-
చెరవీడిన అసాంజ్ !
అగ్రరాజ్యంపై యుద్ధం చేయాలంటే మారణాయుధాలు అవసరం లేదని, ఒక ల్యాప్టాప్తో దాన్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చని గుక్కతిప్పుకోనీయకుండా చేయొచ్చని నిరూపించిన వికీలీక్స్ అధిపతి జూలియన్ అసాంజ్కు పద్నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. తన సాహసవంతమైన కార్యకలాపాల కారణంగా అయినవాళ్లకు దూరమై కొన్నాళ్లు లండన్లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో తలదాచుకుని, ఆ తర్వాత బ్రిటన్ చెరలో మగ్గిన అసాంజ్ నేరాంగీకార ప్రకటనకు సిద్ధపడి అమెరికా ఇవ్వజూపిన వెసులుబాటుకు తలొగ్గక తప్పని స్థితి ఏర్పడటం స్వేచ్ఛాప్రియులకూ, పాత్రికేయలోకానికీ చివుక్కుమనిపిస్తుంది. ఒప్పందం ప్రకారం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని 14 దీవుల సముదాయమైన ఉత్తర మెరీనా ఐలాండ్స్ (ఎన్ఎంఐ)లో ఒకటైన సైపాన్ దీవిలోని న్యాయస్థానం ఎదుట అసాంజ్ హాజరై తన తప్పు ఒప్పుకున్నాడు. అమెరికాలో అడుగుపెట్టడానికి అసాంజ్ విముఖత చూపిన కారణంగా, సాంకేతికంగా దానిలోనే భాగమైన సైపాన్లో ఈ తతంగం పూర్తిచేయటానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. అమెరికా ఆయనపై గూఢచర్యానికి సంబంధించి 18 ఆరోపణలు చేసింది. వాటి ఆధారంగా విచారణ జరిగితే అసాంజ్కు 175 ఏళ్ల శిక్షపడేది. కానీ ఒప్పందం ప్రకారం అందులో ఒకే ఒక నేరారోపణ మోపి, దానికింద అయిదేళ్ల శిక్షవిధించి బ్రిటన్ జైల్లో అనుభవించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే విడుదల చేయటానికి ఒప్పందం కుదిరింది. వికీలీక్స్ ఎప్పటిలా పనిచేస్తుందా లేదా అన్నది తేలాల్సి వుంది.ఏం నేరం చేశాడు అసాంజ్? యుద్ధాలనూ, దురాక్రమణలనూ సమర్థించుకునేందుకు అగ్రరాజ్యాలు ప్రచారంలో పెట్టే అబద్ధాలను తుత్తినియలు చేశాడు. అమెరికా దురాక్రమణలో ఉన్న ఇరాక్లో ఒక మారుమూల పల్లెలో వీధిలో నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరు సాధారణ పౌరులనూ, రాయిటర్ జర్నలిస్టులు ఇద్దరినీ కేవలం సరదా కోసం బాంబులతో హతమార్చిన అమెరికా సైనికుల దురంతాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు. ఉగ్రవాదాన్ని అంతంచేసే పేరిట ఇరాక్, అఫ్గానిస్తాన్లలో అమెరికా కూటమి దేశాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో, ఎలా నరమేధాన్ని సాగించాయో తెలిపే లక్ష పత్రాలను బట్టబయలు చేశాడు. వర్ధమాన దేశాలే కాదు... సాటికి సరైన సంపన్న దేశాల విషయంలోనూ అమెరికాకు ఎంత చిన్న చూపున్నదో ఏకరువు పెట్టే కోట్లాది సందేశాలను బజారున పడేశాడు. అవన్నీ వేర్వేరు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన సందేశాలు. ఎక్కడి ప్రభుత్వం ఎటువంటిదో, సైనిక వ్యవస్థల తీరుతెన్నులేమిటో తెలిపే అంచనాలు వాటిల్లో ఉన్నాయి. ఆఖరికి దేశదేశాల పాలకులు తమ అక్రమార్జనను వేరే దేశాల బ్యాంకులకు తరలిస్తున్న వైనాన్ని ఆధారాలతో వెల్లడించాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2006లో జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ‘మన అనుకూలుర’ వివరాలు పంపిన సందేశం కూడా అసాంజ్ లీక్స్లో ఉంది. ఇవన్నీ గూఢచర్యం కిందికొస్తాయని ఇన్నేళ్లుగా అమెరికా చేసిన వాదనలో పసలేదు. ఆ దేశమైనా, పాశ్చాత్య దేశాలైనా సందర్భం ఉన్నా లేకపోయినా ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెబుతుంటాయి. తెరవెనక మాత్రం అందుకు విరుద్ధమైన పోకడలకు పోతుంటాయి. దీన్నే సాక్ష్యాధారాలతో అసాంజ్ వెల్లడించాడు. అప్రజాస్వామికమైన ఆ కార్యకలాపాలు తాము నమ్మే విలువలకూ, విధానాలకూ పూర్తి విరుద్ధమని ఆ దేశాల పౌరులు గ్రహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చివుంటే అంతిమంగా అక్కడి సమాజాలకూ, ప్రపంచానికీ మేలు జరిగేది. కానీ వంచకులను విశ్వసించటం, అబద్ధాలకు పట్టంగట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి. అసాంజ్ విలువను ఇలాంటి సమాజాలు ఏం గుర్తించగలవు? ఆయన ఇరాక్, అఫ్గాన్లలో అమెరికా దురంతాలను వెల్లడించినప్పుడు అమెరికా పౌరులు వెల్లువలా కదిలివుంటే ఇవాళ ఇజ్రాయెల్ గాజాను వల్లకాడు చేయసాహసించేది కాదు. మారణాయుధాలూ, మందుగుండు సరఫరా చేస్తూ ఆ నెత్తుటి క్రీడకు అమెరికా దోహదపడేది కాదు. అమెరికా ఆరోపిస్తున్నట్టు అసాంజ్ గూఢచారి కాదు. నికార్సయిన పాత్రికేయుడు. తన చర్యల ద్వారా మెరుగైన స్వేచ్ఛాయుత సమాజాన్ని ఆశించాడు తప్ప అందులో దురుద్దేశాలు లేవు. చేయని నేరానికి ఇలా గత అయిదేళ్లుగా అసాంజ్ దాదాపు 19 చదరపు అడుగుల సెల్లో రోజుకు 23 గంటలు ఏకాంతవాస ఖైదు అనుభవిస్తున్నాడు. బయటి ప్రపంచంతోగానీ, సహ ఖైదీలతోగానీ ఆయనకు సంబంధాల్లేవు. ఈ శిక్ష కారణంగా ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుండెజబ్బు సోకింది. బహుశా అందుకే కావొచ్చు... ఆయన ఈ ఒప్పందానికి అంగీకరించి వుండొచ్చు.అసాంజ్ విడులను స్వాగతిస్తూనే పాత్రికేయ ప్రపంచం వ్యక్తం చేస్తున్న భయాందోళనలు సహేతుకమైనవి. తమ దేశ పౌరుడు కాకపోయినా తమ గుట్టుమట్లు వెల్లడించినందుకు అమెరికా ఆగ్రహించటం, ఇన్నేళ్లుగా ఆయన్ను వెంటాడటం... ప్రజాస్వామ్య దేశాలుగా డప్పు కొట్టుకునే స్వీడన్, బ్రిటన్లు అందుకు సహకరించటం ఏరకంగా చూసినా సిగ్గుచేటైన విషయం. అసాంజ్ కేసు చూపి భవిష్యత్తులో తమ చీకటి చర్యలను బట్టబయలు చేసే ఏ దేశ పాత్రికేయులనైనా అమెరికా తమ దేశానికి పట్టి అప్పగించమని కోరవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా అసాంజ్ వెనక దృఢంగా నిలబడి అటు అమెరికాపైనా, ఇటు బ్రిటన్పైనా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చింది. ఎన్ని దేశాలు ఆ పని చేయగలుగుతాయి? అసాంజ్ విడుదల ఆయన కుటుంబానికీ, మద్దతుదార్లకూ ఊరటనిస్తుందనటంలో సందేహం లేదు. కానీ ఇందులో అంతర్లీనంగా కనిపిస్తున్న పోకడలు ప్రమాదకరమైనవి. -
అమెరికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల నేతలు, ప్రచార బృందాల విమర్శల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం రాత్రి ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో క్యాంపస్ వద్ద ట్రంప్ మాట్లాడారు. ‘నాలుగు ఏళ్ల క్రితం ఆమెరికా ఒక గొప్పదేశంగా ఉండేది. అంతే స్థాయిలో మరికొన్ని రోజుల్లో అమెరికా గొప్ప దేశం నిల్చోబెడతా. యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. దీంతో కొంత కాలం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో వలసలు పెరిగాయి. బహిష్కరణ విధానాలతో వలసలపై కఠిన చర్యలు తీసుకుంటాను. మోసగాడైన జో బైడెన్.. సోదరభావంతో ఉండే ఫిలడెల్ఫియా సిటీని మొత్తం నేరాలు, రక్తపాతంతో నాశానం చేశారు. ఇక్కడ అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇదంతా ‘బైడెన్ వలస నేరం’. .. మన దేశ చరిత్రలో సురకక్షితమైన సరిహద్దులు కలిగి ఉండేవాళ్లం. కానీ ఇప్పడు మనం ప్రపంచ చరిత్రలోనే రక్షణ లేని సరిహద్దులను కలిగి ఉన్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను. బైడెన్ ఆర్థిక విధానాలను మార్చివేస్తాను. రక్షణ వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తా. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా అమెరికాకు సైతం ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా’అని ట్రంప్ అన్నారు.ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరుగనున్నాయి. జాతీయవాదిగా, వలసలను త్రీంగా వ్యతిరేకించే నేతగా పేరున్న ట్రంప్ ఇటీవల అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్ గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
వలసదారులకు భారీ ఆఫర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అమెరికా పౌరులను ఆకట్టుకునేందుకు బైడెన్ సర్కార్ అక్కడి చట్టబద్దతలేని వలసదారులకు భారీ ఉపశమనం కలి్పంచనుంది. అమెరికా పౌరులను పెళ్లాడిన వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు బైడెన్ మంగళవారం ప్రకటించారు. అయితే ఈ వలసదారు ఇప్పటికే అమెరికాలోనే కనీసం పదేళ్లుగా నివసిస్తూ ఉండాలనే షరతు విధించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న దాదాపు ఐదు లక్షల మంది వలసదారులకు ఈ నిర్ణయంతో లబ్దిచేకూరనుంది.అమెరికా పౌరుల భాగస్వాములు చట్టబద్ధత కోసం త్వరలో దరఖాస్తుచేసుకోవచ్చని తర్వాతి దశలో వాళ్లకు పౌరసత్వం ఇస్తామని బైడెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 17నాటికి అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని పదేళ్లు పూర్తయితే లీగల్ స్టేటస్(చట్టబద్ధత) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తు ఆమోదం పొందితే మూడేళ్ల తర్వాత గ్రీన్కార్డ్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి తాత్కాలిక వర్క్ పరి్మట్ ఇస్తారు.ఈ వర్క్ పరి్మట్ సాధిస్తే వారు దేశ బహిష్కరణ వేటు నుంచి తప్పించుకుని అమెరికాలోనే ఉద్యోగాలు/పనులు చేసుకోవచ్చు. ‘‘ పౌరసత్వంలేని భాగస్వామి, చిన్నారులతో కలసి అమెరికా పౌరులు కుటుంబసమేతంగా సంతోషంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నాం. కుటుంబాల ఐక్యత దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. పిల్లలూ దరఖాస్తు చేసుకోవచ్చు అమెరికా పౌరులను పెళ్లాడిన అక్రమ వలసదారుల పిల్లలూ చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి పిల్లలు దేశవ్యాప్తంగా 50,000 మంది ఉంటారని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితభాగస్వామి చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అమెరికా పౌరులను పెళ్లాడి పదేళ్లు పూర్తికావాల్సిన పనిలేదు. అంటే పెళ్లికి ముందే అమెరికాలో పదేళ్లుగా ఉంటూ జూన్ 17వ తేదీలోపు పెళ్లాడినా సరే వాళ్లు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులే.17వ తేదీ(సోమవారం) తర్వాత పదేళ్లు పూర్తయితే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అమెరికాలో సమ్మర్ సీజన్దాకా ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. అమెరికా పౌరులను పెళ్లాడిన దాదాపు 11 లక్షల మంది వలసదారుల్లో చాలా మంది ఈ తాజా నిర్ణయంతో లబి్ధపొందనున్నారు. డ్రీమర్లకూ తాయిలాలు! అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల(డ్రీమర్లు)కు బైడెన్ సర్కార్ అదనపు సౌకర్యాలు కలి్పంచనుంది. ‘‘ అమెరికా ఉన్నత విద్యా సంస్థలో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ఆఫర్ పొందిన డ్రీమర్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు’ అని బైడెన్ అన్నారు. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు గతంలో ఒబామా సర్కార్ ‘డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్’ పేరిట రక్షణ కలి్పంచిన విషయం తెల్సిందే. -
జోబైడెన్ కీలక నిర్ణయం.. అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట!
