-
సెప్టెంబర్ 14 నుంచి గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో ఉన్న అవకాశాలు, డిమాండ్పై కంపెనీలు చర్చించనున్నాయి. ముంబైలో సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో 2023’ ఇందుకు వేదికగా నిలవనుంది. పరిశ్రమకు చెందిన 500 మందికి పైగా ఇందులో పాల్గొననున్నారు. ఈ వివరాలను విగ్రో కమ్యూనికేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ (వీసీఈ) ప్రకటించింది. డిమాండ్ను సృష్టించడం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలు, కొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి తదితర అంశాలపై స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీల ప్రతినిధులు చర్చించనున్నారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో స్టెయిన్లెస్ స్టీల్ కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పోలో భాగంగా సీఈవోలతో రౌండ్ టేబుల్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయి. వీటికితోడు పరిశ్రమ తరఫున సాంకేతిక సదస్సులు కూడా ఉంటాయి’’అని వీసీఈ డైరెక్టర్ అనితా రఘునాథ్ తెలిపారు. -
జేఎల్ఎల్కు రోల్స్-రాయిస్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తాజాగా కాంప్లెక్స్ పవర్, ప్రొపల్షన్ సొల్యూషన్స్ అభివృద్ధి, తయారీలో ఉన్న రోల్స్–రాయిస్ నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్ట్ను దక్కించుకుంది.ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమయ్యే దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా భారీగా విస్తరించనుంది. తమ వైవిధ్యమైన ప్రాజెక్టులను సురక్షితమైన, స్థిరమైన, స్పూర్తిదాయకంగా అందించడం లక్ష్యమని ప్రాపర్టీ సర్వీసెస్ , రోల్స్ - రాయిస్ గ్లోబల్ హెడ్, ఆండ్రూ మెక్మానస్, చెప్పారు. ఇవీ చదవండి: iQoo Z7 Pro 5g వచ్చేసింది..రూ.20 వేలలో బెస్ట్ 5g ఫోన్ 30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్ భారత్ సహా ఆరు దేశాల్లో రోల్స్–రాయిస్కు చెందిన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోకు సౌకర్యాల నిర్వహణ సేవలను జేఎల్ఎల్ అందించనుంది. ఆరు దేశాల్లోని 44 కేంద్రాల్లో 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోల్స్–రాయిస్కు చెందిన తయారీ, గిడ్డంగులు, కార్యాలయాలను 2024 ఫిబ్రవరి నుంచి జేఎల్ఎల్ నిర్వహిస్తుంది. -
జూలైలో ఎగుమతులు 16% డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. నాలుగు నెలల్లోనూ.. ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్పాల్ సింగ్ బంగా లేదా అజయ్బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్పాల్ సింగ్ బంగా అట్లాంటిక్లో వైస్ చైర్మన్గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
చైనాను బీట్ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా భారతదేశం చైనాను అధిగమించింది. దాదాపు 21 ట్రిలియన్ డాలర్ల అసెట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 85 సావరిన్ వెల్త్ ఫండ్లు, 57 సెంట్రల్ బ్యాంకులు, 142 చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రపంచ పెట్టుబడి నిర్వహణ సంస్థ ఇన్వెస్కో వెల్లడించిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపించింది. ‘‘ఇన్వెస్కో గ్లోబల్ సావరిన్ అసెట్ మేనేజ్మెంట్ స్టడీ’’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ భారతదేశలో మెరుగైన వ్యాపార పరిస్థితులు, రాజకీయ స్థిరత్వం, అనుకూలమైన జనాభా, నియంత్రణ పరమైన సానుకూలతలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థలు, ఫండ్స్కు స్నేహపూర్వక వాతావరణం కలి్పస్తున్నాయి. ♦ ద్రవ్యోల్బణం– వాస్తవ వడ్డీ రేట్ల పరిస్థితుల ప్రాతిపదికన పెట్టుబడిదారులు తరచూ తమ పోర్ట్ఫోలియోలను రీకాలిబ్రేట్ (పునఃసమీక్ష, మదింపు) చేసుకుంటున్నారు. ♦ ‘‘మాకు భారతదేశం లేదా చైనాతో తగినంత పెట్టుబడులు ఏమీ లేవు. అయితే, వ్యాపార, రాజకీయ స్థిరత్వం పరంగా భారతదేశం ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లు కనబడుతోంది. రెగ్యులేటరీ వ్యవస్థల పటిష్టంగా ఉండడం సావరిన్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న అంశం’’ అని మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక సావరిన్ ఫండ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ♦ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పెరిగిన విదేశీ కార్పొరేట్ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతున్న మెక్సికో, బ్రెజిల్తో సహా అనేక దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటోంది. ♦ కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి, దేశీయ కరెన్సీల పటిష్టతలకు దోహదపడుతున్న అంశం ఇది. ♦ పెట్టుబడులను పెంచడానికి ఆకర్షణీయమైన వర్ధమాన మార్కెట్లలో ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ♦ ద్రవ్యోల్బణం సవాళ్లు భారత్సహా భౌగోళికంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వర్థమాన దేశాల మార్కెట్ బాండ్లు పెట్టుబడులకు తగిన సాధనాలుగా భావించవచ్చు. -
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతిదారులు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కి చెందిన గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకూ చేసిన ఎగుమతులు ఈ ఏడాదితో 8 బిలియన్ డాలర్లు దాటనున్నాయి. గతేడాది ఇవి 5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అమెజాన్ తమ ఎక్స్పోర్ట్స్ డైజెస్ట్ 2023 నివేదికలో పేర్కొంది. 2015లో అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.25 లక్షల ఎగుమతిదారుల స్థాయికి చేరినట్లు వివరించింది. 1,200 మంది భారతీయ ఎగుమతిదారులు గతేడాది రూ. 1 కోటి విక్రయాలు సాధించినట్లు అమెజాన్ తెలిపింది. అత్యధికంగా ఎగుమతైన వాటిల్లో బొమ్మలు (50 శాతం), గృహ .. వంటగది ఉత్పత్తులు (35 శాతం), సౌందర్య సాధనాలు (25 శాతం) ఉన్నాయి. 2025 నాటికి భారత్ నుంచి మొత్తం ఈ-కామర్స్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లకు చేరేలా తోడ్పడేందుకు లక్షల కొద్దీ చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్లతో కలిసి పని చేయనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ తదితర దేశాలకు 26.6 కోట్ల పైచిలుకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఎగుమతవవుతు న్నాయని నివేదిక పేర్కొంది. 2023లో ఎగుమతులపరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
గూగుల్ గుడ్న్యూస్.. భారత్లో గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్
అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం భారత్లోని గుజరాత్లో గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. మోదీ విజన్ గొప్పది మోదీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్ను, దీనిపై ప్రధాని మోదీ దార్శనికతను సుందర్ పిచాయ్ ప్రశంసించారు. ‘యూఎస్లో చరిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది. భారత్ డిజిటలైజేషన్ ఫండ్లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 82 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోదీతో పంచుకున్నాం. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం’ అని పిచాయ్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో ఉంది. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా విజన్ రానున్న భవిష్యత్కు బ్లూప్రింట్గా తాను భావిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. కాగా సుందర్ పిచాయ్తోపాటు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితరులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్లను కలిసిన వ్యాపారవేత్తలలో ఉన్నారు. ఇదీ చదవండి: వైట్హౌస్లో మెరిసిన అంబానీ దంపతులు.. -
రక్షించండి ప్రభో! పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. పాక్ ప్రధాని ఆవేదన
పాకిస్థాన్లో నగదు నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎమ్ఎఫ్ నుంచి రావాల్సిన నగదు అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. 'యుద్దాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి.. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్కు ఇవ్వడానికి మాత్రం ఉండవు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. 'యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారు. పాకిస్థాన్ విషయానికి వచ్చే సరిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి సంపన్న దేశాలు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది' అని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వరదలతో నష్టపోయిన పాక్ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది. జూన్ చివరి నాటికి ఐఎమ్ఎఫ్ నుంచి పాక్కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎమ్ఎఫ్కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: State Dinner Menu: వైట్ హౌస్లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే.. -
ఆనంద్ VS ఆనంద్: ఆనంద్ మహీంద్ర ట్వీట్, ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్తో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి. ఆనంద్ VS ఆనంద్ గేమ్లో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. కానీ గిఫ్ట్ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్ ఓపెనింగ్ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ. చెస్ బేస్ ఇండియా ఈ లీగ్కు ఆరంభానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఆనంద్ వెర్సస్ ఆనంద్ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది. The 1500 year old game, is ready to make #TheBigMove. The stage is set in Dubai, the modern marvel city of the world. @anandmahindra @tech_mahindra @FIDE_chess @DubaiSC @C_P_Gurnani @jagdishmitra @balanalaskank @gulf_titans @GangesGMs @SGAlpineWarrior @trivenickings @umumba… pic.twitter.com/8EkMTlIOJo — Tech Mahindra Global Chess League (@GCLlive) June 21, 2023 There will be NO prize for anyone who guesses who won the match…😊 (But I will applaud the first person who guesses which classical opening I used…) https://t.co/ghDTlbGxh5 — anand mahindra (@anandmahindra) June 22, 2023 -
