-
పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి
మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. -
ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు!
మోదీ మెచ్చిన అడవి పండు ఏంటీ అనుకుంటున్నారా!. అదేనండి ఉత్తరాఖండ్కి చెందిన కఫాల్ ప్రూట్. ఏంటీ పేరే అలా ఉంది అనుకోకండి. ఎందుకంటే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. సాక్షాత్తు ప్రధాని మోదీ సైతం ఈ పండు ప్రయోజనాలు చూసి ఫిదా అయ్యారంటే.. అది ఎంత విలువైనదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్రూట్ ఎలా ఉంటుంది? దానివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా! ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఒకనొక సందర్భంలో ఓ బుట్టడు కఫాల్ పండ్లు పంపడంతో మోదీ తెగ సంబరపడిపోయారు. అంతేగాదు ఉత్తరాఖండ్ సీఎం ధామికి లేఖ రాసి మరీ ఆ పండు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆ లేఖలో మోదీ.. "ఉత్తరాఖండ్ సంస్కృతిలో 'కఫాల్' పాతుకు పోయింది. ఆ ప్రాంత జానపద పాటల్లో కూడా ఆ ప్రస్తావన ఉంది. పెరగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పండు ప్రజలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే విలువైన పండుగా ఉంది" అని పేర్కొన్నారు. ఆ పండు చూడటానికి కూడా ఆకర్ణగా ఉంటుంది పండు ఎలా ఉంటుదంటే.. ఉత్తరాఖండ్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ అడవి పండు లబిస్తుంది. భారతదేశంలోని ఇతర ప్రాంత ప్రజలు వేసవిలో మామిడిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిసతఏ..ఉత్తరాఖండ్ ప్రజలు ఈ కఫాల్ పండ్లను ఆస్వాదిస్తారు. వారు పెద్ద మొత్తంలో వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇవి రెండు రోజుల్లోనే పాడైపోతాయి. ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం సాధ్యపడుదు. వాళ్లు వీటిని ఎండబెట్టి కూరల్లో, లేదా పానీయంగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కఫాల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. విటమిన్ సి, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్ వంటి విటమిన్లకు మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరం అంతటా వాపు, నొప్పిని తగ్గించడంలో ఉపకరించే యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షనాలు కూడా ఉన్నాయి. కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిన పెంచుతుంది ఎలా తినొచ్చంటే.. జామ్లు, జెల్లీలు, చట్నీలు, పచ్చళ్లు వంటి రూపంలో ప్రిజర్వ్ చేసుకుని తొనొచ్చు. ఇది అత్యంత స్వీట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని సలాడ్లో జోడించొచ్చు. అలాగే ఐస్క్రీం, పెరుగు వంటి డెజర్ట్లో కూడా ఉపయోగించొచ్చు. కూరలుగా కూడా వండుకోవచ్చు. అన్నం తోపాటు తినొచ్చు పండ్లను పంచదార, యాలకులు, ఇతర సుగంధ ద్రవ్యాలతో నీటిలో మరిగించి.. 'కఫల్ పన్నా' అనే ప్రత్యేకమైన పానీయాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పానీయం జీర్ణక్రియకు ప్రయోజనకారిగానే కాకుండా కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది. కఫల్ మొక్క ఆకులను ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాటిలో యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండటంతో.. తామర, సోరియాసిస్ వంటి వివిధ చర్మ వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడమే గాక కడుపులో మంటను తగ్గించడంలో అద్భత ఔషధంగా పనిచేస్తుందని ఉత్తరాఖండ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. (చదవండి: గన్నేరు మొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!) -
పండ్లకు కవర్ల కవచం
సాక్షి, అమరావతి: మామిడి, జామ, దానిమ్మ, యాపిల్, సీతాఫలంతోపాటు ప్యాషన్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటివాటికి కవర్లు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. పండ్ల నాణ్యతను పెంచి రైతులకు అధిక ధరను అందిస్తున్నాయి. ప్రస్తుతం కవర్లు తొడగని బంగినపల్లి మామిడి పండ్లు టన్నుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతుండగా... కవర్లు కట్టిన పండ్లకు రూ.80 వేల నుంచి రూ.1.10లక్షలు వరకు ధర పలుకుతోంది. కవర్లు తొడిగిన ఇతర పండ్లకు సైతం 30శాతం అదనపు ధర లభిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యాన పంటల నాణ్యతను పెంచడం ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలన్న సంకల్పంతో పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులకు హెక్టారుకు రూ.28వేలు చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రూ.1.80 కోట్లు సబ్సిడీ సొమ్మును రైతులకు ఇచ్చింది. దీంతో యాపిల్, దానిమ్మ, ద్రాక్షతోపాటు అన్ని రకాల పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా సగటున 10కోట్ల కవర్లు దిగుమతి చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉద్యానపంటలు సాగుచేసే రైతులే 3కోట్లకుపైగా కవర్లు వినియోగిస్తున్నారు. తెగుళ్లు.. చీడపీడలకు చెక్ సాధారణంగా పిందె, కాయ మీద వర్షం లేదా మంచు పడితే వాటిని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, తామర (త్రిప్స్), పెంకు పురుగులు దాడి చేస్తుంటాయి. వీటి నివారణ కోసం 10 నుంచి 15సార్లు మందుల పిచికారీ కోసం పంటను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడి, గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పండ్లకు కవర్లను అమర్చటం వల్ల తెగుళ్లు, చీడపీడలకు చెక్ పెట్టగలుగుతున్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా.. అమర్చేందుకు మరో రూపాయి ఖర్చవుతోంది. 10 నుంచి 15 ఏళ్ల వయసుగల తోటలకు 60 నుంచి 70శాతం, ముదురు తోటల్లో 30 నుంచి 40శాతం కాయలకు కవర్లు కట్టగలుగుతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న బంగినపల్లితోపాటు రసాలు, సువర్ణరేఖ తదితర మామిడి రకాలకు కవర్లను అమరుస్తున్నారు. రాయలసీమలో దానిమ్మ, జామ, డ్రాగన్ ఫ్రూట్, గోదావరి జిల్లాల్లో సీతాఫలం పండ్లకు కవర్లు కడుతున్నారు. నిమ్మకాయ సైజులోకి వచ్చిన తర్వాత కవర్లు కట్టి కనీసం 40 రోజులపాటు ఉంచితే కాయపై మచ్చలు ఏర్పడవు. వర్షం నీరు కాయకు తాకకుండా కిందికి జారిపోతుంది. ఈదురు గాలులవేళ కాయ రాలడం కూడా ఉండదు. 90 శాతం చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. కాయల సైజు కూడా కనీసం 20–25 శాతం పెరుగుతుంది. నాణ్యంగా, ఆకర్షణీయంగా మంచి రంగుకొస్తాయి. తొలి కవర్ల తయారీ యూనిట్ ఏపీలోనే.. కవర్లు కట్టే విధానం ఏపీలో శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రంలో 2వేల టన్నుల పండ్లకు కవర్లు కడుతున్నారు. రానున్న ఐదారేళ్లలో కనీసం లక్ష టన్నులకు కవర్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. నాలుగేళ్లుగా తైవాన్, చైనా నుంచి కవర్లను దిగుమతి చేసుకుంటుండగా.. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ రూ.10కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ కంపెనీని ఏర్పాటు చేసింది. విదేశాల్లో మంచి డిమాండ్ కవర్లు కట్టిన కాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మా కంపెనీ ఏటా 50 టన్నుల వరకు యూరప్, యూకే, యూఎస్ఏ దేశాలకు ఎగుమతి చేస్తోంది. డిమాండ్కు తగినట్లుగా కవర్లు కట్టిన కాయలు దొరకడం లేదు. – ఉండవల్లి రాజు, యజమాని, మధురమ్స్ లిమిటెడ్ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం ఉద్యాన పంటలకు మంచి ధర లభించేందుకు ఫ్రూట్ కవర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ యూనిట్ ఆగిరిపల్లిలో ఏర్పాటుచేశాం. గతేడాది ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభించాం. రోజుకు 2.50లక్షల కవర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష టన్నుల పండ్లకు కవర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. – శరణాల అప్పారావు, ఎండీ, ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ -
పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి
ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండటంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రూపాల్లో సాయం అందిస్తుండటంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను సోమవారం వెల్లడించింది. - సాక్షి, అమరావతి 1.81 కోట్ల టన్నులతో మనమే టాప్ 2023–24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్లు ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది. అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. బత్తాయి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ విస్తీర్ణమే ఉన్నా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రఫ్రదేశ్లో పండ్లు సాగు విస్తీర్ణం 7,80,310 హెక్టార్లు ఉండగా.. మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది. -
పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్ నుండి 150 పీకేఆర్కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్లకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్కు 200 పీకేఆర్లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్లకు అమ్ముతున్నారు. -
అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా?