వాషింగ్టన్ : వీసా దారులకు అమెరికా జోబైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అమెరికా పౌరుల భాగస్వాములకు సరైన డాక్యుమెంట్లు లేకపోయినా పర్మనెంట్ రెడిడెంట్స్ (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్లు పోటీపడుతున్నారు.ఈ తరుణంలో అమెరికా పౌరుల్ని ప్రసన్నం చేసుకునేందుకు జోబైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించేందుకు సిద్ధమైంది.అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం..అమెరికా పీఆర్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ కావాలంటే అర్హులైన వారు వారి సొంత దేశంలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. కొత్త రూల్స్ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో జూన్ 17,2024 ముందు వరకు వివాహ అయ్యిండి.. కనీసం అమెరికా పౌరులుగా కనీసం 10ఏళ్లు ఉంటే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.ఇమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం..పీఆర్ కోసం అప్లయ్ చేసుకునే వారి సంఖ్య 5లక్షలు ఉండొచ్చని అంచనా.అదనంగా, అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50వేల మంది పిల్లలు ఉన్నారు. -
బొమ్మలా నిల్చున్న బైడెన్.. ఒబామా ఏం చేశారంటే..
న్యూయార్క్: గత కొంత కాలంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన, ఫిట్నెస్పై తీవ్ర విమర్శల పాలువుతున్నారు. ఆయన అధిక వయసు, మతిమరుపు కారణంగా పలు వేదికలపై వింతగా ప్రవర్తిస్తూ కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోతున్నారు. పక్కనున్న వాళ్లు ఆయన్ను కదిలిస్తేగాని బైడెన్ తేరుకోవటం లేదు. ఇటువంటి ఘటన మరోకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రెసిడెంట్ జో బైడెన్ శనివారం ఓ ఫండ్రైజింగ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పికాక్ థియేటర్లో జిమ్మి కిమ్మెల్తో ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం స్టేజీపై ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కలిసి నిల్చున్నారు. ఈ క్రమంలో భారీ వచ్చిన జనాలను చూసి.. ఒక్కసారిగా బైడెన్ కళ్లు దగ్గరుకు చేసుకొని విగ్రహంగా కదలకుండా 10 సెకండ్లపాటు ఫ్రీజ్ అయిపోయారు. దీంతో పక్కనే ఉన్న ఒబామా చేయిపట్టుకొని కదిలించటంతో బైడెన్ తేరుకొని ముందుకు నడిచినట్లు వీడియో దృష్యాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🔥🚨DEVELOPING: President Obama had to guide Joe Biden off the stage with Jimmy Kimmel at Biden’s fundraising event in The Hamptons with George Clooney. pic.twitter.com/5OoWVhajOl— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 16, 2024 ఇటీవల జరిగిన జీ-7దేశాల సమ్మిట్కు హాజరైన బైడెన్ వింతగా ప్రవర్తించారు. ఇటలీలోని అపూలియాలో తీర ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ను దేశాధినేతలు వీక్షిస్తుంటే.. దానికి దూరంగా వెళ్లుతూ.. అక్కడ ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించినట్లు వీడియోల్లో కనిపించి విషయం తెలిసిందే. వెంటనే ఇటలీ ప్రెసిడెంట్ జార్జీయా మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకొని మరీ వెనక్కి తీసుకువచ్చారు.LMFAOOO is Joe Biden okay??? pic.twitter.com/kvAJHBcwAd— kira 👾 (@kirawontmiss) June 13, 2024గతంలో పలు సందర్భాల్లో జో బైడెన్ ఫ్రీజ్ కావటం, తడబడటానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు బైడెన్ ఫ్రీజ్ మరోసారి ఫ్రీజ్ అయిపోయారనే వార్తలను వైట్హౌజ్ ఖండించింది. ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడ ప్రేక్షకులు చప్పట్లతో చూపించిన ప్రేమలో మునిగిపోయి అలా కొన్ని క్షణాలు ఉండిపోయారని తెలిపింది. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో సైతం బైడెన్ ప్రవర్తన, ఫిట్నెస్ను ప్రతిపక్ష పార్టీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024 -
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’
వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. -
అమెరికాలో పొలిటికల్ హీట్.. ట్రంప్ జైలుకా, వైట్ హౌస్కా
అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్. మెక్సికో-అమెరికా మధ్య గోడ, ఏడు దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం. ఇలా అనేక దేశాలను వణికించేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా వివర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్ పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో...జైలుకా, వైట్ హౌస్కా అన్న చర్చ మొదలైపోయింది. ఈ ఎపిసోడ్కి ఎలాంటి ముగింపు పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికన్నా కొద్ది రోజుల ముందే...డోనల్డ్ ట్రంప్ కూడా క్రిమినల్ కేసులో దోషిగా తేలారు. ఒక క్రిమినల్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం అన్నది ఇదే తొలిసారి. ఇది అమెరికా గౌరవానికి భంగపాటు అన్న వాదన ఒకవైపు వినిపిస్తున్నా...ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంటు రిపబ్లికన్స్ కూడా అదే స్థాయిలో ట్రంప్కి మద్దతుగా నిలుస్తున్నారు. మన్ హట్టన్ కోర్టు ఇచ్చే తీర్పుని తాను లెక్క చేయనని నవంబర్ 5వ తేదీన అసలైన తీర్పు వస్తుందంటున్నారు ట్రంప్. నవంబర్ 5 ఎలక్షన్ డే. అయితే...అందరి చూపు మాత్రం ఇప్పుడు జులై 11వ తేదీన న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఖరారు చేసే శిక్ష ఏంటన్న దానిపైనే ఉంది. శిక్ష ఖరారు చేసే సమయంలో ట్రంప్ వయస్సు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఫాలో కావడంలో ఫెయిల్ అవడం...ఇలా అనేక అంశాలను జడ్జి పరిగణలోకి తీసుకుంటారు. దీంతో...జరిమానాతో సరిపెడతారా ? లేక జైలు శిక్ష విధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. హష్ మనీ కేసులో ట్రంప్ పై మొత్తం 34 అభియోగాలు ఉన్నాయి. న్యూయార్క్ చట్టాల ప్రకారం ఇవి తక్కువ తీవ్రత ఉన్న కేసులే అయినా...గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒక వేళ ట్రంప్కి జైలు శిక్ష పడితే...అనేక ప్రాక్టికల్ సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కేవలం అధ్యక్షుడికి మాత్రమే కాదు. మాజీ అధ్యక్షులకు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉంది. ట్రంప్కి కూడా సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఇస్తోంది. ఇప్పుడు హష్ మనీ కేసులో ట్రంప్కి జైలు శిక్ష పడితే...ట్రంప్కి జైల్లో కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీని కోసం అనేక జైలు నిబంధ నలను సవరించాలి. అలానే...అమెరికా మాజీ అధ్యక్షుడుని జైల్లో ఉంచడం అంటే...