International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందేశంలో భారతీయులు కొత్తదనాన్ని స్వాగతించడంలోనూ, సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని కనబరిచారని అన్నారు. ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఆహ్వానం మేరకు అమెరికా పయనమైన భారత ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని భారత ప్రజానీకానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. యోగా మనలోని అంతర్గత ద్దృష్టిని మెరుగుపరచి మనలోని ఐక్యత పెరిగే లా చేస్తుందని దీని ద్వారా వైరుధ్యాలను చెరిపేసి, అడ్డులన్నిటినీ అధిగమించి, ఆటంకాలను తొలగించుకోవచ్చని, మనమంతా కలిసి "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్" స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు కూడా యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని, "మహాసముద్రాల వలయంగా యోగా" నిర్వహిస్తున్నందున ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా వర్ణించారు. భారత దేశంలోని కోట్లాది ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని ఆయనన్నారు. #WATCH | At around 5:30 pm IST, I will participate in the Yoga program which is being organised at the headquarters of the United Nations. The coming together of more than 180 countries on India's call is historic. When the proposal for Yoga Day came to the United Nations General… pic.twitter.com/oHeehPkuZe — ANI (@ANI) June 21, 2023 అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని: ఎలన్ మస్క్ -
ప్రపంచం లోని టాప్-10 ఖరీదైన స్నీకర్స్
-
ప్రపంచవ్యాప్తం గా ప్రసిద్ధి చెందిన టాప్ - 10 భారతీయ బ్రాండ్లు
-
2030 నాటికి పేదరిక నిర్మూలన సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో పేదరికం గత 32 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 1991 వేసవిలో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశంలో సంపద సృష్టికి మాత్రమేగాక దారిద్య్ర నిర్మూలనకు దారితీశాయి. ఇండియాలో 2005-2006 సంవత్సరం 2019-2021 ఏడాది మధ్య దాదాపు 41 కోట్ల 50 లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంకా ఈ కాలంలో దారిద్య్రం 55శాతం నుంచి కేవలం 16 శాతానికి తగ్గిపోయిందని కూడా గ్లోబల్ బహువిధ దారిద్య్ర సూచిక-2022 (ఎంపీఐ) గత అక్టోబర్లో వెల్లడించింది. పేదరికాన్ని ఇలా తగ్గించగలిగినా ప్రపంచంలో అత్యధిక పేద ప్రజలు 2020లో (22 కోట్ల 89 లక్షలు) ఇండియాలోనే ఉన్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ), ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ దారిద్య్రం, మానవాభివృద్ధి ఇనిషియేటివ్ (ఓఫీ) విడుదల చేపిన ఈ ఎంపీఐ నివేదిక తెలిపింది. పై గణాంక వివరాల్లో కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఎంత ఉందో చెప్పకపోయినప్పటికీ మొత్తంమీద కొవిడ్ రాక ముందున్న 15 ఏళ్లలో ఇండియాలో పేదరికం గణనీయంగా తగ్గిపోవడం ఓ వాస్తవం. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్యను సగానికి తగ్గించాలని 2010లో సమావేశమైన యూఎన్డీపీ, ఓఫీ ప్రతినిధులు నిర్ణయించారు. పదిహేనేళ్లలో దాదాపు 42 కోట్ల మంది దారిద్య్రం నుంచి విముక్తి పొందినా...ఇంకా ఇండియాలో ఇంకా దాదాపు 30 కోట్ల మంది పేదలు ఉంటారని అంచనా. వారిలో 90శాతం (20.5 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రోజుకు సగటున 1.9 డాలర్ల ఆదాయంతో ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని దారిద్య్రం నుంచి బయటపడిన మనిషిగా పరిగణిస్తారు. కేవలం ఆర్థిక పరిస్థితి మాత్రమేగాక చదువు, ఆరోగ్యం వంటి అంశాలను కూడా కలిపి ప్రజలు పేదలా, కాదా అని నిర్ధారించే పద్ధతి ఇప్పుడు అమలులోకి వచ్చింది. తూర్పు రాష్ట్రాల్లో పేదరికం నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం కావాలట దేశంలోని తూర్పు ప్రాంతం వైరుధ్యాల పుట్ట. అత్యంత సంపన్న ప్రకృతి వనరులున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన లోహాలు, ఖనిజాలు అందించే గనులు ఇతర వనరులున్న ఈ ప్రాంతం ప్రగతిపథంలో నడవాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం చొరవ, ప్రోత్సాహకాలు సరిపోవు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు లేదా దారిద్య్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించడానికి రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ తూర్పు ప్రాంతం అంటే..బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు. అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు, గనులు ఉన్న ఈ రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారు. సహజ వనురులున్న సొంత రాష్ట్రాల్లో పనులు లేక ఇతర రాష్ట్రాలకు పోయి ప్రమాదకర ఉద్యోగాలు సైతం వారు చేస్తున్నారు. నీతి ఆయోగ్ బహువిధ పేదరిక సూచిక (ఎంపీఐ) ప్రకారం బిహార్ లో 51.91శాతం, ఝార్ఖండ్ లో 42.16శాతం ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఈ ఐదు తూర్పు రాష్ట్రాల్లోని సహజ వనరుల ఆధారంగా అక్కడ పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయంలో గణనీయ స్థాయిలో దిగుబడులు సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అత్యంత విలువైన గనులున్న ఝార్ఖండ్, అటవీ ప్రాంతాలున్న ఛత్తీస్ గఢ్, గతంలో పారిశ్రామికంగా ఓ వెలుగు వెలిగిన పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో పేదరికం పూర్తిగా నిర్మూలించి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధిక దారిద్య్రాన్ని తొలగించే చర్యలు, ఆర్థిక అభివృద్ధికి రూపొందించే పథకాలు ఏకకాలంలో అమలు చేస్తే తూర్పు ప్రాంతం దేశ ప్రగతికి కీలకపాత్ర దోహదం చేస్తుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
ఐటీ లేఆఫ్స్: కొత్త ఉద్యోగాల కోసం బ్రహ్మాండమైన ఏఐ టూల్స్ ఇవిగో!
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలుఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) 1956లో జాన్ మెక్కార్తీ ఈ అంశంపై మొదటి విద్యాసంబంధ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 2022లో శరవేగంగా ముందుకు దూసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అనేది మనిషి తరహాలోనే ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోగలదు కూడా. వ్యాపార సామర్థ్యాన్ని పెంచడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఖర్చులను తగ్గించడంలో కూడా ఏఐ సాయపడుతుందనేది ప్రధాన ఆలోచన. అలాగే మార్కెటింగ్లో, కస్టమర్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్లను గుర్తించడంతో పాటు, కస్టమర్ల ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించేందుకు ఉపయోగ పడుతుంది.తద్వారా ప్రత్యర్థులతో పోలిస్తే మరింత ముందుగా వ్యూహ రచనలో దూసుకుపోవచ్చని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలకుపయోగపడే కొన్నిముఖ్యమైన ఏఐ టూల్స్గురించి తెలుసుకుందాం. టాప్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ ( AI సంచలనం) క్విల్బాట్: ఇన్స్టంట్ పారాఫ్రేజర్ అప్వర్డ్: ఇన్నోవేటివ్ సమ్మరైజర్ కెరీర్దేఖో ఏఐ నెట్వర్క్ ఏఐ అప్లికెంట్ ఏఐ కిక్ రెస్యూమ్ ల్యాంగ్వేజ్ప్రొ అడాప్టివ్ ఎకాడమీ రెస్యూమ్ చెక్ ఫింగర్ పప్రింట్ సక్సెస్ అన్స్కూలర్ రెస్యూమ్ ఏఐ పాయిజ్డ్ ప్రాడిజీ ఏఐ లాంగోటాక్ -
కరోనా పీడ విరగడైంది: డబ్యూహెచ్వో
జెనీవా: కరోనా మహమ్మారి పీడ దాదాపుగా విరగడైనట్టే. గత మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్–19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇకపై చూడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నామ్ వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో లాక్డౌన్లతో నాలుగ్గోడల మధ్య ప్రజలు బందీగా ఉండడం, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడం వంటి వాటితో కరోనా కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ బలహీనపడిపోయినప్పటికీ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని టెడ్రోస్ చెప్పారు. ఇప్పటికీ ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతీ వారం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. 2020 జనవరి 30 డబ్ల్యూహెచ్ఓ కోవిడ్–19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. -
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబో రేస్ని పూర్తి చేసిన తొలి భారతీయుడు
రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్లోని లెస్ సాబుల్స్ డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో సెయిలింగ్ రేస్లో ప్రపంచవ్యాప్తంగా చుట్టూ వచ్చిన సెయిలర్గా(నావికుడు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ రేస్ సెప్టెంబర్ 4,2022న ఫ్రాన్స్లో ప్రారంభమైంది. దీంతో టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా సోలో సెయిలింగ్ రేసులో రెండో స్థానం దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడంటూ రేసు అధికారిక వెబ్పేజ్లో ఒక ప్రకటనలో వెల్లడించింది. (చదవండి: బ్యూటీపార్లర్కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..) -
డాలర్, యూరోకి షాకిచ్చే కరెన్సీ? ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’ గురించి తెలుసా?
గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ గురించి ఎపుడైనా విన్నారా.భూమి లేని దేశం కానీ డాలర్, యూరో కంటే బలమైన కరెన్సీ దీని సొంతమా? నిజంగా ఈ కరెన్సీ అంత విలువైందా? మహర్షి మహేశ్ యోగి 2020 అక్టోబర్ 7న స్థాపించిన దీని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే ఆసక్తికరమైన, ప్రత్యేకమైన దేశం గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నుండి శాంతియుత, సామరస్యపూర్వక వ్యక్తులను ఒకచోట చేర్చడమే దీని లక్ష్యం. మహర్షి మహేశ్ యోగి మరణానంతరం ప్రస్తుతం మహర్షి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్కి న్యూరాలజిస్ట్, అధినేత రాజా రామ్ (టోనీ నాడార్) అధినేతగా ఉన్నారు. . గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ దాని స్వంత కరెన్సీని రామ్ అని పిలుస్తారు. ఇది లోకల్ కరెన్సీ. దీన్నే బేరర్ బాండ్ అని కూడా పిలుస్తారు.ఇది అయోవా, నెదర్లాండ్స్లో ఉపయోగిస్తున్నారు. ఐరోపాలో 10 యూరోలు, అమెరికా 10 డాలర్లకు సమానమైన ‘రామ్’. రామ్ 1, 5, 10 వివిధ డినామినేషన్లలో లభ్యం. ఇది ఇప్పటికే ఉన్న కరెన్సీలను భర్తీ చేయదు కానీ నిర్దిష్ట లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు. రామ్ను బ్యాకప్ చేయడానికి బంగారాన్ని ఉపయోగించడాన్ని సంస్థ ప్రోత్సహిస్తుంది. 2001లో మహర్షి మహేష్ యోగి జారీ చేసిన కరెన్సీని డచ్ సెంట్రల్ బ్యాంక్ అనుమతించిందట. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్) అమెరికాలోని పలు నగరాల్లో నిర్మించిన "శాంతి భవనాలు" మరో విశేషం. ఈ భవనాలు దేవాలయాలు పోలిఉంటాయి. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు, మూలికా సప్లిమెంట్లు, అతీంద్రియ ధ్యానం వంటి వాటిపై బోధిస్తారు. బెథెస్డా, మేరీల్యాండ్, హ్యూస్టన్ ఆస్టిన్, టెక్సాస్, ఫెయిర్ఫీల్డ్, అయోవా, సెయింట్, పాల్, మిన్నెసోటా , లెక్సింగ్టన్, కెంటుకీ వంటి నగరాల్లో వీటిని చూడవచ్చు. గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అంతిమ లక్ష్యం హింస లేదా సంఘర్షణ లేని ప్రపంచాన్ని సృష్టించడమేనని చెబుతారు. వారి బోధనలు, అభ్యాసాలతో అంతర్గత శాంతిని, సామరస్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. 