Bank Of Maharashtra Increases MCLR Rate By 20 Bps, Details Inside - Sakshi
Sakshi News home page

లోన్‌ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

Published Tue, Oct 11 2022 10:42 AM | Last Updated on Tue, Oct 11 2022 12:33 PM

Bank Of Maharashtra Increases Mclr Rate By 20 Bps - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) 20 బేసిస్‌ పాయింట్లు లేక 0.2 శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఎస్‌బీఐసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ రుణ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే.

 తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం బ్యాంక్‌  ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ 7.60 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement