రొడక్షన్స్కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణరంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్లను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రంమలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్కు కూడా కారు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు AudiQ7 కారు ఆ జాబితాలో చేరింది. ఈ రోజుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఆడి క్యూ7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇది లీటర్ పెట్రోల్కు 14 కి.మీల మైలేజీని కూడా ఇస్తుంది. క్షణాల్లో 250 KMPH స్పీడ్ను అందుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఆడి క్యూ7 కారు ఆన్-రోడ్ ధర రూ.1 కోటి 10 లక్షల వరకు ఉంటుంది. 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అశ్వినికి రూ. 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు పునీత్. అంతకు ముందు కూడా జాగ్వార్ కారుని తన భార్యకి గిఫ్ట్గా పునీత్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశ్విక కొన్న కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
సడన్గా ఓటీటీకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక కొత్త కొత్త సినిమాలు చూసేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఓటీటీలు అందిస్తున్నాయి. ఏ భాష సినిమా అయిన డబ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి రెండు పార్టులుగా వచ్చి సక్సెస్ సాధించింది. ప్రేమకథగా వచ్చిన ఈ సిరీస్కు అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది తాజాగా మరో కన్నడ ప్రేమకథ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కథగా తెరకెక్కించిన ఒండ్రు సరళ ప్రేమ కథె చిత్రం సడన్గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వినయ్ రాజ్కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్లో తీసుకోస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించగా.. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. -
మీ ఆశీస్సులే మమ్మల్ని బతికించాయి: స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ఇటీవల విమాన ప్రమాదాల గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాంటి అనుభవాన్ని పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానం ల్యాండింగ్ సమస్య రావడంతో భయాందోళనకు గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపింది. ఆ సమయంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఆమెతో పాటే ఉన్నారు. తాజాగా అలాంటి అనుభవమే మరో స్టార్ హీరోకు ఎదురైంది. తొలిసారి మృత్యువు నుంచి ఆ దేవుడే మమ్మల్ని కాపాడారంటూ కన్నడ నటుడు ధృవ సర్జా పోస్ట్ చేశారు. నా జీవితంలో మొదటిసారి ఎదురైన చేదు సంఘటనను ఇన్స్టా ద్వారా షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్ ల్యాండింగ్కు ఇబ్బందులు రావడంతో మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఢిల్లీ నుంచి ఓ పాట చిత్రీకరణ కోసం శ్రీనగర్కు ధృవ సర్జా బృందం బయలుదేరింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ చాకచక్యంగా వ్యవహరించిన సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో చిత్రబృంద సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ మాకు నిజంగా పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి శ్రీనగర్కు వెళ్లే మార్గంలో తీవ్ర అల్లకల్లోల వాతావరణ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది అన్ని ప్రోటోకాల్లను అనుసరించడంతో శ్రీనగర్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. కాగా..కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట షూట్ చేసేందుకు శ్రీనగర్ వెళ్లారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)