-
బరితెగించిన టీడీపీ, జనసేన గూండాలు..
-
ఏపీలో రాక్షస పాలన.. రాష్ట్రం వదిలి వెళ్లిన కుటుంబాలు
-
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
మీకు ఓట్లు వేసిన వారికే విత్తనాలు ఇస్తారా..?
-
తొలి 100 రోజులు పాలనాపరమైన అంశాలపైనే దృష్టి
సాక్షి, అమరావతి: జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, ఇక్కడి నుంచి తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపైనే దృష్టిపెట్టాలని పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. శాసనసభ వ్యవహారాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు జనసేన పార్టీ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక క్యాంప్ కార్యాలయంలో పవన్కళ్యాణ్ జనసేన పార్టీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని ఎమ్మెల్యేలకు వివరించారు. పవన్ మాట్లాడుతూ.. జనసేన నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని, ఈ కార్యక్రమం అయిన తరవాత మీరు నియోజకవర్గస్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టి మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి, జనసేన నాయకులను అభినందించండి అని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల, దుర్గేష్ పాల్గొన్నారు. కాగా, బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించిన పవన్కళ్యాణ్ మంగళవారం ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యేక మాలధారణతో కూడిన పసుపు వ్రస్తాలు ధరించి పాల్గొన్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం దెబ్బతిందని, వ్యవస్థలు ఎలా నాశనమయ్యాయో వివరిస్తూ.. కీలక శాఖల్లోని వాస్తవాలను ప్రజల ముందుపెట్టేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తామని పవన్ చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని వివిధ స్థాయి ఉద్యోగుల సంఘాల నేతలు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వేర్వేరుగా కలిసి తమ సమస్యలు గురించి పవన్కు వివరించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, తాను వెంటనే అద్భుతాలు చేసేస్తాను అని చెప్పను గానీ.. ఉద్యోగుల వేదన వింటానని, వారి సూచనలను స్వీకరిస్తానని పవన్ చెప్పారు. -
పల్నాడులో టీడీపీ, జనసేన అరాచకం
-
కరుడుగట్టిన పసుపు యోధుడు
సాక్షి, అమరావతి: చింతకాయల అయ్యన్నపాత్రుడు కరుడు గట్టిన పసుపు యోధుడు, ఫైర్బ్రాండ్ అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా శాసనసభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమానపరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు. అయ్యన్నను స్పీకర్ పదవిలో చూడటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ సీఎం ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో వచ్చిన అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్రవేశారన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. సీఎంగానే సభలో అడుగుపెట్టా.. సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని 2021 నవంబర్ 19న సభ నుంచి బయటకువెళ్లానని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెట్టానని చంద్రబాబు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదన్నారు. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలన్నారు. 25 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయాల ప్రభావంతోనే నేడు హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచిందన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తిచేయడంతో పాటు, వికసిత్, పేదరికంలేని ఏపీని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా 2047 నాటికి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా చట్టసభ ముందుకు సాగాలన్నారు. ప్రజలు హుందాతనం చూస్తారు ఇన్ని రోజులు ప్రజలు అయ్యన్నలోని వాడివేడి చూశారని, ఇక మీదట హుందాతనం చూడబోతున్నారని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై తిట్టే అవకాశం ఆయనకులేదని, సభలో తిట్టే వారిని నిలువరించే బాధ్యత ఉందన్నారు. అయ్యన్నను స్పీకర్ చేయడం చూస్తుంటే అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్ను చేసినట్లుందన్నారు. గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ అయ్యన్నపాత్రుడు భయపడలేదని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. సు«దీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేశారని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.హుందాగా మాట్లాడాలి.. శాసనసభలో సభ్యులు హుందాతనంగా మాట్లాడాలి. ప్రస్తుత సభలో 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరందరికీ అవకాశాలిస్తాను. ప్రజలు, రాష్ట్రం కోసం అందరూ మాట్లాడాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ సభ సంప్రదాయాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలెంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ స్పీకర్హుందాగా నడపాలంటూనే జగన్పై అనవసర విమర్శలు.. గత శాసనసభను కౌరవ సభతో పోలుస్తూ.. ప్రస్తుత సభను హుందాగా నడపాలంటూ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే మంత్రులు అనిత, బీసీ జనార్థన్రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర సహా ఇతర సభ్యుల ప్రసంగాలన్నీ మాజీ సీఎం జగన్ నామస్మరణతోనే కొనసాగాయి. పదేపదే ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శించారు.