మనం మార్కెట్ నుంచి అరటి పళ్లు తీసుకుస్తాం. కానీ వాటిని ఉపయోగించే లోపలే పాడేపోతుంటాయి. ఎందుకంటే? అరటిపళ్లు తొందరగా పండి పోతాయి. బాగా పండినవి తినలేం కూడా. వాటిని ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. చూస్తు..చూస్తూ.. పడేయబుద్ధికాక ఓ పక్కా..! మరోవైపు వృధా చేస్తున్నామేమో! అనే ఫీలింగ్తో తెగ బాధ పడిపోతుంటా. అందువల్లే చాలామంది అరటిపళ్లను ఇంట్లో జనం ఎక్కువమంది ఉన్నారు, తింటారు అనుకుంటేనే కొంటున్నారు. అలాంటప్పుడు అలా పండిన అరటి పండ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించుకునేలా రెసిపీలు చేసుకోవచ్చట. అవేంటో చూద్దామా!. మన వంటకాల్లో పండిన అరటి పళ్లును ఐదు రకాలుగా వాడొచ్చట. అంతేగాదు వాటితో చేసిన రెసిపీలను పిల్లలు పెద్దలు వదలకుండా లాగించేస్తారట కూడా. ఇంతకీ అవేంటంటే. బనానాపూరీలు: ఇది టీ టైం అల్పహారంగా చెప్పొచ్చు. ఇది మంగళూరు వంటకం. మనం ఎప్పటిలా చేసే పూరీలకు విభిన్నంగా మంచి రుచిని అందిస్తాయి ఈ బనానా పూరీలు. గోధుమ పిండిలో వేడి పాలు, పండిన అరటిపండ్లు, సుగంధద్రవ్యాలు కలిపి పూరీల మాదిరిగా చేస్తే వెరైటీ వంటకాన్నీ ఆస్వాదించడమే గాకుండా పండిన అరటిపళ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించగలుగుతాం. ఈ వంటకం అన్ని వయసుల వారికి తప్పక నచ్చుతుంది. అరటిపండు రైతా! ఏంటిదీ అరటిపండు రైతా అని భయపడకండి. అదేనండి సలాడ్ మాదిరిగానే ఈ పండిన అరటిపండ్లను చక్కగా పెరుగులో కలిపి, కొద్దిపాటి డ్రైప్రూట్స్ జోడించి చిన్న చిన్న బౌల్లో వేసి అందిస్తే వావ్ అంటూ లాగించేస్తారు. ఇది మార్నిగ్ టైంలో మంచి బ్రేక్ఫాస్ట్గా పనిచేస్తుంది. దీనిలో కాల్షియం, ఫైబర్, పోటాషియం తదితర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పైగా పిల్లలకు మంచి బలం కూడా. బనానా వడలు! ఇది కూడా టీ టైం స్నాక్స్ లాంటివే. అరటికాయ బజ్జీలు విన్నాం కానీ ఇలా అరటిపండ్లతో వడలేంటి అని ఆశ్చర్యపోకండి. పండిన అరటి పండ్లను వడలలో ఉపయోగించడం వల్ల లోపలి తీపి భాగం వడంతటికి స్ప్రెడ్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇవి క్రంచి క్రంచిగా, టేస్టీగా మంచి ఫీల్ని ఇచ్చే స్నేక్స్ అని చెప్పొచ్చు అరటిపండు కొబ్బరి చట్నీ అరటిపండుతో కొబ్బరి చట్నీ ఏంటండీ? అని భయపడకండి. కొబ్బరి అరటితో ఓ క్రీమ్లాంటి లిక్విడ్ వస్తుంది. దీనికి కొద్దిగా సుగంధద్రవ్యాలు జోడిస్తే మంచి వాసనతో కూడిన రుచి ఉంటుంది. దీన్ని దోసలు, ఇడ్లీలలో స్వీట్ చట్నీ మాదిరిగా వాడొచ్చు. మన భాషలో చెప్పాలంటే అరటి పండు జామ్ అనుకోండి. ఎలా ఉంటుందా? అని సందేహించొద్దు. ఎందుకంటే? కమ్మటి కొబ్బరితో అరటిపళ్లలోని తీపి కలగలస్తే దాని టేస్టే వేరబ్బా!. ఓసారి ట్రై చెయ్యండి మీకే తెలుస్తుంది. అంతేకాదండోయ్ మెత్తని పండిన అరటిపళ్లతో స్నేక్స్, బ్రేక్ఫాస్ట్ వంటివి చేయడం చాలా సులభం. పైగా వివిధర రకాలుగా రెసిపీల రూపంలో చేసిస్తే మన ఇంటిల్లపాదికి సకల పోషకాలను అందించినవారమవుతాం. ఇంకేందుకు ఆలస్యం వృధా చెయ్యకుండా ట్రై చేసి చూస్తారు కదూ!. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సీతాఫలం, రామా ఫలం గురించి విన్నాం కానీ ఇదేంటి కృష్ణఫలం?. ఔనండి! మీరు విన్నది నిజమే. మనకు నిజంగానే దీని గురించి పెద్దగా తెలియదు గానీ దీని వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ పండుని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్. ఇది ఉష్ణమండల పండు, ఇది ఒక విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి గుండ్రంగా లేదా ఓవెల్ ఆకారంలో ఉంటుంది. దీని బయటి భాగం గట్టిగా ఉంటుంది. లోపలి భాగం జ్యూ'సీగా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా ఊదా లేదా తిక్ మెరూన్ కలర్లో లేదా పసుపు రంగులో ఉంటాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు ఇది శక్తిమంతమైన ఫైబర్ మూలం. పిసిటానాల్' అనే సమ్మేళనం మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగూ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుంది ఈ పండులో విటమిన్ ఏ బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. అందువల్ల దీని తీసుకుంటే అంధత్వం రాదు. పైగా కంటి పనితీరు మెరుగుపడుతుంది. అంతేగాదు బరువును తగ్గించే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. నిజానికి, కృష్ణఫలం సారం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పెరిగిన శరీర బరువు, కొవ్వు పదార్ధం , గ్లూకోస్ టాలరెన్స్ ద్వారా ఈ లక్షణాలు సులభంగా మెరుగుపడతాయి. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారంలో ఈ పండును చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఇందులో కేన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. (చదవండి: మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!) -
మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్!
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా? కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు. -
ఆకాశ పండు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!
స్కై ఫ్రూట్ మహిళలలో వచ్చే పీఓసీడీ సమస్యలకు ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కనిపరిష్కారం. ఈ స్కై ఫ్రూట్ (ఆకాశపండు) గొప్పతనం గురించి ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ఆధునిక వైద్య శాస్త్రంలో, స్కై ఫ్రూట్స్ ఖ్యాతి చాలా పాతది కానప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలలో, అధిక రక్తపోటు పీసీఓడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సాంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. స్కైఫ్రూట్ ఎలా ఉపయోగించాలి? మీకు స్కై ఫ్రూట్ మొత్తం దొరికితే, దాన్ని పగలగొట్టి దాని గింజను బయటకు తీయండి. వెచ్చని నీటితో లోపలి విత్తనాన్ని నమలవచ్చు లేదా మింగవచ్చు. రుచి పరంగా, ఇది చాలా చేదుగా ఉంటుంది. మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువ ఉంటే, పూర్తి విత్తనాన్ని తీసుకోండి. మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే, సగం గింజను తినండి. ఇది టాబ్లెట్గానూ లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది. “ఉదయం, పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలని చెబుతున్నారు. గరిష్ట ప్రయోజనాల కోసం, స్కై ఫ్రూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ, కాఫీ, పాలు ఏదైనా ఇతర ఆహార పదార్థాలను తాగకుండా ఉండండి. స్కైఫ్రూట్ ప్రయోజనాలు.. “స్కై ఫ్రూట్" అందించే ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ జాబితానే ఉంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంతోపాటు వివిధ సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. వాటిలో కొన్ని: చర్మ అలెర్జీకి చికిత్సలా పని చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఋతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలించుకోవడానికి సహాయపడుతుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది అల్జీమర్స్కు చికిత్స చేస్తుంది నపుంసకత్వానికి చికిత్స చేస్తుంది శరీర బలాన్ని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆస్తమా చికిత్సలో సహాయపడుతుంది నిద్రలేమికి చికిత్స చేస్తుంది ఆకలిని పెంచుతుంది మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది మలేరియాకు చికిత్స చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కణితులతో పోరాడడంలో సహాయపడుతుంది ఆస్తమా చికిత్సలో ఉపయోగపడుతుంది హృదయనాళ వ్యవస్థను మెరుగుపరిచి, రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది కరోనరీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆర్టెరియోస్క్లెరోసిస్ ఫలకాన్ని నివారిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్లు.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అదనంగా, స్కై ఫ్రూట్ విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సహజ ప్రోటీన్లు, ఎంజైమ్లు తోపాటు వివిధ ముఖ్యమైన పోషకాల విలువైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. స్కైఫ్రూట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు.. స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు వచ్చాయి. ఎవరైనా అనారోగ్యంగా భావిస్తే.. బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం, చీకటి మూత్రం వంటి కాలేయ గాయం వంటి లక్షణాలు కనిపిస్తే..అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం, కామెర్లు వచ్చినా, స్కై ఫ్రూట్ తీసుకోవడం మానేసి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఏదైనా వాడేముందు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు వాడి మంచి ప్రయోజనాలను పొందండి. (చదవండి: చూపు లేదు కానీ క్యాన్సర్ని గుర్తిస్తారు) -
అబ్బ నీ కమ్మని దబ్బ..తక్కువ పెట్టుబడితో అదిరిపోయే ఆదాయం!
సీతంపేట(పార్వతిపురం మన్యం): మన్యంలో పుల్లదబ్బ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడి పెరగడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోవడంతో భామిని, సీతంపేట ఏజెన్సీలో సుమారు 2 వందల ఎకరాల వరకు పంటను కొండపోడు వ్యవసాయంలో గిరిజనరైతులు పండిస్తారు. అక్కడక్కడ పోడులో వీటిని వేస్తారు. సుమారు 100 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. కావిడ దబ్బ రూ. 200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్లో ఒక్కో కావిడి ఇవే ధరలకు అమ్మేవారమని గిరిజనులు చెబుతున్నారు. హడ్డుబంగి, సోమగండి, గొయిది, శంభాం, కుశిమి, పెదరామ తదితర పంచాయతీల పరిధిలో దబ్బ ఎక్కువగా పండుతుంది. వారపు సంతల్లో విక్రయాలు ఒక్కో పుల్ల దబ్బ పండు మైదాన ప్రాంతాల్లో ఒక రూపాయికి విడిగా విక్రయిస్తారు. ఇక్కడ ఒక్కో పండు అర్ధరూపాయికి సరాసరి కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో కిలోల వంతున విక్రయిస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు వ్యాపారులు నేరుగా గ్రామాలకే వెళ్లి ఖరీదు చేస్తున్నారు. పుల్లదబ్బ ఎక్కువగా పచ్చళ్లు తయారు చేసే చిన్నతరహా కంపెనీలకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతూ గిరిజన రైతులు నిర్ణయించిన ధరలు కాకుండా సిండికేట్గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు గిరిజనులు విక్రయించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా వ్యాపారుల నుంచి అడ్వాన్స్లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో వ్యాపారులకు సరుకు అప్పగిస్తారు. వ్యాపారుల ధరకే విక్రయిస్తున్నాం పైనాపిల్, సీతాఫలం తర్వాత ఆదాయాన్ని ఇచ్చేది దబ్బ పంట. కావిళ్లలో మోసుకుని తీసుకువస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్మకాలు చేస్తున్నాం. – ఎస్.రైకన్న, అక్కన్నగూడ పంట దిగుబడి బాగుంది ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంది: కొండపోడు వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి సేకరణ కష్టంగా ఉంటుంది. ఈ సీజన్ వచ్చేనెల వరకు ఉంటుంది. ఒడిశా వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. – ఎస్.ఎల్లంగో, మెట్టుగూడ చదవండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే.. -
అల్ల.. నేరేడువనంలో..
గుర్రంకొండ : రైతుల పాలిట కల్పతరువుగా మారింది అల్లనేరేడు. రైతుల లభాల రేడు అల్లనేరేడు కాయలు ఈ ఏడాది విరగ్గాశాయి. ప్రస్తుత సమాజంలో అత్యధిక జనాన్ని పట్టిపీడిస్తున్న చక్కెర(షుగరు)వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వారు తియ్యగా ఉండే ఈ పండ్లను తినవచ్చు. వారికి అన్ని రకాలుగా ఈ కాయలు దివ్య ఔషధం లాగా ఉపయోగ పడుతున్నాయి. దీంతో ఈ సీజన్లో ఈ కాయలకు భలే డిమాండ్ ఏర్పడింది. పలువురు చక్కెర వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు కాయల్లోని గింజల్ని ఎండబెట్టుకొని పొడిగా చేసుకొని తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. చక్కెర వ్యాధి గ్రస్తులకు అల్లనేరేడు కాయలు దివ్య ఔషధంలా పని చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో వీటికి భలే డిమాండ్ ఏర్పడింది. కరువు రైతు ఇంట లభాల పంటగా అల్లనేరేడు మిగిలింది. 749 హెక్టర్లలో సాగు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో మొత్తం 746 హెక్టార్లలో అల్లనేరేడు తోటల పెంపకం చేపట్టారు. ఈ ఏడాది మొత్తం 2090 క్వింటాళ్ల అల్లనేరేడు దిగుబడి వచ్చింది. నల్లబంగారంగా పేరున్న ఈ కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.100 ధర పలుకుతుండడంతో రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. బయట రాష్ట్రాల్లోని మార్కెట్లో కిలో రూ.120 వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో రెతులు ఈ ఏడాది లాభాలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా హైబ్రీడ్ రకం కాయలు పెద్దపెద్ద సైజుల్లో కాసి చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. హెబ్రీడ్ కాయల్లో గింజ శాతం తక్కువగా ఉండి గుజ్జు శాతం ఎక్కువగా ఉండడం వీటి ప్రత్యేకత. ఇలాంటి రకం కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి మంచి ధరలు పలుకుతున్నాయి. సగటున ఎనిమిది సంవత్సరాల వయసున్న అల్లనేరుడు చెట్టు సరాసరి 25 నుంచి 35 కిలోల వరకు కాయలు కాస్తున్నాయి. ఈఏడాది తోటల్లో చెట్లకు మంచి కాపు పట్టింది. బయట రాష్ట్రాలకు ఎగుమతి నియోజకవర్గంలోని అల్లనేరేడు కాయల్ని రైతులు, వ్యాపారుల బయట రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు తోటల్లోనే కాయల్ని మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తున్నారు. ఏ రకం గ్రేడు కాయల్ని కిలో రూ. 120 చొప్పున విక్రయిస్తున్నారు. బిగ్రేడ్ రకం కాయల్ని కిలో రూ.100 వరకు, సీగ్రేడ్ రకం కాయల్ని రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈప్రాంతంలోని కాయల్ని తిరుపతి, కడప, బెంగుళూరు, చెన్నై వంటి పట్టణాలకు తరలిస్తుంటారు. దివ్య ఔషధంగా అల్లనేరేడు ప్రస్తుత సమాజంలో అల్లనేరేడు పలువురికి దివ్వ ఔషధంగా మారిది. మధుమేహం అదుపుకు, శరీర సమస్యలకు చాలా ఉపయోగ పడుతోంది. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం,జింక్ ఫోలిక్ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. రక్తశుద్ధితోపాటు హిమోగ్లోబిన్ పెంచుతుంది. అస్తమా, ఊపరితిత్తుల వ్యాధులను దూరం చేస్తుంది. రక్తంలో కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. దంతసమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి. గ్యాస్, మూత్ర సమస్యలు చర్మవ్యాధులు, కీళ్ల సమస్యలను నివారించడంలో తోడ్పడుతాయి. ఇంకా పలు రకాల జబ్బులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. దీంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. -
ఇంట్లోనే నిమిషాల్లో ఐస్క్రీమ్లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే!
చల్లగా, తియ్యగా, కమ్మగా.. రకరకాల ఫ్లేవర్స్లో దొరికే ఐస్క్రీమ్ అంటే చప్పరించని వారెవరు? మరి అలాంటి ఐస్క్రీమ్ని మళ్లీమళ్లీ లాగించాలంటే ఇలాంటి మెషిన్ ఇంట్లో ఉండాల్సిందే. ఇందులో చాలా రకాల ఐస్క్రీమ్స్ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలతో కూడా ఐస్క్రీమ్ తయారు చేసుకోవచ్చు. తగినన్ని పాలు, పంచదార, ఎసెన్స్ను జోడించి ఎన్నో రుచులను ఆస్వాదించొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందిన.. 2 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ డివైజ్ బౌల్ని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఐస్క్రీమ్ తయారు చేసుకునే ముందు ఫ్రిజ్లోంచి తీసి, డివైజ్లో సెట్చేస్తే సరిపోతుంది. దానిపైన మూత, దానిపైనే పవర్ యూనిట్ అడ్జస్టబుల్గా ఉంటాయి. ఆన్, ఆఫ్ బటన్తోపాటు పవర్ బటన్ కూడా డివైజ్ పైనే కనిపిస్తూ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా ఈజీ. ఈ డివైజ్తో పాటు రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. ధర : 40 డాలర్లు (రూ.3,063) చదవండి👉🏾Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్ధర రూ. 1,990 -
ఆరోగ్య కోట అంజీర
-
కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. అయితే ఇది యుబారి రకం..
