-
చెవులకు చిల్లు.. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి వింత శబ్ధాలు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుగోలు దారులకు రోజుకో కొత్త సమస్య ఎదురవతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నట్లు యాపిల్కు పిర్యాదు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐ ఫోన్15 సిరీస్ ఫోన్లోని ఐఫోన్ 15 ప్రొ మోడల్స్లో స్పీకర్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని, ఫోన్ వ్యాల్యూమ్ ఎక్కువ పెట్టినప్పుడు వస్తున్న శబ్ధాలకు చికాకు తెప్పిస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాదు, ఫోన్ నుంచి శబ్ధం వచ్చే సమయంలో ఆ ఫోన్ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఈ సమస్య ఎక్కువగా కాల్స్ చేసే సమయంలో కానీ, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో ఉత్పన్నమవుతుంది. దీంతో ఆడియో స్పష్టత లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. యాప్స్ వాడుతున్న సమయంలో కూడా వింత సౌండ్స్ వస్తున్నాయని కస్టమర్లు వరుస ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు. విడుదల నుంచి ఏదో ఒక సమస్య యాపిల్ ఎంతో అట్టహాసంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను వాడుతున్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా,యాపిల్ ఐఫోన్ ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ ఫోన్లలో హీటింగ్ సమస్యపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఫోన్ వెనుక భాగం వేడెక్కుతుందని కస్టమర్లు ఫిర్యాదు చేసినట్లు యాపిల్ యాజమాన్యం ధృవీకరించింది. సమస్యల్ని పరిష్కరిస్తాం అయితే ఈ సమస్య కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్లోని బగ్ ఇందుకు కారణమని గుర్తించినట్లు చెప్పింది. దాంతోపాటు థర్డ్పార్టీ యాప్ల నుంచి వచ్చే అప్డేట్లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణం అవుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఒఎస్ 17 అప్డేట్ను విడుదల చేస్తామని యాపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్కి అప్గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్కి వెళ్లే టీనేజ్ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్లో ఉండేలా తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్గ్రేడ్ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి ఇలా!
టెక్ ప్రియులకు శుభవార్త. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఐఫోన్లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ ధర అంటే? ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను కొనే ధరలోనే ఐఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా? ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో యాపిల్ ఐఫోన్ 12ని రూ.35,000 లోపే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 మార్కెట్ ధర రూ.38,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ రూ.3,000తో దాని ధర రూ. 35,999కి చేరుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.3,000 తగ్గుతుంది. అదే ఫోన్ను రూ.32,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకెంతో ఇష్టమైన ఐఫోన్ ను ఇప్పుడే సొంతం చేసుకోండి. ఐఫోన్12 ఫీచర్లు ఐఫోన్ 12లో 6.1, 5.4 అంగుళాల స్క్రీన్, స్పోర్ట్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, 12 ఎంపీ డ్యూయల్ రియల్, వైడ్ యాంగిల్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా డ్యూయల్ సిమ్ (నానో+ఇ-సిమ్), అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉన్నాయి. -
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై విమర్శలు.. స్పందించిన యాపిల్!
