-
కేంద్రం కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల వడ్డీ రేట్లు పెంపు!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వీటిపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి – మార్చి కాలానికి కొత్త రేట్లు అమలు కానున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 2.25 శాతం మేర కీకలమైన రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించినట్టు తెలుస్తోంది. వివిధ పథకాలపై పెంపు 0.20–1.1 శాతం మధ్య ఉంది. తాజా పెంపు తర్వాత కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ప్రధానంగా జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే, సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ పథకాల రేట్లను కేంద్ర సర్కారు 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సవరించడం గమనార్హం. అప్పుడు 0.10–0.30 శాతం మేర మూడు పథకాల రేట్లను పెంచింది. తాజా సవరణ తర్వాత బ్యాంక్ ఎఫ్డీ రేట్లకు, ఈ పథకాల రేట్లకు పెద్దగా వ్యత్యాసం లేదు. -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారం కానున్నాయి. ఈ పెంచిన రేట్లు నవంబర్ 15, 2022 నుండి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వాహన, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లు ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయించబడతాయి. అయితే ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్లు అంతకుముందు 7.95 శాతం నుండి 10 బేసిస్ పాయింట్లు (bps) 8.05 శాతానికి పెంచింది అలాగే, రెండేళ్లు , మూడేళ్ల ఎంసీఎల్ఆర్లను ఒక్కొక్కటి 10 బేసిస్ పాయింట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి పెంచినట్లు ఎస్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్లను ఒక్కొక్కటి 15 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి, ఓవర్నైట్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.60 శాతానికి చేరుకుంది. ఎంసీఎల్ఆర్ అంటే కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటే ..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ అంటారు. రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్ఆర్ ఆటోమేటిక్గా రుణాల కాస్ట్పై ప్రభావం చూపుతుంది. రుణాలపై వడ్డీరేటు పెరిగితే నెలవారీ ఈఎంఐలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసీఎల్ఆర్పై ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపైనా ఈఎంఐ ప్రభావం పడుతుంది. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్) 4.50 శాతానికి పెంచింది. ► 90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది. ►1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది. ►1 రోజు నుంచి ఏడాదికి కాలానికి 9 నెలలు ఎఫ్డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు. గమనిక : పెరిగిన పిక్స్డ్ రేట్లు ►ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్డీ టెన్యూర్ కాలానికి 6.10 శాతం, 15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్ పొందవచ్చు. ►ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్ కాలానికి) చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు. గమనిక : పెరిగిన రికరింగ్ డిపాజిట్ రేట్లు ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే సాధారణ రికరింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. చదవండి👉 భారత్లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! -
సేవింగ్ అకౌంట్తో డబ్బులు సంపాదించండిలా
మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్లోనా? అయితే మీ సేవింగ్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా? మీ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్ అకౌంట్కు స్వీప్ - ఇన్ ఎఫ్డీ ఆప్షన్ను ఎనేబుల్ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్ అకౌంట్గాను, వినియోగించకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్గా పనిచేస్తుంది. షార్ట్ టర్మ్లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్వీప్-ఇన్ స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్ అకౌంట్లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్ ఇయర్ టెన్యూర్ కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్ను పొందవచ్చు. స్వీప్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్ అకౌంట్పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది? కొన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్ను .. ఫిక్స్డ్ డిపాజిట్కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్- ఇన్ ఆప్షన్ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. స్వీప్-ఇన్ అకౌంట్ అర్హతలు అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ను ఓపెన్ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ. 25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్తో ఏటీఎం నుండి నగదును విత్డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
లోన్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) 20 బేసిస్ పాయింట్లు లేక 0.2 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఎస్బీఐసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ రుణ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం బ్యాంక్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 7.60 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది. -