టోక్యో: పండ్లు,కూరగాయలు కొనుగోలు చేయాలంటే మహా అయితే వందల్లో ఖర్చు అవుతుంది. పండ్లకు అన్సీజన్లో మాత్రమే ధర అధికంగా ఉంటుంది. అదీ కూడా కొనలేని స్థితిలో ఏం ఉండదు. జపాన్లో మాత్రం అలా కాదు.. యుబారి అనే పుచ్చకాయ కొనుకోలు చేయాలంటే లక్షలు ఖర్చుచేయాల్సిందే! అందుకే ప్రపంచలోనే అత్యంత ఖరీదైన పండుగా గుర్తింపు పొందింది. ఈ పండును కొనుగోలు చేసే డబ్బులో తక్కువలో తక్కువ మన దగ్గర ఎకరా భూమిని కూడా కోనుగోలు చేయవచ్చు. చదవండి: అమెరికా బ్లాక్లిస్ట్లో పెగాసస్ కేజీ యుబారి పుచ్చకాయ ధర లక్షల్లో ఉంటుంది. ధనవంతులు తప్ప సామాన్యులకు అందనంత ఖరీంది. యుబారీ పండు ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. అందుకే కొనుగోలుదారులు, రెస్టారెంట్ యజమానులకు సౌలభ్యం కోసం ఈ పండును చిన్న చిన్న పరిమాణాల్లో అమ్ముతుంటారు. జపాన్లోని యుబారి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరుగుతుంది. గ్రీన్హౌస్ లోపల సూర్యకాంతిలో ఈ పండును పెంచుతారు. -
నేచురల్స్ విజయం.. ఆ రుచి వెనుక రహస్యం ఇదే
మంచి వ్యాపారి కావాలంటే ఉండాల్సిన అర్హతలు కుటుంబ నేపథ్యం, పెట్టుబడి, మేనేజ్మెంట్ డిగ్రీలు ఇవేమీ అక్కర్లేదనీ నిరూపించాడీ వ్యాపారి. పదో తరగతి పాస్ కావడానికే నానా తంటాలు పడ్డా కామన్ సెన్స్ తో బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. సహజత్వాన్ని మరో మెట్టుపైకి చేర్చాడు Naturals Ice Cream Success Story: రఘునందన్ శ్రీనివాస్ కామత్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆయన స్థాపించిన నాచురల్స్ ఐస్క్రీం అంటే తెలియని వారు తక్కువ. అక్కడి రుచిని తలచుకుని నోరూరని వారు అరుదు. అమితాబ్ బచ్చన్ నుంచి వివియన్ రిచర్డ్స్ వరకు ఆ ఐస్క్రీంకి ఫిదా అయిపోయారు. ఐస్క్రీం తింటున్నామా లేక పళ్లు తింటున్నామా అనేంత సహజంగా ఇక్కడ హిమక్రీములు తయారవుతాయి. ఒక్కసారి ఇక్కడ ఐస్క్రీం రుచి చూసిన వారు రెండో సారి గుర్తు పెట్టుకుని మరీ తింటారు. ఇంతకీ అంతలా ఆకట్టుకునే ఆ ఐస్క్రీం తయారీకి బీజం ఎలా పడింది. మంగళూరు టూ ముంబై కర్నాటకలోని మంగళూరుకి చెందిన శ్రీనివాస్ కామత్ పళ్ల వ్యాపారి. మార్కెట్లో వందల పళ్ల మధ్య పక్వానికి వచ్చి రుచి ఎక్కువగా పండుని ఎంపిక చేయడంలో ఆయన దిట్ట. దీంతో పళ్ల మంగళూరులో పళ్ల వ్యాపారం చేస్తూ భార్య, ఏడుగురు సంతానాన్ని పోషించేవాడు. అయితే పళ్లపై వచ్చే వ్యాపారం సరిపోకపోవడంతో కుటుంబాన్ని ముంబైకి మార్చాడు. అలా తన పదిహేనవ ఏట తల్లిదండ్రులతో కలిసి ముంబైలో అడుగు పెట్టాడు రఘునందన్ శ్రీనివాస్ కామత్. తినుబండారాల షాప్ పళ్ల వ్యాపారం వద్దనుకుని ముంబైలో తినుబండరాల షాప్ని ఓపెన్ చేసింది ఆ కుటుంబం. మిగిలిన అక్కడున్న మిగిలిన షాప్లని కాదని తమ దగ్గరికే కష్టమర్లు వచ్చేలా చేసేందుకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసేది రఘునందన్ తల్లి ప్రయత్నించేది. అయితే అంత తేలిగ్గా ఆ టేస్టీ ఫుడ్ రెసీపీ దొరికేది కాదు. అయినా ఆమె ప్రయత్నిస్తూనే ఉండేది. ఆమెకు తోడుగా రఘునందన్ వంటింట్లో ఎక్కువ సేపు గడిపేవాడు. వారి ప్రయత్నం ఫలించి రుచికరమైన రెసిపీలతో ఆ షాప్ బాగా నడిచింది. ఆర్థిక ఇబ్బందులు లేని స్థితికి ఆ కుటుంబం చేరుకుంది. దీంతో అక్కడే ఐస్క్రీంలు అమ్మడం కూడా ప్రారంభించారు. సొంత ప్రయత్నం ముంబైలోని ఈటెరీ షాప్లో ఇంట్లోనే తయారు చేసిన వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్లు అమ్మేవారు. అయితే అన్నతో వచ్చిన విబేధాల కారణంగా ఆ షాప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎవరూ చేయనిది ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఫ్రూట్ ఫ్లేవర్లు అప్పటి వరకు వెనీలా, స్ట్రాబెరీ, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్క్రీమ్లే అమ్మేవారు. మ్యాంగో, జామ, ద్రాక్ష ఫ్లేవర్లలో ఐస్క్రీమ్లు ఎందుకు అమ్మకూడదనే ఆలోచన రఘునందన్లో కలిగింది. రుచి ఎక్కువగా ఉండే పళ్లను గుర్తించడంలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న నైపుణ్యం, కొత్త రెసిపీలు తయారు చేయడంలో తల్లి నుంచి నేర్చుకున్న మెళకువలు రంగరించి ఫ్రూట్ఫ్లేవర్లలో ఐస్క్రీమ్లు తయారు చేశాడు. ఫస్ట్ స్టోర్ ముంబైలో జనసంచారం ఎక్కువగా ఉండే జూహు రోడ్లో 1984లో కేవలం నాలుగు టేబుళ్లతో నాచురల్స్ ఐస్క్రీం స్టోర్ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు రెగ్యులర్ ఫ్లేవర్ల తిని మోహం మొత్తిపోయిన జనాలకు ఈ ఫ్రూట్ ఫ్లేవర్లు బాగా నచ్చాయి. అంతే మరుసటి ఏడాదికే విల్లేపార్లేలో మరో స్టోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ముంబైలో ఐస్క్రీమ్ అంటే నాచురల్స్ అనే పరిస్థితి మారింది. వివ్ మాటలతో లెజండరీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ హోస్ట్గా 1986లో సన్నీడేస్ కార్యక్రమం వచ్చేది. దానికి అతిధిగా వచ్చిన వివ్ రిచర్డ్స్ మాట్లాడుతూ.. తానెప్పుడు ముంబై వచ్చినా నాచురల్స్లో ఐస్క్రీమ్స్ తప్పక తింటానని, అక్కడ దొరికే రుచి మరెక్కడా దొరకదంటూ కితాబిచ్చాడు. ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా నాచురల్స్ పేరు మార్మోగిపోయింది. మౌత్టాక్ నాచురల్స్ ప్రయాణం ప్రారంభైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ ప్రచారంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు రఘునందన్ కామత్ ఖర్చు పెట్టలేదు. అక్కడ ఐస్క్రీం రుచి చూసిన వాళ్లే ప్రచారం చేసి పెట్టారు. అందులో వివియన్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ఎందరో ఉన్నారు. అలా నోటిమాట సాయంతోనే ముంబై నుంచి దేశమంతటా నాచురుల్స్ రుచులు విస్తరించాయి. రూ.300 కోట్ల టర్నోవర్ రోడ్డు పక్కన చిన్న తినుబండరాల షాప్ నుంచి ప్రారంభమైన రఘునందన్ శ్రీనివాస్ కామత్ ప్రయాణం రోజు రూ. 300 కోట్ల టర్నోవర్కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 135 పైగా ఔట్లెట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు దోస, కోకోనట్, ద్రాక్ష, లిచి, జామ ఒకటేమిటి ఇలా అన్ని రకాల ఫ్లేవరల్లో ఐస్క్రీమ్లు దొరుకుతాయి. అదే రహస్యం నాచురల్స్ సక్సెస్ వెనుక ఉన్న రహాస్యం కామన్సెన్స్ అంటారు రఘునందన్ కామత్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ జ్ఙానంతోనే నాచురల్స్ స్థాపించానని చెబుతారు. వాళ్ల నుంచి నేర్చరుకున్న విషయాలనే మరింత సాన పెట్టానంటారు. అందులో కృత్రిమత్వం ఏమీ లేదనే. అందుకే తమ ఐస్క్రీమ్లు అంత సహాజంగా ఉంటాయంటారు. - సాక్షి, వెబ్డెస్క్ -
‘అల్లనేరేడు’ తింటే ఆరోగ్యానికి ఎంత మేలో..
