Union Budget 2023-24: FM Allocates Rs 20 Lakh Crore For Agricultural Credit Farmers - Sakshi
Sakshi News home page

Union Budget 2023-24: రైతులకు తీపి కబురు.. ఆ పథకానికి నిధులు పెంచుతున్నారు

Published Wed, Feb 1 2023 12:41 PM | Last Updated on Wed, Feb 1 2023 1:23 PM

Union Budget 2023: Budget Allocates Rs 20 Lakh Crore For Agricultural Credit Farmers - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని మరింత పెంచుతాన్నామన్నారు.  కరువు ప్రాంత రైతులకు 5 వేల 300 కోట్లు కేటాయించారు.

వీటితో పాటు వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా  పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement