-
‘నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాన్న’!
ఐఫోన్! పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యాపిల్ తయారు చేసిన ఐఫోన్లను అంటే మక్కువ. కానీ సెలబ్రిటీలు ఐఫోన్ను కొనుగోలు చేస్తున్నా దాని ధర కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అలాంటి కాస్ట్లీ ఐఫోన్ని కావాలని ఓ 11 ఏళ్ల అమ్మాయి మారం చేస్తోంది. అందుకు ఆ చిన్నారి తండ్రి ఏం చేశాడు. గత దశాబ్దకాలంగా లేటెస్ట్గా మార్కెట్లో విడుదలవుతున్న గాడ్జెట్లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ పిల్లలు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో యాపిల్ తయారు చేసిన ఐఫోన్తో పాటు ఇతర ఉత్పత్తులు ప్రత్యేకం. నాకు ఐఫోన్ 15 కావాలి తాజాగా, ఓ తండ్రిని తన 11 ఏళ్ల కుమార్తె ఐఫోన్ 15 కొనిపెట్టమని అడిగింది. అందుకు అతను సున్నితంగా తిరస్కరించాడు. అంత ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే కుమార్తె అడిగింది కదా.. పోనీలే అని కెమెరా పనితనం, బ్యాటరీ లైఫ్టైం బాగుందనే ఉద్దేశ్యంతో ఐఫోన్ 13 ఫోన్ని కొనుగోలు చేస్తానని మాటిచ్చాడు. ఐఫోన్ 13 కొనిస్తా నాన్న అందుకు కుమార్తె ససేమిరా అన్నది. ‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు నా పాత ఐఫోన్ 8ని ఇచ్చాను. ఆ ఫోన్తో తన స్నేహితులతో మాట్లాడుకునేందుకు, సోషల్ మీడియాను వాడుతుంది. ఇటీవల ఆమె స్నేహితులు కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. తనకి కూడా కొత్త ఫోన్ కావాలని మారం చేస్తోంది. నా ఫోన్ పాతది. నా స్నేహితులు కొత్త ఫోన్లు కొనుక్కున్నారు. నా క్కూడా కొత్త ఫోన్ కొనిపెట్టమని అడుగుతుంది. సరే నా కూతురు ఫోన్ అడిగిందని ఐఫోన్ 13ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డా. ఇతర లేటెస్ట్ ఐఫోన్ సిరీస్లు ఎలా ఉన్నాయో.. ఆ ఫోన్ కూడా అలాగే ఉంది. ధర కూడా 600 డాలర్లు. అయితే, ఆఫోన్ 120హెచ్జెడ్ డిస్ప్లే ఉందని, గేమ్స్ ఆడుకునేందుకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ని కోరుకుంటుంది. ఆ ఫోన్ కూడా అంతే 120 హెచ్జెడ్ డిస్ప్లేగా ఉందిగా. ఐఫోన్ 15 కొనడం డబ్బు వృధా అని భావించాను. కానీ నా నిర్ణయాన్ని నా 11 ఏళ్ల కుమార్తె విభేదించింది. మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటోంది. గడుగ్గాయ్.. చివరికి అనుకున్నది సాధించింది ‘నా కుమార్తె గేమర్. పాతది అయినందున తన ఫోన్ సరిగ్గా గేమ్ చేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె ఐఫోన్ 13ని కొనిస్తానని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ఆమె ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని మొండిగా ప్రవర్తిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ సోషల్ మీడియాలో వాపోయాడు తండ్రి. చివరికి తన కుమార్తెకు ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోని కొనిచ్చి సంతోష పెట్టిందని అన్నాడు. ఈ పోస్ట్పై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సు అంత ఖరీదైన ఫోన్ కొనొద్దని, పిల్లలకు అతిగారాభం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
ఐఫోన్ల కోసం ఓ కీబోర్డ్.. అదెలా పనిచేస్తుందంటే?