నీతి వాక్యాలు వల్లెవేసిన అధికార పక్ష నాయకులే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభలోలేని ప్రతిపక్ష నేత పేరును పదేపదే ప్రస్తావిస్తూ అర్థరహిత విమర్శలు చేశారు. టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ స్పీకర్కు అభినందనలు చెప్పడం కంటే జగన్ను తూలనాడటంపైనే ఎక్కువగా దృష్టిసారించారు.అంతకుముందు.. సభను దూషణలు, వెకిలి చేష్టలతో కాకుండా గౌరవంగా నిర్వహించాలని కోరిన చంద్రబాబే.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పిరికితనంతో సభకు రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్ష సభ్యులకు సభకు వచ్చే ధైర్యంలేదని విమర్శించారు. విజయాన్ని తీసుకున్నారుగాని, ఓటమిని తీసుకోలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. -
కొత్త ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్
-
జనసేనకు కీలక పదవి
-
కొనసాగుతున్నవిధ్వంసం
ద్వారకాతిరుమల/తాడేపల్లిగూడెం/గోపాలపురం: అధికారమే అండగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో గురువారం కూడా యథేచ్ఛగా విధ్వంసం సాగించారు. ఏలూరు జిల్లాలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసంఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కిటికీ అద్దాలను పగులగొట్టాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డు సత్యనారాయణపేటలో టీడీపీ కార్యకర్తలు సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సత్యనారాయణ పేటలో రెండేళ్ల క్రితం రూ.9 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మించారు. తాజాగా ఈ శిలాఫలకాన్ని నాశనం చేశారు. ‘తూర్పు’లో శిలాఫలకం పగులకొట్టి.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సచివాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులకొట్టారు. అంతేకాకుండా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వెంకటాయపాలెం – గౌరీపట్నం రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తుప్పల్లో పడేశారు. దీంతో వెంకటాయపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పికెట్ ఏర్పాటు చేశామని ఎస్సై సతీష్కుమార్ తెలిపారు. -
దాడులు సరికాదు.. చంద్రబాబుకు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ
సాక్షి, విజయవాడ: టీడీపీ, జనసేన కార్యకర్తల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని వారిని దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు.. ప్రభుత్వంలో భాగస్వాములు.. వారికి అండగా ఉండి మానసికస్థైర్యం కల్పించాలని కోరారు.‘‘రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఉండవు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యం. రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారు. ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసే విధంగా ఉంది’’ అని బండి శ్రీనివాస్రావు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘అనంతపురంలో టీడీపీ నేత జేసి ప్రభాకర రెడ్డి.. రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్లను నా కొడకల్లారా.. నరుకుతా... అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం వారిని దూషించడాన్ని ఖండిస్తున్నాం. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబసభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డీఈ మన్నెం విజయ భాస్కరరావు ఇంటిలోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. విధినిర్వహణలో తప్పుచేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణం. ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం వంటివి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ లేఖలో బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
జనసేనలో చేరిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీకృష్ణపై అనర్హత వేటు
-
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్తో పవన్.. క్యాంపు ఆఫీసు పరిశీలన