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’(WonderLust) పేరుతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఆ ఫోన్ల అమ్మకాలు కొనసాగుతుండగా.. వాటిని కొన్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విమర్శలపై యాపిల్ స్పందించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు వేడెక్కడంతో పాటు టైటానియం ఫ్రేమ్, కొత్త ఫీచర్, రంగు మారుతున్నట్లు యూజర్లు యాపిల్ సంస్థకు మెయిల్స్ పెడుతున్నారు. స్పందించిన యాపిల్ ఈ క్రమంలో ఫోన్పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు యాపిల్ రంగంలోకి దిగింది. ఫోన్ వేడెక్కడానికి కారణం ఫోన్ హార్డ్వేర్ డిజైన్ కాదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27న ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేసిన వెర్షన్ 302 వల్లేనని యాపిల్ చెప్పినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని యాపిల్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ ఫోన్ వేడెక్కడానికి ఇన్స్టాగ్రామ్, ఊబెర్, వీడియోగేమ్ అస్ఫల్ట్ అని తెలిపారు. వీటి వినియోగం వల్లే ఐఫోన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఫోన్ వేడి వల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ఛార్జింగ్ మరో కారణం 20డబ్ల్యూ కంటే ఎక్కువ ఛార్జింగ్ సామర్థ్యంతో యూఎస్బీ-సీ పవర్ అడాప్టర్లను ఉపయోగించడం, ఫోన్ను పునరుద్ధరించిన కొద్దిసేపటికే బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెసింగ్ కారణంగా ఫోన్ వేడెక్కేందుకు దోహదం చేస్తుందన్నారు. కాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ సమస్యలకు పరిష్కారం చూపించాలని, లేదంటే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్
టెక్ విభాగంలో యాపిల్ సంస్థకు, ఆ కంపెనీ విడుదల చేసే ప్రొడక్ట్లకు మార్కెట్లో ఉన్న ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే యాపిల్ విడుదల చేసే ఉత్పత్తుల్ని సొంతం చేసుకోవాలని టెక్ లవర్స్ ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా ఐఫోన్లు. అవి విడుదలైతే వాటిని పోటీ పడి మరి దక్కించుకోవాలని అనుకుంటారు. అందుకే వినియోగదారుల డిమాండ్ తగ్గట్లు యాపిల్ సైతం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్లను విడుదల చేస్తుంది. తాజాగా, యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ కోసం యూజర్లు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. తీరా.. ఎంతో ముచ్చటపడి కొన్న ఫోన్లు విపరీతంగా వేడెక్కడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి ఫోన్ని దక్కించుకుంటే ఇలా అయ్యిందేంటని తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా, ఐఫోన్ 15 సిరీస్లోని ఐఫోన్ ప్రో, ఐఫోన్ మ్యాక్స్లో గేమ్స్ ఆడే సమయంలో, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫోన్ల వెనుక భాగం వేడెక్కుతుందని చెబుతున్నారు. మరికొందరు ఛార్జింగ్ ఎక్కే సమయంలో ఇదే తరహా సమస్య ఎదుర్కొంటున్నట్లు యాపిల్ సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు.కస్టమర్ల ఫిర్యాదుతో యాపిల్ టెక్నీకల్ సపోర్ట్ టీం సైతం గతంలో ఐఫోన్ను ఎలా వినియోగించాలో వివరిస్తూ బ్లాగ్లో రాసిన ఆర్టికల్స్ను చదవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాగ్ ఆర్టికల్లో ఫోన్ కూల్గా, హీట్గా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ .. అందుకు కారణాలు 👉సూపర్ ఛార్జ్ ప్రాసెసర్ల కారణంగా ఐఫోన్లు వేడెక్కుతుంది. 👉వినియోగదారులు తమ కొత్త ఫోన్లో యాప్లు, డేటా, ఫోటోలను డౌన్లోడ్ చేయడం వంటి పనులు చేయడం వల్ల హీటెక్కుతుంది. 👉ఇన్స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. 👉చాలా మంది యూజర్లు థర్మామీటర్తో ఫోన్ ఉష్ణోగ్రతను చెక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఓ పోస్ట్ ప్రకారం, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ త్వరగా వేడెక్కుతుంది. సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం వల్లేనని మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. 👉పలువురు ఐఫోన్ 15 ప్రో యూజర్లు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదని, మునుపటి మోడల్లకు అనుగుణంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఉన్నాయని చెబుతున్నారు. 👉ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కాల్ సమయంలో స్విచ్ ఆఫ్ అయ్యేంత వేడిగా ఉంది. సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది : మరో యూజర్ 👉ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్లు శక్తివంతమైన గ్రాఫిక్స్ ఇంజన్తో కొత్త ఏ17 చిప్లు ఉన్నాయి. బహుశా గేమింగ్ పనితీరును మెరుగుపడే సమయంలో వేడెక్కొచ్చని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్కుక్ వైరల్ -
ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్కు హై సివియారిటీ వార్నింగ్!