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు అలెర్ట్. మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో వడ్డీ మొత్తం కనిపించడంలేదని కంగారు పడుతున్నారా? సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్మెంట్లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో ఆ వడ్డీని జమ చేస్తుంది. ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లబ్ధి దారుల అకౌంట్లలో డిపాజిట్ అయ్యింది. 2021-22 సంబంధించి ఈపీఎఫ్ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. There is no loss of interest for any subscriber. The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII — Ministry of Finance (@FinMinIndia) October 5, 2022 దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నిర్ణయించిన వడ్డీ మొత్తం ఇప్పటి వరకు తమ అకౌంట్లలో జమ కాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్దాస్ పాయ్ పీఎఫ్ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్లో స్పష్టం చేసింది. -
ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డీఎఫ్సీ మే 18, 2020లో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 0.25శాతం అదనపు వడ్డీతో మే 18, 2020 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. తేడా ఎంతంటే ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు. టెన్యూర్ లోపు డ్రా చేస్తే అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్లను ప్రీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది. చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే! -
మరోసారి వడ్డీరేట్లు పెంచిన RBI
-
మరోసారి వడ్డీ రేట్లు పెంచిన RBI
-
చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వరుసగా రేట్ల తగ్గింపులతో చిన్నబోయిన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి కీలకమైన వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతున్నాయి. మన ఆర్బీఐ కూడా ఇదే బాటలో నడుస్తోంది. మే చివరి నుంచి ఇప్పటి వరకు 1.4 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో మార్కెట్ తీరుకు అనుగుణంగా, తొమ్మిది వరుస త్రైమాసికాల యథాతథ స్థితి తర్వాత.. చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సైతం కేంద్ర సర్కారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.30 శాతం వరకు పలు పథకాల రేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే పథకాలపై ప్రధానంగా రేట్లను పెంచింది. అదే సమయంలో కొన్ని పథకాల రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతి త్రైమాసికానికీ ఈ పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే తదుపరి మూడు నెలల కాలానికి తాజా రేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల టైమ్ డిపాజిట్పై ప్రస్తుతం 5.5 శాతం రేటు ఉంటే, ఇక మీదట ఇది 5.8 శాతం కానుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్పై రేటు 0.20 శాతం పెరిగి 7.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ పథకంలో రేటు 7.4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి (123 నెలలకు మెచ్యూరిటీ).. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో రేటును 6.6 శాతం నుంచి 6.7 శాతానికి కేంద్రం సవరించింది. వీటిల్లో మార్పు లేదు..: ఏడాది, ఐదేళ్ల ఎఫ్డీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల రేట్లు ప్రస్తుతమున్న మాదిరే మరో మూడు నెలలు కొనసాగుతాయి. ఈ పథకాల రేట్లను కేంద్రం సవరించలేదు. సవరించిన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
మీకే రుణాలిస్తాం..చిరు వ్యాపారులకు జై కొట్టిన బ్యాంకులు!
ముంబై: మహమ్మారి కరోనా ముందటి స్థాయిలతో పోలిస్తే చిన్న వ్యాపారాలకు రుణ పంపిణీ రెట్టింపు అయ్యింది. అయితే బ్యాంకర్లు రుణ పంపిణీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇప్పటికే ఖాతాలు కలిగి ఉన్న రుణ గ్రహీతలకే తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ మొగ్గు చూపింది. రుణ సమాచార కంపెనీ– సిబిల్ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుండి రుణాల కోసం డిమాండ్ (వాణిజ్య క్రెడిట్ విచారణల సంఖ్య ప్రాతిపదికన) కరోనా ముందస్తు స్థాయితో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.6 రెట్లు పెరిగింది. ►మొత్తం ప్రత్యక్ష ఎంఎస్ఎంఈ రుణగ్రహీతల సంఖ్య మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 6 శాతం వృద్ధి రేటుతో 7 మిలియన్లకు చేరుకుంది. ►ఎంఎస్ఎంఈ విభాగంలో ఎన్పీఏలు మార్చి 2021 నుండి పెరుగుతున్నాయి. మహమ్మారి వల్ల సూక్ష్మ పరిశ్రమ విభాగం ఎక్కువగా దెబ్బతింది. ►వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కంటే టర్మ్ లోన్ విషయంలో ఎక్కువగా పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది సానుకూల సంకేతంగా పేర్కొనవచ్చు. ►ఎంఎస్ఎంఈలు క్యాష్ క్రెడిట్, ఓవర్డ్రాఫ్ట్ (సీసీ, ఓడీ) రుణాల ద్వారా తమ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) అవసరాలను నిర్వహిస్తున్నాయి. చదవండి👉 మరింత తగ్గనున్న మొండిబాకీల భారం -
వరల్డ్ టాప్ బ్యాంకర్..సాఫ్ట్ బ్యాంక్కు ఊహించని షాక్!
టోక్యో: అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనల కారణంగా పెట్టుబడుల విలువ కరిగిపోవడంతో జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 23.4 బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే వ్యవధిలో 5.6 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది. సమీక్షాకాలంలో అమ్మకాలు 6 శాతం పెరిగి 11.6 బిలియన్ డాలర్లకు చేరాయి. కంపెనీ ఏర్పాటైన తర్వాత నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టాలు ఎన్నడూ చూడలేదని సంస్థ సీఈవో మసయోషి సోన్ తెలిపారు. గత ఆరు నెలలుగా నమోదైన నష్టాలు 37 బిలియన్ డాలర్లకు ఎగిశాయని వివరించారు. చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబాలో వాటాల విలువ భారీగా పడిపోవడం .. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నష్టాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిల్చింది. అలాగే, యెన్ విలువ పడిపోవడం కూడా మరో కారణం. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా ఈ సవాళ్లు నెలలు లేదా సంవత్సరాల తరబడి కూడా కొనసాగవచ్చని సోన్ పేర్కొన్నారు. -
మిరే అస్సెట్ తక్కువ వడ్డీకే స్టాక్ ఫండింగ్
ముంబై: మిరే అస్సెట్కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్కు సంబంధించి 80 శాతం మార్జిన్ను పొందొచ్చని వివరించింది. మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి!