జియ్యమ్మవలస: గిరిజనులకు అల్లనేరేడు తోటలు ఆసరాగా నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్షి్మపురం, కొమరాడ మండలాల్లో నేరేడు తోటలు ఎక్కువగా పెంచుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో టికేజమ్ము, పిటిమండ, కొండచిలకాం, నడిమిసిరిపి, పల్లపుసిరిపి, చాపరాయిగూడ, బల్లేరు తదితర గ్రామాలలో విపరీతంగా నేరేడు చెట్లున్నాయి. గిరిజన గ్రామాలలోనే కాకుండా గిరిజనేతర గ్రామాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. సాధారణంగా అల్లనేరేడు చెట్టును నాటినప్పటి నుంచి సుమారు నాలుగేళ్లలోపు పంటకు వస్తుంది. ఒక్కో చెట్టు సుమారు 100 కిలోల వరకు చెట్టు పెరుగుదలను బట్టి దిగుబడి వస్తుందని గిరిజనులు అంటున్నారు. గిరిజన గ్రామాలకు వ్యాపారులు వచ్చి బేరాలు కుదుర్చుకుంటారు. కేజీ నేరేడు పండ్లు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. వాటిని పట్టణాలకు తీసుకుపోయి కిలోను రూ.160కు విక్రయిస్తుంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పౌరాణికంగాను, ఔషధపరంగా కూడా జంబూ వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిదని, మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. నేరేడుకు పట్టణాల్లో డిమాండ్ అల్లనేరేడు పండుకు గిరిజన ప్రాంతాలలో అంతగా ధర లేదు. పట్టణాల్లో ఎక్కువ ధర ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుండడంతో ఇక్కడ ఎవరూ కొనరు. దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటాం. - మండంగి అప్పారావు, బల్లేరుగూడ షుగర్కు దివ్య ఔషధం షుగర్ వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు పండును తింటే దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ గింజలను పొడిరూపంలో చేసుకుని తింటే ఫలితం ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పండే ఈ పండుకు ఆదరణ ఉంది. - డాక్టర్ శ్రావణ్కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, ఆర్ఆర్బీపురం చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా.. -
Dragon Fruit: ఎంటర్ ది ‘డ్రాగన్’
డ్రాగన్ ఫ్రూట్. మంచి పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. ఈ ఫల సేద్యం కృష్ణా జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు అక్కడక్కడా సాగుచేస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధమైంది. నూజివీడు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉపాధి హామీ పీడీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మామిడి, నిమ్మ, జామ, సపోట తదితర పండ్లతోటలకు సర్కారు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇక నుంచి డ్రాగన్ ఫ్రూట్నూ ఈ జాబితాలో చేర్చింది. ఆసక్తికల రైతులు ఉపాధి హామీ పథకం ఏపీఓలను సంప్రదించి డ్రాగన్ సాగు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోనూ పైలెట్ ప్రాజెక్టుగా.. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టేందుకు రాష్ట్రంలో పలు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో కృష్ణా జిల్లా కూడా ఉంది. పథకం అమలుకు మార్గదర్శకాలూ విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు అర ఎకరా విస్తీర్ణంలో సాగుకు అనుమతిస్తారు. దీనికి ముందుకు వస్తే రైతుకు రూ.1.86 లక్షలను ఇస్తారు. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులనూ చెల్లిస్తారు. మొక్కల ఖరీదులోనూ సగం రైతులు పెట్టుకుంటే మిగిలిన సగం ప్రభుత్వం భరిస్తుంది. అర ఎకరాకు దాదాపు 350 మొక్కలు అవసరమవుతాయి. డిమాండ్ ఎక్కువ మంచి పోషకాలు కలిగిన డ్రాగన్ఫ్రూట్కు మార్కెట్లోనూ డిమాండ్ బాగా ఉంది. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది. ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.100 పలుకుతోంది. ఈ ఫలంలో రెండు రకాలు ఉన్నాయి. ఒక రకానికి లోపలి భాగం తెలుపురంగులో మరో రకానికి ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఫలానికే డిమాండ్ ఎక్కువ. వీటిల్లో విటమిన్–సీ, విటమిన్–బీ3తో పాటు ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బొహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధి నియంత్రణకు దోహదపడుతుంది. ఏడాదికల్లా కాపు మొక్కలు నాటిన తరువాత ఏడాది కల్లా కాపు వస్తుంది. 30 ఏళ్లు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి మూడు కాపులు వస్తాయి. ప్రారంభంలో ఒక్కొక్క చెట్టుకు పది కాయలు కాస్తాయి. రానురాను దిగుబడి మరింత పెరుగుతుంది. డ్రాగన్ ఎడారి మొక్కైన నాగజెముడు, బ్రహ్మజెముడులాగా నీరు తక్కువగా ఉన్నా బతుకుతుంది. చౌడు భూములు మినహా మిగిలిన నేలల్లో దీనిని సాగుచేసుకోవచ్చు. రైతులు ఆసక్తి చూపాలి డ్రాగన్ఫ్రూట్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. అర ఎకరం వరకు సాగు చేసుకుంటే ఉపాధిహామీ పథకం నుంచి నిధులను ఇస్తుంది. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకుని ముందుకు రావాలి. – జీవీ సూర్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా -
డ్రాగన్ ఫ్రూట్ కాదు కమలం పండు
పట్నా : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’గా మార్చిన తరువాత డ్రాగన్ పండు దేశం దృష్టిని ఆకర్షించిన మాట నిజమేగానీ ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా తక్కువ కాలరీలున్న డ్రాగన్ ఫ్రూట్ గిరాకీని పెంచింది. దీంతో డ్రాగన్ఫ్రూట్ గత కొన్నేళ్ళుగా బిహార్లోని రైతులకు మంచి జీవనోపాధిని కల్పిస్తోంది. సాంప్రదాయ వ్యవసాయానికి దూరంగా ఉంటూ ఏదైనా వినూత్న ప్రయోగం చేయాలని భావించే బిహార్లోని కోసి, సీమాంచల్ రైతాంగం డ్రాగన్ ఫ్రూట్ పంటలను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక హెక్టార్ భూమిపై తొలుత 6 నుంచి 8 లక్షలు పెట్టుబడి పెట్టి ఏడాదికి 8 నుంచి 10 లక్షల ఆదాయాన్ని సులభంగా సంపాదిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వైభవానికో చరిత్ర బిహార్లో డ్రాగన్ ఫ్రూట్ వైభవానికి ఓ చరిత్ర ఉంది. ఆ కథే కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)కి ఉందని అంటారు హార్టికల్చర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ సింగ్. ఆ కథేంటో తెలుసుకోవాలంటే 2014వ సంవత్సరానికి వెళ్ళాల్సిందే. 2014లో కిషన్ గంజ్లో డ్రాగన్ ఫ్రూట్ విజయగాథ ప్రారంభం అయ్యింది. నాగరాజ్ నఖ™Œ అనే ఔత్సాహిక రైతు సింగపూర్ నుంచి 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను తీసుకొచ్చాడు. మొదట 5 హెక్టార్ల భూమిలో 100 మొక్కలతో పని ప్రారంభించారు. అవి పెరిగి పెద్దవై 15,000 నుంచి 20,000 మొక్కలకు పెరిగాయి. పెట్టుబడి ఎంత? ప్రారంభంలో ఒక హెక్టారుపై 6 నుంచి 8 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐదు అడుగుల పొడవున్న పోల్స్, వాటిపైన రింగులుగా టైర్లు, బిందు వ్యవసాయం కోసం వాడే వ్యవసాయ పరికరాలను అమర్చుకోవడం కోసం ఈ పెట్టుబడిని వినియోగించాల్సి ఉంటుంది. మూడేళ్ళ తరువాత మనం పెట్టే పెట్టుబడిపై రాబడిరావడం మొదలౌతుంది. ఆ తర్వాత రైతులు ఏడాదికి సులువుగా 8 నుంచి 10 లక్షల రూపాయలను సంపాదించగలుగుతారు. డ్రాగన్ వైపు మొగ్గు చూపుతున్న జిల్లా రైతాంగం కిషన్ గంజ్తో సహా పొరుగు జిల్లా ప్రజల్లో డ్రాగన్ ప్రూట్ పంటపై అవగాహన కల్పిస్తోన్న హేమంత్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘సమీప జిల్లాల్లోని రైతులు పూర్ణియా, సుపాల్, అరారియాలు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై తరచూ ఆరాతీసేవారు. ఆ తరువాత మెల్లిగా వారి వారి ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ని సాగుచేయడం ప్రారంభించారు’ అని చెప్పారు. కేవలం ఒక్క కిషన్ గంజ్లోనే 12 ఎకరాల భూమిలో రైతులు డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలైన కోసి, సీమాంచల్ జిల్లాల్లో రైతులు కూడా డ్రాగన్ఫ్రూట్ని సాగుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే విషయంలో సమస్యలెదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ని కొనుగోలుచేసేందుకు వ్యాపారులు వస్తున్నారు. కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ 300 నుంచి 400 రూపాయలు ధర పలుకుతున్నాయి. ప్రోత్సహిస్తే రైతు పంట పండినట్లే.. సంప్రదాయక పంటల విషయంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. ‘రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పి)పైనే ఆధారపడాల్సి ఉంటుందని ఈ ప్రాంతానికి డ్రాగన్ ఫ్రూట్ని పరిచయం చేసిన నాగరాజ్ అంటారు. అయితే డ్రాగన్ ఫ్రూట్ విషయంలో తాను కనీసం స్థానిక మార్కెట్ అవసరాలకు సరిపోయే పంటను అందించలేకపోతున్నాను అంటారాయన. అందుకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తే, రైతులు లాభదాయకమైన డ్రాగన్ ఫ్రూట్ పంటలవైపు మొగ్గుచూపుతారని నాగరాజ్ అభిప్రాయపడుతున్నారు. వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్లను ఎలా పండించాలో రైతులకు అవగాహన కల్పించేందుకు కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) 500 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. ఎర్రటి పండులో ఎరుపు గుజ్జు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ అత్యంత ప్రాచుర్యం పొందిన రకం అని హేమంత్ కుమార్ సింగ్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ పంటలపై అవగాహనకు బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సాబోర్, డ్రాగన్ ఫ్రూట్స్ పండించే విధానంపై ఓ వీడియో పోస్ట్ చేసింది. దీన్ని రైతులు విస్తృతంగా చూశారు అని యూనివర్సిటీ తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ఆర్.కె.సోహానే తెలిపారు. 50 శాతం రాయితీతో.. డ్రాగన్ ఫ్రూట్ సాగుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాన్ని వివరిస్తూ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ కుమార్, ఈ యేడాది నుంచి, వైశాలి జిల్లాలోని దేశ్రీ వద్ద 0.4 ఎకరాల భూమిలో డ్రాగన్ పండ్ల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. మొక్కకు 20 రూపాయల చొప్పున 50 శాతం రాయితీతో ఈ మొక్కలను రైతులకు అందిస్తారు. ‘కిషన్ గంజ్లో డ్రాగన్ పంట ఫలవంతమైన తరువాత ప్రభుత్వం ఈ పంటను విస్తృతపరిచే విషయంపై దృష్టి సారించింది. దక్షిణ బిహార్లో విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అని రాకేష్ కుమార్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ కాదుకమలం పండు ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్ని ప్రపంచదేశాలతో పాటు భారత్లోనూ విరివిగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్నారు. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’ అని మార్చి గుజరాత్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ప్రకటించారు. డ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని, ధర రీత్యా విలువైనదేనని రూపాని అన్నారు. కమలం ఉపయోగాలు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. -
కాసులు కురిపించే డ్రాగన్ ప్రూట్స్..