ఐఫోన్లు (iPhone), పలు ఇతర యాపిల్ (Apple) ఉత్పత్తులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హై సివియారిటీ వార్నింగ్ ఇచ్చింది. పలు ఉత్పత్తుల్లో సాఫ్ట్వేర్లు సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఫోన్లు, యాపిల్ మ్యాక్లు, వాచ్లు, ఐపాడ్లలో ఉపయోగిస్తున్న పలు వర్షన్ల సాఫ్ట్వేర్లు సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని సెర్ట్ఇన్ గుర్తించింది. ఆయా సాఫ్ట్వేర్లు టార్గెటెడ్ సిస్టమ్పై ఆర్బిటరీ కోడ్ అమలు చేయడానికి, భద్రతా పరిమితులను చేధించడానికి అటాకర్కు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రభావిత సాఫ్ట్వేర్లు ఇవే.. Apple macOS Monterey 12.7కి ముందు వెర్షన్లు Apple macOS Ventura సంస్కరణలు 13.6కి ముందు వెర్షన్లు Apple watchOS 9.6.3కి ముందు వెర్షన్లు Apple watchOS 10.0.1కి ముందు వెర్షన్లు Apple iOS 16.7కి ముందు వెర్షన్లు, iPadOS 16.7కి ముందు వెర్షన్లు Apple iOS 17.0.1కి ముందు వెర్షన్లు iPadOS 17.0.1కి ముందు ఉన్న వెర్షన్లు Apple Safari 16.6.1కి ముందు ఉన్న వెర్షన్లు సెక్యూరిటీ కాంపోనెంట్లో సర్టిఫికేట్ ధ్రువీకరణ, కెర్నల్, వెబ్కిట్ కాంపోనెంట్లో సమస్యల కారణంగా యాపిల్ ఉత్పత్తులలో సైబర్ దాడికి అవకాశాలు ఉన్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన అభ్యర్థనను పంపడం ద్వారా ఈ అవకాశాలను అటాకర్ ఉపయోగించుకోవచ్చని హెచ్చరించింది. ఆయా వెర్షన్లకు ముందున్న సాఫ్ట్వేర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. (ఐఫోన్ 15పై అప్పుడే వెల్లువెత్తిన కంప్లైంట్లు..) -
రైలు పక్కనే కాచుకుని ఉంటారు, చటుక్కున మొబైల్ లాగేసుకుంటారు
-
భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్. అమెరికా దిగ్గజం యాపిల్ లాంచ్ చేసిన లేటెస్ట్ ఐఫోన్ల 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ లభించనుంది. Apple iPhone 15పై అమెజాన్ , Flipkartలో రూ.60,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్లనుమొదలైన సంగతి తెలిసిందే.ఐఫోన్ 15 సెప్టెంబర్ 22 నుండి తొలి సేల్. అలాగే షిప్పింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం. యూజర్లు Apple India వెబ్సైట్లో అలాగే ఢిల్లీ, ముంబైలోని రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్ని ఉపయోగించి వారి వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 6,000 వరకు తక్షణ తగ్గింపు లభ్యం. యాపిల్ దేశంలో తన తాజా ఉత్పత్తులపై వరుస డిస్కౌంట్లను ప్రకటించింది. iPhone 15 ఇప్పుడు రూ. 74,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 79,900.అలాగే రూ. 89,900 నుంచి దిగి వచ్చిన iPhone 15 Plus రూ. 84,900 వద్ద అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో రూ. 128,900కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,34,900. iPhone 15 Pro Maxని రూ. 153,900కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు రూ. 159,900. (ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్:యోనో యాప్తో ఈజీగా) తాజా నివేదికల ప్రకారం, అమెజాన్లో iPhone 15 ప్రీ-ఆర్డర్లో రూ. 89,900 నుంచి షురూ అవుతాయి. డిస్కౌంట్ తర్వాత, ఐఫోన్ 15 ఫ్లిప్కార్ట్లో రూ. 79,900 నుండి ప్రారంభం అయితే, ఈ సమయంలో వెబ్సైట్లో అన్ని మోడల్లు స్టాక్లో లేవు. ఎంపిక చేసిన HDFC కార్డ్ల ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. (ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!) మీదగ్గర iPhone 12 ట్రేడ్-ఇన్ ఆఫర్లో భాగంగా రూ. 20,000 అదనపు తగ్గింపు. ఈ డిస్కౌంట్ రావాలంటే ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. దీనికి అదనంగా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. ఈ రెండు ఆఫర్లు వర్తించినతరువాత ఐఫోన్ 15 ధర రూ. 48,900కి పడిపోతుంది.ఈ తాజా ఆఫర్ సెప్టెంబర్ 22 నుండి అందుబాటులో ఉంటుంది. మీకు iPhone 12 లేకపోయినా డోంట్వర్రీ. మీ iPhone లేదా Android స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా Cashifyలో లేదా iStore అధికారిక వెబ్సైట్లో తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఫోన్ వయస్సు ,పరిస్థితిని బట్టి వినియోగదారులు రూ.2వేల రూ.67,800 వరకు ధర దిగి వస్తుంది. (Disclaimer: తాజా iPhone 15 స్మార్ట్ఫోన్పై ఉత్తమమైన డీల్స్కోసం ఆయా ప్లాట్ఫారమ్లలో అన్ని డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లను చెక్ చేసుకోవడం ఉత్తమం) -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్పై మరోసారి ట్రోలింగ్కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫాంలు కూడా యాపిల్పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
తొలిసారి మేడిన్ ఇండియా ఐఫోన్..నో వెయిటింగ్! ఇక ఐఫోన్ లవర్స్కు పండగే!