2008 ఫిబ్రవరి 5న నెదర్లాండ్స్లోని తన నివాసంలో మహర్షి యోగి కన్నుమూశారు. (ఇదీ చదవండి: Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ రామ్ అంటూ 2020లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే రామ్ అనేది లోకల్ కరెన్సీ మాత్రమే తప్ప, గ్లోబల్ కరెన్సీగా గుర్తించలేమని ఆ సందర్భంగా నిపుణులు కొట్టిపారేశారు. మరోవైపు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ వాటికన్ లాంటి స్వతంత్ర నగర రాజ్యంగా ను ఏర్పాటు చేయాలని సార్వభౌమాధికార హోదాను పొందేందుకు ప్రయత్నిస్తోంది. వారు అనేక దేశాల నుండి భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, కాని స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి భూమిని విక్రయించడానికి అంగీకరించలేదు. ఒకవేళ సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఆ తరువాత దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకుంటే, అపుడు రామ్ కరెన్సీ రెగ్యులర్ లీగల్ టెండర్ హోదాను పొందుతుందనేది నిపుణుల మాట. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్ఝున్వాలా) -
దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు
న్యూఢిల్లీ: భారత్ బంగారం దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30 శాతం పడిపోయాయి. దిగుమతులుమొత్తం విలువ 31.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది యల్లో మెటల్ దిగుమతుల విలువ 2021-22 ఇదే కాలంలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దిగుమతుల్లో పెరుగుదల లేకపోగా, క్షీణత నమోదుకావడం దీనికి నేపథ్యం. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు విలువైన లోహం దిగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కేంద్రం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులను నిరుత్సాహ పరచడం, తద్వారా ఈ బిల్లును తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరక్కుండా కట్టడి చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. వెండి వెలుగులు.. కాగా, వెండి దిగుమతులు మాత్రం 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. -
వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!
సాక్షి, ముంబై: దేశీయంగా పసిడి పైపైకి చేరుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ఉంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పై రూ. 10 పెరిగి.. రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.19 పెరిగి రూ.61,340కి చేరుకుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.55,300గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏక ంగా వెయ్యి రూపాయలు ఎగిసి రూ.60,330గా ఉంది. కాగా ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 360 గా ఉంది. అటు ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది. ఇక హైదరాబాద్లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ. 2900పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. బలహీనమైన అమెరికా ఆర్థిక డేటాతో ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటు వడ్డన ఆందోళనతో గోల్డ్ ఔన్సు 2వేల డాలర్లు అధిగమించింది. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది. -
ఎగుమతుల లక్ష్యం.. 2 ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఎగుమతులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించింది. అంతేకాకుండా ఈకామర్స్ ఎగుమతులకు ప్రోత్సాహకాలను అందించాలని కూడా ప్రతిపాదించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన ఎఫ్టీపీ 2023 ప్రకారం రాయితీల జమానా నుండి ప్రోత్సాహకాల దిశగా మారేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, భారతీయ మిషన్ల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు. లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, మరిన్ని ఎగుమతి హబ్లను అభివృద్ధి చేయడం కూడా తాజా పాలసీలో భాగం. డైనమిక్ పాలసీ... గతంలో అయిదేళ్లకోసారి ప్రకటించే ఎఫ్టీపీల మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం డైనమిక్ అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించే పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి గడువు ముగింపు అంటూ ఏదీ ఉండదు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పాలసీని సవరిస్తారు. ‘ఈ పాలసీకి గడువు తేదీ ఏదీ లేదు, కాలానుగుణంగా మార్పులు చేయడం జరుగుతుంది’ అని పాలసీ ఆవిష్కరణ అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీటీఎఫ్టీ) సంతోష్ సారంగి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు మరిన్ని ప్రాంతాలకు భారీగా విస్తరించే విధంగా వాణిజ్య శాఖ చర్యలు చేపడుతుందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా దృష్టి పెడతామన్నారు. వచ్చే 4–5 నెలల్లో విదేశాల్లోని భారతీయ మిషన్లతో కలిసి వాణిజ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. ‘2030 నాటికి 2 ట్రలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలనేది మా లక్ష్యం. దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది. అయితే వస్తు ఎగుమతులు, సేవల ఎగుమతులను అధిగమించాలని మేము భావించడం లేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్ డాలర్లను అధిగమించనున్నాయని డీజీఎఫ్టీ తెలిపారు. 