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్ )రుణాల్ని 10బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం పడనుంది. ఎంసీఎల్ఆర్ అంటే ఎంసీఎల్ఆర్ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్ఆర్ను వాడుక భాషలో సింపుల్గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్) ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్లతో పాటు, టెన్యూర్ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి.పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఎంసీఎల్ఆర్పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. జూలై15 (నేటి) నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఇంట్రస్ట్ రేట్లు ఎస్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఎంసీఎల్ఆర్ రేట్లు టెన్యూర్ను బట్టి మారాయి. ఆ వడ్డీ రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసుకుందాం. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. 6నెలల టెన్యూర్ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి వన్ ఇయర్ టెన్యూర్ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి. అదనపు భారం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనుంచి ముఖ్యంగా హోం లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది. చదవండి: తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్! -
ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐల లాభాలు పెరుగుతాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత పుంజుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. నూతన నియంత్రణపరమైన కార్యాచరణ కింద అవి మెరుగైన రేట్లకు రుణాలు ఇచ్చే వెసులుబాటు లాభాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం పెరుగుతున్న వడ్డీ రేట్ల క్రమం.. ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐల లాభాలను ప్రభావితం చేయకపోవచ్చని, నిధులపై అవి వెచ్చించే అధిక వ్యయాలను, రుణాలపై అధిక వడ్డీ రేట్ల రూపంలో అధిగమించగలవని పేర్కొంది. దీంతో నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గానే ఉంటాయని తన నివేదికలో అంచనా వేసింది. రుణ రేట్లను నిర్ణయించడంలో పెరిగిన అనుకూలతే వాటి లాభదాయకతకు తోడ్పడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. పెరిగిన రేట్లు.. ఇప్పటికే చాలా వరకు ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు రుణ రేట్లను 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు పెంచినట్టు క్రిసిల్ రేటింగ్స్ డిప్యూటీ చీఫ్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. దీంతో వాటికి పెరిగిన రుణ సమీకరణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు తగినంత వెసులుబాటు ఉందని చెప్పారు. అలాగే, ఆస్తుల నాణ్యత సవాళ్లను ఎదుర్కొనేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువ నిధులను పక్కన పెట్టినందున, అవసరమైతే ఆయా నిధులను కూడా వినియోగించుకోగలవన్నారు. ఆదాయ పరిమితి పెంచడం (రుణ గ్రహీతల), రుణ రేట్లను నిర్ణయించడంలో వచ్చిన వెసులుబాటు వల్ల ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు ప్రస్తుత మార్కెట్లలోనే మరింతగా చొచ్చుకుపోగలవని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు, అసలు కారణం ఇదే!
న్యూఢిల్లీ: హైదరాబాద్తోపాటు దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) 15 శాతం తగ్గాయి. 84,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) ఇళ్ల విక్రయాలు 99,550 యూనిట్లుగా ఉన్నాయి. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల విక్రయాలు 24,569 యూనిట్లతో పోలిస్తే 3.5 రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో 11,190 యూనిట్లు ఏప్రిల్–జూన్లో హైదరాబాద్ మార్కెట్లో 11,190 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చిలో విక్రయాలు 13,140 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే, జూన్ త్రైమాసికంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం తగ్గి 25,785 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 19 శాతం తక్కువగా 15,340 యూనిట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులో 14 శాతం తగ్గి 11,505 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలో 11 శాతం తగ్గి 12,500 యూనిట్లు, చెన్నైలో 24 శాతం క్షీణించి 3,810 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్కతాలోనూ 20 శాతం తక్కువగా 4,800 యూనిట్లు విక్రయమయ్యాయి. కొనుగోలు వ్యయాలు పెరగడం వల్లే.. ‘‘నిర్మాణ వ్యయాలు పెరిగినందున డెవలపర్లు ప్రాపర్టీల రేట్లను పెంచాల్సి వచ్చింది. ఆర్బీఐ రెండు విడతలుగా రేట్ల పెంపుతో గృహ రుణ రేట్లు పైకి ఎగబాకాయి. ఈ రెండు అంశాలతో కొనుగోలు వ్యయం పెరిగిపోయింది. ఇళ్ల విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. చదవండి👉 దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు తక్కువే! -
