-
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్..!
ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిపై ప్రతిపాదిత 8.1 శాతం వడ్డీ రేటు ఇతర చిన్న పొదుపు పథకాలు అందించే వడ్డీ రేట్ల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత కాలపు వాస్తవికతలను బట్టి, త్వరలో వడ్డీ రేటును సవరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ రేటును 8.1 శాతానికి తగ్గించాలని బోర్డు ప్రతిపాదించిందని ఆమె రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లులపై చర్చకు సమాధానంగా చెప్పారు. "ఈపీఎఫ్ఓకు ఒక సెంట్రల్ బోర్డు ఉంది, చందాదారులకు ఎంత రేటు ఇవ్వాలనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. వారు కొంతకాలంగా వడ్డీ రేటును మార్చలేదు.. ఇప్పుడు దానిని 8.1 శాతానికి మార్చారు" అని ఆమె పేర్కొన్నారు. ఇది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు తీసుకున్న నిర్ణయం.. బోర్డులో విస్తృత శ్రేణి ప్రతినిధులు ఉన్నారు. సుకన్య సమృద్ధి యోజన(7.6 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (7.4 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం) వంటి ఇతర పథకాలు అందించే రేట్లు చాలా తక్కువగా ఉండగా, ఈ వడ్డీ రేటును 8.1 శాతంగా ఉంచాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. "వాస్తవంగా ఈ రోజు అమలులో ఉన్న ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మిగిలిన వాటి కంటే ఇంకా ఎక్కువగా ఉంది" అని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ సవరణ ఇప్పుడు "నేటి వాస్తవాలను" ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-21లో ఉన్న 8.5 శాతం నుంచి 2021-22 నాటికి 8.1 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. (చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!) -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్బీఐ బాటలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కూడా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 10, 2022 వస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే వర్తించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.6 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50 శాతం. ► 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2 శాతం వడ్డీరేటు ► 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి వడ్డీ రేటు 4.3 శాతం. ► 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీ రేటు ► 1 సంవత్సరం లోపు, ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 3.7 శాతం వరకు ఉంటాయి. పైన పేర్కొన్న రేట్లు సాధారణ , సీనియర్ సిటిజన్లకు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఎఫ్డీలపై వడ్డీ రేట్లను కూడా ఐసీఐసీఐ సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి.ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు మారవు. చదవండి: ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. ఎంతంటే? -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం షాకివ్వనుంది. 40 ఏళ్ల తరువాత తొలిసారి ఈపీఎఫ్ఓపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫర్ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై సమావేశమైంది. ఈ భేటీలో ఖాతాదారులకు 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ వడ్డీ రేట్లు 40ఏళ్ల మందుకు అంటే 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఖాతాలపై 8శాతం ఇవ్వడం గమన్హారం. మళ్లీ 40ఏళ్ల తరువాత అదే తరహాలో వడ్డీ రేట్లు ఇవ్వడానికి కోవిడ్ తో పాటు ఖాతాదారుల నుంచి జమయ్యే నిధి తక్కువ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు ఎలా ఉన్నాయ్! 2011 -2012 లో 8.25శాతం 2012-2013 లో 8.5శాతం 2013-2014 లో 8.75శాతం 2015 -2016లో 8.8శాతం 2016 - 2017లో 8.65శాతం 2017 - 2018లో 8.55శాతం 2018 -2019 లో 8.65శాతం 2019-2020లో 8.5శాతం 2020-2021లో 8.5శాతం 2021 -2022లో 8.1శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు రిపోర్ట్లో హైలెట్ చేస్తున్నాయి. తాజా వడ్డీరేట్ల తగ్గుదల నిర్ణయాన్ని సీబీటీ సభ్యులు కేంద్ర ఆర్ధిక శాఖకు పంపనున్నారు. ఆర్ధిక శాఖ నిర్ణయంతో ఈ తగ్గిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?! -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఎఫ్డీ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల మార్చి 10 నుంచి ఎఫ్డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది. అలాగే, ఈ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. (చదవండి: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ) -
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కోటక్ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీరేట్ల పెంపు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనుంది. కొత్త వడ్డీ రేట్ల అమలు 2022 మార్చి 9 నుంచి సవరించిన కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. దీంతో 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెరిగింది. గతంలో ఈ ఎఫ్డీలపై 4.9 శాతం వడ్డీ రేటును కోటాక్ అందించింది. సీనియర్ సిటిజన్స్కు 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. కాగా గత నెలలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన వడ్డీరేట్లు ఇలా..! ► 7 రోజుల నుంచి 30 రోజుల కాలపరిమితి ఎఫ్డీలపై 2.5 శాతం ► 31 నుంచి 90 రోజుల ఎఫ్డీలపై 2.75 శాతం ► 91 నుంచి 120 రోజుల ఎఫ్డీలపై 3 శాతం వడ్డీ ► 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై వడ్డీ రేటు 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు ఉంటుంది. ► 181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్డీలపై 4.4 శాతం ► 364 రోజుల ఎఫ్డీలపై 4.5 శాతం ► 390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.1 శాతం ► 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.45 శాతం ► 5 ఏళ్లుపై మించిన ఎఫ్డీలపై 5.5 శాతం చదవండి: క్రెడిట్కార్డు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ వార్త..! -
