-
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
బహుళపక్ష బ్యాంకులను పటిష్టం చేయాలి
న్యూఢిల్లీ: సీమాంతర సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. జీ20కి భారత్, జీ7కు జపాన్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ దిశగా సమిష్టి కృషి చేయాలని ఆమె సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. సంక్షేమానికి పాటించాల్సిన ఆర్థిక విధానాలపై జపాన్లోని నైగతాలో నిర్వహించిన జీ7 సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. పేద వర్గాలకు మార్కెట్లను, ప్రాథమిక సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీ తోడ్పడగలదని మంత్రి చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సాధికారత లభిస్తోందని పేర్కొన్నారు. -
దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి - ఆర్థిక మంత్రి పిలుపు
ఇంచెయాన్ (దక్షిణ కొరియా): భారత్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్దిలో భాగం కావాలని ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. భారత్ శతాబ్ధి ఉత్సవాల నాటికి ఆధునిక దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని చెబుతూ.. ఈ 25 ఏళ్ల అమృత కాలం పెట్టుబడులకు ఎన్నో అవకాశాలను తీసుకొస్తుందన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీప ఇంచెయాన్లో 56వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. నూతన భారత్ ఆవిష్కారానికి, మెరుగైన పాలన కోసం నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలను మంత్రి సీతారామన్ వెల్లడించారు. ఇన్వెస్టర్లతో రౌండ్టేబుల్ సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఇటీవల భారత్ చేపట్టిన సంస్కరణలకు తోడు, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ (ఎన్ఐపీ), నేషనల్ మోనిటైజేషన్ పైపులైన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ తదితర చర్యలను వివరించారు. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ఆశాకిరణంగా నిలిచినట్టు చెప్పారు. భారత పట్ల నమ్మకాన్ని కొనసాగిస్తున్న కొరియా ఇన్వెస్టర్లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాలకు సంబంధించిన పీఎల్ఐ పథకంలో పాల్గొనడం పట్ల కొరియా ఇన్వెస్టర్లు ఆసక్తి, అంకితభావం చూపించడాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతారామన్, ఫిజి దేశ ఉప ప్రధాని బిమన్ చంద్ ప్రసాద్తో సమావేశమయ్యారు. ఏడీబీకి ప్రోత్సాహం సభ్య దేశాలకు రుణ పంపిణీలో సరికొత్త, రిస్క్ ఆధారిత విధానాలను అనుసరించే విషయమై ఏడీబీకి భారత్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ఏడీబీ గవర్నర్ల ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్ తరఫున గవర్నర్గా మంత్రి సీతారామన్ ఏడీబీ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్లీనరీలో చర్చల ద్వారా చాలా అంశాలకు పరిష్కారం లభిస్తుందని, ఏడీబీకి మార్గదర్శకం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి అనుచరులు కూడా అతడిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంత్రి ప్రేమ్చంద్ అగర్వాల్ రిషికేశ్ పట్టణంలో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో సురేంద్రసింగ్ నెగీ అనే వ్యక్తి తన బైక్తో మంత్రి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు నుంచి కిందకు దిగిన మంత్రి ప్రేమ్చంద్.. నేగిపై సీరియస్ అయ్యారు. అనంతరం, నేగిపై చంపచళ్లుమనిపించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇంతలో, మంత్రి సిబ్బంది.. నేగిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ దాడిపై మంత్రి స్పందించారు. నేగి.. నన్ను అసభ్య పదజాలంతో తిట్టడంతో నా సిబ్బంది దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేది? అని కాంగ్రెస్ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేదా సీఎం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. Uttarakhand Cabinet Minister Premchand Agarwal fighting with youth in Rishikesh, then later his bodyguards also beat up the youth! pic.twitter.com/GxvNzuLk1O — Yash (@Yashfacts28) May 2, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ అడ్డాపై కాంగ్రెస్ కన్ను -
ఆన్లైన్ గేమింగ్పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు
సియోల్: ఆన్లైన్ గేమింగ్పై పన్నులకు సంబంధించిన విధానాలపై జీఎస్టీ కౌన్సిల్ కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవి ఖరారైతే గేమింగ్ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు రాగలవని ఆమె వివరించారు. దక్షిణ కొరియాలోని సియోల్లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు ట్యాక్సేషన్, నియంత్రణ సహా ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ మండలి మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. కేపీఎంజీ నివేదిక ప్రకారం 2021లో రూ. 13,600 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ రంగం 2024–25 నాటికి రూ. 29,000 కోట్లకు చేరనుంది. ఆన్లైన్ గేములపై ట్యాక్సేషన్ అంశం రెండేళ్లుగా నలుగుతోంది. ఇతరత్రా బెట్టింగ్ గేమ్లతో పోలిస్తే నైపుణ్యాలు అవసరమయ్యే ఆన్లైన్ గేమ్ల విషయంలో పన్ను రేటు తక్కువగా ఉండాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులో లేదా జూన్లో జరిగే జీఎస్టీ తదుపరి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
ఇంచియాన్ (దక్షిణ కొరియా): పర్యావరణ పరిరక్షణకు (గ్రీన్) దోహదపడే భారత్ పరిశ్రమకు రాయితీలతో కూడిన రుణాలను మరింతగా మంజూరు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ఆర్థిక పురోగతి ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ ఎకానమీ సానుకూల వాతావరణానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవాతో ఆమె ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఏడీబీ సావరిన్ నాన్ సావరిన్ ఆపరేషన్స్లో భారత్ కీలక దేశంగా కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సభ్య దేశాలకు 100 బిలియన్ డాలర్ల ‘గీన్’ ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి ఏడీబీ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పునరుద్ఘాటించారు. ఆసియా, పసిఫిక్లో గ్రీన్ ఫైనాన్షింగ్కు సంబంధించి ఏడీబీ వినూత్న విధానాలకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయి డినామినేటెడ్ బాండ్లతో ఏడీబీ నిధుల సమీకరణ.. కాగా, రూపాయి డినామినేటెడ్ బాండ్ల ద్వారా మరిన్ని నిధులను సేకరించాలని చూస్తున్నట్లు ఏడీబీ పెసిడెంట్ ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మౌలిక, గ్రీన్ ప్రాజెక్టులకు 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఏడీబీ ప్రతిపాదిస్తుండడం గమనార్హం. ఈ ప్రతిపాదనను ఆమోదం నిమిత్తం ఏడీబీ బోర్డు చర్చించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