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరుకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆఫీసు నిర్మాణం చేపట్టారు. పవన్ మెచ్చే విధంగా ఆయనకు నచ్చిన రంగుల్లో క్యాంపు ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఇదంతా చూసిన తర్వాతే ఆఫీసుకు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం.కాగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి మంగళవారం తన ఆఫీసును పవన్ పరిశీలించారు. ఆఫీసు నిర్మాణంలో భాగంగా భవనంలో పైన అంతస్తులో నివాసం, కింద కార్యాలయం ఏర్పాటు చేశారు. అదే భవనంలో సమావేశం మందిరం కూడా అందుబాటులో ఉండటంతో ప్లాన్కు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం. తన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా క్యాంపు ఆఫీసులో పవన్ మార్పులు సూచించడంతో అందుకు తగినే విధంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే ఆఫీసును వినియోగించుకున్నారు. మరోవైపు.. కాసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి పవన్ బయలుదేరారు. అలాగే, ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రభుత్వం భద్రత పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పవన్కు ప్రభుత్వం కేటాయించింది. ఇక.. రేపు పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై ఆగని దాడులు
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
నా మనసుకు దగ్గరైన శాఖలివి
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాకు కేటాయించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవే. ఈ శాఖలు ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నా. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నాకు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రతి ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన బలమైన అవగాహన ఉంది. సమస్యలను కళ్లారా చూశా. కాలుష్యమయమైన జల వనరులను.. తప్పని పరిస్థితుల్లో తాగునీరుగా వాడుకుంటున్న పల్లెవాసులను గమనించా. ప్రజలకు మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తా. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా చేయూతనిస్తా. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి బాసటగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తాం. అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతా. అడవుల వినాశనానికి పాల్పడినా, అందుకు ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కి పంపిస్తా.తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం’ అని పవన్ చెప్పారు. కాగా, జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలో చేరిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్లకు కేటాయించిన పౌరసరఫరాలు, పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం: కొట్టు సత్యనారాయణ
పశ్చిమగోదావరి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లు కరోనాతో పోరాడాం. ఐదేళ్లు పూర్తి స్థాయిలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశాం. కార్పొరేట్ విద్య ద్వారా దోచుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చాం. ప్రజలు సంక్షేమ పథకాలు ద్వారా సంతృప్తితో ఉన్నారని అనుకున్నాం. కానీ ప్రలోభాలకు గురి అవుతారని అనుకోలేదు...సంక్షేమ పథకాలు ద్వారా ఏడాదికి 70 వేల కోట్లు ఇచ్చేస్తూ ప్రభుత్వాన్ని అప్పుల పాలు అయిపోతుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతకుమించి హామీలు ఇచ్చారు. వాలంటీర్లను నానా మాటలు అని మేము వస్తే 10వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గెలిచిన వ్యక్తి గత ఎన్నికల్లో నా మీద 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంత మాత్రాన ఏమి అయిపోలేదు. ప్రజల కోసం మేమెప్పుడు పోరాడుతూనే ఉంటాం. ..2019లో ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చినా మేము విర్రవీగాలేదు, దాడులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మాధవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు నోరు లేని మూగజీవలు కోసం నిల్వ పెట్టుకున్న గడ్డివాములను జనసేన కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పటించారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత స్పష్టమైన మెజారిటీ కూటమి సాధించింది. రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది’’ అని అన్నారు.చదవండి: అధికారుల వల్లే నాడు టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పగలరా? -
రెడ్బుక్ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రత్యర్థులపై ఇటు ఆటవిక దాడులు కొనసాగిస్తూ అటు రాజ్యాంగాన్ని కాలరాసి నారా లోకేశ్ రాసుకున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలుకు రంగం సిద్ధమవుతోంది! రాష్ట్రవ్యాప్తంగా రెడ్బుక్ హోర్డింగ్ల ఏర్పాటుతో తాము మరింతగా కొనసాగించనున్న విధ్వంసకాండ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను టీడీపీ నిర్భీతిగా చాటింపు వేస్తోంది. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ ఆ కుట్రకు సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా తెర తీయడం విస్తుగొలుపుతోంది. ఐఏఎస్ అధికారులే లక్ష్యంగా బ్లాక్ మెయిలింగ్, వేధింపులకు ఆయన శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేసే అధికారులను పనితీరు మదింపు నివేదికల పేరుతో లొంగదీసుకోవడం, అనంతరం తమ అక్రమాలకు వారిని సాధనంగా చేసుకోవడమే లక్ష్యంగా ఈ కుట్రకు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న విపరిణామాలు, అక్రమాలు, బీభత్సకాండకు అధికార యంత్రాంగంతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలి చ్చారు. ఒకవైపు తమకు ఓటేయనివారు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తూ మరోవైపు అధికార యంత్రాంగాన్ని సొంత అజెండా అమలుకు వాడుకునేందుకు సన్నద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అటు వ్యాజ్యాలు.. ఇటు వార్నింగ్లు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మంత్రి నారా లోకేశే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్ ఫోటోలతో రెడ్బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేసి టీడీపీ సర్కారు భయోత్పాతం సృష్టిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ నాయకుడి ఫొటోలతో హోర్డింగ్లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. టీడీపీ మాత్రం ‘రెడ్ బుక్’ పేరుతో హోర్డింగ్లు ఏర్పాటు చేయడం వారి హింసాత్మక ప్రవృత్తిని బట్టబయలు చేస్తోంది. మంగళగిరి, విజయవాడ, గుంటూరుతోపాటు రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఈ హోర్డింగులు వెలిశాయి. ఎన్నికలకు ముందే ‘రెడ్బుక్’ పేరుతో అధికారులపై లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. నిబంధనల మేరకు వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అందరి పేర్లు రెడ్బుక్లో రాస్తున్నానని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంగతి తేలుస్తానని, అంతు చూస్తానని హెచ్చరించారు. అఖిల భారత స ర్విసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను ఇలా బ్లాక్మెయిల్ చేయడం సరికాదని అప్పట్లోనే రాజకీయ పరిశీలకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కూడా కొనసాగుతున్నాయి. వీటిని బేఖాతర్ చేస్తూ టీడీపీ తన కుట్రలకు పదును పెడుతోంది. పచ్చముఠాల విధ్వంసకాండ బీజేపీతో పొత్తును ఆసరాగా చేసుకుని టీడీపీ రౌడీమూకలు ఎన్నికలకు ముందే విధ్వంసకాండకు తెరతీశాయి. సమర్థంగా పని చేస్తున్న పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్(ఈసీ) ద్వారా బదిలీ చేయించి మరీ గూండాగిరీకి పాల్పడ్డాయి. పోలింగ్ ముందు రోజు, అనంతరం దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టి విరుచుకుపడ్డాయి. బాంబు దాడులకు దిగాయి. ఎన్నికల్లో విజయం సాధించాక టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. టీడీపీ గూండాల విధ్వంసకాండతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు గ్రామాలను విడిచి వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఎన్నికల విధుల కోసం వచ్చిన కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రంలో ఉండగానే పరిస్థితిలా ఉంటే.. తర్వాత ప్రభుత్వ పెద్దలు ఎలా వ్యవహరించనున్నారో స్పష్టమవుతోంది. వేధించే పన్నాగం అఖిలభారత సర్విసు అధికారులపై రాజకీయ ముద్ర వేసి వేధించాలని ఎన్నికల ముందే రూపొందించిన కుట్ర అమలుకు సన్నద్ధం కావడం ప్రభుత్వ పెద్దల దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినని చెప్పుకుంటూ నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు అఖిలభారత సర్విసు అధికారుల విధి విధానాల గురించి పూర్తిగా తెలుసు. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు మారుతుంటాయి గానీ రాష్ట్రానికి కేటాయించిన అఖిల భారత సర్విసు అధికారులు కొనసాగుతుంటారు. వారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటూ మంచి పరిపాలన అందించడం ప్రభుత్వం బాధ్యత. అందుకు విరుద్ధంగా చంద్రబాబు రాజకీయ కక్షతోనే కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడేందుకు సిద్ధమవుతుండటం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన కొందరు అధికారులను కలవకుండా వెనక్కి పంపారు. కొందరు అధికారులు ఇచ్చిన పూల బొకేలను సైతం తీసుకునేందుకు తిరస్కరించారు. ఇక తనను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినట్టుగా లేవని పరిశీలకులంటున్నారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు అన్యాయంగా ఉందని సీఎం నిందలు వేశారు. తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడటం లేదంటూనే తన అక్కసునంతా వెళ్లగక్కి వ్యక్తిగత అజెండాను బయటపెట్టారు. కక్ష సాధింపులుండవంటూనే కొందరు అధికారులు టార్గెట్గా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. సమాచార సేకరణలో బాబు బృందం అఖిల భారత సర్విసు అధికారులను వేధించే కుట్రకు చంద్రబాబు తెరతీశారు. తమవారు ఎవరు? పరాయి వారు ఎవరు? అనే సమాచారం సేకరించాలని తన బృందాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి రాష్ట్రస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు సమాచారాన్ని సేకరించే పనిలో చంద్రబాబు బృందం నిమగ్నమైంది. ఆ విషయాన్ని టీడీపీ వర్గాలు బహిరంగంగానే వెల్లడిస్తున్నాయి. తద్వారా అధికారులను బ్లాక్మెయిల్ చేయాలన్నది అసలు ఉద్దేశం.