స్మార్ట్ఫోన్లోని టచ్స్క్రీన్ కీబోర్డు మీద టైప్చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్ఫోన్కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్ కంపెనీ క్లిక్స్ టెక్నాలజీ రూపొందించింది. తొలిప్రయత్నంగా ఐఫోన్–15 మోడల్కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్రైటర్, డెస్క్టాప్, లాప్టాప్ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్ఫోన్లో సులువుగా టైప్ చేయడానికి వీలవుతుంది. ఈ ఏడాది లాస్ వేగస్లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. -
ఐఫోన్ 16 సిరీస్ డిజైన్లు.. తెరపైకి మరో రూమర్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఇప్పటికే గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసిన యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ను మార్కెట్కు పరిచయం చేయనుంది. అయితే, ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ డిజైన్పై రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 16తో తీసుకునే ఫోటోలు, వీడియోల కోసం యాపిల్ సంస్థ కొత్త బటన్పై పనిచేస్తుందని, ప్రోటోటైప్లపై దాని వినియోగం ఎలా ఉందో పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ బటన్ను ఐఫోన్లపై అమర్చితే సింగిల్ క్లిక్తో ఫోటోలు, వీడియోలు తీసుకునే వెసులు బాటు కలగనుంది. నివేదిక ప్రకారం.. కెమెరా బటన్ ఫోన్కు కుడి దిగువన ఉండవచ్చని, అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో ఫోటోలు ,వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా, గత సంవత్సరం సెప్టెంబర్లో లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ను పాత ఫోన్ సిరీస్ల కంటే భిన్నంగా మ్యూట్ బటన్ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్తో వచ్చింది. మాక్ రూమర్స్ ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్లో ప్రాజెక్ట్ నోవా పేరుతో కొత్త కెమెరా బటన్ మెకానికల్కు బదులుగా కెపాసిటివ్ బటన్గా ఉంటుందని అంచనా వేయబడింది. ఐఫోన్ ఎస్ఈ లోని హోమ్ బటన్ను పోలి ఉండేలా కొత్త బటన్ ఉండవచ్చని తెలుస్తోంది. -
‘సంపాదన తగ్గింది’.. సీఈఓ టిమ్కుక్కు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు వచ్చే ఆదాయం తగ్గడంతో ఆ సంస్థ సీఈఓ టిమ్కుక్ సంపాదించే సంపాదన తగ్గించింది. 2022తో పోలిస్తే 2023లో ఆయన సంపాదన భారీగా తగ్గినట్లు యాపిల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. టిమ్కుక్ గత ఏడాది భారీ మొత్తంలో సంపాదించారని, కానీ అది 2022లో కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో ఆయన సంపాదించిన మొత్తం 99.4 మిలియన్లు కాగా 2023లో 63.2 మిలియన్లగా ఉందని నివేదికలో పేర్కొంది. రిపోర్ట్లో ఏముందంటే? ఇటీవల యాపిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అందులో టిమ్ కుక్కు అందించే పరిహారం, షేర్ హోల్డర్స్ సలహాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మార్పులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించింది. అందులో యాపిల్ సీఈఓ సంపాదన తగ్గినట్లు హైలెట్ చేసింది. టిమ్కుక్ విమాన ఖర్చులు యాపిల్ 2022లో సీఈఓ కుక్కి అందించే శాలరీ, స్టాక్ అవార్డ్స్, నాన్ ఈక్విటీ బోనస్ (పరిహారం) 84 మిలియన్లగా నిర్దేశించింది. అయితే అతను అంచనాలను మించి 99.4 మిలియన్లను సంపాదించాడు. కానీ 2023కి కుక్ పరిహారం 40 శాతం తగ్గి 49 మిలియన్లకు పడిపోయింది. కుక్ అందించే పరిహారంలో 3 మిలియన్ల జీతం, స్టాక్ అవార్డులు మొత్తం 46,970,283 డాలర్లు, నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్ పరిహారం మొత్తం 10,713,450 డాలర్లు, ఇతర పరిహారం 2,526,112 డాలర్ల వరకు పొందారు. 2023లో కుక్ కోసం యాపిల్ వ్యక్తిగత విమాన ప్రయాణ కోసం 1,621,468 డాలర్లు ఖర్చు చేసిందని, 2022లో వెచ్చించిన మొత్తం కంటే రెండింతలు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. కంపెనీ కుక్ కోసం వ్యక్తిగత భద్రత కోసం 820,309 డాలర్లు పెట్టుబడి పెట్టింది యాపిల్ సగటు ఉద్యోగి వేతనం ఎంతంటే? 2023లో తన సగటు ఉద్యోగికి సగటు వార్షిక మొత్తం పరిహారం 94,118 డాలర్లు అని యాపిల్ తెలిపింది. ఇక టిమ్కుక్తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటీవ్లకు యాపిల్ భారీ మొత్తాన్ని అందించింది. వారిలో సీఎఫ్ఓ లూకా మాస్త్రి : 26,935,883 డాలర్లు జనరల్ కౌన్సెల్ అండ్ సెక్రటరీ కేట్ ఆడమ్స్ : 26,941,705 డాలర్లు రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రెయిన్ : 26,937,010 డాలర్లు సీఓఓ జెఫ్ విలియమ్స్ : 26,961,221 డాలర్లను అందిచినట్లు యాపిల్ తన నివేదికలో వెల్లడించింది. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త.. నష్టపరిహారం చెల్లిస్తున్న యాపిల్!
మీరు పాత ఐఫోన్లను వినియోగిస్తున్నారా? వాటిల్లో ఏమైనా బ్యాటరీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ తరహా ఇబ్బందులు తలెత్తుంటే ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నష్టపరిహారం చెల్లిస్తుంది. సుమారు 8 ఏళ్ల క్రితం నమోదైన యాపిల్పై ‘బ్యాటరీగేట్’ క్లాస్-యాక్షన్ లాసూట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఐఫోన్లను వినియోగిస్తుంటే యాపిల్ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. అసలేంటి యాపిల్ ‘బ్యాటరీగేట్’ వివాదం 2016లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, 7 సిరీస్తో పాటు ఎస్ఈ మోడల్ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐఫోన్ సిరీస్ మోడళ్లు స్లో అవ్వడంతో వాటిని ఆపరేట్ చేయలేపోతున్నామంటూ అమెరికాకు చెందిన సుమారు 33 రాష్ట్రాల యూజర్లు మూకుమ్మడిగా సంబంధిత రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు. యాపిల్ సంస్థ ధనార్జన కోసం కావాలనే తమ ఫోన్లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిందని, తద్వారా మేం వినియోగించే ఫోన్లు పనిచేయడం మందగిస్తే.. కొత్త ఫోన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కొనుగోలు చేస్తే ఐఫోన్ల అమ్మకాలు జరిగి.. యాపిల్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. యాపిల్ అనాలోచిత నిర్ణయం వల్లే వినియోగదారుల హక్కుల కోసం పోరాడే జస్టిన్ గుట్మాన్ సైతం యాపిల్కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్లతో పాటు పవర్ మేనేజ్మెంట్ టూల్ వల్ల ఐఫోన్లు అకస్మాత్తుగా షట్డౌన్ అవ్వడం, బ్యాటరీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. యాపిల్ నిర్ణయంతో ఐఫోన్ 6, 6ప్లస్, 6 ఎస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ,7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ను వినియోగిస్తున్న యూకేలో 25 మిలియన్ల ఐఫోన్ యూజర్లకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం విలువ 768 మిలియన్లని కోర్టుకు ఆధారాల్ని అందించారు. తెరపైకి బ్యాటరీగేట్ వివాదం ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసేలా.. యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఉద్దేశపూర్వకంగా ప్రాసెసర్ పనితీరు మందగించేలా వ్యవహరించిందని తెలిపేలా ‘బ్యాటరీగేట్’ అనేపదాన్ని అనే పదాన్ని రూపొందించారు. ‘బ్యాటరీగేట్’ పేరును ట్రెండింగ్లోకి తెచ్చారు. బాధిత యూజర్లకు 92 డాలర్ల నష్టపరిహారం ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. వినియోగదారుల ఫిర్యాదు దెబ్బకు యాపిల్ దిగొచ్చింది. 2020లో బాధిత యూజర్లకు 500 మిలియన్ల నష్టపరిహారం చెల్లిస్తామని అంగీకరించింది. ఒప్పందం ప్రకారం.. యాపిల్ ఇటీవల ప్రతి ఒక్క బాధిత యూజర్కు 92 డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్లలో టెలిఫోటో లెన్స్లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్ను డిస్కౌంట్పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్ను అమెజాన్లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
టెక్ దిగ్గజం యాపిల్ను గడగడలాడిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ను గడగడలాడిస్తున్నాడా? తమ దేశం కాదని ఇతర దేశాల్లో యాపిల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జిన్ పింగ్ నిర్ణయాలను చూస్తుంటే. ఇటీవల జిన్ పింగ్ ప్రభుత్వం దేశంలో మేడిన్ ఇన్ చైనా ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఐఫోన్లాంటి ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులను దేశంలో వినియోగించడాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డ్రాగన్ కంట్రీ స్థానికంగా తయారవుతున్న విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థలైన బ్యాంక్లు ఇతర రంగాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే సాఫ్ట్వేర్లను దేశీయ సంస్థల నుంచి పొందాలని, అదే సమయంలో సెమీ కండక్టర్ పరిశ్రమ వృద్దిలో పాలు పంచుకోవాలని కోరింది. ఈ తరుణంలో కనీసం ఎనిమిది ప్రావిన్సుల్లోని పలు రాష్ట్ర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఉద్యోగులు స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. అంతవరకూ బాగున్నా..ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఉన్న జెజియాంగ్, షాన్డాంగ్, లియోనింగ్, సెంట్రల్ హెబీ వంటి ప్రావిన్సులకు చెందిన నగరాల్లోని సంస్థలు, ఏజెన్సీలకు ఈ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. మేడిన్ ఇన్ చైనా నినాదం దేశ వ్యాప్తంగా అమలు చేయాలి గానీ.. కేవలం ఐఫోన్ తయారీ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయడం ఏంటని ఐఫోన్ లవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సెప్టెంబర్ నెలలో కనీసం మూడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని సిబ్బందికి కార్యాలయాల్లో ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. చివరిగా ఐఫోన్ల బ్యాన్ అంశంపై యాపిల్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
యాపిల్కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్బెర్గ్కి వెల్లడించాయి. యాపిల్కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్వేర్ ఎగ్జిక్యూటివ్లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
‘చైనాకి యాపిల్ మరో భారీ షాక్!’
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీపై ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేని యాపిల్ భారత్లో మరో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను టాటా గ్రూప్ నెలకొల్పనుంది. ఈ ఏడాది అక్టోబర్లో కర్ణాటక కేంద్రంగా భారత్లో ఐఫోన్లను తయారు చేసే విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను టాటా గ్రూప్ 125 మిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తమిళనాడు హోసుర్ కేంద్రంగా టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా రెండో ఐఫోన్ తయారీ యూనిట్ను ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలిపింది. ఈ ఫ్యాక్టరీలో టాటా గ్రూప్ కనీసం 20 లైన్లో ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుందని బ్లూంబెర్గ్ నివేదికలో పేర్కొంది. ఇక ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ 12 నెలల నుంచి 18 నెలల లోపల అందుబాటులోకి రానుందని అంచనా. చైనాకు భారీ షాక్ టెక్ దిగ్గజం యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా చైనా కాకుండా మిగిలిన దేశాలైన భారత్, థాయిలాండ్, మలేషియాలలో ఐఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత్కు చెందిన టాటా కంపెనీ ఐఫోన్లు తయారు చేసుకునేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే భారత్లోని కర్ణాటక కేంద్రంగా ఐఫోన్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తున్న విస్ట్రాన్ కార్పొరేషన్ను టాటా కొనుగోలు చేసేలా పావులు కదిపింది. ఈ తరుణంలో విస్ట్రాన్ కాకుండా.. టాటానే సొంతంగా ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేలా యాపిల్.. టాటా గ్రూప్ను ప్రొత్సహించింది. ఆ చర్చలు చివరి దశకు రావడం.. దేశీయంగా టాటా మరో ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని బ్లూమ్బర్గ్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం! -
రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత!