శృంగవరపుకోట రూరల్: విదేశాల్లో సంపన్నులు తినే డ్రాగన్ ఫ్రూట్స్ మన ప్రాంతంలో కనిపించవు. అలాంటి అరుదైన పంటను బొండపల్లి, డెంకాడ, లక్కవరపుకోట మండలాల్లో ఔత్సా హిక రైతులు సాగుచేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా యువ రైతులు పండ్ల తోట లు సాగుచేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు. అధిక దిగుబడులు వస్తుండడంతో సంతోసపడుతున్నారు. మన ప్రాంతంలో విస్తారంగా సాగుచేయవచ్చని చెబుతున్నారు. ఎర్రగా, నల్లని గింజలతో డ్రాగన్ పండు లోపలిభాగం.. అన్ని రకాల నేలలు అనుకూలం.. డ్రాగన్ఫ్రూట్స్ మొక్కల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మంచి సేంద్రియ కర్బనంతో కూడిన ఇసుక నేలలు మరింత శ్రేష్టం. ఈ పంటను అధికంగా వియత్నాం, థాయ్లాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక వంటి విదేశాల్లో పండిస్తున్నారు. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. పూత, కాయ సమయాల్లో 3–4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంట పండించుటకు, మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైనది. సిమెంట్/కాంక్రీట్ స్తంభాలను ఎకరానికి 500 వరకు అవసరమవుతాయి. ప్రతీ స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాలి. స్తంభానికి పైన టైర్/ఇనుప చక్రం ఉంచాలి. ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా, జారిపోకుండా ఊతం అందిస్తుంది. ఎకరానికి సుమారుగా 2, 000 మొక్కలు నాటాలి. 20 సంవత్సరాల వరకు దిగుబడి.. ఈ పంట ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. స్తంభానికి నలు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, 1 అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులను ఇవ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. సంవత్సరంలో రెండు సార్లు (జూన్ మరియు జనవరి లో) పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమా న్ని పిచికారీ చేయాలి. సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. తోటలో కోత దశకు చేరువలో ఉన్న డ్రాగన్ పండ్లు జూన్–అక్టోబర్ నెలల్లో.. డ్రాగన్ఫ్రూట్ పూత, కాయ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. పంట పొలంలో విద్యుత్ లైట్లను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందవచ్చు. డ్రాగన్ సాగుకు ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు దిగుబడి 6–8 టన్నుల వరకు వస్తుంది. ప్రస్తుత మార్కెట్లో డ్రాగన్ఫ్రూట్ కేజీ ధర రూ.150–200 వరకు పలుకుతోంది. సాగు బాగుంది... డ్రాగన్ పండ్ల మొక్కలను నాలుగు ఎకరాల్లో సాగుచేశాను. ఎకరాకు మొదటి క్రాప్లో 4–5 టన్నుల దిగుబడి వచ్చింది. పండ్లను విశాఖలో అమ్ముతున్నాం. మార్కెట్ బాగుంది. ఎకరాకు సుమారు రూ.8 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి మినహాయిస్తే రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు మిగులుతోంది. – జస్టిన్, కిత్తన్నపేట, ఎల్.కోట మండలం పూత దశలో ఉన్న డ్రాగన్ఫ్రూట్ తోట సాగుపై ఆసక్తి చూపాలి రైతులు కొత్తగా ఆలోచించాలి. పండ్ల తోటల సాగుతో పాటు మార్కెటింగ్ వ్యూహాన్ని పసిగట్టాలి. పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్న పెద్ద రైతులు డ్రాగన్ పండ్ల మొక్కల సాగుపై ఆసక్తి చూపాలి. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలను ఆర్జించవచ్చు. డ్రాగన్ఫ్రూట్ను తెలుగులో సిరి జమ్మెడ చెట్టు అంటారు. ఇది ఎడారి జాతికి చెందిన పండ్ల మొక్క. తక్కువ నీటితో సాగుచేయవచ్చు. ఈ పండ్లలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండును తినడం ద్వారా బరువు నియంత్రణ, ఆస్తమా, చెడు కొలెస్ట్రాల్ తగ్గటం, డయాబెటిస్ నియంత్రణ లాంటి ఎన్నో ఉపయోగాలు చేకూరుతాయి. అందుకే పండ్లకు ఎప్పుడూ ధర ఉంటుంది. – బండారు దీప్తి, ఉద్యానవన శాఖ అధికారి, ఎస్.కోట డ్రాగన్ తోటల సాగును పరిశీలిస్తున్న జిల్లా ఉద్యాన అధికారులు -
రూ.100కే 5 రకాల పండ్లు పంపిణీ
-
కానరీ మిలన్
తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలనిచ్చే కొత్త పంట కానరీ మిలన్ పండ్లను సాగు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కల్లెం నర్సింహారెడ్డి. పసుపురంగులో దోసకాయ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది కూరగాయ కాదు. తర్బూజ మాదిరిగా తియ్యగా ఉండే పండు ఇది. నాలుగైదు నెలల్లో కోతకు వచ్చే వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసి సరైన ధర లేక కష్టనష్టాలను ఎదుర్కోవడం కంటే కానరీ మిలన్ను సాగు చేయడం మేలని నర్సింహారెడ్డి భావిస్తున్నారు. పంటను ప్యాకింగ్ చేస్తున్న కూలీలు మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో కానరీ మిలన్ను ఢిల్లీతో పాటు, అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి డిమాండ్ ఉంది. శీతలగిడ్డంగిలో పెడితే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అరబ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నట్లు చెబుతున్నారు. అనంతపురం ప్రాంత రైతులు కొంత కాలం క్రితం నుంచే కానరీ మిలన్ను సాగు చేసి ఢిల్లీ మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. నిజామాబాద్ ప్రాంతంలో తొలుత నర్సింహారెడ్డి ఆరెకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆయన సమీప బందువులు కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. విత్తనం ధర అధికం తైవాన్ నుంచి తెప్పించే హైబ్రిడ్ విత్తనాన్ని వాడాల్సి రావడం వల్ల ధర ఎక్కువగా ఉంటున్నది. ప్రతి పంటకూ విత్తనం కొని వేయాల్సిందే. కానరీ మిలన్లో రెండు రకాలున్నాయి. వేసవి సీజన్లో అధిక దిగుబడినిచ్చే రకం కొయినూర్ రకం. ఇది చలిని తట్టుకోలేదు. చలికాలంలో వేరే రకం వెయ్యాలి. మరో పది రోజుల్లో ఆ రకం విత్తబోతున్నాను అన్నారు నర్సింహారెడ్డి. రవాణా ఖర్చు కిలోకు రూ. 20 ఎకరానికి 10–15 టన్నుల కానరీ మిలన్ పండ్ల దిగుబడి వస్తుంది. ఢిల్లీ తీసుకెళ్లి టోకున అమ్మితే కిలోకు రూ. 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతుంది. పాదికి రెండు లేక మూడు పిందెలను మాత్రమే ఉంచుతారు. పండు కిలోన్నర రెండు కిలోల బరువు వరకు పెరుగుతుంది. కిలోకన్నా ఎక్కువ బరువున్న పండే రుచిగా ఉంటుంది. ధర కూడా పలుకుతుంది. అట్ట పెట్టెకు ఆరు నుంచి ఏడు కాయలను ప్యాక్ చేసి లారీల్లో ఢిల్లీ మార్కెట్కు రవాణా చేస్తున్నారు. రవాణాకు సిద్ధ్దమైన కానరీ మిలన్, రైతు నర్సింహారెడ్డి అయితే, లారీల్లో సరుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి కిలోకు రూ. 20 వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్లో దీనికి కిలోకు రూ. 30 ధర వచ్చినా మంచిదే. అయితే, మన వాళ్లకు ఈ పండు తెలియదు. గత ఏడాది శివరాత్రికి పది టన్నులు పంపి హైదరాబాద్లో అమ్మాం. స్థానికంగా మార్కెట్ పెరిగితే బాగుంటుందని నర్సింహారెడ్డి అన్నారు. దుక్కికి రూ.10 వేలు, పశువుల ఎరువుకు రూ.పది వేలు, మల్చింగ్, ఎరువులకు మరో రూ.20 వేలు, ఇతర ఖర్చులు మరో 15 వేల వరకు ఉంటాయి. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమిషన్లు పోగా ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జిస్తున్నారు నర్సింహారెడ్డి. రోజూ పొలం అంతా కలియదిరగాలి సున్నితమైన హైబ్రిడ్ పంట కావడంతో పంటను ప్రతిపూటా రైతు స్వయంగా తడిమి చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కూలీలపై వదిలేస్తే ఏమాత్రం కుదరదు. రోజూ ఏదో ఒక పూట పొలం అంతా కలియదిరగాల్సిందే. చీడపీడలేమైనా సోకాయేమో స్వయంగా చూసుకోవాలి. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే నష్టాలు పాలు కావాల్సి వస్తుందని నర్సింహారెడ్డి(97052 02562) చెబుతున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ 65 రోజుల్లో పంట చేతికి.. ఇది మెట్ట ప్రాంతపు పంట. నీరు ఎక్కువగా ఉండకూడదు. వర్షాకాలం దీని సాగుకు అనువైన కాలం కాదు. ఈ ఏడాది వర్షాలు నెల రోజులు ఎక్కువగా పడటం వల్ల తమ పంట దెబ్బతిన్నదని నర్సింహారెడ్డి తెలిపారు. వర్షం వల్ల కాయ తీపి కూడా తగ్గిందన్నారు. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం నాలుగు ఎకరాల్లో ఈ పంటను పండించవచ్చని ఆయన చెబుతున్నారు. విత్తనం వేసిన తర్వాత 60 నుంచి 65 రోజుల్లో పంట చేతికందుతుంది. స్వల్పకాలిక పంట కావడంతో ఏడాదిలో రెండు నుంచి మూడు పంటలు పండించవచ్చని నర్సింహాæరెడ్డి తెలిపారు. ఎకరంలో ఎత్తు మడుల(బెడ్స్పై)పై మల్చింగ్ షీట్ పరచి సాగు చేయడానికి మొదట సుమారు రూ. 75 వేల వరకు ఖర్చవుతుందని, రెండు, మూడో పంటలకు ఖర్చు తగ్గుతుందన్నారు. -