Apple iPhone 15: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా యాపిల్ ఐఫోన్ 15 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఇండియాలోని ఐఫోన్ లవర్స్కి గుడ్ న్యూస్. ఐఫోన్ 15 లాంచింగ్ తరువాత ఎలాంటి వెయిటింగ్ లేకుండానే, గ్లోబల్ సేల్స్ అరంగేట్రం రోజునే ఇండియా మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందట. అదీ మేడిన్ ఇండియా కొత్త ఐఫోన్ మోడల్స్ రాబోతున్నాయి. అదే నిజమైతే ఐఫోన్ లవర్స్కు నిజంగా పండగే. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం లాంచ్ రోజున భారతదేశంలో అసెంబుల్ చేసిన యాపిల్ ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్ 15ని దక్షిణాసియాతో పాటు మరికొన్ని ఇతర గ్లోబల్ ప్రాంతాల్లో తొలిరోజే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. భారత్లొ సరికొత్త ఐఫోన్లకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. మేడ్-ఇన్-ఇండియా పథకానికి ఇదొక కీలకమైన మైలురాయి కానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ఐఐటీ కాదని నటిగా..చివరికి బి-టౌన్ని కూడా వదిలేసి..ఇన్ని ట్విస్ట్లా!) ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్గా ఉన్న చైనాలో ఇటీవల ఆంక్షలు, యాపిల్కు తర్వాతి చైనాగా భారత్ నిలుస్తుందన్న అంచనాల మధ్య ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రారంభంలో, యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్లను దేశంలో ప్రారంభించింది. కాగా గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు) అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా వండర్ లస్ట్ పేరుతో నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15సిరీస్ను ప్రకటించనుంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్లో ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పాటు, యాపిల్వాచ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 9 యాపిల్ వాచ్ అల్ట్రా (2వ తరం) ఐపాడ్స్ లాంచింగ్పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గాను, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉంటుందని అంచనా -
ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!
iPhone Spyware Alert యాపిల్ ఐఫోన్లో లోపాలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఫోన్లలో డిజిటల్ వాచ్డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ కొత్త స్పైవేర్ను గుర్తించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకునే ఇజ్రాయెల్ పెగాసస్కు చెందిన స్పైవేర్ ఐఫోన్, ఇతర డివైస్లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే తమ డివైస్లను అప్డేట్ చేయాలని కోరింది. సిటిజెన్ ల్యాబ్ నివేదించిన లోపాలను పరిశోధించిన యాపిల్ కొత్త అప్డేట్స్ను జారీ చేసింది.ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన లోపాలను 'జీరో డే బగ్స్' గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. (యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) గత వారం వాషింగ్టన్కు చెందిన సివిల్ సొసైటీ గ్రూప్కు చెందిన ఉద్యోగి యాపిల్డివైస్ చెక్ చేస్తున్నప్పుడు, NSO పెగాససస్కు సంబంధించిన స్పైవేర్ ద్వారా తాజా బ్రీచ్ గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.iOS 16.6లో చొరబడుతున్న మూడు కొత్త వైరస్ను కనుగొన్నట్టు తెలిపింది. ఇవి యూజర్తో సంబంధం లేకుండానే బ్లాస్ట్పాస్(BLASTPASS)చేస్తుందని, ఎటాకర్ iMessage ఖాతా నుండి హానికరమైన చిత్రాలతో పాస్కిట్ఎ టాక్ ఉంటుందని తెలిపింది. అధునాతన దాడుల గురించి పౌర సమాజానికి మరోసారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తోందని సిటిజెన్ ల్యాబ్ టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన మంక్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీలోన సిటిజెన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ పేర్కొన్నారు. సిటిజన్ ల్యాబ్ బాధిత వ్యక్తి లేదా సంస్థపై మరిన్ని వివరాలను అందించలేదు. సిటిజన్ ల్యాబ్ పరిశోధనపై తక్షణ వ్యాఖ్య ఏమీ లేదని NSO ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ సంస్థ పెగాసస్పై ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులపై నిఘాతో సహా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2021 నుండి అమెరికా ప్రభుత్వందీన్ని బ్లాక్ లిస్ట్లోపెట్టిన సంగతి తెలిసిందే. Today, Apple released iOS 16.6.1, patching two vulnerabilities exploited by BLASTPASS in Wallet (CVE-2023-41061) and ImageIO (CVE-2023-41064) so update your iPhones! Also, if you're at risk because of who you are or what you do, please enable Lockdown Mode https://t.co/3cqQyWI3pG — Bill Marczak (@billmarczak) September 7, 2023 -
యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు
Apple iphone Ban: అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్ల వాడకంపై నిషేధాన్ని మూడు చైనా మంత్రిత్వ శాఖలతోపాటు, ప్రభుత్వ మద్దతు ఏజెన్సీలు, కంపెనీలకు విస్తరించాలని చైనా యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏకంగా రెండు రోజుల్లో షేరు సుమారు 6 శాతం నష్టపోయాయి. షేరు ధర సుమారు 175డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ సుమారు 200 బిలియన్ డాలర్లు కోల్పోయింది, గురువారం షేర్లు 2.9 శాతం కుప్పకూలాయి.ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పతనాన్ని నమోదు చేసింది. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) యాపిల్ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద విదేశీ మార్కెట్. గత ఏడాది కంపెనీ మొత్తం ఆదాయంలో ఐదో వంతు చైనానుంచే. ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించాలనే, చైనా తాజా నిర్ణయం యాపిల్ మరింత నష్టం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి, యూజర్ల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా ఐఫోన్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెల కొన్నాయి. 2 కోట్ల ఐఫోన్ అమ్మకాలు ప్రమాదం చైనాలో బ్యాన్, ప్రత్యర్థి హువావే లాంచింగ్స్తో కారణంగా యాపిల్ ఏకంగా 20 మిలియన్ల ఐఫోన్ల్అమ్మకాలు ప్రమాదంలోఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, చైనీస్ ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం ఐఫోన్లను ఉపయోగించకుండా నిరోధించినట్లయితే యాపిల్ 5 నుండి కోటి ఐఫోన్లు ప్రమాదంలో పడతాయి. కార్యాలయానికి ఐఫోన్లను తీసుకురావడంపై కూడా చైనా నిషేధాన్ని అమలు చేస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు , Oppenheimer విశ్లేషకులు యాపిల్ ప్రత్యర్థి Huawei పోటీ కారణంగా మరోకోటి ఐఫోన్ల ఆర్డర్లను కోల్పోయిట్టు అంచనా. హువావే జోరు అతిత్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ కానున్న తరుణంలో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Huawei టెక్నాలజీస్ అధునాతన చిప్తో Mate 60 స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ ప్రీసేల్స్ను ప్రారంభించింది. అటు ఐఫోన్ల వినియోగంపై అధికారుల నియంత్రణలను చైనా మరింత పెంచే అవకాశం ఉందిన తైపీ మెగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెన్ హువాంగ్ వ్యాఖ్యానించారు. -
ఈ ఒక్క రీజన్తో యాపిల్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా?
యాపిల్ కంపెనీ ఈనెల 12 (2023 సెప్టెంబర్ 12)న జరగబోయే ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటికే స్మార్ట్ఫోన్ ట్రేడ్-ఇన్ ప్లాట్ఫారమ్ సెల్సెల్ అనే కొత్త సర్వేలో ఎక్కువమంది ఈ మొబైల్ కొనటానికి కారణం USB-C ఛార్జింగ్ పోర్ట్ను ప్రవేశపెట్టడమే అని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ సెల్సెల్ సర్వే ప్రకారం.. యాపిల్ USB-C ఛార్జింగ్ పోర్ట్తో ఐఫోన్ 15 మోడల్స్ అందించనుంది. ఈ కారణంగా చాలామంది కొత్త వినియోగదారులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సుమారు 63 శాతం మంది ఐఫోన్ యూజర్లు కొత్త ఐఫోన్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ యూఎస్బీ-సీ ఛార్జర్ ప్రవేశపెట్టడం వల్ల కేవలం ఐఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 15 శాతం ఇటువైపు మొగ్గు చూపుతారని నివేదికలు చెబుతున్నాయి. కేవలం వినియోగదారుడు మాత్రమే కాకుండా కుటుంబంలోని అందరూ ఈ ఛార్జర్ ఉపయోగించవచ్చని, ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు.. 2012 నుంచి యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ప్రత్యేకమైన చార్జర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూరోపియన్ యూనియన్ నిబంధనల వల్ల మొదటిసారి ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ-సీ ఛార్జర్తో రానుంది. ఇది వినియోగదారులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
విడుదల కాకముందే.. ఐఫోన్ 15కి భారీ ఎదురుదెబ్బ?