భద్రతా పరంగా చాలా రిస్క్. ఈ కోణంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. జైలు శిక్ష పడినా అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ట్రంప్కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే...అమెరికా రాజ్యాం గం అధ్యక్ష అభ్యర్థికి నిర్ణయించిన అర్హతల్లో వయస్సు, అమెరికా పౌరసత్వం, 14 ఏళ్లుగా అమెరికాలో నివశించడం లాంటి వే ఉన్నాయి. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నాయి. అయితే...ఇప్పటికే ట్రంప్కి జరగాల్సిన నష్టం జరిగిందనే విశ్లేషణలు కూడా బలంగానే వినిపి స్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్లూమ్బర్గ్ - మార్నింగ్ కన్సల్ట్ పోల్లో...ట్రంప్ దోషిగా తేలితే ఆయన రిపబ్లి కన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాలలోని 53 శాతం ఓటర్లు తెలిపారు. క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6 శాతం మంది ఓటర్లు చెప్పారు. ట్రంప్ని న్యాయస్థానం దోషిగా తేల్చిన మర్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన సర్వేలో ఈ తీర్పు సరైనదే అని, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని...సర్వేలో పాల్గొన్న మెజార్టీ అమెరికన్లు తేల్చేశారు. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఆరోపించారు. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిం దంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. కానీ...హష్ మనీ కేసు మాత్రం ట్రంప్ని తీవ్ర స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరుగుతోంది. ఆయనకొచ్చే విరాళాలు పెరుగుతున్నాయి.ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. గత ఎన్నికల్లో బైడెన్కి అధికారాన్ని బదలాయించకుండా...తన మద్దతుదా రులను ట్రంప్ రెచ్చగొట్టిన తీరు...ఆయన తెంపరితనానికి పరాకాష్ట. వ్యవస్థలపై ట్రంప్ ఎప్పుడూ పెద్దగా గౌరవం చూపించరు. ఈసారి గెలిస్తే...వలసలను కట్టడి చేయడం దగ్గర నుంచి అంతర్జాతీయ సాయానికి కత్తెర వేయడం దాకా చాలా వివాదాస్పద అంశాలనే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రత ను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో జులై 11న హష్ మనీ కేసులో ట్రంప్కి పడే శిక్ష ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్రిమినల్ కేసులో ట్రంప్ దోషిగా తేలడాన్ని...తన ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకోవడం పై బైడెన్ ఫోకస్ పెడుతున్నారు. బైడెన్ కుమారుడు ఎపిసోడ్ని కూడా ట్రంప్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. 80 ఏళ్లు బైడెన్, 80 వసంతాలకు అతి చేరువలో ఉన్న ట్రంప్. పైగా...వీరిద్దరూ చుట్టూ క్రిమినల్ కేసుల కేంద్రం గా నెగిటివ్ వైబ్రేషన్స్. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కన పెడితే...సమర్థ నాయకత్వాన్ని అమెరికాకు అందించే విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థులు బలంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
గెలుపెవరిది..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ వర్సెస్ ట్రంప్
జో బైడెన్. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు. డోనాల్డ్ ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అధ్యక్ష పదవి కోసం తలపబడుతున్నారు. వైట్ హౌస్ రేసులో ఢీ అంటే ఢీ అంటున్నారు. జో బైడెన్ వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాంగ్ లీడర్ అన్న భావన కలిగించలేకపోతున్నారు. ఇక నాలుగేళ్లు ట్రంప్ పాలన ఎలా సాగిందో ప్రపంచమంతా చూసింది. డెమోక్రాట్స్ బైడెన్కి, రిపబ్లికన్స్ ట్రంప్కి జై కొట్టేశారు. ఇంత వరకు బానే ఉంది. కానీ...గత అధ్యక్షులతో పోల్చితే...సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే...కేవలం ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా..వరల్డ్ వైడ్గా చర్చ సాగుతోంది.నిజానికి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకి కొత్త కాదు. ప్రపంచ ప్రజలకు కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్తో పాటు ప్రపంచ ప్రజలంతా చూశారు.అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను కూడా వరల్డ్ అంతా చూస్తోంది. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు...జో బైడెన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది. అలానే కుమారుడి మీద కేసులు కూడా ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్ సంగతి సరే. ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు.అమెరికా రాజకీయాల్లో వృద్ధులు పదవులు చేపట్టడంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. అమెరికా పౌరుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లు. కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసంటూ లేదు. బైడెన్ వయస్సు 81. ట్రంప్ వయస్సు 78. ఆ వయస్సు అమెరికాకి నాయకత్వం వహించే స్థాయిలో శారీరిక, మానసిక ఆరోగ్యం సహకరిస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. మరోవైపు బైడన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సార్లు ఆయన వయస్సు కేంద్రంగా చర్చ సాగుతూ వచ్చింది. తాజాగా జీ-7 దేశాల సదస్సులో బైడెన్ వింతగా ప్రవర్తించడంతో...మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.అది.. ఇటలీ తీరప్రాంత నగరం అపూలియా. జీ7 సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. కానీ.. అదే సమయంలో జో బైడెన్ మాత్రం వింతగా ప్రవర్తించారు. తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్ను తిలకిస్తుండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే.. బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్కు షేక్హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత అక్కడే ఉన్న మిగితా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటికి తను షేక్హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్లో ఉంచి షాక్తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్.కొన్నాళ్ల క్రితం వైట్హౌస్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే.. బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండి పోయారు. ఏం జరుగుతుందో అర్ధం కానట్లు చూస్తుండిపోయారు. కొన్ని సెకన్లపాటు అలాగే ఉండిపోయిన బైడెన్ ఆ తర్వాత తేరుకున్నారు.ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలోనూ బైడెన్ దొరికిపోయారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోయారు. తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు బైడెన్ తీరు అధికార డెమొక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే బైడెన్ ప్రవర్తనని...రిపబ్లికన్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది. ఇకపై ప్రచారంలో దీన్ని ఒక కీలక అస్త్రంగా మార్చుకోవచ్చు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ని...