‘డ్రాగన్’ ఫ్రూట్ ఒక్కసారి నాటితే 20 ఏళ్లు దిగుబడి
విలక్షణమైన వైద్యుడు డాక్టర్ మాధవరం శ్రీనివాసరావు. మనుషుల డాక్టర్ పట్టుదలతో మొక్కల డాక్టర్గా మారారు. ఉద్యాన శాస్త్రవేత్తగా అవతారం ఎత్తారు. ఖరీదైన, పోషక విలువలున్న పండు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి కేంద్రీకరించారు. వియత్నాం సహా 11 దేశాలు తిరిగి మెలకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్కు సమీపంలోని తన క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ను అత్యంత లాభదాయకంగా సాగు చేయడంలోనే కాదు.. కొత్త హైబ్రిడ్స్ బ్రీడింగ్పైనా పట్టు సాధించాడు. సెలెక్టివ్ బ్రీడింగ్తోపాటు ‘డబుల్ గ్రాఫ్టింగ్’ పద్ధతిని అనుసరిస్తూ 8 నెలల్లోనే కాపుకొచ్చే ‘సియాన్ రెడ్’ అనే కొత్త హైబ్రిడ్ డ్రాగన్ ఫ్రూట్ రకాన్ని రూపొందించారు. అన్సీజన్లోనూ దీపపు కాంతిలో అధిక దిగుబడి సాధిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పల్ప్, వైన్ తయారు చేసి వాణిజ్యవేత్తగా ఎదగాలని ఆశిస్తున్నారు. వైద్య వృత్తిని వదలిపెట్టకుండానే డ్రాగన్ ఫ్రూట్ సేద్యంపై పరిశోధనలు సాగిస్తుండటం విశేషం. ఈ పండుతో వైన్ తయారు చేయాలని, పల్ప్ పరిశ్రమ పెట్టాలని కలలు కంటున్నారు. చేసేది తీరిక లేని వైద్యవృత్తి. ఒక కొత్త పండు ఆయనను అమితంగా ఆకర్షించి, దేశ దిమ్మరిని చేసింది. వ్యవసాయంలోకి దింపింది. ఉద్యాన శాస్త్రవేత్తగా మార్చింది. ఆ విలక్షణ వైద్యుడే డాక్టర్ మాధవరం శ్రీనివాస్రావు. ఎండీ జనరల్ చదివాడు. పెళ్లిచూపుల్లో ఎర్రని డ్రాగన్ ఫ్రూట్ను చూసి మనసు పారేసుకున్నారు. దానిపై లోతైన అధ్యయనం చేశాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రెండేళ్లలోనే పట్టు సాధించాడు. ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే.. డ్రాగన్ పండ్లు పాడవకుండా పాలిథిన్ కవర్ల రక్షణ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్ గ్రామ శివారులో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఇందులో 2.5 ఎకరాల్లో పరిశోధనలు సాగిస్తున్నా. మిగతా భూమిలో డ్రాగన్ ప్రూట్ను సాగు చేస్తున్నా. తొలుత గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతుల వద్దకు వెళ్ళాను. ఆ పంటను సాగుచేస్తున్నప్పటికీ వారి నుండి ఆశించిన సమాచారం అందలేదు. సంతృప్తి కలగ లేదు. ఆ అన్వేషణలోనే వియత్నాం సహా 11 దేశాలు తిరిగాను. వియత్నాం రైతుల దగ్గరే ఉండి వ్యవసాయ పాఠాలు నేర్చుకున్నాను. మహారాష్ట్ర నుండి కొన్ని మొక్కలు తెచ్చి పంటను సాగు చేద్దామని 2015లో ప్రారంభించాను. కానీ మహారాష్ట్ర నుండి మా పొలానికి తెచ్చే సరికే 70 శాతం మొక్కలు చనిపోయాయి. ఇక ఇలా కాదని.. ఇక్కడి వాతావరణానికి అనుకూలించే మొక్కలను సాగు చేద్దామనుకున్నాను. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే.. ‘ఈ పంటలను మనం సాగు చేయలేం. దాన్ని గురించి మర్చిపోండి డాక్టర్ గారూ’ అని సలహా ఇచ్చారే తప్ప ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా డ్రాగన్ ప్రూట్ పండించడమే కాకుండా దాన్ని ఫలితాన్ని రైతులకు అందించాలనే పట్టుదల, కసి మరింత పెరిగింది. ఫిలిప్పీన్స్, మలేషియా,ౖ తెవాన్, ఇజ్రాయిల్, థాయిలాండ్ దేశాలకు వెళ్ళి అక్కడ డ్రాగన్ ప్రూట్ పండించే వ్యవసాయ క్షేత్రాలు చూశాను. వియత్నాంలో డ్రాగన్ ప్రూట్ పండించే రైతు ఇంట్లో పెయిడ్ గెస్ట్గా వారం రోజులు ఉండి పంటలను ఎలా సాగు చేయాలో పూర్తిగా తెలుసుకున్నాను. మొక్కలను అంట్లు కట్టడం(గ్రాఫ్టింగ్) నేర్చుకున్నాను. అక్కడి నుండి మొక్కలు తీసుకువస్తే కలిగే ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని పండ్లు తీసుకువచ్చాను. ఆ గింజలు నాటి మొక్కలు పెంచాను. ఒకటికి రెండు సార్లు అంటు కట్టడం(డబుల్ గ్రాఫ్టింగ్) ద్వారా డ్రాగన్ ప్రూట్లో సియాన్ రెడ్ అనే కొత్త హైబ్రిడ్ రకానికి రూపకల్పన చేసి, సాగు చేస్తున్నాను. ఎకరానికి 2 వేల మొక్కలు డ్రాగన్ ప్రూట్ మొక్కకు త్వరగా ఎత్తు పెరిగే గుణం వుంటుంది. ఇవి నిటారుగా ఎదగడానికి ఆధారం కావాలి. అందుకే సిమెంట్ కాంక్రీటు స్థంభాలను నాటాలి. వాటి పైన మొక్క అల్లుకునేందుకు వీలుగా గుండ్రటి, చతురస్త్రాకారంతో సిమెంట్ నిర్మాణాలు ఏర్పాటు చేసి.. గొడుగులాగా మొక్కలు పెరిగేలా చేయాలి. ఏడు అడుగుల సిమెంట్ స్థంభాలను తీసుకొని రెండు అడుగుల లోతు భూమిలో పాతాలి. ఒక ఎకరాకు 450 నుండి 500 స్థంభాలను నేలను బట్టి 8 నుండి 10 అడుగుల దూరంగా నాటాలి. ప్రతి స్తంభం వద్ద నాలుగు వైపులా నాలుగు మొక్కల చొప్పున.. ఒక ఎకరంలో సుమారు 2 వేల మొక్కలను నాటాలి. ఒక్కసారి నాటితే 20 ఏళ్లు దిగుబడి ఒకసారి మొక్కలు నాటితే 20 సంవత్సరాల వరకు పంట వుంటుంది. స్తంభానికి నలు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, ఒక అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేప పిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులివ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం వుంటుంది. సంవత్సరంలో రెండు సార్లు (జూన్, జనవరిలో) పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. దీంతో పాటు ప్రతీ రెండు, మూడు నెలలకొకసారి జీవన ఎరువులను సైతం చెట్లపై పిచికారీ చేయాలి. నేలలో సారం పెంచేందుకు వర్షాకాలంలో చెట్ల మధ్య జనుము, పచ్చిరొట్ట పైరును పెంచి నేలలో కలియదున్నాలి. ఈ పంటలో చీడపీడల సమస్య చాలా తక్కువ. అన్సీజన్లోనూ పంట దిగుబడి సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలి కాపు కాయడానికి రెండు నుండి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే, డబుల్ గ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగించి 8 నెలల కాలంలోనే తొలి దిగుబడి తీసుకువచ్చాను. సహజంగా డ్రాగన్ ప్రూట్ దిగుబడి కాలం జూన్–అక్టోబర్ మధ్య కాలం. కానీ, నవంబర్–జనవరి మధ్య కాలంలో విద్యుత్ లైట్ల ద్వారా కాంతిని మొక్కలకు అందించడం ద్వారా జనవరి, ఫిబ్రవరి నెలలోనే మొక్కలు పూతకు వచ్చేలా చేశాం. ఇలా చేస్తే 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. సీజన్లో ఈ పండ్ల «ధర కిలో రూ.150 నుండి రూ. 200 వుంటే. అ¯Œ సీజన్లో మాత్రం రూ. 300 నుండి రూ. 400 వరకు వుంటుంది. డ్రాగన్ ఫ్రూట్ వైన్ తయారు చేస్తా! డ్రాగన్ ఫ్రూట్తోపాటు అవకాడో (వెన్న పండు) పంటలపై పరిశోధనాలు చేస్తున్నా. దిగుబడి, గుజ్జు, తీపి, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండే వంగడాలపై పరిశోధనాలు చేస్తున్నా. వైద్యవృత్తిలో బిజీగా ఉంటూనే రోజుకు కొన్ని గంటలు కేటాయిస్తున్నా. రైతులను ప్రోత్సహించి ఈ పంటలను విస్తృతంగా సాగులోకి తేవాలి. ఎక్కువ పంట అందుబాటులోకి వచ్చాక వైన్ తయారు చేద్దామని, పల్ప్ పరిశ్రమ నెలకొల్పాలని ఆశిస్తున్నాను. మన దేశంలోనే చాలా పెద్ద మార్కెట్ ఉంది, దిగుల్లేదు.– డాక్టర్ మాధవరం శ్రీనివాస్రావు(97040 83000), ఎండీ (జనరల్), డ్రాగన్ ఫ్రూట్ రైతు, బ్రీడర్ ప్రస్తుతం మూడురకాలను మొక్కలను సాగు చేస్తున్నాను. దిగుబడి ఎకరాకు 8 టన్నుల వరకు వస్తుంది. మన వాతావరణానికి తట్టుకొని, రోగ నిరోధక శక్తి కలిగి, అధిక దిగుబడి, రుచి, నిల్వ సామర్థ్యం ఉండే ఐదు కొత్త రకాల అభివృద్ధి కోసం పరిశోధనలు చేపట్టాను. మూడు రకాలను అందుబాటులోకి తెచ్చాను.ఈ పండు సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించి సబ్సిడీ రుణాలు అందించాలి. ఈ పండు బ్లడ్ షుగర్ను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య వుండదు. ఎముకలను గట్టిపరుస్తుంది. గుండె సంబంధ వ్యాధులను సైతం నయం చేస్తుంది. రైతులకు పంటలలో మెలకువలు నేర్పించడంతో పాటు రైతులకు కావాల్సిన డ్రాగన్ ప్రూట్ మొక్కలను అందించేందుకు నర్సరీని ఏర్పాటు చేస్తున్నాను. ఇటీవల వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ డ్రాగన్ ఫ్రూట్ నెట్వర్క్ కౌన్సిల్ సమావేశంలో నాకు సభ్యత్వం కూడా ఇచ్చారు అని డా. శ్రీనివరావు ఆనందంగా చెప్పారు. – దివాకర్రెడ్డి, సాక్షి, సంగారెడ్డి ఫొటోలు: శివప్రసాద్ -
పోషకాల పవర్హౌజ్!