మరో వారం పది రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానుంది. ఈ తరుణంలో ఐఫోన్ తయారీ విషయంలో ఏదో ఒక రూమర్ సామాజిక మాధ్యమాల్లో హాట్టాపిగ్గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఐఫోన్ తయారీపై ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. అందులో ఐఫోన్ 15 తయారీ భారీ తగ్గిందని.. భారీ అమ్మకాలు, డిమాండ్ దృష్ట్యా ఇది యాపిల్ సంస్థకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 9 టూ 5 రిపోర్ట్ ప్రకారం.. ఇటీవల ప్రముఖ హాంకాంగ్ పెట్టుబడి సంస్థ హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 15 యూనిట్లు తయారవుతాయో అంచనా వేశారు. గతంలో 83 మిలియన్ యూనిట్లు వస్తాయని అంచనా వేసిన ఆయన..ఇప్పుడు 77 మిలియన్ యూనిట్లు మాత్రమే అని అన్నారు. ఫోన్ల తయారీకి అవసరమైన అన్ని విడిభాగాలను పొందడంలో సమస్యలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు కొనాలనుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున.. ఉత్పత్తి తగ్గించినట్లు జోస్యం చెప్పారు. 11 మిలియన్ యూనిట్ల తగ్గింపు జెఫ్ పు నివేదికను ఊటంకిస్తూ ఐఫోన్ 15ను ఎన్ని ఉత్పత్తి అవుతాయో తెలుపుతూ మిజుహో అనే జపనీస్ బ్యాంక్ ఓ రిపోర్ట్ను వెల్లడించింది. అందులో 84 మిలియన్లు అవుతుందని భావించిన మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా 73 మిలియన్లు ఉత్పత్తి అవుతుందని చెప్పడం గమనార్హం. ఐఫోన్ 15 ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన విడి భాగాల్ని యాపిల్ పొందలేకపోతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆలస్యం 9 టూ 5 మరో నివేదికలో.. ఈ సెప్టెంబర్లో యాపిల్ సంస్థ ఈవెంట్ నిర్వహించనుంది. ఆ ఈవెంట్లో ఐఫోన్ 15 మోడల్స్ను విడుదల చేయనుంది. కానీ వాటిల్లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉండబోదని భావిస్తోంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కోసం అక్టోబర్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోటోల్ని మరింత దగ్గరగా జూమ్ చేసేలా లేటెస్ట్ టెక్నాలజీతో కెమెరాను డిజైన్ చేయనుంది. అయితే కెమెరా విడిభాగాలను తయారు చేసే సోనీ సంస్థ ఐఫోన్ లాంచ్ కు సకాలంలో వాటిని అందించలేకపోతోంది. కాబట్టి, ఫ్యాన్సీ ఐఫోన్ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. -
ఐఫోన్ 15 కీలక అప్డేట్: ఆ రంగులకు సెలవు!
ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ( Apple ) ఐఫోన్ 15 ( iPhone 15) సిరీస్కు సంబంధించిన కీలక అప్డేట్ గురించి తెలిసింది. ఐఫోన్ 15 లాంచ్ డేట్పై యాపిల్ పెదవి విప్పలేదు. కానీ సెప్టెంబర్ 12 లేదా 13 తేదీల్లో ఐఫోన్ 15 విడుదలవుతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 రంగులకు సంబంధించి తాజా రూమర్ ఒకటి విస్తృతంగా ప్రచారమవుతోంది. ఐఫోన్ల, ఇతర యాపిల్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే 9to5Mac అనే వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కోసం యాపిల్ కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లను నిలిపివేసి కొత్తగా గ్రే, బ్లూ కలర్స్ను తీసుకురానుంది. గోల్డ్, పర్పుల్ కలర్స్ అవుట్! ఐఫోన్లలో ముందు నుంచి వస్తున్న గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లను ఐఫోన్ 15 ప్రో మోడల్తో నిలిపేస్తున్నట్లు చెబుతున్నారు. 2018లో ఐఫోన్ ఎక్స్ఎస్ మోడల్ నుంచి గోల్డ్ కలర్ ఆప్షన్ను యాపిల్ కొనసాగిస్తోంది. నిజానికి ఐఫోన్ 6 మోడల్ నుంచే గోల్డ్ కలర్ ఏదో ఒక రూపంలో ఉంటూ వస్తోంది. ఇక పర్పుల్ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్తో పరిచయమైంది. These could be the new iPhone 15 Pro color options:- Space Gray- Silver- Titan Gray- Dark BlueWhich color would you pick?Source: @9to5mac pic.twitter.com/ePSwkkk9m4— Apple Hub (@theapplehub) August 24, 2023 సెప్టెంబరులో విడుదల కానున్న ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కొత్త ఏ17 బయోనిక్ చిప్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సిస్టమ్, పిల్-ఆకారపు కటౌట్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుందని పుకారు ఉంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్తో మొదటిసారిగా కలర్-కోఆర్డినేటెడ్ ఛార్జింగ్ కేబుల్లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. Apple is expected to launch the iPhone 15 Pro and iPhone 15 Pro Max next month! Here are some of the major changes:Design updatesThe new Pro models will feature some design changes, including a new Titanium body (replacing Stainless Steel) and the thinnest bezels on a… pic.twitter.com/dg8kDLNJdw— Apple Hub (@theapplehub) August 23, 2023 -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
చైనాకు షాకిచ్చిన యాపిల్ సంస్థ..భారత్ లో ఐఫోన్15 సిరీస్ ఫోన్ల తయారీ..