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
Canara Bank Hikes Fixed Deposit Rates: కెనరా బ్యాంక్ తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు(౦.25) శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు మార్చి 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంక్ తెలిపింది. కెనరా బ్యాంక్ 7 నుంచి 45 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వినియోగదారులకు 46 రోజుల నుంచి 90 రోజులు మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.90 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇంకా 180 రోజులు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్డీలకు 4.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కస్టమర్లు 2-3 సంవత్సరాల కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే కస్టమర్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.25 శాతానికి బదులుగా.. 5.45 శాతం వడ్డీ రేటు లభించనుంది. మిగత ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల గురించి బ్యాంక్ పోర్టల్ సందర్శించండి. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడులపై అధిక వడ్డీ రేటును స్వీకరిస్తారని బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు చేసే పెట్టుబడులపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% అధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు "1111 డేస్" రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం కింద డిపాజిట్ రేటుకంటే అదనంగా 0.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 5.55 శాతం. (చదవండి: ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త...!
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ దారిలోనే హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేట్ల పెంపు వుంటుందని బ్యాంకు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 14 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఈ వడ్డీరేట్ల పెంపు కేవలం రూ.2 కోట్లలోపున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనునాయి. ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం 6 నెలలకు గాను 1 రోజుల నుంచి 9 నెలల టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం 9 నెలల గాను 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ఒక ఏడాది పాటు: జనరల్ పబ్లిక్ కోసం - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.35 శాతం -
ఎస్బీఐ కీలక నిర్ణయం, బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!!
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లనుపెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నిర్ణయంపై ఫిక్స్డ్ డిపాజిటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా ..కొత్తగా పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ♦ ఎస్బీఐ వెబ్సైట్ కథనం ప్రకారం..ఎస్బీఐ ఇప్పుడు 2ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ♦2 సంవత్సరాల నుండి 3సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్డ్రేట్ల కాలపరిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.45 శాతానికి చేరింది. ♦ 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీల కాలపరిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరుకుంది. ♦ 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్డీపై వడ్డీ రేట్లు మారవు. ఎస్బీఐ జనవరి 2022లో 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న ఎఫ్డీల వడ్డీ రేటును రూ. 2 కోట్లలోపు 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచిందని గమనించాలి. ఈ ఎఫ్డీలు ఇప్పుడు 5.1 శాతం (5% నుండి పెరిగాయి) సీనియర్ సిటిజన్లు 5.6% (5.5% నుండి) వడ్డీని పొందవచ్చు. ♦ డిసెంబర్ 2021లో ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బీపీఎస్కి పెంచింది. కొత్త బేస్ రేటు, అంటే సంవత్సరానికి 7.55శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో మరియు రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. -
మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!
ఈపీఎఫ్ఓకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వచ్చే నెలలో గౌహతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో 22021-22కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 5 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మార్చి రెండో వారంలో గౌహతిలో సమావేశం కానుంది. వడ్డీ రేటు, కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి తదితర విషయాల గురించి సమావేశంలో చర్చించనుంది. 2020-21లో పీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించిన విధంగా 2021-22కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అందిస్తుందా అని మీడియా అడిగినప్పుడు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిస్తూ.. ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2021 మార్చిలో నిర్ణయించింది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2021లో ఆమోదించింది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ 2020-21కు వడ్డీ ఆదాయాన్ని 8.5 శాతంగా చందాదారుల ఖాతాలోకి క్రెడిట్ చేయాలని ప్రాంత కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును సీబీటీ నిర్ణయించిన తర్వాత, ఈ వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ మేరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును చందాదారుల ఖాతాలో జమ చేస్తుంది. (చదవండి: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా శుభవార్త..!) -
పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు.. వడ్డీ రేటు పెరిగే అవకాశం..!
పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్ఓ తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించడానికి గౌహతిలో మార్చి 4-5న సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ బోర్డు ఆదాయాలపై చర్చించడానికి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ(ఎఫ్ఐఏసీ) బుధవారం సమావేశం కానుంది. గత ఆర్థిక సంవత్సరం 2020-21కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ బోర్డు గత ఏడాది మార్చిలో ఖరారు చేసింది. గత 8 ఏళ్లలో ఈపీఎఫ్ఓ అందించిన అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. ఈపీఎఫ్ బోర్డు తన చందాదారులకు ఎఫ్ వై21 వడ్డీ రేటును క్రెడిట్ చేయడం ప్రారంభించింది. "2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50% వడ్డీతో 23.59 కోట్ల ఖాతాలు క్రెడిట్ చేయబడ్డాయి" అని డిసెంబర్ 20న ఒక ట్వీట్లో బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పీఎఫ్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే ఇది మునుపటి వడ్డీ రేట్ల కంటే తక్కువ. 2019-20కి వడ్డీ రేటు 8.5 శాతంగా నిర్ణయించారు. ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ. 2018-19లో పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం. 2016-17 సంవత్సరంలో EPFO సభ్యులకు 8.65 శాతం వడ్డీని ఇచ్చింది. ఈపీఎఫ్ సభ్యులు ఎస్ఎమ్ఎస్ ద్వారా బ్యాలెన్స్ ఎంతో మనం చెక్ చేసుకోవచ్చు. కేవలం ‘EPFOHO UAN’ అని టైప్ చేసి తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేయడానికి ఈపీఎఫ్ సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. (చదవండి: హైదరాబాద్లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీ రెడీ.. మూడు వేల మందికి ఉపాధి!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
తన ఖాతాదారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. ఖాతాదారుడి ఖాతాలో నిర్వహించే రోజువారీ బ్యాలెన్స్ మీద వడ్డీ లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఈ వడ్డీలను త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచిన కొత్త వడ్డీలు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 3 శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఖాతాలో రూ. 50 లక్షల నుంచి రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మీద బ్యాంక్ 3.50 శాతం వడ్డీని ఇస్తుంది. అదే సమయంలో, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మొత్తం మీద వడ్డీ రేటు 4.50 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సవరించిన రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ పొదుపు ఖాతాలకు వర్తిస్తాయని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై విధించే వడ్డీరేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోవైపు ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ, ఎన్ఆర్ఐ పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతకు ముందు, రూ.10 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ గల ఖాతాలకు 2.80 శాతం వడ్డీరేటును ఇస్తే, ఈప్పుడు అది 2.75 శాతానికి తగ్గింది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్ల మీద ఇచ్చే వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఫండ్ రూ.500 కోట్లు కంటే ఎక్కువ ఖాతా బ్యాలెన్స్పై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి పంజాబ్ & సిండ్ బ్యాంక్ పంజాబ్ & సిండ్ బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుంచి పొదుపు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రభుత్వ రంగ రుణదాత ఇప్పుడు రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా నిల్వలపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.20 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, అలాగే ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వర్తిస్తాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!) -
పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై చెల్లించే ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీపీబీ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.25% వడ్డీ రేటు లభిస్తుంది. లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభించనుంది. గతంలో రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభిస్తే, లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.75% వడ్డీ రేటు లభించేది. రోజు వారి బ్యాలన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈఓడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత నెలలో 5 కోట్ల మంది కస్టమర్లకు చేరుకొని సరికొత్త మైలురాయిని అధిగమించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. (చదవండి: ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. అదుర్స్!) -
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. తాజా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 20 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు కూడా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. మరిన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దం అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన అధికారిక పోర్టల్లో వడ్డీ రేట్లకు సంబంధించన కొత్త జాబితాను ప్రకటించింది. సాదారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఎక్కువగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్స్ కి అదనంగా వడ్డీ రేటు లభించదు. కొత్త ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగారూ.2.4 కోట్లు లాభం!) -
బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా..! అయితే మీకో గుడ్న్యూస్!
బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్లు పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా దారులు వడ్డీరేట్ల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన ఆ ఇంటస్ట్ర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం? దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు తర్వాత వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంటుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా..,రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి.ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ పొందేందుకు కనీస వ్యవధి 7 రోజులు. వడ్డీ ఒక సంవత్సరంలోని రోజుల సంఖ్య ఆధారంగా లెక్కించబడుతుంది. లీపు సంవత్సరంలో వడ్డీ 366 రోజులకు లెక్కించబడుతుంది, సాధారణ సంవత్సరంలో వడ్డీ 365 రోజులకు లెక్కించబడుతుంది. కాగా, పెరిగిన వడ్డీ రేట్లపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమీక్రాన్ కేసులు పేరుగతున్న తరుణంలో కేంద్రం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2022తో ముగిసే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కూడా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం నుంచి స్థిర ఆదాయం పొందే పెట్టుబడిదారులకు ఉపశమనం కలగనుంది. అంటే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన చిన్న పొదుపు పథకాలకు సెప్టెంబర్-డిసెంబర్ 2021 మధ్య కాలంలో వర్తించే వడ్డీరేట్లు 31 మార్చి 2022 వరకు వర్తించనున్నాయి. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్హోల్డర్లకు వార్షిక వడ్డీ 7.1 శాతం లభిస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది. ఇక సుకన్య సమృద్ధి అకౌంట్పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్కీమ్ ఇదే. ఇక ఐదేళ్ల మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్కు 6.6 శాతం వడ్డీ, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్కు 5.5 శాతం, ఐదేళ్ల డిపాజిట్కు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు ఖాతాలకు 4% వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 2020 నుంచి ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. (చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?) -
కొత్త ఇల్లు కొనేవారికి గుడ్న్యూస్..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్న్యూస్ తెలిపింది. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్తో లేదా వారి స్వంత ప్రాక్టీస్లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. క్రెడిట్ స్కోరు 750 పైగా ఉండాలి అలాగే, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. వీరికి మాత్రమే గృహ రుణాలు 6.65% వడ్డీ రేటుకు లభిస్తాయి. 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా ఈ వడ్డీ రేటును పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరి షరతు ఏమిటంటే కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందడానికి అర్హులు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!) -
గృహ కొనుగోలుదారులకు గుడ్న్యూస్.. ఆ బ్యాంకులో వడ్డీ రేటు 6.40% మాత్రమే!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎమ్) 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ కింద ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మార్కెట్ పోటీకి అనుగుణంగా కారు రుణాలపై ప్రస్తుతం ఉన్న 7.05 శాతం వడ్డీ రేటును కూడా 6.80 శాతానికి బ్యాంకు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి ఉంటాయని బీఓఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ రేటు రుణగ్రహీతల క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుందని తెలిపింది. బ్యాంకు ఇప్పటికే తన బంగారం, గృహ నిర్మాణం & కారు రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. "రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వల్ల వినియోగదారులు తమ రుణాలపై మరింత ఆదా చేసుకోవచ్చు అని, ఇది వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని బీఓఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. (చదవండి: మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా) -