నవరత్న హోదా పొందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ - పూర్తి వివరాలు
ప్రభుత్వ రంగ సంస్థ 'రైల్ వికాస్ నిగమ్'కు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా రైల్ వికాస్ నిగమ్ ఇప్పుడు 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నవరత్న హోదా పొందింది. ఇప్పటివరకు మినీ రత్న హోదాలో ఉన్న రైల్ వికాస్ నిగమ్ నవరత్న హోదా కైవసం చేసుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది రైల్వే శాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. దీని టర్నోవర్ సంవత్సరానికి రూ. 19,381 కోట్లు. అంతే కాకుండా గత 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం రూ. 1,087 కోట్లు. కావున ఈ సంస్థకు నవరత్న హోదా కల్పించాలనే యోచన గతం నుంచి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికి సాధ్యమైంది. నవరత్న హోదా పొందటం వల్ల సంస్థ చాలా విషయాల్లో సొంత నిర్ణయాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం, ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో స్వతంత్య్రం ఉంటుంది. ఇది సంస్థ వేగవంతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి నవరత్న హోదా కల్పించే ప్రాతి పదికను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని, ఈ ఆమోదం ప్రకారం ఇకపైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నవరత్న హోదా పొందిన సంస్థగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొనసాగుతుందని డిపిఈ (Department of Public Enterprises) ట్విటర్ ద్వారా తెలిపింది. (ఇదీ చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) Hon'ble Finance Minister has approved the upgradation of RVNL to Navratna CPSE. RVNL will be the 13th Navratna amongst the CPSEs. RVNL is a Ministry of Railways CPSE with an annual turnover of Rs 19381 crores and net profit of Rs 1087 crores for the years 2021-22. @RailVikas — Department of Public Enterprises (@DPE_GoI) April 26, 2023 ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.. -
కలకలం రేపిన ఆడియో.. ఆర్థిక మంత్రికి కొత్త చిక్కులు
ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలోని ఓ మీడియా ప్రతినిధితో ఆయన కొంత కాలం క్రితం మాట్లాడినట్లు భావిస్తున్న ఓ ఫోన్ కాల్ ఆడియో తాజాగా వివాదాస్పదమైంది. ఇందులో సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయ నిధి స్టాలిన్, బంధువులు కలిసి రూ. 30 వేల కోట్లు మింగేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. దీనిపై విచారణకు అన్నాడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. సాక్షి, చైన్నె: ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ఢిల్లీలోని ఓ మీడియా ప్రతినిధితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి మధ్య జరిగిన 26 ఫోన్కాల్స్కు సంబంధించిన సమాచారం. అందులో ఉన్న వారి మాటల్లోని అంశాలతో ఒక పూర్తిస్థాయి ఆడియో శనివారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ గొంతు ఆ ఆడియోలో ఉండటం చర్చకు దారి తీసింది. రూ. 30 వేల కోట్లు కొట్టేశారు.. సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయ నిధి స్టాలిన్, బంధువులు శబరీషన్, మురుగన్ ఏడాది కాలంలో రూ.30 వేల కోట్లు కొట్టేశారని, ఇంత పెద్ద మొత్తాన్ని డీఎంకేలో ఉన్న మునుపటి నాయకులు కూడా సంపాదించ లేక పోయారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మొత్తాన్ని ఎలా దాచబోతున్నారో, ఎక్కడ పెట్టనున్నారో? అని ఉన్న తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు డీఎంకేలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ ఆడియోను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తీవ్రంగా పరిగణించారు. విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అయితే, డీఎంకే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇప్పటికే తాను డీఎంకే అక్రమాస్తుల జాబితా విడుదల చేశానని, తాజా ఆడియో ఆ పాలకుల అక్రమాలకు సాక్ష్యంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఆడియోపై విచారణ జరగాలని, ఆర్థిక మంత్రి విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి విచారణకు ఆదేశించాలని కోరబోతున్నామన్నారు. అయితే ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ స్పందిస్తూ, ఆ గళం తనది కాదే కాదని, ఎవరో తన వలే మిమిక్రీ చేసినట్లుందని వ్యాఖ్యనించడం గమనార్హం. అదే సమయంలో అన్నామలై స్పందిస్తూ, ఈ ఆడియోలో ఉన్నది ఎవరి గళం అన్నది తేల్చుకునేందుకు ఫోరెన్సిక్ అనాలసిస్కు పరిశోధనకు సిద్ధమా..? అని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఆడియోలో ఉన్న గళం పళణి వేల్ త్యారాజన్దా..? కాదా? అన్నది పక్కన పెడితే, సీఎం ఫ్యామిలీని టార్గెట్ చేసి మరీ తీవ్ర ఆరోపణలు అందులో ఉండటం కొత్త చర్చకు తెర లేపినట్లైంది. ఈ వ్యవహారం మంత్రి మెడకు చుట్టుకున్న పక్షంలో పదవీ గండం తప్పదనే ప్రచారం సాగుతోంది. -
ప్రపంచీకరణలో మరింత పారదర్శకత అవసరం