2021–22లో ఈ మొత్తం ఎగుమతుల విలువ 676 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి గ్లోబల్ హోదా... అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలని ఎఫ్టీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, విదేశీ వాణిజ్య లావాదేవీలకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీ కరెన్సీలో సెటిల్మెంట్లకు ఎగుమతి ప్రయోజనాలను కల్పించనున్నారు. ‘కరెన్సీపరమైన సంక్షోభాలు, లేదంటే డాలర్లకు కొరత ఉన్న దేశాలతో రూపాయిల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. కాగా, యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక (ఈపీసీజీ) స్కీమ్ అలాగే ముందస్తు అనుమతులకు ప్రతిగా ఎగుమతి బాధ్యతలను (ఈఓ) నెరవేర్చడంలో విఫలమైన ఎగుమతిదారులకు వన్టైమ్ సెటిల్మెంట్ కోసం క్షమాబిక్ష స్కీమ్ను కూడా తాజా ఎఫ్టీపీలో పొందుపరిచారు. దీని ప్రకారం ఈఓల విషయంలో డిఫాల్ట్ అయిన పెండింగ్ కేసులన్నింటినీ క్రమబద్దీకరిస్తారు. దీనికోసం మినహాయింపు పొందికస్టమ్స్ సుంకాలను, అలాగే 100% వడ్డీతో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆచరణాత్మక పాలసీ.. ఎఫ్టీపీ 2023ని కార్పొరేట్ వర్గాలు స్వాగతించాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను పెంచేలా ఆచరణాత్మక, సానుకూలమైన పాలసీగా పరిశ్రమ చాంబర్లు, ఎగుమతిదారులు దీన్ని అభివర్ణించారు. 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించేలా అనేక వినూత్న చర్యలను పాలసీలో ప్రకటించారని భారతీయ పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటాను భారీగా పెంచేందుకు దోహదం చేస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. పాలసీలో ఇతర చర్యలు... ► జిల్లాలను ఎగుమతి హబ్లుగా చేసేందుకు రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో కలిసి పనిచేయడంపై కూడా ఎఫ్టీపీ 2023 దృష్టిపెట్టింది. ► యూఏవీ/డ్రోన్స్, క్రయోజనిక్ ట్యాంక్స్, ప్ర త్యేక రసాయనాల వంటి ద్వంద్వ వినియోగ హై ఎండ్ ఉత్పత్తులు, టెక్నాలజీల ఎగుమతుల కోసం సరళమైన పాలసీలపై దృష్టిసారిస్తారు. ► ఈకామర్స్ ఎగుమతులకు ఎగుమతి ప్రయోజనాలను ప్రత్యేకంగా అందించాలని పాలసీ నిర్దేశించింది. కొరియర్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని రెంట్టింపు చేస్తూ, ఒక్కో కన్సైన్మెంట్ను రూ.10 లక్షలకు చేర్చనున్నారు. కాగా, ఈకామర్స్ అగ్రిగేటర్లకు స్టాకింగ్, కస్టమ్స్ అనుమతులు, రిటర్న్ల ప్రక్రియను సులభతం చేసేందుకు గిడ్డంగి సదుపాయంతో కూడిన ప్రత్యేక జోన్ను ఏర్పాటు చేయనున్నారు. 2030 నాటికి ఈకామర్స్ ఎగుమతులు 200–300 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతాయని అంచనా. ► అన్ని రకాల బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), వర్టికల్ సాగు యంత్రాలు, మురుగునీటి శుద్ధి, రీసైక్లింగ్, వర్షపు నీటి ఫిల్లర్లు, గ్రీన్ హైడ్రోజన్లను పర్యావరణహిత టెక్నాలజీ ఉత్త్పత్తుల్లోకి చేర్చారు. తద్వారా ఈపీసీజీ స్కీమ్ ప్రకారం వీటిపై ఎగుమతి పరమైన నియంత్రణలు తగ్గుతాయి. -
ఖతార్ ఎయిర్వేస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ హీరోయిన్
న్యూఢిల్లీ: దుబాయ్కి చెందిన ఖతార్ ఎయిర్వేస్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను తమ గ్లోబల్ అంబాసిడర్గా నియమించింది. ఈ సందర్బంగా ఖతార్కు మించింది మరేదీ లేదు అంటూ కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఖతార్ ఎయిర్వెస్ 'ఆంట్ నో బడీ' ప్రచార వీడియోను ట్వీట్ చేసింది. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయం హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బ్యూటిఫుల్ లుక్లో దీపికా పడుకొణె మెరిసింది. ప్రీమియం అనుభవంతో, ఎక్సలెన్స్కు, లగ్జరీకి పర్యాయపదంగా ఉన్న ఖతార్కు దీపిక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం గర్వకారణమని, ఇందుకు ప్రఖ్యాత నటి దీపికా సరియైన ఎంపిక అంటూ ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హిస్ ఎక్సలెన్సీ అక్బర్ అల్ బేకర్ సంతోషాన్ని ప్రకటించారు. ఖతార్ ఎయిర్వేస్ ఇటీవలే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ అందించే 2022 వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్లో 'ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్'గా అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకోవడం వరుసగా ఇది ఏడోసారి (2011, 2012, 2015, 2017, 2019, 2021 2022). వీటితో పాటు వరల్డ్ బెస్ట్ బిజినెస్ క్లాస్, వరల్డ్ బిజినెస్ క్లాస్ లాంజ్ డైనింగ్, బెస్ట్ ఎయిర్లైన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అవార్డులను కూడా అందుకుంది. కాగా ఖతార్ఎయిర్వేస్ దోహా హబ్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ద్వారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 150 కంటే ప్రదేశాలకు విమానాల్ని నడుపుతోంది. There's nothing else quite like the luxury of travelling with Qatar Airways ✈️ Introducing our brand-new film featuring our global brand ambassador @deepikapadukone pic.twitter.com/NjAgXInl7v — Qatar Airways (@qatarairways) February 28, 2023 -
గ్లోబల్ గవర్నెన్స్ ఫెయిల్! ఆ దేశాల గళం వినిపిస్తాం!
ఉక్రెయిన్లోని రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా జీ20 విదేశాంగ మంత్రులు సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. ఈ జీ20 సమావేశాలు భారత అధ్యక్ష హోదాలో ఢిల్లీలోని హరియానాలో గురుగ్రామ్ వేదికగా మార్చి1 నుంచి 4వ వరకు జరగనున్నాయి. ఈ మేరకు జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ.. "ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విపలమయ్యాయన్నారు. అంతేగాదు ప్రస్తుతం ప్రపంచ స్థాయి సంస్థలు సంక్షోభంలో ఉన్నాయనే దానిని మనందరం గుర్తించాలి. దీనికి ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారీ, ఉగ్రవాదం, యుద్ధాలే నిదర్శనమని, అందువల్లే ప్రపంచ పాలన వైఫల్యం చెందిందని స్పష్టంగా తెలుస్తోంది. సంవత్సరాల పురోగతి తర్వాత సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల కోసం మనం మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదంలో ఉన్నాం. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను కల్పించడం కోసం భరించలేని అప్పులతో సతమతమవుతున్నాయి. అలాగే ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఈ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారత్ దక్షిణాది గళం వినిపించేందుకే యత్నిస్తోంది. మనమంతా ప్రపంచ విభజన సమయంలో కలుస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలపై సాముహికంగా పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే ఈ సమావేశంలో పాల్గొనని వారిపట్ల కూడా మాకు బాధ్యత ఉంది. మన కలిసి చేయగలిగిన వాటిల్లోకి పరిష్కరించలేని సమస్యలను తీసుకురాకూడదు. తమ చర్యలతో ప్రభావితమైన దేశాల మాట వినకుండా ఏ దేశం లీడర్షిప్ను సాధించలేదు. మనల్ని ఏకం చేస్తున్న వాటిపై దృష్టి సారించాలి గానీ విభజించే వాటిపై కాదని" సదస్సులో ప్రదాని మోదీనొక్కి చెప్పారు. కాగా, రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో జరుగుతున్న ఈ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో దాదాపు 40 మంత్రి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాల తోపాటు బంగ్లాదేశ్, ఈ జిప్ట్, నెదర్లాండ్స, మారిషస్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోసహా తొమ్మిది అతిథి దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం. (చదవండి: బిల్గేట్స్తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు! కేంద్ర ఆరోగ్య మంత్రి) -
మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? బతుకుడెట్లా?
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది ప్రపంచం పరిస్థితి ఇప్పుడు! కోవిడ్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటుండగానే బోలెడన్ని ఇతర సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి! రెండేళ్ల వృద్ధిని అందుకొనే క్రమంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతూండటం ఒకవైపు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఇంకోవైపు... పలు దేశాల ఆర్థిక విధానాల్లో మార్పుల కారణంగా పేద, ధనిక అంతరాలూ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? రానున్న రెండేళ్లలో ఏమైనా మార్పులొస్తాయా? దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండే చిక్కుల మాటేమిటి? ఈ అంశాలన్నింటిపై ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వే నిర్వహించింది. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే ప్రకారం ఇప్పటి ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? బతకడానికయ్యే ఖర్చుల్లో పెరుగుదల! కాస్ట్ ఆఫ్ లివింగ్! రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఏడాది పూర్తయ్యింది. కోవిడ్ అనంతర పరస్థితుల్లో మొదలైన ఈ యుద్ధం అనేక రంగాల్లో ప్రపంచ స్థితిగతులను మార్చేసిందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనపడని నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద పెరిగిపోతున్న జీవన వ్యయంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే చెబుతోంది. ఇంకో రెండేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని సర్వేలో పాల్గొన్న అధికులు అభిప్రాయపడ్డారు. కోవిడ్కు ముందు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పరిశ్రమలకు, కంపెనీలకు బ్యాంకుల ద్వారా చాలా సులువుగా అప్పులు పుట్టేవని, ఇప్పుడా స్థితి లేకపోవడం, మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్పై ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని ఆ సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే రాగల రెండేళ్లు, పదేళ్ల కాలవ్యవధుల్లో ఎదుర్కొనే అవకాశమున్న ఐదు అతిపెద్ద ముప్పులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే 40కిపైగా దేశాల్లోని వివిధ రంగాల నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్య, వ్యాపార రంగాలతోపాటు ప్రభుత్వ అధికారులు పలువురు నిపుణుల బృందంలో ఉన్నారు. ఈ సర్వేలో రిస్క్ లేదా ముప్పుగా పరిగణించిన అంశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిపై లేదా ప్రజలు, ప్రకృతి వనరులపై దుష్పభావం చూపగలిగేవి. రానున్న రెండేళ్లలో ఈ ముప్పుల తీవ్రత, పరిణామాలు, ప్రభుత్వాల సన్నద్ధత వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు. అన్ని ప్రియమవుతున్న వేళ కోవిడ్ కంటే ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద సమస్యగానే ఉండేది. కానీ మహమ్మారి పుణ్యమా అని సరఫరాలు నిలిచిపోవడం, డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలు కూడా అందనంత స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సరఫరాలపై