గన్ కొనుకోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. అటు ట్రంప్ మీద ఉన్న ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోపణలు మాత్రమే కాదు. హష్ మనీ కేసులో ఆయన దోషిగా తేలారు. త్వరలోనే శిక్ష ఏంటన్నది న్యాయస్థానం ప్రకటించనుంది. ట్రంప్ వయస్సు కూడా 78 ఏళ్లు కావడంతో...వృద్ధాప్యం కోణంలో ఆయన నాయకత్వం మీదా చర్చ జరుగుతోంది. ఇలా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరూ సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్గా మారింది.క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్లో అడుగుపెట్టిన నాటి నుంచి... తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారిన అధ్యక్షుడు బైడెన్. అమెరికాలో చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడుగా ట్రంప్కి అద్భుతమైన రికార్డు ఉండనే ఉంది. ఇప్పుడు ఇద్దరి వయస్సు కేంద్రంగా కూడా వాడి వేడి చర్చ సాగుతోంది. ఇలా అనేక కోణాల్లో బైడెన్, ట్రంప్ మధ్య నెగిటివ్ వైబ్రేషన్స్ బలంగా హల్చల్ చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య వాడి వేడి సమరం తప్పదని ఎన్నికల సాగుతోన్న తీరు చెప్పకనే చెబుతోంది. అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ కన్నా ట్రంప్ ముందున్నారు. ట్రంప్ ట్రాక్ రికార్డ్ అంతా వివాదాలు, ఆరోపణల మయమే. అయినా సరే...ప్రచారంలో ట్రంప్ దూకుడుని బైడెన్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్కి మరో సమస్య వచ్చి పడింది. ఆయన కుమారుడు హంటర్ బైడెన్...క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్ కేంద్రంగా నెగిటివిటీ పెరుగుతోంది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. డెలావెర్లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీఎల్లెన్ నోరీకా... హంటర్ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. కానీ ఈ తరహా కేసుల్లో 25 ఏళ్ల వరకూ శిక్ష పడుతుంది. అదే సమయంలో తొలిసారి నేరానికి పాల్పడినందు వల్ల అంత శిక్ష పడక పోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నేరాన్ని నిర్ధారించిన జడ్జి.. ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేదీ చెప్పలేదు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికి కొద్ది రోజుల ముందే...డోనాల్డ్ ట్రంప్ని హష్ మనీ కేసులో దోషిగా తేల్చింది మన్హట్టన్ కోర్టు. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు... ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశార ని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు. 2006 జులై లో ఒక చారిటీ గోల్ఫ్ ట్రోర్నమెంట్లో ట్రంప్ని ఒక చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో కలిసినట్టుగా డేనియల్స్ చెబుతున్నారు. లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనట్టు ఆమె తెలిపారు.2016 ఎన్నికల ముందు...ట్రంప్ లాయర్ కోహెన్...తనకు హష్ మనీ కింద ఒక లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్టు డేనియర్స్ తెలిపారు. అమెరికాలో రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. హానికారక సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని... డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు. 2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో... ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు. అయితే ఈ చెల్లింపులతో ట్రంప్కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు. కానీ తరువాత ట్రంపే 1,30,000 డాలర్ల హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు. ఈ డబ్బును ట్రంప్ లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు.దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలే మని నిపుణులు అంటున్నారు. బిజినెస్ రికార్డులు తారుమారు అనేది న్యూయార్క్లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. అయితే, కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా, జరిమానాతో సరిపుచ్చుతారా అనేది చెప్పలేమని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఇంత కంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ట్రంప్ న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ ఈ విషయంలో ట్రంప్కి గట్టిగానే మద్దతు తెలుపుతోంది.ట్రంప్ మద్దతుదారులు ఈ కేసును బైడెన్ రాజకీయ కుట్ర అంటారు, ట్రంప్ వ్యతిరేకులు ఆయనకు శిక్షపడినందుకు సంతోషిస్తారు. రాజకీయాన్ని అటుంచితే, మరోసారి దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న ఓ మాజీ అధ్యక్షుడు ఇలా వరుస కేసులు ఎదుర్కోవడం, నేరస్థుడిగా ముద్రపడటం అమెరికా పరువు ప్రతిష్ఠలకు భంగకరమే అంటున్నారు పరిశీలకులు. అయితే...ఈ తరహా వివాదాలు, కేసులు, ట్రంప్కి కొత్త కాదు. ట్రంప్ని ఈ కోణంలో చూడటం అమెరికన్స్కి కొత్త కాదు. దీంతో...కోర్టు విధించే శిక్ష ఏంటి ? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అటు బైడెన్ కుమారుడు క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్ మీద ఆప్రభావం ఎంత వరకు పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘డొనాల్డ్ ట్రంప్ ఒక మోసగాడు, ఫెయిల్యూర్’
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలం నుంచి అధిక వయసు పేరుతో జో బైడెన్(81)పై విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇదే విషయాన్ని ట్రంప్ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. బైడెన్తో పోల్చితే అమెరికాకు తానే చురుకైన ప్రెసెడింట్గా ఉండగలనని పేర్కొంటున్నారు. అయితే శుక్రవారం ట్రంప్ సైతం 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దీంతో జో బైడెన్ ఎన్నికల ప్రచారం బృందం ఓ వైపు ట్రంప్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేస్తునే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఓ సందేశం పంపారు.‘హ్యాపీ బర్త్ డే ట్రంప్. మీరు మోసపూరిత, ఫెయిల్యూర్ వ్యక్తి. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, హాక్కులు, భవిష్యత్తుకు మీరు చాలా ప్రమాదకారి. మీరు ఇక ఎప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్ కాలేరు. మీ 79వ బర్త్డేకు అదే మొదటి అందమైన బహుమతి అవుతుంది’అని తెలిపింది. అదేవిధంగా అధ్యక్షుడు బైడెన్ అధికార యంత్రాగం సైతం ట్రంప్పై విమర్శలు చేస్తూ.. ట్రంప్ సాధించిన 78 విజయాలు ఇవే అంటూ ఆయనపై ఉన్న కేసులు, అభియోగాల జాబితాను విడుదల చేసింది. పలు కేసులు, అభియోగాలు మోపబడిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ట్రంప్ అని ఎద్దేవా చేసింది.అంతకుముందు ప్రెసిడెంట్ జో బైడెన్ ట్రంప్కు ఎక్స్లో బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ‘అధిక వయసు ఉన్న వ్యక్తి నుంచి మరో ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగా బర్త్ డే శుభాకాంక్షలు అందుకోండి. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. దానికి ఎన్నికలతో సంబంధం లేదు. ఎన్నికలు అధ్యక్షుడి ఎంపిక చేసేవి మాత్రమే’’ అని బైడెన్ అన్నారు. ఇక.. ట్రంప్ అరోపించినట్లు గానే జో బైడెన్ అధిక వయసు, మతిమరుపుతో ఇబ్బంది పడినట్లు పలు సందర్భాల్లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. ట్రంప్ 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇద్దరు అధిక వయసు నేతలు అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడటం అమెరికాలో తొలిసారి కావటం గమనార్హం. -