-
యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?!
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ తగలనుందా? తాజాగా, యాపిల్ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్ ప్రొడక్ట్ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్కు ప్లాంట్లో గతంలో కంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్ ఐఫోన్లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్రమత్తమైన టిమ్కుక్ యాపిల్ సంస్థ గత కొన్నేళ్లుగా చైనాలో తన ఉత్పత్తుల్ని తయారీ, అమ్మకాలు నిర్వహిస్తుంది. అయితే, డ్రాగన్ కంట్రీలో సప్లయి చైన్ సమస్యలు, అమెరికా - చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సత్సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని, తనను తాను తయారీ కేంద్రంగా మార్చుకోవాలని కోరింది. ఇలా వరుస పరిణామాలతో యాపిల్ సీఈవో టిమ్కుక్ అలెర్ట్ అయ్యారు. చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే ఓ అంచనాకు వచ్చిన యాపిల్ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇందులో భాగంగా భారత్లో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా నుంచి భారత్కు చైనాలో సప్లయి చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్కు తరలించాలని భావించింది. కాబట్టే గత ఏడాది భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్ల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఆ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ మరో రిపోర్ట్ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్లో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ విలువలో యాపిల్కు 25 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. ఈ వృద్ది రేటు 2021లో 12 శాతం నుండి పెరిగినట్లు మరికొన్ని సంస్థలు నివేదించాయి. ప్రమాదం అంచున చైనా ఆధిపత్యం ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్ జిన్మీ షెన్ తెలిపారు. అయినప్పటికీ, యాపిల్ తన తయారీని చైనా నుంచి బయట (ముఖ్యంగా భారత్కు) దేశాలకు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
‘ఫొటో చూసి ఎత్తు చెప్పండి’ అమ్మడి ప్రశ్నకు ఐఫోన్తో నెటిజన్ సమాధానం!
సోషల్ మీడియాలో రోజురోజుకూ విచిత్రమైన పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా x (గతంలో ట్విట్టర్)లో ఒక యువతికి సంబంధించిన పోస్టు వైరల్గా మారింది. దీనిలో ఆమె యూజర్స్కు ఒక ప్రశ్న సంధించింది. వెంటనే దీనికి సమాధానాలు, కామెంట్ల వెల్లువ మొదలయ్యింది. తన ఎత్తు ఎంతో చెప్పమన్న ఆ అమ్మడిని కంగుతినిపిస్తూ యూజర్స్ సమాధానాలిస్తున్నారు. guess my height 👀 pic.twitter.com/02t86D25a7 — S. (@daalmakhniiii) August 12, 2023 xలో దాల్మఖనీ పేరు కలిగిన యూజర్ తనకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె ఒక ఐఫోన్ పట్టుకుంది. ‘నా హైట్ ఎంతో చెప్పండి’ అని అడిగింది. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ లక్షల్లో సమాధానాలు వచ్చాయి. 1500కు పైగా యూజర్స్ ఈ పోస్టును లైక్ చేశారు. సాగర్ అనే యూజర్ చేసిన కామెంట్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆమె చేతిలోని ఐఫోన్-12 పొడవు 14.6 సెంటీమీటర్లు అని పేర్కొంటూ, ఆమె ఫొటో పక్కన అంటే తల మొదలు కొని పాదాల వరకూ ఒక్కొక్కటిగా 9 ఫోన్లను పెడుతూ వచ్చాడు. దీనిని మొత్తం లెక్కించాక ఆమె ఎత్తు 4 అడుగుల 31 ఇంచీలు అని తేల్చిచెప్పాడు. రాహుల్ అనే యూజర్ ఎన్నో దుర్గుణాలు కలిగిన రావణుడు కూడా ఏనాడూ ఇటువంటి ప్రశ్న అడగలేదని కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. 4.31 ft pic.twitter.com/mmtgmh1LAk — Sagar Budhwani (@Sagarbudhwani_) August 12, 2023 -
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్...ఇక పండగే!