RBI: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి సర్దుబాటు నిర్ణయం వైపే మొగ్గు చూపింది. వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది ఆర్బీఐ. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. అలాగే ఎంఎస్ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేట్లను 4.25 శాతానికే పరిమితం చేసినట్లు తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం & రాష్ట్ర వ్యాట్ తగ్గింపులు.. కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్కు మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం డిమాండ్కు మద్దతునిస్తూ ఆగస్టు నుంచి ప్రభుత్వ వినియోగం కూడా పుంజుకుంది. ► 2021-22లో వాస్తవ GDP వృద్ధి అంచనా 9.5% వద్ద ఉంచబడింది, Q3లో 6.6% & Q4లో 6% ఉంటుంది. వాస్తవ GDP వృద్ధి 2022-23 Q1కి 17.2% మరియు 2022-23 Q2కి 7.8%గా అంచనా వేయబడింది. ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. ఇది డిమాండ్ బలపడుతున్నప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణానికి వేగంగా ప్రసారం చేయబడుతుంది ► ధరల ఒత్తిడి తక్షణ కాలంలో కొనసాగవచ్చు. రబీ పంటలకు ప్రకాశవంతమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల ధరలు శీతాకాలపు రాకతో కాలానుగుణ దిద్దుబాటును చూడగలవని అంచనా. ► 2021-22లో CPI ద్రవ్యోల్బణం 5.3%గా అంచనా వేయబడింది. ఇది క్యూ3లో 5.1%, మరియు క్యూ4లో 5.7% రిస్క్ విస్తృతంగా సమతుల్యతతో ఉంటుంది ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. చదవండి: మార్కెట్ నుంచి మాయమవుతున్న రూ.2000 నోట్లు ! కారణాలు ఇవే -
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ వినియోగదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వల్ల గత కొంత కాలంగా ఎఫ్డీలపై అందించే వడ్డీ రేట్లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సి)లు తగ్గించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు తీపికబురు అందించాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ 33 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీని అందించేంది. అలాగే, 66 నెలల ఎఫ్డీలపై అందించే వడ్డీ రేటు 6.6 శాతంగా, 99 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.65 శాతంగా వడ్డీని ఉండేది. కానీ, ఇప్పుడు దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. దీంతో 33 నెలల కాలపరిమితితో కూడిన రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. 66 నెలల కాలపరిమితితో రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై 6.7శాతం, 99 నెలల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. (చదవండి: భారత్లో రైతుల ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే..!) బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డీ వడ్డీ రేట్లు బజాజ్ ఫైనాన్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య కాలవ్యవధి గల ఎఫ్డీలకు ఇచ్చే వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు/0.30% వరకు పెంచింది. అయితే, 12-23 నెలల కాలపరిమితితో కూడిన ఎఫ్డీ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు లేదు. 24 నెలల-35 నెలల మధ్య కాలపరిమితితో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ల కోసం సంవత్సరానికి 6.4% వడ్డీ రేటు చెల్లిస్తే, 36 నెలల-60 నెలల మధ్య డిపాజిట్లకు సంవత్సరానికి 6.8% వడ్డీ రేటు చెల్లించనుంది. అయితే, ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకు ముందు ఈ రెండు సంస్థలు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు పెంపు
ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా 0.05 శాతం పెరిగింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. దేశంలో వడ్డీరేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం అయితే, ఇది 6.55 శాతానికి పెరిగింది. నిజానికి పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంక్ సెప్టెంబర్లో వడ్డీరేటును తగ్గించింది. పోటీరీత్యా మిగిలిన బ్యాంకులూ ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి.తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్ ఆఫర్కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ వ్యవహారాల ప్రెసిడెంట్ అంబుజ్ చందనా పేర్కొనడం గమనార్హం. కోటక్ కీలక ట్వీట్ నేపథ్యం... కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ట్వీట్ నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి’ అని ఉదయ్ కోటక్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ త్వరలో శుభవార్త చెప్పనుంది. తన ఖాతాదారులకు వడ్డీ జమ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, రిటైర్డ్ బోర్డు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) కింద కొత్త నిబంధనను రూపొందించింది. ఈపీఎఫ్ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనం, కరువు భత్యం(డీఏ) లేదా వారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులో 75 శాతం వరకు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. (చదవండి: డ్రీమ్-11కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్...!) ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్కు వస్తాయి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.(చదవండి: ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!) -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
Bajaj Housing Finance Home Loan Rates: మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(బిహెచ్ఎఫ్ఎల్) నేడు (అక్టోబర్ 1) గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం & ఉపాధి ఉన్న దరఖాస్తుదారులు ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహితలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో తెలిపింది. ఇప్పటికే ఉన్న గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బిఎఫ్సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి. సెప్టెంబర్ 21న హెచ్డీఎఫ్సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని తెలిపింది. రుణ మొత్తం, ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుంది. (చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్!) -
కొత్త ఇల్లుకొనేవారికి హెచ్డీఎఫ్సీ ఫెస్టివల్ బొనాంజా!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) పండుగ ఆఫర్లలో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 6.70 శాతానికి గృహ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. అయితే, క్రెడిట్ స్కోర్ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద, కస్టమర్లు 20 సెప్టెంబర్ 2021 నుంచి 6.70 శాతానికి హెచ్డీఎఫ్సీ అందించే గృహ రుణాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తం లేదా ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 31 అక్టోబర్ 2021 వరకు అందుబాటులో ఉండనున్నట్లు రుణదాత తెలిపింది. గతంలో ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా సైతం పండగ సీజన్ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసింది.(చదవండి: అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్!) -
రిస్క్ తక్కువ.. నాణ్యత ఎక్కువ
యాక్సిస్ షార్ట్టర్మ్ ఫండ్: వృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఆర్బీఐ ఎంపీసీ ఆగస్ట్ భేటీలో రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, సర్దుబాటు ధోరణినే కొనసాగించింది. లిక్విడిటీని సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో వేరియబుల్ రివర్స్ రెపో (వీఆర్ఆర్) మొత్తాన్ని పెంచింది. దీంతో భవిష్యత్తు వడ్డీ రేట్ల గమనంపై అనిశ్చితి కొనసాగనుంది. మోస్తరు రిస్క్ తీసుకుని, ఏడాది నుంచి మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేసుకునే వారు షార్ట్ డ్యురేషన్ (స్వల్ప కాల) ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు డెట్, మనీ మార్కెట్ సాధనాలైన కార్పొరేట్ బాండ్లు, డిబెంచరర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు), ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. 1–3 ఏళ్ల కాలంతో కూడిన సాధనాలను ఎంపిక చేసుకుంటాయి. ఈ విభాగంలో యాక్సిస్ షార్ట్టర్మ్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. పనితీరు.. ఈ పథకాల రాబడుల్లో అస్థిరతలను గమనించొచ్చు. కానీ, రాబడులు అధికంగా ఉంటాయి. యాక్సిస్ షార్ట్ టర్మ్ పనితీరును గమనిస్తే స్థిరంగా కనిపిస్తుంది. వ్యాల్యూరీసెర్చ్ 4స్టార్ రేటింగ్ ఇచ్చిన పథకం ఇది. ఏడాది కాలంలో 8.9 శాతం, మూడేళ్లలో 8.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఐదేళ్లలో 7.52 శాతం, ఏడేళ్లలో 8 శాతం, 10 ఏళ్లలో 8.24 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఎఫ్డీ రాబడుల కంటే ఇవి మెరుగైనవే. ఈ పథకం నిర్వహణలో రూ.12,183 కోట్ల పెట్టుబడులున్నాయి. రిస్క్ విషయంలో సగటు కంటే తక్కువ విభాగంలో ఈ పథకం ఉంది. చదవండి: ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు పోర్ట్ఫోలియో.. అధిక నాణ్యత, తక్కువ రిస్క్ అనే విధానాన్ని యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్ అనుసరిస్తుంది. ప్రస్తుతం ఏడాది కాలవ్యవధితో కూడిన కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉంది. అధిక రేటింగ్ కలిగిన దీర్ఘకాల కార్పొరేట్ బాండ్స్లోనూ కొంత పెట్టుబడులున్నాయి. పోర్ట్ఫోలియోలో ఉన్న స్వల్పకాల సాధనాలు.. సమీప కాలంలో వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు తోడ్పడతాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. దీర్ఘకాలంతో కూడిన సాధనాల నుంచి మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 2021 జూలై నాటికి పథకం పోర్ట్ఫోలియోలోని సాధనాల సగటు మెచ్యూరిటీ 2.90 సంవత్సరాలుగా ఉంది. విడిగా పరిశీలిస్తే.. 27 శాతం పెట్టుబడులు ఏడాది వరకు కాల వ్యవధి కలిగిన సాధనాల్లోనూ.. 39 శాతం పెట్టుబడులు 1–3 ఏళ్ల సాధనాల్లోనూ ఉన్నాయి. 3–5 ఏళ్ల కాలవ్యవధి సాధనాల్లో 11 శాతం, అంతకుమించిన కాలవ్యవధి కలిగిన డెట్ ఇన్స్ట్రుమెంట్లలో 14 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న సాధనాల నాణ్యతను పరిశీలించినట్టయితే.. ఏఏఏ రేటెడ్ పేపర్లలోనే 83 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఏఏఏ అనేది అధిక నాణ్యతకు సూచిక. 9 శాతం పెట్టుబడులు ఏఏప్లస్ డెట్ పేపర్లలో ఉన్నాయి. -
దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ
ముంబై: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.