పలు దేశాలు నియంత్రణలు విధించాయి. ఇది ద్రవ్యోల్బణం తద్వారా కనీస అవసరాల ఖర్చులు పెరిగిపోయేలా చేసింది. నల్ల సముద్రం నుంచి ఆహారధాన్యాల ఎగుమతికి చేసుకున్న ఒప్పందం నుంచి రష్యా తొలగిపోయేందుకు సిద్ధమవుతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని యూరప్ దేశాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ప్రపంచం సాధారణ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది విషయానికి వస్తే ఇంధన ధరలు గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 46 శాతం వరకూ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చైనాలో కోవిడ్ నియంత్రణలను సడలించడం వల్ల వినియోగం మరింత పెరిగి ఇంధన, ఆహార ధరలు ఇంకా పెరుగుతాయని, ఇది బ్యాంకుల వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుందన్న భయాందోళనలు అధికమవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ బ్లూమ్బర్గ్ పేర్కొనడం గమనార్హం. వాణిజ్య యుద్ధాలతో తీవ్ర నష్టం ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఆయుధాలతో జరిగేవి. ఇప్పుడు వాణిజ్య ఆర్థికాంశాలపై ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీని ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదు. ఇతర దేశాలతోపాటు అనేక రంగాలకు విస్తరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో భారత్, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ఎంత దుమారం రేపిందో తెలియనిది కాదు. రానున్న పదేళ్లలో దేశాల మధ్య ఘర్షణలు మరింత పెరుగుతాయని, అవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటం, దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతుండటాన్ని దీనికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా నియంత్రణలు, నిషేధాలు విధించినట్లే భవిష్యత్తులోనూ ఆర్థికాంశాలపై దాడులు తీవ్రతరం కానున్నాయని అంచనా. ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సమాజంలో వైషమ్యాల పెరుగుదల విలువలు, సమానత్వాల మధ్య అంతరం పెరిగిపోతుండటం కూడా స్వల్పకాలిక ముప్పుగా పరిగణిస్తున్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చే విభజన క్రమేపీ రాజకీయాలకు విస్తరిస్తుందని, వలసలు, లింగవివక్ష, జాతి, కులం, మతం ఆధారంగా ఘర్షణలు పెరిగేందుకు కారణమవుతుందని అంచనా. ప్రపంచం నలుమూలలా పలు దేశాల్లో ఘర్షణలు, ఉద్యమాలు పెరిగిపోతుండటం ఇందుకేనని చెబుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యం, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై అదుపు లేకపోవడం వల్ల సమాజం తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అత్యధికులు ఆందోళణ వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. సుమారు 30 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా చెప్పుకోదగ్గ ముందడు ఏదీ ఇప్పటిదాకా పడలేదు. వాతావరణంలో ఈనాటి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ స్థాయికి పెంచరాదన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించట్లేదు. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది వాతావరణ మార్పులపై ప్రస్తుత స్థితిని తప్పుబట్టారు. 2030 నాటికే సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశాలు ఇప్పుడు 50 శాతమని ఐపీసీసీ అంచనా వేస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీ–7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. పారిస్ ఒప్పందాన్ని ధనిక దేశాలే తుంగలో తొక్కిన కారణంగా 2050 నాటికే ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా చేయాల్సిన పనులు కాకుండా రాజకీయంగా ఉపయోగకరమైన వాటిపైనే దేశాలు ఆధారపడటం పరిస్థితిని దిగజారుస్తోంది. యూరోపియన్ యూనియన్ తాజాగా శిలాజ ఇంధన ఆధారిత ఫ్యాక్టరీల మరమ్మతులకు, ఇంధనాల కోసం ఏకంగా 5000 కోట్ల యూరోలు ఖర్చు చేస్తుండటం ఇందుకు తార్కాణం. ఈ పరిస్థితి రానున్న రెండేళ్లలోనూ మెరుగయ్యే అవకాశాలు లేవని, దీర్ఘకాలంలో అంటే రానున్న పదేళ్ల వరకూ కూడా వాతావరణ మార్పులపై పోరు మందగమనం ప్రపంచానికి ఒక సమస్యగానే మిగలనుందని అంచనా. టర్కీలో ఇటీవలి భారీ భూకంపం, గతేడాది అకాల వర్షాలు, వరదలు, కరవులు అన్నీ వాతావరణ మార్పులను సూచిస్తున్నా ధనిక దేశాలిప్పటికీ మేలుకోకపోవడం ఆందోళనకరమేనని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం అధిపతి క్రిస్ ఫీల్డ్ అన్నారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
షాకింగ్: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం
సాక్షి,ముంబై: స్వీడన్కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్ భారీగా ఉద్యోగులను తొలగించింది. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రాయిటర్స్ శుక్రవారం నివేదించింది. లోకల్ బిజినెస్ను బట్టి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయిని ప్రకటించిన ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ ఇప్పటికే ఆయా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. (ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!) టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుననాయి. అయితే టెలికాం పరిశ్రమలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. కాగా స్వీడన్లో దాదాపు 1400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది ఉద్యోగాల కోతలను ప్రకటించిన ట్విటర్, గూగుల్, మెటా ,మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల లీగ్లో ఎరిక్సన్ చేరింది. (పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!)