నిబంధనలకు విరుద్ధంగా తాము పురమాయించే పనులు చేసేలా లొంగదీసుకునే కుట్రతో ఈ తతంగాన్ని సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఐదేళ్లూ తాము ఏం చెబితే అదే చేయాలి! నిబంధనలు ఉటంకిస్తూ అభ్యంతరాలు చెప్పకూడదు! అనే సందేశాన్ని దీని ద్వారా ఇవ్వనున్నారు. అందుకు సమ్మతించే అధికారులకే పోస్టింగులిస్తామని, లేదంటే వేధిస్తామని చెబుతుండటం చంద్రబాబు కుట్రను బట్టబయలు చేస్తోంది. ఇదేనా పెద్దరికం? ప్రభుత్వ పెద్దననే విషయాన్ని మరచిపోయి సీఎం చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో లోకేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డి ఆ శాఖ అధిపతిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆయన నిబంధనల మేరకే విధులు నిర్వర్తించారు. అయితే చంద్రబాబు రాజకీయ కారణాలతో సీఎస్గా ఉన్న జవహర్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవాస్తవ ఆరోపణలు చేశారు. ఆయన్ను బదిలీ చేయాలని ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేపోవడంతో ఈసీ ఆయన్ను బదిలీ చేయలేదు. ఎన్నికల ముందు సామాజిక పెన్షన్ల పంపిణీలోనూ ఈసీ ఆదేశాలనే ఆయన పాటించారు.అయినా సరే చంద్రబాబు ఆయనపై చిందులు తొక్కారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాక సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే జవహర్రెడ్డిని సెలవుపై వెళ్లిపోవాలని ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ నెలాఖరున జవహర్రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. తాను బాధ్యతలు స్వీకరించే నాటికి జవహర్రెడ్డి విధుల్లో ఉండకూడదని చంద్రబాబు పట్టుబట్టి మరీ వేధించడం గమనార్హం. బాబు పేషీ అధికారులకూ జగన్ కీలక పోస్టింగ్లు2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జగన్ తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పోస్టింగులిచ్చారు. చంద్రబాబు పేషీలో పనిచేసిన సాయిప్రసాద్ను కీలకమైన సీసీఎల్ఏగా నియమించారు. ఆయన పేషీలో పనిచేసిన అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు–భవనాలు, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల బాధ్యతలు అప్పగించారు. టీడీపీ హయాంలో ఆర్థిక శాఖలో పనిచేసిన అధికారులనే జగన్ తన ప్రభుత్వ హయాంలోనూ కొనసాగించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేతిలో చేతిలో కాగితాన్ని బలవంతంగా లాక్కున్న ఐఏఎస్ అధికారికి కూడా కీలకమైన పోస్టింగ్ ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. జగన్ ఓడాడు.. ఇంకా చావలేదు! అయ్యన్న విద్వేష వ్యాఖ్యలు ‘‘జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదు’’ అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘వాడు ఓడిపోయాడు కానీ చావలా..! అపారమైన ధన బలం ఉంది.. కుల బలం ఉంది.. పక్కన తెలంగాణ ప్రభుత్వంలో వీడి మనుషులు ఉన్నారు’ అని ఓ వ్యక్తి అందులో అయ్యన్నతో వ్యాఖ్యానించాడు. దీనిపై అయ్యన్న ప్రతిస్పందిస్తూ.. ‘చచ్చేదాక కొట్టాల! ఈయన చెప్పింది కరెక్టే. ఓడిపోయాడు కానీ చావలేదు. చాలా మంచి డైలాగ్ ఇది’ అని పేర్కొన్నారు. ఓడిపోయాడు కానీ చావలేదనే డైలాగ్ తనకు బాగా నచ్చిందంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. పామును చచ్చేవరకు కొట్టాలనే డైలాగ్ను తాను బయట మాట్లాడేటప్పుడు వాడతానంటూ తన నైజాన్ని చాటుకున్నారు. -
సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలికి సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా గెలిచిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ చైతన్యానికి నిలయమైన తెనాలి నుంచి ఎందరో రాజకీయ ఉద్దంఢులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా సమర్థత నిరూపించుకున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి మంత్రి పదవులను చేపట్టినవారు కొందరే. నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కేవలం నలుగురు మాత్రమే మంత్రి పదవులను చేపట్టారు. అందులో ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించగా, మరొకరు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నల్లారి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో అప్పటి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. 2004, 2009 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాదెండ్ల మనోహర్ ఆ రెండు ఎన్నికల్లోనూ తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాదెండ్ల మనోహర్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లైబ్రరీ కమిటీ చైర్మన్ పదవి వరించింది. తర్వాత క్యాబినెట్ హోదాతో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. నల్లారి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిని నిర్వర్తించారు. అనంతర రాజకీయ పరిణామాలతో వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో జనసేన అభ్యరి్ధగా తెనాలి నుంచి పోటీచేసిన నాదెండ్ల మనోహర్, ఆ రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 వచ్చేసరికి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. జనసేన పీఏసీ చైర్మన్గా జనసేన, టీడీపీల మధ్య పొత్తులో మనోహర్ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. బీజేపీతో కూడా పొత్తు కుదరటంతో జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేసి, అధికారాన్ని చేపట్టాయి. జనసేనలో నెంబర్ టూ అయిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కు సహజంగానే మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. ఆ ప్రకారంగానే గన్నవరం ఐటీ పార్కులో బుధవారం అట్టహాసంగా జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మనోహర్కు కీలక మంత్రిత్వ శాఖ లభిస్తుందనేది కూడా వాస్తవమే. 