వడ్డీలు కట్టలేక చేతులెత్తేసిన ‘ఫ్యూచర్’!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా రూ. 6.07 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. కంపెనీ గతంలో జారీ చేసిన మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)పై ఈ నెల 20కల్లా వడ్డీ చెల్లించవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే ప్రతికూల పరిస్థితులతో వీటిపై వడ్డీ చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ. 120 కోట్ల విలువైన సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఈ సెక్యూర్డ్ డిబెంచర్లను వార్షికంగా 10.15 శాతం కూపన్ రేటుతో జారీ చేసింది. కాగా.. ఈ నెల మొదట్లోనూ రూ. 29 కోట్ల విలువైన ఎన్సీడీలపై రూ. 1.41 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో కంపెనీ విఫలంకావడం గమనార్హం! -
ఖాతాదారులకు పీఎన్బీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నిధుల సమీకరణ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా సవరణతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.40 శాతానికి చేరింది. ఓవర్నైట్, నెల, మూడు నెలల రేట్లు వరుసగా 6.75 శాతం, 6.80 శాతం, 6.90 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.10 శాతానికి పెరిగింది. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన బ్యాంక్ ఈఎంఐల భారం వినియోగదారులపై పెరగనుంది. హెచ్డీఎఫ్సీ.. నెలలో ‘మూడవ’ వడ్డింపు కాగా, హెచ్డీఎఫ్సీ గత నెల రోజుల్లో మూడవసారి రుణ రేటును పెంచింది. గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (ఆర్పీఎల్ఆర్) స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త, పాత రుణ గ్రహీతలకు జూన్ 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా పెంపు అనంతరం క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం ప్రాతిపదికన కొత్త రుణ గ్రహీతలకు రుణ రేట్లు 7.05 శాతం నుంచి 7.50 శాతం శ్రేణిలో ఉంటాయి. ప్రస్తుత కస్టమర్లకు ఈ రేట్లు 7–7.45 శాతం శ్రేణిలో ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికి నిర్ణయించిన నేపథ్యంలో బ్యాంకులు తాజా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
ఇళ్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంకేతాలిచ్చారు. అయితే ఇన్నిరోజులు ఆయా బ్యాంకులు ఇంటి రుణాల్ని తక్కువ వడ్డీ రేట్లకే ఆఫర్ చేశాయి. కానీ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలపై వడ్డీలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. భారత్తో పాటు ప్రపంచ దేశాల్ని ద్రవ్యోల్బణం తీవ్రంగా వేధిస్తోంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలకు చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పనిలో పనిగా ఆర్బీఐ సైతం పలు వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ(మే) నెలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ..40 బేసిస్ పాయింట్లు వరకు వడ్డీ రేట్లను పెంచింది. అంతేకాక తదుపరి సమావేశాలలో కూడా వడ్డీ రేట్లను పెంచుతామని హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కరోనాకు ముందు హోం లోన్పై ఎంత వడ్డీ కడుతున్నామో..ఇప్పుడు కూడా అంతే కట్టాల్సి ఉంటుంది.దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు 10 శాతం వరకు పెరగొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆర్బీఐ హోం లోన్లపై ఎంత వడ్డీ విధిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. -
ఫ్యూచర్కు మరో ఎదురు దెబ్బ.. ఈసారి వడ్డీ రూపంలో
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) తాజాగా రూ. 23 కోట్ల నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి రూ. 1.06 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. మే 17న దీన్ని చెల్లించాల్సినట్లు పేర్కొంది గత మూడు నెలల్లో ఫ్యూచర్ గ్రూప్ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి బ్యాంకులకు రూ. 2,836 కోట్ల చెల్లింపులో కూడా విఫలమైనట్లు ఎఫ్ఈఎల్ గత నెల స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్లోని 19 సంస్థలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ డీల్ సాకారం కాలేదు. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను మరోసారి సవరించింది. కొద్ది రోజుల క్రితమే ఆయా టెన్యూర్స్కు సంబంధించి వడ్డీరేట్లను మార్చగా..ఇప్పుడు మరోకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లను సవరిస్తూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీరేట్లు బుధవారం (ఏప్రిల్ 20) నుంచి అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారిక వెబ్సైట్లో...“ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని పేర్కొంది. సవరించిన వడ్డీరేట్ల జాబితా ప్రకారం...హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 7-29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 2.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక 30 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.91 రోజులు- 6 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయినట్లయితే, బ్యాంక్ సాధారణ పౌరులకు 3.5 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డిలపై సాధారణ పౌరులకు 5.1 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 5.6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. సాధారణ పౌరులకు 2 సంవత్సరాల వ్యవధితో 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు వరుసగా 5.2 శాతం, 5.45 శాతం, 5.6 శాతం. సీనియర్ సిటిజన్ల విషయంలో, ఈ రేట్లు వరుసగా 5.7 శాతం, 5.95 శాతం, 6.35 శాతంగా ఉన్నాయి. చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..? -
EPF వడ్డీ రేట్లు తగ్గించడం సరికాదు :విజయసాయిరెడ్డి