వాషింగ్టన్: గ్లోబలైజేషన్ ప్రయోజనాలను తక్కువ చేసి చూపాలని భారత్ కోరుకోవడం లేదని కేంద్ర లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే దానిని మరింత పారదర్శకంగా మార్చాలని కోరుతోందని పేర్కొన్నారు. ప్రముఖ అమెరికన్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ మేరకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మరింత ప్రగతిశీలంగా ఉండాలని, ఇతర దేశాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భారత్ కోరుతోందన్నారు. ‘‘వినడానికి మాత్రమే కాకుండా చెప్పడానికి భిన్నమైన దేశాలకు డబ్ల్యూటీఓ మరింత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని’’ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా.. భారత్ చాలా కాలంలో తన తయారీ రంగం వృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తను ఉత్పత్తి చేయగల వినియోగ వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం లేదని తెలిపారు. అయితే ధర వ్యత్యాసాలు, పోటీతత్వం వంటి అంశాలు అంతర్జాతీయంగా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యల విషయంలో ఆయా దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర అవగాహనలు అవసరమని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానం ఇక అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ తగిన ప్రాంతమని ఆమె ఉద్ఘాటించారు. నైపుణ్యం, డిజిటలైజేషన్పై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. క్రిప్టో ‘జీ 20’ ఉమ్మడి ఫ్రేమ్వర్క్! క్రిప్టో రిస్క్లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడమే ఇండియా జీ20 ప్రెసిడెన్సీ లక్ష్యమని కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలతో సంబంధం ఉన్న నష్టాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలకు ఉమ్మడి ఫ్రేమ్వర్క్ అవసరమన్నారు. భారత్ పారదర్శక ఎకానమీ భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆమె అమెరికన్ వ్యాపారవేత్తలను అభ్యర్థించారు. తద్వారా పారదర్శక ఎకానమీ నుంచి లభించే ప్రయోజనాలు పొందాలని అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో సూచించారు. ప్రస్తుత భారత్ ప్రభుత్వం దేశ వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ పరిశ్రమ భాగస్వామ్యం కోసం తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వివరించారు. మహమ్మరి వంటి సవాళ్ల సమయంలోనూ దేశాభివృద్ధే లక్ష్యంగా సంస్కరణల బాటన నడిచిందన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 మార్చి 31 నాటికి తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,64,725 కోట్లే అని వెల్లడించారు. టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ నిజం కాదా? అని ప్రశ్నించారు. “ఖజానా ఖాళీ!, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. వైసీపీ ప్రభుత్వం మొదటి 6 నెలల్లోనే అప్పుదొరకక ఆదాయం లేక ఇంటికి వెళుతుంది” అంటూ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలివి! ఇప్పుడేమో రాష్త్రం అప్పు రూ. 12.5 లక్షల కోట్లు దాటనుందని జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్రం అప్పు రూ. 10.31 లక్షల కోట్లు చేరిందని ఆయనే నిర్ధారించి సభల్లో ఇష్టమొచ్చినట్లు ప్రకటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా, నైజీరియాగా, జింబాబ్వేగా మారబోతోందని ప్రతిపక్ష నేతలు ఇలాగే గగ్గోలు పెట్టారు. టీడీపీ నాయకులలో రాష్ట్ర ఆర్ధిక స్థితిపై సరైన అవగాహన లేక నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దుష్ప్రచారాలతో రాష్ట్ర ప్రజలలో ఒక రకమైన గందగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని విఫల యత్నంచేస్తున్నారు. వాస్తవానికి , మే నెల, 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31 , 2023 నాటికీ రాష్ట్రం అప్పు రూ. 4,36,522 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాలా రూ.1,64,725 కోట్లు మాత్రమే. అప్పు పెరుగుదలని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ అప్పు Compound Annual Growth Rate (CAGR) 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు CAGR 19.02 % పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసిందన్నడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో (జూన్ 2019 నుంచి మార్చి 2023) కేంద్ర ప్రభుత్వ అప్పు CAGR 14.37% పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం CAGR 13.55 శాతమే పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అప్పు అసలే లేదు. పైగా మా ప్రభుత్వం ఆ మాత్రం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే..ప్రజలను కాపాడుకోవడానికే. తలసరి అప్పు రూ. 5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని సొంత లెక్కలు చెబుతూ యనమల గారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రజలను తప్పు దోవ పట్టించే తప్పుడు లెక్కలు, పచ్చి అసత్యాలన్నది వాస్తవం. సెన్సస్-2011 ఆంధ్రప్రదేశ్ జనాభా 4.96 కోట్లు. ఈ జనాభా ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ చూస్తే 2022 - 23కి రూ. 25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కూడా కనీస బాధ్యత లేకుండా రూ.లక్ష కోట్లు వడ్డీ కడుతుందని చెప్పడమంటే ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనాలు మినహా నిజాలు లేవని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, యువత భవిష్యత్తు నాశనమైనా మాకేం పోదు, పేదవారు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మాకు సంబంధం లేదు, మాకు కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అసత్యాలతో, అనుకూల మీడియాతో భయాందోళనలోకి ప్రజలను నెట్టి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ పన్నిన దుష్ట పన్నాగం కాక మరేమిటి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ని, ఓవర్ డ్రాఫ్ట్ (O.D) ని అప్పులలో కలిపి యనమల గారు కుతంత్రాలను జొప్పించి అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చేస్తున్న కుయుక్తే. భారతీయ రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు రోజు వారీ నగదు నిర్వహణకు గాను, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వసతిని కల్పించింది. దీనిని వాడుకోవడమనేది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమైన విషయం. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అనేవి తాత్కాలిక అప్పు మాత్రమే. ‘వేస్ అండ్ మీన్స్’ మరియు ‘ఓవర్ డ్రాఫ్ట్’ కింద మన రాష్ట్ర అప్పు సున్నా. టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ గా పొందడం వాస్తవం కాదా? అందులో రూ. 139 కోట్లు తిరిగి చెల్లించకుండా వెళ్లి పోయిన మాట వాస్తవం కాదా? అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2020–21 సంవత్సరానికి గాను రూ 69,454 కోట్లు వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకుంది. ఇదేదో ఇపుడే వైసీపీ ప్రభుత్వమే తొలిసారి చేస్తున్నట్లుగా వాస్తవాలను మరుగున పరచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. ఉదాహరణకు కోవిడ్ పరిస్థితుల్లో పేద వాడిని కష్టాల నుండి కాపాడుకోవడం కోసం నియమిత గడువులోపల ఒక సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆర్బీఐ వద్దకు వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం పరిపాటి. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్గా కూడా మారొచ్చు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద విషయమైనట్లు టీడీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చూడడానికి విడ్డూరంగా ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్షాలలో (SDG) 13వ స్థానంలో ఉందని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందనే ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజం కాదు. ఎక్కడ నుండి ఈ తప్పుడు సమాచారాన్ని కనిపెడతారో, కావాలనే ఈ కాకి లెక్కలు ఎలా సృష్టిస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాను. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ 72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21నాటికి ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబమన్న అసలు నిజం ప్రజలకు తెలియాలి. పైగా ప్రతిసారి ఈ స్కోరులో భారతదేశ సగటు స్కోరు కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని నీతిఆయోగ్ గణాంకాలే తేల్చాయి. చంద్రబాబు నాయుడు గారు 2022-23 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే చాల వెనుకపడి ఉందంటున్నారు. మరి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ. 2,09,848/- ఉంటే మరీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ. 1,54,031/- ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నాయుడు పాతకకృత్యాలే. ఓటుకు నోటు కేసు , ఇబ్బడిముబ్బడిగా అప్పులు,వడ్డీలతో ఆర్ధిక విధ్వంసం. ఇవే ఏపీ వెనకబాటుతనానికి కారణం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి పోయి హైదరాబాద్ ని రాత్రి రాత్రికి తరలి వచ్చి విజయవాడలో చేరడం, టీడీపీ వాళ్ళు అవినీతి ఊబిలో కూరుకుపోయి చేసిన ఆర్థిక అనర్థాలేనని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518/- (2022-23 AE). భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,72,000/- (2022-23 AE). అంటే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో మెరుగ్గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రతి పైసా ప్రజలకు అవినీతి లేకుండా వారి ఖాతాలకు జమ అయింది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద ,మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ 2,05,109 కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న అనుకూల వర్గాల వారినే లబ్ధిదారులుగా ఎంచుకున్నారు. వారి లక్ష్యం స్వార్థపూరితం.. కావడం వల్ల అర్హత ఉన్నా కూడా ఫలాలు అందని పేద ప్రజలెందరో నాటి ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి కుల,మత, ప్రాంత,వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హతే ప్రామాణికం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు, వడ్డీ, తలసరి ఆదాయం, ఎస్.డీ.జీ , డీ.బీ.టీ ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు , చంద్ర బాబు నాయుడు గారి దుష్ప్రచారంలో చెప్పే లెక్కలు వేరు. పత్రికా ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం ఓ అబద్ధం. అప్పులు, వడ్డీలు, తలసరి ఆదాయం, SDG, DBT లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా లెక్కలన్నీ పూర్తిగా కల్పితం. ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు స్వార్థంతో చేసిన కపట నాటకాలనడానికి.. పైన పేర్కొన్న వాస్తవ గణాంకాలే ఉదాహరణ. అని మంత్రి బుగ్గన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే -
రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
రూ.2వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. కాగా రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పలు కారణాల చేత ఈ నోట్ల సర్క్యూలేషన్ను తగ్గించేసినట్టు తెలిసింది. ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ను ఆపేసినట్టు ఆర్బీఐ ఆ మధ్య తెలిపింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. -
Raisina Dialogue: అన్నీ అమ్మేసే తొందరేమీ లేదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ (పీఎస్ఈ) హడావిడిగా వాటాలు విక్రయించేయాలన్న తొందరలో ప్రభుత్వమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికం సహా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైజినా డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. పీఎస్ఈ పాలసీ ప్రకారం అటామిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలికం; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల విభాగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ‘అన్నీ హడావిడిగా అమ్మేసేయాలన్న తొందర్లో ప్రభుత్వం లేదు. అలాగే గుండుసూదుల నుంచి పంటల దాకా ప్రతి వ్యాపారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందనీ ఈ పాలసీలో ఏమీ లేదు. కాబట్టి తన అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో.. ఉదాహరణకు టెలికం వంటి వాటిల్లో ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రొఫెషనల్గా నడిచే ఒక టెలికం కంపెనీ ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోనూ తమంతట తాము నిలదొక్కుకోగలిగేంత పెద్ద సంస్థల్లో ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె వివరించారు. అలా కాకుండా మరీ చిన్నవి.. నిలదొక్కుకోలేనివి ఉంటే వాటిని పెద్ద సంస్థల్లో విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని భావించింది. కానీ దీన్ని తర్వాత రూ. 50,000 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో దాన్ని కాస్త స్వల్పంగా పెంచుతూ రూ. 51,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ధరల స్పీడ్ను నిలువరిస్తున్నాం..
జైపూర్: ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. ఉదాహరణకు, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశలో పప్పుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే స్థానిక లభ్యతను మెరుగుపరచడానికి కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. వివిధ వర్గాలతో 2023 బడ్జెట్ తదుపరి చర్చాగోష్టి నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన ఆర్థిక మంత్రి విలేకరులతో ఇంకా ఏమన్నారంటే.. ‘‘గత మూడేళ్లుగా వంట నూనెల దిగుమతిపై దాదాపు పన్ను విధించడంలేదు. దీని కారణంగా పామ్ క్రూడ్, పామ్ రిఫైన్డ్ ఆయిల్ అందుబాటులో విఘాతం కలగడం లేదు. వంట నూనెల సరఫరా సులభతరం కావడంతోపాటు, డిమాండ్ను దేశం తేలిగ్గా ఎదుర్కొనగలుగుతోంది. ధరల స్పీడ్ ఇదీ... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూ వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న వినియోగ ధలర సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపది క అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4% గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4న మొదటిసారి 0.40% పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అర శాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. దీనితో రెపో మొత్తంగా 6.5 శాతానికి చేరింది. జనవరి రిటైల్ ధరల స్పీడ్ నేపథ్యంలో ఏప్రిల్లో జరిగే పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఎన్పీఎస్ నిధులు బదిలీ చేయలేం కాగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కోసం డిపాజిట్ అయిన నిధులను ప్రస్తుత చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించలేమని అటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో పాటు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కూడా స్పష్టం చేశారు. ‘‘ఏదైనా రాష్ట్రం ఎన్పీఎస్ కోసం డిపాజిట్ చేసిన నిధులను వారికి తిరిగి ఇవ్వవచ్చని ఆశించినట్లయితే అది అసాధ్యం’’ అని వారు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ఇటీవల భారీ పతనాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉటంకిస్తూ, జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) పెట్టుబడి పెట్టే షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వదిలివేయలేని పేర్కొన్నారు. ఎన్పీఎస్లో డిపాజిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను రాష్ట్రాలకు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు నిధులను బదిలీ చేయకపోతే రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ సీనియర్ అధికారి నుంచి వచ్చిన ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పాత పెన్షన్ స్కీమ్కు తిరిగి వెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ పుంజుకోవడం మంచి పరిణామం కాదని ఆర్థిక కార్యదర్శి జోషి ఈ సందర్భంఆ స్పష్టం చేశారు. ‘‘కొత్త పెన్షన్ పథకంలోని డబ్బు ఉద్యోగులకు సంబంధించినది. ఇది ఉద్యోగి– ఎన్పీఎస్ ట్రస్ట్కు మధ్య ఒప్పందం. ఉద్యోగి మెచ్యూరిటీకి ముందు లేదా పదవీ విరమణ వయస్సు రాకముందే నిష్క్రమిస్తే, అప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి’’ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొవిజన్ ఇప్పటికే ఉందని బుధవారం వివరించారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీసీసీఐ సభ్యులతో బడ్జెట్ అనంతర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ముడి పెట్రోలియం, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనాలను తాత్కాలికంగా జీఎస్టీ నుంచి మినహాయించారు. వాటిని ఎప్పటి నుంచి ఈ పరిధిలోకి తేవాలనేది జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. 2023 ఫిబ్రవరి 18న జీఎస్టీ మండలి 49వ సమావేశం జరగనుంది. ఒకవేళ మొత్తం మండలి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏ రేటు వర్తింపచేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. రేటును నిర్ధారించి తనకు తెలియజేస్తే పెట్రోలియం ఉత్పత్తులను సత్వరం జీఎస్టీ పరిధిలోకి చేర్చగలమన్నారు. మరోవైపు, వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్రం గత మూడు–నాలుగేళ్లుగా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచుతూనే ఉందని మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమును, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోందన్నారు. (ఇదీ చదవండి: ఈవీ జోరుకు భారత్ రెడీ.. ప్లాంటు యోచనలో వోల్వో!) -
'అడ్డంకులు సృష్టిస్తున్నా ఆగని ప్రగతి.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గం'
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోమని, ప్రభుత్వ రంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4.06 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మిందని చెప్పారు. రాష్ట్రాలపై కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తోందని, అమ్మితే రాయితీలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతోందని, అందుకు అంగీకరించకపోతే నిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని వెంటబడ్డా తాము అంగీకరించలేదన్నారు. అలా చేస్తేనే రుణ పరిమితిని పెంచుతామన్నా తలొగ్గలేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినట్టు వింటే రూ.30 వేల కోట్లు వచ్చేవని, కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి తిరస్కరించామన్నారు. సీనియర్లు ఖండించాలి.. రాజకీయ పారీ్టల నేతలు ఇటీవల పేల్చేస్తాం, కూల్చేస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఆయా పారీ్టల్లో టి.జీవన్రెడ్డి వంటి సీనియర్ నేతలు అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని హరీశ్రావు సూచించారు. ఆ పారీ్టల విధ్వంస భాషను తెలంగాణ ప్రజలు మన్నించరని, వారికి పడే ఓట్లు కూడా పడవని పేర్కొన్నారు. మిగిలిపోయిన దాదాపు 9.5 కి.మీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని ప్రస్తుత పద్ధతుల్లోనే వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ.. టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విద్యుత్ కొనుగోళ్లు వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాల చెల్లింపునకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం తెలిపాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. యూపీఏనే నయం.. మోదీ సర్కార్ కన్నా అంతకుముందు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏనే కొంత నయమని హరీశ్రావు అన్నారు. మోదీ ఏలుబడిలో జీడీపీ తగ్గిందని, అప్పులు పెరిగాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడాయని చెప్పారు. మూలధనం పెంచడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును అదాని దారి మళ్లించిన తీరుపై హిడెన్ బర్గ్ నివేదిక సృష్టించిన కలకలానికి మోదీ సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తప్పు చేయబట్టే ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
ఏనాడో గాడితప్పిన కేంద్ర బడ్జెట్లు!
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి ప్రభాకర్ అంటించిన చురక జ్ఞాపకం వచ్చింది. దేశ ప్రజాబాహుళ్యం స్థితిగతుల్ని పాలకులు పరిశీలించకపోబట్టే శ్రమ విలువను 75 ఏళ్లుగా గణించలేకపోయారు. ప్రణాళికలకూ, ఆచరణలో అమలు చేయని అతిశయోక్తులకూ మాత్రం తక్కువేమీ లేదు! భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కాస్తా నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. దేశ తొలి ప్రధానమంత్రి పదవిలోకి రాక ముందు, దేశానికి స్వాతంత్య్రమనేది ఏ పరిస్థితుల్లో ‘నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదో’ ఇలా స్పష్టం చేశారు: ‘‘ప్రత్యేక హక్కులనూ, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ తమ హక్కుల్ని తాముగా వదులుకున్నట్టు చరిత్రకు దాఖలాల్లేవు. సాంఘిక మార్పులు రావా లంటే ఒత్తిడి, లేదా బల ప్రయోగం అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం, ఈ స్వార్థ ప్రయోజనాలకు భరతవాక్యం పలకడమనే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదు’’. ఇంతకన్నా మరో గొప్ప సత్యాన్ని 1992లో సుప్రసిద్ధ అమెరికన్ పత్రిక ‘టైమ్’ ప్రకటించింది: ‘‘కమ్యూనిజం పతనం కావొచ్చు. కానీ క్యాపిటలిజమూ, ప్రజాస్వామ్యమూ శాశ్వతంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ జయప్రదం కాగలగవన్న గ్యారంటీ ఏమీ లేదు’’! ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పెరిగి పెద్ద మహమ్మారి రూపం దాల్చిన అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ‘చిట్కా వైద్యాల’తో ఉపశమింప జేసుకోవడమే గానీ ఆ సంక్షోభ లక్షణాలు ఈ రోజుకీ సమసిపోలేదు. కనుకనే అమెరికా ఆశీర్వాదాలతోనే నెలకొన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అత్యున్నత స్థాయి అధికారిగా, సలహాదారుగా ఈ సంస్థలను విశ్వసించి రంగంలోకి దిగి ఎలాంటి దారుణానుభవం చూడవలసి వచ్చిందో వివరించారు డేవిసన్ బుధూ. ఇప్పటికీ అమెరికా, ప్రపంచబ్యాంకు సంస్థలను నమ్ముతున్న భారత నాయకులు డేవిసన్ బుధూ అనుభవాల నుంచి గుణపాఠం తీసుకోలేక పోతున్నారు. చివరికి ఆంగ్లో – అమెరికన్ సంస్థలే భారత ఆర్థిక వ్యవస్థను పాలకులు నిర్వహిస్తున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నా ‘మనసూ, చర్మం’ మందబారిపోయి దులిపేసుకునే దశలో ఉన్నారు. ఆసియా, ఆఫ్రికాలలో తన దారుణానుభవాలను డేవిసన్ ఇలా గుండె బరువుతో ప్రపంచం కళ్లముందుంచారు (బుధూ 1988లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కామ్డెసెస్కు రాసిన సుదీర్ఘ రాజీనామా): ‘‘మీరు లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలకూ, ప్రజలకూ అందించమని నా చేతికి అందించిన వరల్డ్ బ్యాంక్ – ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల ఔష ధాన్నీ, రకరకాల చిట్కాలనూ (బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్) సంవత్సరాల తర బడిగా అందజేస్తూనే వచ్చాను. కానీ ఏళ్ల తరబడిగా ఈ దేశాల్లో గడించిన అనుభవం దృష్ట్యా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందు కంటే, ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్ల సామాన్య ప్రజల రక్తంతో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. మలినమై పోయిన ఈ నా చేతుల్ని కడుక్కోవడానికి నేను తీసు కున్న మంచి నిర్ణయమే ఈ రాజీ నామా. అయ్యా! కామ్డెసెస్ గారూ! ఈ దేశాల్లో మనం చేస్తున్న పనుల వల్ల పేదల రక్తం నదులై పారుతోంది. ఒక్కోసారి నాలో నేననుకుంటాను – ఐఎంఎఫ్ బ్యాంకుల తరఫున మీ పేరిట, మీకు ముందు పని చేసిన అధిపతుల పేరిట లేదా మీ అధికార ముద్రల చాటున నేను చేయ వలసి వచ్చిన పాపాలను కడిగేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో దొరికే సబ్బులు కూడా ఏ మూలకూ చాలవని.’’ (ఎనఫ్ ఈజ్ ఎనఫ్: 1988). కాగా, కడిగి పారేసిన ఆ ‘సబ్బుల్ని’ ఇండియాలో మొదటగా పీవీ నరసింహారావు హయాంలో అందుకుంటే, వాటిని ఆంధ్రప్రదేశ్లో వాడి ప్రజలకు ‘టోపీ’ పెట్టడానికి ప్రయత్నించినవాడు ప్రపంచ బ్యాంక్ ‘పెంపుడు బిడ్డ’ చంద్రబాబు! ఇక భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది బీజేపీ పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. ఆ పథకం కింద కేటాయింపులన్నీ దారి మళ్లుతున్నాయి. పైగా 2023 బడ్జెట్ ఏడాది కాలపరిమితికి మించకపోయినా, దేశ స్వాతంత్య్రం వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అంటే 2047 నాటి ‘లక్ష్యాల దిశగా ఈ బడ్జెట్ ఉంద’ని స్వయంగా ప్రధానమంత్రి ‘కోత’ కోయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇండియా లాంటి వర్ధమాన దేశాలలోని కారుచౌక కూలీరేట్ల ఫలితంగా విదేశీ కంపెనీలు పోటీ మీద ఇండియాలో ప్రవేశించి, ఉద్యోగుల్ని తొలగించడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోగా ఆ విధానాలనే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఎసరు పెట్టడంలో పాలకులు అనుసరిస్తూ, ప్రైవేటు వారికి ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు. దీన్ని ఎవరో కాదు, స్వయానా ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ డైరెక్టర్ సి.ఫ్రెడ్ బెర్గ్స్టెన్ ఎదురు తన్నిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ బ్యాక్లాష్) అని వర్ణించాల్సి వచ్చింది. ‘వ్యవస్థాగతమైన సర్దుబాట్లు అంటే, ‘ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగాల నుంచి పౌరుల్ని తొలగించేయడమేనని బెర్గ్స్టెన్ స్పష్టం చేశాడు. స్విస్ బ్యాంకులు, తదితర విదేశీ బ్యాంకుల్లోకి దొంగ చాటుగా ప్రవేశించిన డబ్బును తిరిగి దేశంలోకి తెచ్చి దేశ ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచుతామన్న పాల కులు ఆచరణలో మొండి చేయి చూపించడం మరపురాని అనుభవంగా మిగిలి పోయింది. ‘కోవిడ్’ వల్ల ప్రజా బాహుళ్యానికి కల్గిన నష్టం కన్నా దాని పేరిట జరిగిన మిలాఖత్ వ్యాపార లావాదేవీల వల్ల ప్రజ లకు వాటిల్లిన నష్టం ఎక్కువ. పోతన భాగవత కథల్లో ‘రహూగణుడ’నే ఒక అహంకారి ఉంటాడు. అతడెక్కిన పల్లకీ ఈ దేహమే. కానీ, దాన్ని మోసే బోయీలు ‘ఓంకారాన్ని’ వల్లిస్తూ నడుస్తారు, అలసట తెలియకుండా ఉండటం కోసం. పల్లకీలో కూర్చున్నవాడి ప్రయాణం మాత్రం సుఖంగానే సాగుతుంది. నేడు మన దేశ ప్రజల్ని పాలకులు పల్లకీ బోయీలుగా మార్చారు. నేటి దేశ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఆంత్రోపాలజిస్ట్ గ్లెన్ డేవిస్స్టోన్ వెల్లడించాడు: ‘‘పాలకులు వ్యవసాయం పేరిట వెచ్చిస్తున్న డబ్బంతా రైతాంగ శ్రేయస్సుకు కాదు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుతున్న పారిశ్రామిక వేత్తల శ్రేయస్సు కోసం’’.క్రీ.పూ. 2100 సంవత్సరంలోనే సుమేరియా ఏలికలు ఆర్థిక వ్యవస్థను ప్రజాపరం చేసి ఎలా ప్రజా బాహుళ్యాన్ని కరువు కాటకాలు లేకుండా కాపాడుతూ వచ్చిందీ చరిత్ర నమోదు చేసింది. బాబిలో నియా, ఈజిప్టులలో సహితం రాచరిక పాలనల్లోనూ ప్రజలు సుఖంగా జీవించారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత ప్రజలకు మసకబారని ఉషోదయాన్ని 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పాలకులు ప్రసాదించగల స్థితిలో లేకపోవడం విషాదకరం. కరెన్సీ సంక్షోభం వల్లనే దేశ పరిస్థితులు ఒడుదొడుకుల్లో పడ్డా యని పాలకులు చెప్పే మాటలు విని సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ గతంలో ఓ కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్లో ఉన్న పేద లంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ‘ఇది మనం పుట్టినప్పటి నుంచీ నోరు మూసుకుని అనుభవిస్తున్నదే కదరా’ అనుకుంటారు. ఆ తంతే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతూండటం సిగ్గుచేటు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
అదానీ గ్రూప్ షేర్ల పతనం.. నిర్మలా సీతారామన్ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత నియంత్రణ సంస్థలు ఎంతో కచ్చితత్వంతో, కఠినంగా పనిచేస్తుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీశాయా? అంటూ గౌతమ్ అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దశాబ్దాలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెబుతూ.. నియంత్రణ సంస్థలు మన మార్కెట్ను చక్కని, సరైన స్థితిలో నిలబెట్టినట్టు పేర్కొన్నారు. ముందున్నట్టే భారత్ ఇక మీదటా చక్కని నియంత్రణలతో కూడిన ఫైనాన్షియల్ మార్కెట్గా కొనసాగుతుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఎక్కువగా చర్చించుకుంటున్న ఓ సంఘటన భారత మార్కెట్లు ఎంత గొప్పగా నిర్వహించబడతాయనే దానికి నిదర్శనం కాబోదు’’అని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు, షేర్లపై ఆరోపణలతో ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపు కంపెనీలు ఈ వారంలో ఊహించని విధంగా భారీ నష్టాలు చూశాయి. దీంతో ఆర్థిక మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. మెరుగ్గా బ్యాంకింగ్ వ్యవస్థ భారత బ్యాంకింగ్ వ్యవస్థ నేడు ఎంతో సౌకర్యంగా ఉందని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. నికర నిరర్థక రుణాలు (ఎన్పీఏలు) చాలా కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేబినెట్ ఆమోదం పొందిన పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. చదవండి: Union Budget 2023-24: బడ్జెట్ కేటాయింపుల్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో ఇదే తక్కువ. -
Union Budget 2023-2024: క్రీడారంగాన్ని కరుణించిన నిర్మలమ్మ
Union Budget: 2023-2024 కేంద్ర బడ్జెట్లో క్రీడారంగానికి పెద్దపీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1) లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడారంగానికి గతేడాదితో పోలిస్తే కేటాయింపులు ఓ మోస్తరుగా పెరిగాయి. 2022-23 బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ. 3397 కోట్లకు (రూ. 334.72 కోట్ల పెరుగుదల) పెరిగింది. Sports Budget: Rs 3397.32 crore allocated to Sports in Union Budget 2023-2024 (⬆️ Rs 334.72 crore) Sports Budget Allocation 2023-24: ➡️ Khelo India: Rs 1045 Cr ➡️ SAI: 785.52 Cr ➡️ National Sports Feds: 325 Cr ➡️ NSS: 325 Cr ➡️ National Sports Development Fund: Rs 15 Cr — India_AllSports (@India_AllSports) February 1, 2023 గత ఐదేళ్ల కాలంలో కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా ఓ మోస్తరుగా నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గతేడాది మంజూరైన రూ. 3062 కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. తాజా బడ్జెట్లో నిర్మలమ్మ క్రీడలను కరుణించడంతో ఆ రికార్డు బద్ధలైంది. Sports Budget for the last 5 years: 2018-19 - ₹2197 crore 2019-20 - ₹2776 crore 2020-21 - ₹2826 crore 2021-22 - ₹2596 crore 2022-23 - ₹3062 crore This year’s budget allocation 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 - ₹𝟯𝟯𝟵𝟳 𝗰𝗿𝗼𝗿𝗲📈 — Enakshi Rajvanshi (@enakshi_r) February 1, 2023 స్పోర్ట్స్ బడ్జెట్లో ఎవరికి ఎంత..? ఖేలో ఇండియా: రూ. 1045 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్): రూ. 785.52 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్: రూ. 325 కోట్లు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎన్ఎస్): రూ. 325 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్: రూ. 15 కోట్లు -
నిర్మలా సీతారామన్ ధరించిన చీర.. ఎవరు బహుమతి ఇచ్చారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్తో పాటు ఆమె ధరించిన చీరపై కూడా అందరి దృష్టి పడింది. ఎందుకంటే 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఈ ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడల్లా ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత చీరలతో దర్శమిస్తున్నారు. ఈ ఏడాది చేతితో నేసిన ఇక్కత్ సిల్క్ ఎర్ర చీరను ధరించి ఆమె పార్లమెంట్కు హాజరయ్యారు. ఇది భారతీయ సాంప్రదాయ వస్త్రాల పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 2023 సమావేశానికి నిర్మలా సీతారామన్ చేతితో నేసిన నవలగుండ ఎంబ్రాయిడరీ ఎరుపు రంగు ఇక్కత్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన ఈ చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే నిర్మలమ్మ దగ్గర చీరల కలెక్షన్లు ఎక్కువే! ఆమెకు చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక చీరతో దర్శమమిస్తారు. అదే క్రమంలో నలుపును దూరం పెడుతుంటారు. -
కేంద్ర బడ్జెట్ 2023: ఆ వాహనాలకు చెక్.. ఇకనైనా మేల్కోవాల్సిందే!
దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించారు. గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది. -
Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పెరుగనున్నవి... బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు బంగారం, వెండి వాహనాల టైర్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు తగ్గనున్నవి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్ని ధరలు తగ్గనున్నాయి టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు -
Budget 2023: రైతులకు తీపి కబురు.. అందుకోసం రూ.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతాన్నామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5 వేల 300 కోట్లు కేటాయించారు. వీటితో పాటు వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
కేంద్ర బడ్జెట్ 2023: గుడ్ న్యూస్.. మహిళల కోసం మరిన్ని పథకాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. -
Union Budget 2023: ప్రత్యేక సందర్భాల్లో నిర్మలమ్మ ధరించే చీర వెనుక ఇంత కథ ఉందా!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు, ఊరటనిచ్చే అంశాలు వంటి వాటితో ఈ బడ్జెట్లో ఏముందనే ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వీటితో మరో అంశం కూడా ఉందండోయ్. ఆమె ఏ రంగు చీరతో 2023-24 బడ్జెట్ను సమర్పిస్తుందా అని అందరి దృష్టి దానిపైనే ఉంది. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం బడ్జెట్తో పాటు దానిపై కూడా ప్రత్యేక దృష్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరల సేకరణను కలిగి ఉన్నారు.నిర్మలమ్మకు చేనేత చీరలంటే ఇష్టం ఎక్కువ. జనవరి 26న, నార్త్ బ్లాక్లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. నిర్మలమ్మ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక చీరల ధరించి దర్శమమిస్తారు. అదీ కూడా ఆ రంగులు తరచుగా దేశంలోని కరెన్సీ నోట్లకి సరిపోతుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో కనిపించింది. ఈ ఏడాది బడ్జెట్ 2023 కోసం ఆమె ప్రకాశవంతమైన ఎరుపు రంగును ఎంచుకున్నారు. దీనిబట్టి ప్రజలు ఈ సారి సానుకూల బడ్జెట్ ఆశించవచ్చిన తెలుస్తోంది. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం.. ►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది. ►పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర.. ►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది ►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్పురి చీర ►మన్మోహన్ సింగ్ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర ►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర ►విలేకరుల సమావేశంలో ధరించిన జమ్దానీ చీర రూ.50 నోటుతో సరిపోతుంది. ప్రత్యేక సందర్భాలలో ఆర్థిక మంత్రి ఎరుపు రంగును ఎంచుకుంటారు, నలుపును దూరంగా పెడుతుంటారు. చదవండి: Union Budget 2023: బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? ఈ విషయాలు తెలుసా?