2009–14 మధ్య అసెంబ్లీ స్పీకర్గా చేసిన నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత విభజిత ఆంధ్రపదేశ్కు తెనాలి నుంచి తొలిగా మంత్రి పదవిని చేపట్టిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కావటం మరో విశేషం! 1952 ఎన్నికల్నుంచి తెనాలిలో మూడుసార్లు పోటీచేసి గెలిచిన ఆలపాటి వెంకట్రామయ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా మూడు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 1989లో తెనాలి నుంచి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి విజయం సాధించినా, డాక్టర్ చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. 2009లోనూ మళ్లీ విజయాన్ని నమోదు చేసింది. ఆ రెండుసార్లు తెనాలి నుంచి కాంగ్రెస్ తరçపున ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ స్పీకర్గా చేశారు. మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా నియమితులయ్యారు. -
Big Question: ప్రమాణ స్వీకారం పూర్తి.. మరి లెక్క సరిపోతుందా ?
-
పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు
-
పిఠాపురంలో సీన్ రివర్స్
-
ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్కు కూడా చాన్స్ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. మంత్రుల జాబితాను గవర్నర్కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఏపీ కేబినెట్ ఇదే.. 1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన–కాపు) 3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ) 4. కొల్లు రవీంద్ర (బీసీ) 5. నాదెండ్ల మనోహర్ (జనసేన–కమ్మ) 6. పి.నారాయణ (కాపు) 7. వంగలపూడి అనిత (ఎస్సీ) 8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ–బీసీ) 9. నిమ్మల రామానాయుడు (కాపు) 10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (మైనారీ్ట) 11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 12. పయ్యావుల కేశవ్ (కమ్మ) 13. అనగాని సత్యప్రసాద్ (బీసీ) 14. కొలుసు పార్థసారధి (బీసీ 15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 16. గొట్టిపాటి రవి (కమ్మ) 17. కందుల దుర్గేష్ (జనసేన–కాపు) 18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 19. బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి) 20. టీజీ భరత్ (వైశ్య) 21. ఎస్.సవిత (బీసీ) 22. వాసంశెట్టి సుభాష్ (బీసీ) 23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ) 24. మండిపల్లి రామ్ ప్రసాద్రెడ్డి (రెడ్డి) 25. నారా లోకేశ్ (కమ్మ) -
కక్ష సాధింపులు వద్దు
-
డిప్యూటీ సీఎంగా పవన్కళ్యాణ్..!
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా సభలో అడుగు పెడతామని చెప్పడంతో పలు ఊహాగానాలు సాగాయి. అయితే తాజాగా పవన్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చలో దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనతోపాటు జనసేన నుంచి గెలిచిన మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కోరగా చంద్రబాబు అందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో ఒకటి నాదెండ్ల మనోహర్కి దక్కడం ఖాయమని చెబుతున్నారు. మిగిలిన పదవులకు కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.ఉమ్మడి జిల్లాల వారీగా పదవులు చంద్రబాబు ఉమ్మడి జిల్లాల వారీగానే మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నారా లోకేష్ మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, కూన రవికుమార్, కొండ్రు మురళి రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినందున అచ్చెన్నాయుడికి ఇవ్వటంపై సందిగ్దం నెలకొంది. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పితాని సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర పేర్లను పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణల్లో ఒకరిద్దరికి అవకాశం లభించనుంది. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, బాల వీరాంజనేయస్వామి పోటీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, కిశోర్ కుమార్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వర్రెడ్డిలో ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.నేడు టీడీపీ శాసన సభాపక్ష సమావేశంటీడీపీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరగనుంది. సమావేశంలో చంద్రబాబును తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.