Donald Trump: అమెరికన్లకు బిగ్ ఆఫర్ ఇచ్చిన ట్రంప్!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న టార్గెట్తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రజలకు పెద్ద పెద్ద వరాలే ఇస్తున్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏకంగా ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ హామీపై చర్చ నడుస్తోంది.అయితే, వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్లో ట్రంప్.. అమెరికా పార్లమెంట్ సభ్యులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో టారిఫ్ల పాలసీని అమలు చేస్తానని ప్రకటించారు. సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ భేటీలో తెలిపారు. Trump has floated the concept of eliminating income tax and replacing it with tariffs.Wouldn't that require drastically reducing the size of the US Government?Dammit, I'm in. How about you? pic.twitter.com/YHSw3arMV5— TaraBull (@TaraBull808) June 13, 2024 అయితే, ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్లను తీసుకురావడమంటే దిగువ, మధ్యతరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీసి సంపన్నులకు లబ్ధి చేకూర్చడమే అవుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. -
జీ-7: జర్మన్ ఛాన్సలర్ పుట్టినరోజు.. బర్త్ డే సాంగ్తో శుభాకాంక్షలు
ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్లో తొలి రోజు దేశాధినేతల రాక.. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిచింది. జీ-దేశాల సమ్మిట్ భారత్ తరఫున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ సైతం పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే తోలి రోజు సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.యురోపియన్ కమిషన్ ప్రెజిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లడాకుంటున్నారు. అంతలోనే లేయన్ అక్కడే ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బర్త్ డే ఈరోజు అని జోబైడెన్తో చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ.. అయితే ఆయన కోసం మీరు బర్త్ డే సాంగ్ పాడారా? అని అడిగారు.#G7 Italia 2024: #Biden, #Meloni and other world leaders sing happy birthday song for German Chancellor Catch the day's latest news here ➠ https://t.co/mTNeb6ks1i 🗞️ pic.twitter.com/qYordDWk95— Economic Times (@EconomicTimes) June 14, 2024 బైడెన్ ఫ్యామిలీలో అయితే పుట్టినరోజు వేళ బర్త్ డే సాంగ్ పడుతామని అన్నారు. వెంటనే బైడెన్ బర్త్డే సాంగ్ మొదలుపెట్టగా అక్కడికి వచ్చిన దేశాధినేతలు అయనతో పాడుతూ.. ఓలాఫ్ స్కోల్జ్కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు ఓలాఫ్ స్కోల్జ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ వీడియో కనిపిస్తారు.ఓలాఫ్ స్కోల్జ్ 2021 డిసెంబర్ నుంచి జర్మనీ ఛాన్సలర్గా పని చేస్తున్నారు. ఆయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD)సభ్యుడు. ఛాన్సలర్ కావడానికి ముందు.. స్కోల్జ్ 2018 నుంచి 2021 వరకు మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకీర్ణ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్, ఆర్థిక మంత్రిగా పని చేశారు. -
జీ–7 అసంబద్ధ నిర్ణయం
పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్ ట్రంప్కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్ నిష్క్రమించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. అదే బైడెన్ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్ను బతిమాలుతోంది. మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్కు 5,000 కోట్ల డాలర్ల (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. ‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.బైడెన్కూ, ట్రంప్కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. -
G-7 Summit: బైడెన్కు ఏమైంది?.. ఇటలీలో వింత ప్రవర్తన!
ఇటలీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సుకు పలు దేశాల నేతల హాజరయ్యారు. జీ-7లో అమెరికా సభ్య దేశం కావడంతో సదస్సులో పాల్గొనేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇటలీ చేరుకున్నారు. కాగా, ఇటలీలో జో బైడెన్ వింతగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, బైడెన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందకు జీ-7 కూటమి దేశాల నేతలు ఇటలీ చేరుకున్నారు. కాగా, సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు. 🇺🇸 President Joe Biden is completely lost at the G7 Summit. pic.twitter.com/LbyiNg7mqE— BRICS News (@BRICSinfo) June 13, 2024 తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్కు ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.అయితే, బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతుకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్కు షేక్హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న మిగతావాళ్లకు ఇచ్చాడు లీడన్. అప్పటికి తను షేక్హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే చేతిని కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్లో ఉంచి షాక్తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024 గతంలోనూ ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. Pay close attention to Joe Biden’s hands in this video! pic.twitter.com/C5r0ceTNnX— Matt Wallace (@MattWallace888) June 12, 2024 It’s funny to MAGA because Joe Biden physically turned around and faced the WWII D Day veterans instead of having his back turned pic.twitter.com/lLC3I1AXCF— Andrew Mercado (@RealAndyMerc) June 7, 2024 -
జీ-7 సమ్మిట్: బైడెన్తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!