Apple Big Event iphone15 launch: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్షిప్లను లాంచ్లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్అయింది. రానున్న యాపిల్ బిగ్ ఈవెంట్కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా లీక్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్ను తేదీని యాపిల్ లీక్కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టుతెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలలో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) సరఫరా సమస్యల కారణంగా ఐఫోన్ 14 ప్లస్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. 2020లో ఐఫోన్ 12 Pro Max, ఐఫోన్12 mini లాంచింగ్ లేట్ అయింది. ఈ ఏడాది సేల్ కూడా ఐఫోన్ 15 మోడల్లు "తీవ్రమైన కొరత" కారణంగా ఆలస్యం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు అన్ని కొత్త మోడళ్ల అమ్మకాలు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే, యాపిల్ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) Breaking 😍 Apple to launch iPhone 15 series on 13 September, 2023. USB-C#iPhone15 #USBC #Apple pic.twitter.com/2YPVLTMlbR — Abhishek Yadav (@yabhishekhd) August 4, 2023 -
భారత్లో ఫాక్స్కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఫాక్స్కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్లో ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
మార్కెట్లోకి యాపిల్ కంపెనీ బూట్లు.. ధర వింటే గుండెల్లో దడపుట్టాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ఎంత ధర ఉన్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి ఊహించని ధర పలికాయి. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్బుక్లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ఆ బూట్లు ఎంత ధర పలికిందంటే.. ధర వింటే భయపడతారు దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్ల విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్లలో ఒకటైన సోథెబీస్లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు విక్రయించారు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. యాపిల్ వంటి వంటి దిగ్గజ టెక్ కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అసాధారణంగా అనిపించినప్పటికీ, ఆ సంస్థ ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతాన్ని పరీశిలిస్తే తెలుస్తుంది. 1986లో ఈ కంపెనీ "ది యాపిల్ కలెక్షన్"ను ప్రారంభించింది. ఇది రెయిన్బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు, ఉపకరణాల శ్రేణి. ఇందులో మగ్లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్లు, సెయిల్బోర్డ్తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి. యాపిల్ ఉత్పత్తులంటే డిమాండ్ అట్లుంటది ఆసక్తికరమైన విషయమేమిటంటే, వింటేజ్ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల వేలంలో యాపిల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గత నెలలో, ఐఫోన్ 2007 మొదటి-ఎడిషన్ను $190,000కి విక్రయించగా.. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి. చదవండి బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు! -
షిప్మెంట్లో ఐఫోన్ సరికొత్త రికార్డ్లు
ఐఫోన్ షిప్మెంట్లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. 2022లో 6.7 మిలియన్ల ఐఫోన్ల షిప్మెంట్ జరగ్గా.. ఈ ఏడాది అత్యధికంగా 8 నుంచి 9 మిలియన్ ఐఫోన్ షిప్మెంట్ జరిగే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది గడిచిన ఆరు నెలల కాలంలో 4 మిలియన్లకు పైగా ఐఫోన్ అమ్మకాలు రెట్టింపు అయినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్, ఐడీసీని ఉటంకిస్తూ.. 2023లో ఐఫోన్ షిప్మెంట్లు దాదాపు 8-9 మిలియన్లు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ తన మార్కెట్ వాటాను 6-7 శాతానికి చేరుకుంటుందని మార్కెట్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ 15 లాంచ్తో పాటు పండగలు, డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు సైతం ఐఫోన్ అమ్మకాలకు కలిసొచ్చే అవకాశం ఉంది. కాగా, జూన్ 30న యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సంవత్సరం జనవరి నుండి మొదటిసారిగా 3 ట్రిలియన్ మార్కును దాటింది. -
యాపిల్ ఐఫోన్ లవర్స్కు బ్యాడ్న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లవర్స్కు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిరీస్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలలో జాప్యం ఏర్పడనుంది. ముందే అనుకున్న విడుదల షెడ్యూల్ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్ట్ వంశీ మోహన్ మాట్లాడుతూ.. ఐఫోన్ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఫోన్ క్యూ4లో అంటే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉందని అన్నారు. డిస్ప్లే సమస్యలే కారణమా? ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. యాపిల్ సంస్థ ఫోన్ల డిస్ప్లే సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లిమిటెడ్ ఫోన్లకే డిస్ప్లేలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 15 ఫోన్ల డిస్ప్లే బెజెల్స్ పరిణామాన్ని తగ్గించడంతో పాటు, ఐఫోన్ల డిస్ప్లేలను ఎల్జీ తయారు చేస్తుంది. వీటి తయారీలోనూ ఆలస్యానికి కారణమని సమాచారం. యాపిల్ వాచ్ 7 డిస్ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్ వాచ్ 7ను మార్కెట్లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!