చాలా చవకగా ఆరోగ్యాన్ని సంపాదించుకోడానికి జామపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలకు కొదవే లేదు. అందుకే ఈ పండును ‘పోషకాల పవర్హౌజ్’ అంటారు. వంద గ్రాముల జామపండులో 68 క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు... ఇందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, పొటాషియమ్ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. జామతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. జామలో విటమిన్–సి చాలా ఎక్కువ. ఇది చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కావడంతో ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. ఒంటికి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తుంది. జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ముక్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. పీచుపదార్థాలు చాలా ఎక్కువ కావడం వల్ల ఇందులో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పీచుపదార్థాలే ఒంట్లో చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. అందువల్ల కూడా ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఉపయుక్తమైన పండుగా పేరొందింది. దీనిలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్దకాన్ని సమర్థంగా నివారిస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేందుకు తోడ్పడుతుంది. జామలో పొటాషియమ్ కూడా ఎక్కువే. పొటాషియమ్ రక్తపోటును అదుపు చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే హైబీపీ నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. జామపండు ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) వంటి వాటిని అదుపు చేయడంతో పాటు, ఒంటికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది. జామలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల పటిష్టపరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. జామపండులో విటమిన్–బి6, విటమిన్ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మెదడులోని న్యూరాన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. అందువల్ల జామపండు తినేవారిలో మెదడు చురుగ్గా ఉంటుంది. డిమెన్షియా, అలై్జమర్స్ వంటి జబ్బులను నివారించడానికి కూడా జామ తోడ్పడుతుంది. జామపండ్లను తినేవారిలో పంటి, చిగుర్లకు సంబంధించిన వ్యాధులు చాలా తక్కువ. ఇందులో ఫోలిక్యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల డాక్టర్లు దీన్ని గర్భిణులకు సిఫార్సు చేస్తుంటారు. కడుపులోని బిడ్డ తాలూకు నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా అభివృద్ధి అయ్యేందుకు జామ తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన, నిగారింపుతో కూడిన మెరిసే చర్మం కోసం జామ బాగా ఉపయోగపడుతుంది. ఏజింగ్ ప్రక్రియనూ ఆలస్యం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి జామ అనేక విధాల తోడ్పడుతుంది. ఇందులోని తక్కువ చక్కెర పాళ్లు, పీచు వంటి అంశాలు వేగంగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి. -
సూపర్ స్పెషలిస్ట్
చిన్న పిల్లల్లో బాగా జ్వరం వచ్చి తగ్గాక తినిపించే పండ్లలో ముఖ్యమైన పండు ఏమిటో తెలుసా? ఆలుబుఖారా! అందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మంచి రోగ నిరోధక శక్తి సమకూరుతుంది. కేవలం చిన్నారుల్లోనే కాదు.. ఇది అందరిలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చూస్తే అందంగా ఉండి... తింటే ఆరోగ్యంగా ఉంచే ఈ పండుతో ఒనగూరే లాభాలెన్నో. వాటిలో ఇవి కొన్ని. ♦ ఆలు–బుఖారా పండు కండరాలు పట్టేయకుండా చూస్తుంది. తరచూ కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్), పిక్కలు పట్టేయడం వంటి సమస్యతో బాధపడేవారు ఆలు–బుఖారా పండ్లు తప్పక తినాలి. ♦ ఆలు–బుఖారా పండ్లలో పోటాషియమ్ ఎక్కువ. అందువల్ల ఇది మన రక్తపోటును క్రమబద్దీకరించి, నియంత్రణలో ఉంచుతుంది. ♦ ఇది రక్తనాళాల్లో కొవ్వులు పేరుకొనే అథెరోస్కి›్లరోసిస్ కండిషన్ను నివారిస్తుంది. ♦ ఈ పండులోని కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. ♦ పొటాషియమ్ ద్వారా హైబీపీని అదుపులో ఉంచడం, చెడు కొవ్వులు పెరగకుండా చూడటం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చూడటం వంటి అన్ని పనులూ చేస్తుంది. పైగా ఇందులోని విటమిన్ బి6 గుండెకు హానిచేసే హోమోసిస్టిన్ను అరికడుతుంది. ఈ కారణాలవల్ల ఇది గుండెకు చాలా మంచిది. పై అన్నింటి కారణంగా అది గుండెపోటు ముప్పునూ సమర్థంగా నివారిస్తుంది. ♦ ఆల్–బుఖారాలో ఐరన్ ఎక్కువ. ఇందులో విటమిన్–సి కూడా ఉండటం వల్ల ఆ ఐరస్ వెంటనే ఒంటికి పడుతుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి ఆలు–బుఖారా ఇస్తుంటారు. పైగా ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది. ♦ ఇది ఎముక సాంద్రతను పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ను అరికడుతుంది. అందుకే అందరూ దీన్ని తీసుకోవాలి. ఈ కారణంగా.. మరీ ముఖ్యంగా మెనోపాజ్ వచ్చిన మహిళలు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ♦ ఆలు–బుఖారాలో ఉండే సార్బిటాల్, ఐసాటిన్ పోషకాలు మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని పీచు (సాల్యుబుల్ ఫైబర్) కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ♦ ఎండు ఆలు–బుఖారాలో ఫోలిక్యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే గర్భిణులు దీన్ని తీసుకుంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. ♦ ఆలు–బుఖారా అనేక క్యాన్సర్లను అరికడుతుంది. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక క్యాన్సర్లు, రెస్పిరేటరీ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లు, నోటి ♦ క్యాన్సర్లను నివారిస్తుంది. దీనికి కారణం ఆ పండులో ఉన్న ఫ్రీ–రాడికల్స్ను అరికట్టే గుణమే. ఈ పండును ఎర్రగా, అందంగా కనిపించేలా చేసే ఎరుపు రంగు పిగ్మెంటే ఫ్రీ–రాడికిల్స్ను తుదముట్టిస్తుంటుంది. ♦ ఆల్–బుఖారా సహజ విరేచనకారి కావడం వల్ల మలబద్దకం సమస్యను మందులేమీ లేకుండానే నివారిస్తుంది. ♦ హృద్రోగాలు ఉన్నవారికి, డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. ♦ అధిక బరువు తగ్గాలనుకునేవారు... బరువును పెరగకుండా చూసుకోవాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ రెండు పనులనూ ఇది సమర్థంగా చేస్తుంది. ♦ వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపును దెబ్బతీసే ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ను నివారిస్తుంది. ఇందులో విటమిన్–ఏ పాళ్లు కూడా ఎక్కువే. దాంతో కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ♦ విటమిన్ సి, విటమిన్ ఏ వల్ల ఇది మేని నిగారింపును మెరుగుపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది. -
చేసిన మోసం!
అదొక మామిడి చెట్టు. ఆకు కనిపించకుండా కాయలు విరగ్గాశాయి. దాని యజమాని చెట్టు నుండి పండిన కొన్ని కాయలు కోసుకుపోయాడు. అందరి దృష్టీ వాటి మీద పడింది. తలా కొన్ని కాయలు కోసుకుపోతున్నారు. కొన్ని కాయలు పండి నేలమీద పడుతున్నాయి. వాటిలో ఒక కాయ మాత్రం బాగా పిరికిది. ఆ పిరికి కాయ ఆకుల గుబుర్ల మాటున దాక్కుని అలానే ఉండిపోయింది. తన సహచరులందరూ దూరం అవడంతో గాభరా పడసాగింది. అలాగని తనంతట తాను పండి నేలమీద పడడం కానీ, ఎవరి కంటా పడడం కానీ ఇష్టం లేదు. దాంతో చెట్టుకే అతుక్కుపోయింది. తన మీద తనకు ఉన్న ‘మోహం’ దానిని బయటపడనివ్వలేదు. కానీ కాలం ఊరుకుంటుందా? కాయ కుళ్లి, అందులో పురుగులు పడ్డాయి. అలా చెట్టుకు ఉండగానే దానిని తినేయసాగాయి. అలా మరికొంత కాలం గడిచింది. చెట్టుకే ఎండి, మరింతగా అతుక్కుపోయింది ఆ పిరికి మామిడి. ఒకరోజు బాగా వేగంగా వీచిన గాలి, ఎండిన ఆకులతో సహా దీనిని కూడా తెంచి పక్కనే ఉన్న మురికి గుంటలో పడేసింది. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు తాను ఎందుకూ పనికి రాకుండా పోవడానికి తనలో దాగి ఉన్న మోహమే కారణమని. – డి.వి.ఆర్.