ప్రపంచంలోనే నంబర్వన్ బ్రాండ్గా ఎదిగిన యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఒక సంతకం విలువ ఏకంగా రూ.20 లక్షలు! అవును.. ఇది నిజమే 47 ఏళ్లు నాటి చెక్కుపై ఆయన పెట్టిన సంతకం కోసం తన అభిమానులు ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. కేవలం నాలుగు డాలర్లు(రూ.333) రాసిఉన్న ఆ చెక్కుకు ఎందుకు అంత క్రేజో తెలుసుకుందాం. ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ అనే సంస్థ తాజాగా ఓ చెక్కును వేలానికి ఉంచింది. ఇప్పటికే ఈ చెక్కును కొనేందుకు అనేక మంది బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ప్రకారం చూస్తే.. ఈ చెక్కు 25,000 వేల డాలర్ల (రూ.20 లక్షలకు పైనే)కు అమ్ముడయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ఆ చెక్కుపై 4 డాలర్లే రానుండడం విశేషం. ప్రస్తుతం డాలర్ విలువతో పోలిస్తే దాని విలువ కేవలం రూ.333గా ఉంది. 1976లో కాలిఫోర్నియాలో స్టీవ్జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి యాపిల్ సంస్థను స్థాపించారు. యాపిల్-1 కంప్యూటర్ కోసం వీరిద్దరూ పనిచేస్తున్న సమయంలో అదే ఏడాది జులై 23న జాబ్స్ ఓ చెక్కుపై సంతకం చేశారు. తాజాగా అమెరికాకు చెందిన ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ సంస్థ స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన ఈ చెక్కును ఇటీవల వేలానికి ఉంచింది. వేలం ప్రక్రియ డిసెంబరు 6న ముగియనుంది. అయితే ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ఆధారంగా చూస్తే స్టీవ్ సంతకానికి రూ.20 లక్షలకు పైనే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్ ఇంతకీ స్టీవ్ జాబ్స్ చేసిన సంతకానికి ఎందుకంత క్రేజ్ అనే సందేహం రావొచ్చు. సాధారణంగా జాబ్స్ ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చేవారు కాదట. దాంతో ఆయన పూర్తి పేరుతో చేసిన సంతకం కావడంతో ఈ చెక్కుకు ఇంత క్రేజ్. ఇప్పటికే స్టీవ్ జాబ్స్కి సంబంధించిన అనేక వస్తువులను ఎన్నో సంస్థలు వేలానికి పెట్టాయి. యాపిల్ సంస్థ ప్రకటన కోసం ఆయన రాసిన పత్రాన్ని వేలం వేయగా.. 1,75,759 డాలర్ల(రూ.1.45 కోట్లు)కు అమ్ముడయింది. -
దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే.. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది. -
180 ఎకరాల విస్తీర్ణంలో జపాన్ కంపెనీ ప్లాంట్.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: ఐఫోన్లకు కావాల్సిన బ్యాటరీలను సరఫరా చేస్తున్న జపాన్ కంపెనీ టీడీకే భారత్లో లిథియం అయాన్ సెల్స్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హర్యానాలోని మనేసర్ వద్ద 180 ఎకరాల విస్తీర్ణంలో ఇది రానుంది. దశలవారీగా ఈ కేంద్రానికి కంపెనీ రూ. 6,000–7,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేనాటికి సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మేడిన్ ఇండియా ఐఫోన్లలో వాడే బ్యాటరీల కోసం ఈ ప్లాంటులో సెల్స్ను తయారు చేస్తారని మంత్రి తెలిపారు. అయితే తయారీ కేంద్రం స్థాపనకై పర్యావరణ అనుమతి కోసం టీడీకే వేచి చూస్తోందని సమాచారం. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ఉన్న చైనాకు చెందిన యాంపీరెక్స్ టెక్నాలజీని (ఏటీఎల్) 2005లో టీడీకే కొనుగోలు చేసింది. అనుబంధ కంపెనీ అయిన నవిటాసిస్ ఇండియా ద్వారా భారత్లో ఏటీఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రీచార్జేబుల్ బ్యాటరీ ప్యాకేజ్లను హర్యానాలోని బావల్ వద్ద ఉన్న ప్లాంటులో నవిటాసిస్ తయారు చేస్తోంది. -
లాంచ్కు ముందే వివరాలు లీక్.. ఐఫోన్ 16 ఇలాగే ఉంటుందా!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తున్న యాపిల్.. ఐఫోన్ 16 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. విడుదల చేయడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే దీనికి సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 డిజైన్, కెమెరా, చిప్సెట్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డిజైన్ లీకైన సమాచారం ప్రకారం, రానున్న కొత్త ఐఫోన్ సాలిడ్-స్టేట్ బటన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ దీనిని ఐఫోన్ 16 ప్రో మోడల్లలో క్యాప్చర్ బటన్గా అందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, స్పర్శను వంటి వాటిని గుర్తించేలా ఉంటుంది. డిస్ప్లే 2024లో విడుదల కానున్న కొత్త ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్, ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ స్క్రీన్ను కలిగి ఉండవచ్చు. కాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్క్రీన్లు వరుసగా 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా రాబోయే ఈ కొత్త మోడల్స్ శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్ కలిగి.. బ్లూ ఫాస్ఫోరోసెన్స్తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ మల్టిపుల్ కలర్స్లో లాంచ్ అవ్వనున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. చిప్సెట్ వచ్చే సంవత్సరం విడుదలకానున్న కొత్త ఐఫోన్ 16 చిప్సెట్కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్లలోని A17 ప్రో చిప్ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ రానున్న కొత్త ఐఫోన్స్ కోసం 3 నానోమీటర్ A18 చిప్ అందించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. చిప్సెట్కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా సెటప్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లు 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో (లైటింగ్) కూడా మంచి పనితీరుని అందిస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
ఐఫోన్లు హ్యాక్..షాక్ లో నేతలు..
-
రూ.1000 కోట్ల డీల్ - భారత్లో టాటా ఐఫోన్స్ తయారీ..
ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ దిగదినాభివృద్ది చెందుతున్న దేశీయ దిగ్గజం 'టాటా' ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది. దీని కోసం కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో టాటా గ్రూప్ ఐఫోన్స్ తయారు చేయనుంది. మరో రెండున్నర సంవత్సరాల్లో విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్దవుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' తెలిపారు. టాటా కంపెనీ ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడానికి తైవాన్ బేస్డ్ సంస్థ 'విస్ట్రాన్ కార్ఫ్' (Wistron Corp) భారతదేశంలోని విభాగాన్ని 125 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1000 కోట్లు కంటే ఎక్కువ) కొనుగోలు చేయనుంది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో మొట్ట మొదటి ఐఫోన్లను ఉత్పత్తి చేసే సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియా కంపెనీల వృద్ధికి మద్దతు ఇస్తుందని, ప్రపంచానికి భారతదేశ విశ్వసనీయతను, ప్రతిభను చాటి చెప్పడానికి బ్రాండ్లకు సపోర్ట్ చేస్తుందని చంద్రశేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports. Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023 -
Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్లపై నిషేధం!
ప్రపంచ నంబర్వన్ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్కు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?) యాపిల్ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ గత నెలలో వాచ్సిరీస్ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది. -
Israel Hamas war: యాపిల్ వాచ్ ద్వారా కూతురి మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా మరణించిన ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వాల్డ్మాన్ కుమార్తె డేనియల్ మరణించారు. స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వాల్డమన్ ఫోన్కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు. అయితే కుమార్తెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా లోకేషన్ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ ఐఫోన్లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు వాల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!) యాపిల్ ఐఫోన్, వాచ్లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్ నంబర్కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. -
ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్లోనూ ప్రత్యేక సాంగ్తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్) అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ ) 📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023 -
ఏటా కొత్త ఐఫోన్ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు?
Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్లో జరిగిన యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్లైన్తోపాటు యాపిల్ స్టోర్లకు కస్టమర్లు క్యూకట్టారు. (iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..) యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు. కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే.. అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. -
ఐఫోన్ 16 ఫోన్ ఫీచర్లు లీక్.. భారీ మార్పులు చేయనున్న యాపిల్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 15 విడుదలైందో లేదో టెక్ ప్రియులు ఐఫోన్ 16 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 ఫీచర్లు ఇలా ఉండబోతున్నాయంటూ పలు లీకులు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ని సైతం అప్గ్రేడ్ చేసి మార్కెట్లో విడుదల చేయనుందని సమాచారం. ముఖ్యంగా స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెచ్జెడ్గా ఉంది. ఇప్పటి వరకు అన్నీ ఐఫోన్లలోని రిఫ్రెష్ రేటు 60 ఉండగా.. దీనిపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే ఐఫోన్ 16లో రిఫ్రెష్ రేటుని 120హెచ్జెడ్కి అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ సైజ్ 6.9 అంగుళాలు ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాలతో లార్జ్ డిస్ప్లే ఉండనుంది. అదే సిరీస్లోని ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్తో రావచ్చు. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ స్క్రీన్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అంచనా. ఐఫోన్ 15 సిరీస్ వరకు విడుదలైన స్టాండర్డ్, ప్లస్ ఫోన్ల డిస్ప్లేలు 6.1-అంగుళాల, 6.7-అంగుళాల స్క్రీన్లను కొనసాగిస్తుందని లీకులు వచ్చాయి. సాలిడ్-స్టేట్ బటన్లు ఐఫోన్ ఎస్ సిరీస్ హోమ్ బటన్లో కనిపించే హాప్టిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ మాదిరిగానే ఐఫోన్ 15 ప్రో లైనప్తో సాలిడ్-స్టేట్ బటన్లను పరిచయం చేయాలని యాపిల్ మొదట భావించింది. ఐఫోన్ 15 ప్రోలో ఈ ఫీచర్ కార్యరూపం దాల్చనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్స్లో సాలిడ్-స్టేట్ బటన్లు ఉండొచ్చని యాపిల్ ఫోన్ అనలిస్ట్ మింగ్-చి కువో సూచించారు. ‘టెట్రా-ప్రిజం’ అంతేకాకుండా, ఐఫోన్ 15 ప్రో మాక్స్లో కనిపించే ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో కెమెరా రాబోయే ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లో ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీ 3x నుండి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసే అవకాశం ఉంది. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 16 ప్రో సిరీస్లో 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను చేర్చాలని అంచనా వేస్తున్నారు. లైట్ తక్కువగా ఉన్నా మెరుగైన పనితీరును అందిస్తుంది. చిప్ సెట్ డిజైన్లలో మార్పులు ప్రస్తుత ఐఫోన్ 15 ప్రో మోడల్లు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు వెనుక రెండు సెన్సార్లను కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే ఐఫోన్ 16 సిరీస్లో నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ డిజైన్తో వచ్చే అవకాశం ఉందని పలువురు టెక్నాలజీ నిపుణులు ఆశిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ల కోసం A18 ప్రో చిప్ని ఉపయోగించవచ్చని అంచనా. -
ఫెస్టివ్ బొనాంజా: కస్టమర్లకు బంపర్ ఆఫర్లు, ఐఫోన్ 15పై స్పెషల్ ఆఫర్
దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభంలో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులు రూ. 26 వేల వరకు క్యాష్బ్యాక్తో ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 15 పై ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేకాదు గృహ రుణాలు, వాహన రుణాలు ద్విచక్ర వాహన రుణాలపై త్వరలోనే గుడ్ న్యూస్ను అందించనున్నట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్ల ద్వారా UPI , కార్డ్లెస్ EMI కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను పొందవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఐఫోన్ 15పై నో-కాస్ట్ EMI ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు) కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందించే లక్ష్యంతో ప్రముఖ బ్రాండ్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ (అక్టోబర్ 8 - అక్టోబర్ 15 వరకు), మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (అక్టోబర్ 6 -అక్టోబర్ 19 వరకు), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అలాగే గృహ, బైక్, ఫోర్వీలర్ వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) దీని ప్రకారం యాపిల్ ఐఫోన్ 15తోపాటు,ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నిచర్, ట్రావెల్, ఫుడ్, ఇతర కేటగిరీలపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్ప్లస్, హెచ్పి, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జి, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, స్విగ్గీ, జొమాటో వంటి ప్రధాన బ్రాండ్స్తో డీల్ కనుగుణంగా ఆఫర్లు పొందవచ్చు. కాగా ICICI బ్యాంక్ లిమిటెడ్కు జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.16,47,000 కోట్లుగా ఉన్నాయి.