ఢిల్లీ: ఇటలీలో రేపు( శుక్రవారం) జరగబోయే జీ-7 దేశాల సమ్మిట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివన్ బుధవారం తెలిపారు. జీ-7 దేశాల సమ్మిట్కు హాజరయ్యేందుకు ఇటలీ వెళ్తున్న సమయంలో జేక్ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఇటలీలో ప్రధాని మోదీని చూడాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే జీ-7 సమ్మిత్కు మోదీ హాజరవుతారని భారత్ అధికారంగా ప్రకటించింది. అయితే మోదీ, బైడెన్ ఇటలీలో కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నా’’ అని అన్నారు. అదే విధంగా తాము పారిస్లో ఉన్న సమయంలో అధ్యక్షుడు బైడెన్ మోదీకి ఫోన్ చేసినట్లు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు బైడెన్ ఫోన్లో శుభాకాక్షలు తెలిపారని అన్నారు.ఇక.. ప్రధాని మోదీ ఇవాళ (గురువారం) ఇటలీ బయల్దేరనున్నారు. మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి బాధ్యత్యలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశి పర్యటన కావటం గమనార్హం. జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్కు హాజరుకావాలని ఇటలీ.. భారత్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అదే విధంగా సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు క్వాత్రా తెలిపారు. -
నేను అధ్యక్షుడినే కాదు.. తండ్రిని కూడా: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(54)ను గన్ కోనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో గన్ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్కు బానిసకాదంటూ ఆయుధ డీలర్కు అబద్దం చెప్పారని, ఆ గన్ను 11 రోజుల పాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. తన కుమారుడి కేసుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.‘‘నేను అమెరికాకు అధ్యక్షుడిని. కానీ, నేను కూడా ఒక తండ్రిని. ఈ కేసుకు సంబంధించి హంటర్ ఆప్పీల్ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తాను’’ అని జోబైడెన్ అన్నారు. దీంతో క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్గా నిలవటం గమనార్హం.ఇక.. ఈ కేసు విచారించిన డెలావెర్లోని ఫెడరల్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నొరీకా మాత్రం హంటర్కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి తీర్పు అక్టోబర్లో వెలువడనుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. హంటర్ బైడెన్పై మరో కేసు కూడా ఉంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంటర్లో విచారణ జరపనుంది. -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
న్యూయార్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు ఇవ్వాలని కోరిన చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులతో మారణ హోమం సృష్టిస్తుందన్న కరీం ఖాన్ ఆరోపణలను బెడెన్ తీవ్రంగా ఖండించారు. వైట్హౌజ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడారు.‘‘గాజాలో జరగుతున్నది.. మారణహోమం కాదు. అటువంటి ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్ బాధిత పక్షంగా మిగిలింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కొందరు హమాస్ చెరలో ఇంకా బంధీలుగా ఉన్నారు. .. మేము(అమెరికా) ఇజ్రాయల్ రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉంటాం. హమాస్ మిలిటేంట్లను అంతం చేసేవరకు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తాం. హమాస్ ఓడిపోవటమే మా లక్ష్యం. హమాస్ను ఒడించేందుకు ఇజ్రాయెల్ కోసం పనిచేస్తాం. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బంధీల విడుదల విషయంలో వెనక్కి తగ్గము’’ అని బెడెన్ అన్నారు. మరోవైపు.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని బైడెన్ పేర్కొనటం గమనార్హం.గాజా, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్లు బాధ్యులని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ అన్నారు. వారికి అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. -
జో బైడెన్ కీలక నిర్ణయం.. చైనా ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనీస్ ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపైన విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మరో మూడు సంవత్సరాలు అమలులో ఉంటాయి. అమెరికాలో చవకైన ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.స్వదేశీ వస్తువుల వినియోగం పెరగటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కొత్త ఆవిష్కరణ ఉత్పత్తి చాలా అవసరం. కాబట్టి అమెరికాలోనే కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని చెబుతున్నారు.2025 నాటికి, సెమీకండక్టర్లపై ట్యాక్ రేటు కూడా 25 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది, నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదలను చూస్తుంది. బ్యాటరీ విడి భాగాల మీద ట్యాక్స్ కూడా 25 శాతానికి పెరుగుతుంది. మొత్తం మీద అమెరికా చైనా వస్తువుల మీద భారీ సుంకాలను విధిస్తూ కీలక ప్రకటనలు చేసింది. -
అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
‘‘గంజాయిని కలిగి ఉన్నా.. లేదంటే సేవించినంత పని చేసినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా చేసిన పోస్ట్ ఇది. ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.వాషింగ్టన్: అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని నెమ్మదిగా ఆ దేశంలో చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడినట్లయ్యింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చబోతున్నారన్నమాట.అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం రూపకల్పన 1937లో జరిగింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించడం గమనార్హం. ఆ తర్వాత మైనర్లు డ్రగ్స్ బారిన పడుతున్నారనే 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్ సబ్స్టాన్సెస్ యాక్ట్. దీని ప్రకారం గంజాయిని ఇంతకాలం షెడ్యూల్-1 డ్రగ్ కింద ఉంచారు. ఈ షెడ్యూల్-1 డ్రగ్స్లో హెరాయిన్, ఎల్ఎస్డీ, ఎక్సాట్సీ వంటివి కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ అని, వీటిని సేవించినా.. కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన ఇంతకాలం కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్3 డ్రగ్స్లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు. షెడ్యూల్-3 డ్రగ్స్లో కెటామైన్, పెయిన్కిలర్స్లో వాడే కోడైన్(codeine) ఉన్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో.. ఇక నుంచి గంజాయి బ్యాచ్లకు కాస్త ఊరట కలగనుంది. అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే.. ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు.వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే.. గంజాయిని రీక్లాసిఫై చేసే ప్రతిపాదనను మాత్రం బైడెన్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆ ప్రాసెస్ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే.. ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది.ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు.బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్ర ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించే దిశగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో ట్రంప్.. చైనాపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో చైనా తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మిలిటరీ ఏజ్’లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడిచేస్తారని అన్నారు. వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా? అంటూ ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వారికి తగిన బుద్ధిచెబుతామన్నారు.ఇదిలా ఉండగా.. కోవిడ్ పరిణామాల అనంతరం అమెరికాకు చైనాకు అక్రమ వలసలు పెరిగినట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో చైనీయులు.. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకొని.. అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో, కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే ట్రంప్ తాజాగా ఆరోపణలు చేశారు.మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనాకు షాకిచ్చారు. బ్యాటరీలు, ఈవీలు, స్టీల్, సోలార్ సెల్స్, అల్యూమినియంతో సహా చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ సుంకాలను విధించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100%, సెమీకండక్టర్లపై 50% సుంకం, చైనా నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై 25% సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కావాల్సింది చైనాతో వివాదం కాదు. పోటీ కావాలి అని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా చైనాతో పోటీ పడటానికి తాము మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. Biden claims he'll impose a 100% tariff on EVs made in China.He does not mention China barely relies on the U.S. for its EV sales (thanks to President Trump's Section 301 tariffs) and will simply manufacture vehicles in Mexico, then ship them into the U.S. pic.twitter.com/A0q97tgaUT— RNC Research (@RNCResearch) May 14, 2024 -
‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరగుతున్న యుద్ధాన్ని అమెరికా రిపబ్లిక్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం రెండో ప్రప్రంచ యుద్ధంతో అభివర్ణించారు. అమెరికా.. జపాన్పై బాంబులు వేసి యుద్ధం ముగించటం అప్పట్లో గొప్ప నిర్ణయమని అన్నారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్కు సైతం అమెరికా బాంబులు ఇస్తే హమాస్తో యుద్ధాన్ని ముగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లిండ్సే గ్రాహం మొదటి నుంచి ఇజ్రాయెల్ మద్దతుదారు.ఇజ్రాయెల్కు 3000 భారీ బాంబులు అందజేయటాన్ని నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెరల్ హార్బర్కు సంబంధించి అమెరికా జర్మనీ, జపాన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుపై విసిరి ఆ యుద్ధాన్ని ముగించింది. అది అప్పుడు చాలా గొప్ప నిర్ణయం. అదే విధంగా ఇజ్రాయెల్కు కూడా బాంబులు అందజేస్తే.. హమాస్తో యుద్ధం ముగిస్తుంది. ఇజ్రాయెల్ ఇంకా నష్టాన్ని భరించే స్థితిలో లేదు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేయవచ్చు’’ అని గ్రహం అన్నారు.ఇక.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్పై బాంబు వేయటం సరైన నిర్ణయమే అయితే.. ప్రస్తుతం ఇజ్రాయెల్ బాంబులు వేస్తే కూడా సరైన నిర్ణయమే అవుతుందని జోబైడెన్ను విమర్శించారు.ఇక.. రఫాలో యుద్ధం కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ సైన్యానికి ఇటీవల అమెరికా 3000 భారీ బాంబుల అందజేతను నిలిపివేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో గాజాలో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఇజ్రాయెల్కు బాంబులు అందించడాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్కు అమెరికా హెచ్చరిక.. ‘ఆయుధాల సరాఫరా నిలిపివేస్తాం’
న్యూయార్క్: గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా షాక్ ఇచ్చింది. రఫాలో దాడులకు దిగితే.. ఇజ్రాయెల్కు అయుధాలు సరాఫరా చేయబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం వార్నింగ్ ఇచ్చారు.‘‘ఇజ్రాయెల్ గాజాలోని రఫా నగరంలోకి అడుగు పెడితే.. ఆయుధాలు సరాఫరా నిలిపివేస్తాం. మధ్య ప్రాచ్యం నుంచి జరిగే దాడులను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్కు ఆయుధాలు సరాఫరా చేస్తాం. కానీ, రఫా నగరంపై దాడిచేస్తే.. ఆయుధాలు సరాఫరా నిలిపివేస్తాం’’ అని బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్కు పంపిన 2వేల పౌండ్ల బాంబుల సరాఫరాపై బైడెన్ స్పందిస్తూ.. అమెరికా సరాఫరా చేసే బాంబుల కారణంగానే గాజాలో పాలస్తీనా ప్రజలు మృతి చెందుతున్నారని తెలిపారు.రఫా నగరంలో ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవటం కోసం అగ్రరాజ్యం అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పది లక్షల జనాభా ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇంకా రఫా నగరంపై పూర్తిస్థాయిలో దాడులకు దిగలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు ఆయుధాల సరాఫరా చేయటంపై మరోసారి సమీక్ష జరుపుతామని అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.‘తమ ఆయుధాలతో ఇజ్రాయెల్ గాజాలో పౌరులపై దాడులతో ప్రాణాలు తీస్తోందని అమెరికా ఏడు నెలల తర్వాత గుర్తించింది. ఇప్పటివరకు 34, 789 మంది పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు’ అని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్ ఆరతి ప్రభాకర్. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్? ఆమె నేపథ్యం ఏంటంటే..ఇంజనీర్ కమ్ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్హౌస్లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్టీపీ) డైరెక్టర్ అండ్ సైన్స్ అడ్వైజర్గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్టీపీ డైరెక్టర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైట్హైస్లో అందించే సేవలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్ ఆఫీస్లో ల్యాప్టాప్ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్కి చాట్జిపిటి గురించి వివరించడంతోనే వెట్హౌస్లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్. ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. ఆమె నేపథ్యం..ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్లోని లుబ్బాక్లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ ఫెలోషిప్ను పూర్తి చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!) -
భారత్పై జో బైడెన్ షాకింగ్ కామెంట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ తమ దేశంలోకి విదేశీ వలసదారులను అనుమతించేందుకు భయపడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే భారత్ వంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధి వేగంగా లేదని చురకలించారు.కాగా, వాషింగ్టన్లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడుతూ.. భారత్, జపాన్, చైనా, రష్యా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ దేశాలు విదేశీ వలసదారులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు భయపడుతున్నాయి. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. కానీ, అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. ఈ కారణంగానే వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. Breaking news: "President Joe Biden calls Japan and India ‘xenophobic’ nations that do not welcome immigrants." Joe Biden comes out as a hardline pro-immigrant, pro-open border & pro-Chinese fentanyl President of the US! pic.twitter.com/yyTTHrvSeZ— Tan Vu (@TanVu327031160) May 2, 2024ఈ క్రమంలో భారత్, జపాన్, చైనా, రష్యా దేశాలను ‘జెనోఫోబిక్’ (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు. ఈ సందర్బంగా అమెరికాను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు బైడెన్. అయితే, ఎన్నికల సందర్బంగా బైడెన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా మిత్ర దేశాలైన భారత్, జపాన్ గురించి బైడెన్ తక్కువ చేసి మాట్లాడం సరికాదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అలాగే, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో ఉన్న భారతీయులపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. మరోవైపు.. బైడెన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది. బైడెన్ ఎంత గౌరవిస్తారో మా మిత్రదేశాలు, భాగస్వాములకు బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ.. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. జపాన్, భారత్తో మాకు బలమైన సంబంధాలున్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు.