Finance Minister
-
'అడ్డంకులు సృష్టిస్తున్నా ఆగని ప్రగతి.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గం'
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోమని, ప్రభుత్వ రంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4.06 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మిందని చెప్పారు. రాష్ట్రాలపై కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తోందని, అమ్మితే రాయితీలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతోందని, అందుకు అంగీకరించకపోతే నిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని వెంటబడ్డా తాము అంగీకరించలేదన్నారు. అలా చేస్తేనే రుణ పరిమితిని పెంచుతామన్నా తలొగ్గలేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినట్టు వింటే రూ.30 వేల కోట్లు వచ్చేవని, కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి తిరస్కరించామన్నారు. సీనియర్లు ఖండించాలి.. రాజకీయ పారీ్టల నేతలు ఇటీవల పేల్చేస్తాం, కూల్చేస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఆయా పారీ్టల్లో టి.జీవన్రెడ్డి వంటి సీనియర్ నేతలు అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని హరీశ్రావు సూచించారు. ఆ పారీ్టల విధ్వంస భాషను తెలంగాణ ప్రజలు మన్నించరని, వారికి పడే ఓట్లు కూడా పడవని పేర్కొన్నారు. మిగిలిపోయిన దాదాపు 9.5 కి.మీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని ప్రస్తుత పద్ధతుల్లోనే వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ.. టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విద్యుత్ కొనుగోళ్లు వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాల చెల్లింపునకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం తెలిపాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. యూపీఏనే నయం.. మోదీ సర్కార్ కన్నా అంతకుముందు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏనే కొంత నయమని హరీశ్రావు అన్నారు. మోదీ ఏలుబడిలో జీడీపీ తగ్గిందని, అప్పులు పెరిగాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడాయని చెప్పారు. మూలధనం పెంచడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును అదాని దారి మళ్లించిన తీరుపై హిడెన్ బర్గ్ నివేదిక సృష్టించిన కలకలానికి మోదీ సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తప్పు చేయబట్టే ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
ఏనాడో గాడితప్పిన కేంద్ర బడ్జెట్లు!
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి ప్రభాకర్ అంటించిన చురక జ్ఞాపకం వచ్చింది. దేశ ప్రజాబాహుళ్యం స్థితిగతుల్ని పాలకులు పరిశీలించకపోబట్టే శ్రమ విలువను 75 ఏళ్లుగా గణించలేకపోయారు. ప్రణాళికలకూ, ఆచరణలో అమలు చేయని అతిశయోక్తులకూ మాత్రం తక్కువేమీ లేదు! భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కాస్తా నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. దేశ తొలి ప్రధానమంత్రి పదవిలోకి రాక ముందు, దేశానికి స్వాతంత్య్రమనేది ఏ పరిస్థితుల్లో ‘నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదో’ ఇలా స్పష్టం చేశారు: ‘‘ప్రత్యేక హక్కులనూ, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ తమ హక్కుల్ని తాముగా వదులుకున్నట్టు చరిత్రకు దాఖలాల్లేవు. సాంఘిక మార్పులు రావా లంటే ఒత్తిడి, లేదా బల ప్రయోగం అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం, ఈ స్వార్థ ప్రయోజనాలకు భరతవాక్యం పలకడమనే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదు’’. ఇంతకన్నా మరో గొప్ప సత్యాన్ని 1992లో సుప్రసిద్ధ అమెరికన్ పత్రిక ‘టైమ్’ ప్రకటించింది: ‘‘కమ్యూనిజం పతనం కావొచ్చు. కానీ క్యాపిటలిజమూ, ప్రజాస్వామ్యమూ శాశ్వతంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ జయప్రదం కాగలగవన్న గ్యారంటీ ఏమీ లేదు’’! ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పెరిగి పెద్ద మహమ్మారి రూపం దాల్చిన అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ‘చిట్కా వైద్యాల’తో ఉపశమింప జేసుకోవడమే గానీ ఆ సంక్షోభ లక్షణాలు ఈ రోజుకీ సమసిపోలేదు. కనుకనే అమెరికా ఆశీర్వాదాలతోనే నెలకొన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అత్యున్నత స్థాయి అధికారిగా, సలహాదారుగా ఈ సంస్థలను విశ్వసించి రంగంలోకి దిగి ఎలాంటి దారుణానుభవం చూడవలసి వచ్చిందో వివరించారు డేవిసన్ బుధూ. ఇప్పటికీ అమెరికా, ప్రపంచబ్యాంకు సంస్థలను నమ్ముతున్న భారత నాయకులు డేవిసన్ బుధూ అనుభవాల నుంచి గుణపాఠం తీసుకోలేక పోతున్నారు. చివరికి ఆంగ్లో – అమెరికన్ సంస్థలే భారత ఆర్థిక వ్యవస్థను పాలకులు నిర్వహిస్తున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నా ‘మనసూ, చర్మం’ మందబారిపోయి దులిపేసుకునే దశలో ఉన్నారు. ఆసియా, ఆఫ్రికాలలో తన దారుణానుభవాలను డేవిసన్ ఇలా గుండె బరువుతో ప్రపంచం కళ్లముందుంచారు (బుధూ 1988లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కామ్డెసెస్కు రాసిన సుదీర్ఘ రాజీనామా): ‘‘మీరు లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలకూ, ప్రజలకూ అందించమని నా చేతికి అందించిన వరల్డ్ బ్యాంక్ – ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల ఔష ధాన్నీ, రకరకాల చిట్కాలనూ (బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్) సంవత్సరాల తర బడిగా అందజేస్తూనే వచ్చాను. కానీ ఏళ్ల తరబడిగా ఈ దేశాల్లో గడించిన అనుభవం దృష్ట్యా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందు కంటే, ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్ల సామాన్య ప్రజల రక్తంతో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. మలినమై పోయిన ఈ నా చేతుల్ని కడుక్కోవడానికి నేను తీసు కున్న మంచి నిర్ణయమే ఈ రాజీ నామా. అయ్యా! కామ్డెసెస్ గారూ! ఈ దేశాల్లో మనం చేస్తున్న పనుల వల్ల పేదల రక్తం నదులై పారుతోంది. ఒక్కోసారి నాలో నేననుకుంటాను – ఐఎంఎఫ్ బ్యాంకుల తరఫున మీ పేరిట, మీకు ముందు పని చేసిన అధిపతుల పేరిట లేదా మీ అధికార ముద్రల చాటున నేను చేయ వలసి వచ్చిన పాపాలను కడిగేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో దొరికే సబ్బులు కూడా ఏ మూలకూ చాలవని.’’ (ఎనఫ్ ఈజ్ ఎనఫ్: 1988). కాగా, కడిగి పారేసిన ఆ ‘సబ్బుల్ని’ ఇండియాలో మొదటగా పీవీ నరసింహారావు హయాంలో అందుకుంటే, వాటిని ఆంధ్రప్రదేశ్లో వాడి ప్రజలకు ‘టోపీ’ పెట్టడానికి ప్రయత్నించినవాడు ప్రపంచ బ్యాంక్ ‘పెంపుడు బిడ్డ’ చంద్రబాబు! ఇక భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది బీజేపీ పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. ఆ పథకం కింద కేటాయింపులన్నీ దారి మళ్లుతున్నాయి. పైగా 2023 బడ్జెట్ ఏడాది కాలపరిమితికి మించకపోయినా, దేశ స్వాతంత్య్రం వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అంటే 2047 నాటి ‘లక్ష్యాల దిశగా ఈ బడ్జెట్ ఉంద’ని స్వయంగా ప్రధానమంత్రి ‘కోత’ కోయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇండియా లాంటి వర్ధమాన దేశాలలోని కారుచౌక కూలీరేట్ల ఫలితంగా విదేశీ కంపెనీలు పోటీ మీద ఇండియాలో ప్రవేశించి, ఉద్యోగుల్ని తొలగించడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోగా ఆ విధానాలనే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఎసరు పెట్టడంలో పాలకులు అనుసరిస్తూ, ప్రైవేటు వారికి ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు. దీన్ని ఎవరో కాదు, స్వయానా ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ డైరెక్టర్ సి.ఫ్రెడ్ బెర్గ్స్టెన్ ఎదురు తన్నిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ బ్యాక్లాష్) అని వర్ణించాల్సి వచ్చింది. ‘వ్యవస్థాగతమైన సర్దుబాట్లు అంటే, ‘ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగాల నుంచి పౌరుల్ని తొలగించేయడమేనని బెర్గ్స్టెన్ స్పష్టం చేశాడు. స్విస్ బ్యాంకులు, తదితర విదేశీ బ్యాంకుల్లోకి దొంగ చాటుగా ప్రవేశించిన డబ్బును తిరిగి దేశంలోకి తెచ్చి దేశ ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచుతామన్న పాల కులు ఆచరణలో మొండి చేయి చూపించడం మరపురాని అనుభవంగా మిగిలి పోయింది. ‘కోవిడ్’ వల్ల ప్రజా బాహుళ్యానికి కల్గిన నష్టం కన్నా దాని పేరిట జరిగిన మిలాఖత్ వ్యాపార లావాదేవీల వల్ల ప్రజ లకు వాటిల్లిన నష్టం ఎక్కువ. పోతన భాగవత కథల్లో ‘రహూగణుడ’నే ఒక అహంకారి ఉంటాడు. అతడెక్కిన పల్లకీ ఈ దేహమే. కానీ, దాన్ని మోసే బోయీలు ‘ఓంకారాన్ని’ వల్లిస్తూ నడుస్తారు, అలసట తెలియకుండా ఉండటం కోసం. పల్లకీలో కూర్చున్నవాడి ప్రయాణం మాత్రం సుఖంగానే సాగుతుంది. నేడు మన దేశ ప్రజల్ని పాలకులు పల్లకీ బోయీలుగా మార్చారు. నేటి దేశ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఆంత్రోపాలజిస్ట్ గ్లెన్ డేవిస్స్టోన్ వెల్లడించాడు: ‘‘పాలకులు వ్యవసాయం పేరిట వెచ్చిస్తున్న డబ్బంతా రైతాంగ శ్రేయస్సుకు కాదు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుతున్న పారిశ్రామిక వేత్తల శ్రేయస్సు కోసం’’.క్రీ.పూ. 2100 సంవత్సరంలోనే సుమేరియా ఏలికలు ఆర్థిక వ్యవస్థను ప్రజాపరం చేసి ఎలా ప్రజా బాహుళ్యాన్ని కరువు కాటకాలు లేకుండా కాపాడుతూ వచ్చిందీ చరిత్ర నమోదు చేసింది. బాబిలో నియా, ఈజిప్టులలో సహితం రాచరిక పాలనల్లోనూ ప్రజలు సుఖంగా జీవించారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత ప్రజలకు మసకబారని ఉషోదయాన్ని 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పాలకులు ప్రసాదించగల స్థితిలో లేకపోవడం విషాదకరం. కరెన్సీ సంక్షోభం వల్లనే దేశ పరిస్థితులు ఒడుదొడుకుల్లో పడ్డా యని పాలకులు చెప్పే మాటలు విని సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ గతంలో ఓ కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్లో ఉన్న పేద లంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ‘ఇది మనం పుట్టినప్పటి నుంచీ నోరు మూసుకుని అనుభవిస్తున్నదే కదరా’ అనుకుంటారు. ఆ తంతే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతూండటం సిగ్గుచేటు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
అదానీ గ్రూప్ షేర్ల పతనం.. నిర్మలా సీతారామన్ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత నియంత్రణ సంస్థలు ఎంతో కచ్చితత్వంతో, కఠినంగా పనిచేస్తుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీశాయా? అంటూ గౌతమ్ అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దశాబ్దాలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెబుతూ.. నియంత్రణ సంస్థలు మన మార్కెట్ను చక్కని, సరైన స్థితిలో నిలబెట్టినట్టు పేర్కొన్నారు. ముందున్నట్టే భారత్ ఇక మీదటా చక్కని నియంత్రణలతో కూడిన ఫైనాన్షియల్ మార్కెట్గా కొనసాగుతుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఎక్కువగా చర్చించుకుంటున్న ఓ సంఘటన భారత మార్కెట్లు ఎంత గొప్పగా నిర్వహించబడతాయనే దానికి నిదర్శనం కాబోదు’’అని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు, షేర్లపై ఆరోపణలతో ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపు కంపెనీలు ఈ వారంలో ఊహించని విధంగా భారీ నష్టాలు చూశాయి. దీంతో ఆర్థిక మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. మెరుగ్గా బ్యాంకింగ్ వ్యవస్థ భారత బ్యాంకింగ్ వ్యవస్థ నేడు ఎంతో సౌకర్యంగా ఉందని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. నికర నిరర్థక రుణాలు (ఎన్పీఏలు) చాలా కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేబినెట్ ఆమోదం పొందిన పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. చదవండి: Union Budget 2023-24: బడ్జెట్ కేటాయింపుల్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో ఇదే తక్కువ. -
Union Budget 2023-2024: క్రీడారంగాన్ని కరుణించిన నిర్మలమ్మ
Union Budget: 2023-2024 కేంద్ర బడ్జెట్లో క్రీడారంగానికి పెద్దపీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1) లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడారంగానికి గతేడాదితో పోలిస్తే కేటాయింపులు ఓ మోస్తరుగా పెరిగాయి. 2022-23 బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ. 3397 కోట్లకు (రూ. 334.72 కోట్ల పెరుగుదల) పెరిగింది. Sports Budget: Rs 3397.32 crore allocated to Sports in Union Budget 2023-2024 (⬆️ Rs 334.72 crore) Sports Budget Allocation 2023-24: ➡️ Khelo India: Rs 1045 Cr ➡️ SAI: 785.52 Cr ➡️ National Sports Feds: 325 Cr ➡️ NSS: 325 Cr ➡️ National Sports Development Fund: Rs 15 Cr — India_AllSports (@India_AllSports) February 1, 2023 గత ఐదేళ్ల కాలంలో కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా ఓ మోస్తరుగా నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గతేడాది మంజూరైన రూ. 3062 కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. తాజా బడ్జెట్లో నిర్మలమ్మ క్రీడలను కరుణించడంతో ఆ రికార్డు బద్ధలైంది. Sports Budget for the last 5 years: 2018-19 - ₹2197 crore 2019-20 - ₹2776 crore 2020-21 - ₹2826 crore 2021-22 - ₹2596 crore 2022-23 - ₹3062 crore This year’s budget allocation 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 - ₹𝟯𝟯𝟵𝟳 𝗰𝗿𝗼𝗿𝗲📈 — Enakshi Rajvanshi (@enakshi_r) February 1, 2023 స్పోర్ట్స్ బడ్జెట్లో ఎవరికి ఎంత..? ఖేలో ఇండియా: రూ. 1045 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్): రూ. 785.52 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్: రూ. 325 కోట్లు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎన్ఎస్): రూ. 325 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్: రూ. 15 కోట్లు -
నిర్మలా సీతారామన్ ధరించిన చీర.. ఎవరు బహుమతి ఇచ్చారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్తో పాటు ఆమె ధరించిన చీరపై కూడా అందరి దృష్టి పడింది. ఎందుకంటే 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఈ ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడల్లా ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత చీరలతో దర్శమిస్తున్నారు. ఈ ఏడాది చేతితో నేసిన ఇక్కత్ సిల్క్ ఎర్ర చీరను ధరించి ఆమె పార్లమెంట్కు హాజరయ్యారు. ఇది భారతీయ సాంప్రదాయ వస్త్రాల పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 2023 సమావేశానికి నిర్మలా సీతారామన్ చేతితో నేసిన నవలగుండ ఎంబ్రాయిడరీ ఎరుపు రంగు ఇక్కత్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన ఈ చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే నిర్మలమ్మ దగ్గర చీరల కలెక్షన్లు ఎక్కువే! ఆమెకు చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక చీరతో దర్శమమిస్తారు. అదే క్రమంలో నలుపును దూరం పెడుతుంటారు. -
కేంద్ర బడ్జెట్ 2023: ఆ వాహనాలకు చెక్.. ఇకనైనా మేల్కోవాల్సిందే!
దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించారు. గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది. -
Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పెరుగనున్నవి... బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు బంగారం, వెండి వాహనాల టైర్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు తగ్గనున్నవి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్ని ధరలు తగ్గనున్నాయి టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు -
Budget 2023: రైతులకు తీపి కబురు.. అందుకోసం రూ.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతాన్నామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5 వేల 300 కోట్లు కేటాయించారు. వీటితో పాటు వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
కేంద్ర బడ్జెట్ 2023: గుడ్ న్యూస్.. మహిళల కోసం మరిన్ని పథకాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. -
Union Budget 2023: ప్రత్యేక సందర్భాల్లో నిర్మలమ్మ ధరించే చీర వెనుక ఇంత కథ ఉందా!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు, ఊరటనిచ్చే అంశాలు వంటి వాటితో ఈ బడ్జెట్లో ఏముందనే ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వీటితో మరో అంశం కూడా ఉందండోయ్. ఆమె ఏ రంగు చీరతో 2023-24 బడ్జెట్ను సమర్పిస్తుందా అని అందరి దృష్టి దానిపైనే ఉంది. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం బడ్జెట్తో పాటు దానిపై కూడా ప్రత్యేక దృష్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరల సేకరణను కలిగి ఉన్నారు.నిర్మలమ్మకు చేనేత చీరలంటే ఇష్టం ఎక్కువ. జనవరి 26న, నార్త్ బ్లాక్లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. నిర్మలమ్మ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక చీరల ధరించి దర్శమమిస్తారు. అదీ కూడా ఆ రంగులు తరచుగా దేశంలోని కరెన్సీ నోట్లకి సరిపోతుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో కనిపించింది. ఈ ఏడాది బడ్జెట్ 2023 కోసం ఆమె ప్రకాశవంతమైన ఎరుపు రంగును ఎంచుకున్నారు. దీనిబట్టి ప్రజలు ఈ సారి సానుకూల బడ్జెట్ ఆశించవచ్చిన తెలుస్తోంది. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం.. ►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది. ►పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర.. ►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది ►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్పురి చీర ►మన్మోహన్ సింగ్ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర ►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర ►విలేకరుల సమావేశంలో ధరించిన జమ్దానీ చీర రూ.50 నోటుతో సరిపోతుంది. ప్రత్యేక సందర్భాలలో ఆర్థిక మంత్రి ఎరుపు రంగును ఎంచుకుంటారు, నలుపును దూరంగా పెడుతుంటారు. చదవండి: Union Budget 2023: బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? ఈ విషయాలు తెలుసా? -
కేంద్ర బడ్జెట్ 2023: నిర్మలమ్మ ప్రధానంగా ఫోకస్ పెట్టే అంశాలు ఇవేనా!
Union Budget 2023: ఎట్టకేలకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 1 ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్న బడ్జెట్ను పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనాకర్షన బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక కేటాయింపులు విషయానికొస్తే.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే అవకాశమూ ఉంది. కోవిడ్ తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు ఖర్చు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబు విషయంలో గత 9 ఏళ్లుగా మార్పులు లేకుండా అలానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేతన జీవులను నిర్మలమ్మా కరుణిస్తుందనే అంటున్నారు. కాకపోతే ఈసారి కూడా భారీ వెసులుబాటు ఉండకపోవచ్చు కానీ.. కొద్దో గొప్పో మార్పులు ఉండే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కనీస మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్నా ఉద్యోగుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ మౌలిక సదుపాయల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కొలువుల కోతలు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ఉపాధి కల్పన పథకానికి శ్రీకారం చుట్టే ప్రతిపాదనలు ఉన్నాయంటూన్నారు. వీటితో పాటుగా గృహరుణాలు. ఆరోగ్య ఖర్చులపై పన్నుల్లో కాసింత వెసలుబాటు కల్పించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. రైల్వే శాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం పెంపు ఉండచ్చని తెలుస్తోంది. ఇక బంగారం దిగుమతులపై పన్ను తగ్గించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకం పెంచే అవకాశం కనిపిస్తోంది. -
Union Budget 2023: నిర్మలమ్మా.. 9 ఏళ్లు అయ్యింది, ఈ సారైనా పెంపు ఉంటుందా?
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఫిబ్రవరి నెలలో పార్లమెంట్లో ప్రవేశపెడుతోంది. అయితే గత కొన్నేళ్లుగా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే పన్ను ఆంశం మాత్రం మోదీ సర్కార్ దాటేస్తూ వస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఈ సారైన ఈ వర్గం ప్రజలు ఆశించిన రాయితులు, పరమితుల, కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అప్పుడేప్పుడు పెంచిన పరిమితి.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను ఉండదు. ఈ రూల్.. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లు గడుస్తున్న ఈ బేసిక్ పరిమితిలో ఏ మార్పులు లేకుండా ఇలానే కొనసాగుతోంది. అయితే రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించినప్పటికీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్ 2023లోనైనా ఈ పరిమితి పెంపును కోరుకుంటున్నారు మధ్య తరగతి ప్రజలు. బేసిక్ పరిమితి పెంచాలి.. ఎందుకంటే! గణనీయంగా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూ.5–6 లక్షలు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ కానుక ఉంటుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే రూ.50వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను పెంచుతారేమో చూడాలి. అలాగే, సెక్షన్ 80సీ కింద వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్ని కూడా రూ.2–3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు నెలకొన్నాయి. అలాగే, గరిష్ట పన్ను రేటు 30 శాతం అమలుకి ఆదాయపన్ను పరిమితిని పెంచాలన్న డిమాండ్ బలంగా ఉంది. ప్రస్తుతం వార్షికాదాయం రూ.10లక్షలకు మించితే పాత పన్ను విధానంలో 30 శాతం రేటు అమలు చేస్తున్నారు. రూ.20 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి 20 శాతం మించి పన్ను ఉండరాదన్నది నిపుణుల సూచనగా ఉంది. పన్ను భారం తగ్గించడం వల్ల మధ్య తరగతి, వేతన జీవులకు ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఇది వినియోగంలోకి మారి, డిమాండ్కు ఊతం ఇస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. పన్నుల భారం తగ్గించడం ఒక కోణం అయితే, సామాన్యులు, మధ్యతరగతి వాసులపై కొత్తగా ఏ రూపంలోనూ పన్నుల భారం మోపకుండా ఉండడం కీలకం కానుంది. మరోవైపు ధరల భారం ఎక్కువ మందిని భయపెడుతోంది. కనుక కూరగాయలు, వంట నూనెలు, చమురు ధరల కట్టడికి తీసుకునే చర్యలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. -
గత ఎన్నికల ముందు బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బడ్జెట్ సమావేశానికి ఇక రెండు రోజులే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్పై కోట్ల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ప్రస్తుతం రాబోవు బడ్జెట్పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2019 ఎన్నికల ముందు నాటి ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలా ఉంటుందో ఈ తరుణంలో ఒకసారి పరిశీలిస్తే ఈ బడ్జెట్పై కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి బడ్జెట్ ఎలా ఉందంటే.. గత 9 ఏళ్లుగా మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరగు లేకుండా పాలిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి ప్రజామోదం కోసం ఈ బడ్జెట్ను కేంద్రం ఒక అవకాశంగా భావిస్తుందా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటుందా? అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే. 2019 ఎన్నికల ముందు నాటి పూర్తి స్థాయి బడ్జెట్ను ఒకసారి గమనించినట్టయితే.. హెల్త్కేర్, పారిశుద్ధ్యం, విద్యా రంగాలకు అంతకుముందు మూడు సంవత్సరాల్లో లేనంతగా కేటాయింపులు పెంచారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అరుణ్ జైట్లీ ప్రకటించారు. విద్య, సామాజిక భద్రత, ఆరోగ్యం కోసం రూ.1.38 లక్షల కోట్లు కేటాయించారు. ఆదాయపన్నుపై హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. ‘‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. అతిపెద్ద యువ జనాభా కలిగి ఉన్న భారత్ తన హామీలను అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’అని నాడు అరుణ్జైట్లీ 2018–19 బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. చదవండి: నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది -
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా!
జనవరి చివరి వారం వచ్చేసింది. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్ పేరు మారుమోగుతోంది. ఇందులో కేంద్రం అందించే కేటాయింపులు, పలు రంగాలను ప్రభావితం చేసే నిర్ణయాలు, పన్ను తగ్గింపు లేదా పెంపు చర్యలపై, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలుపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందో అని సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ సంస్ధలు ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షికబడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో బడ్జెట్కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం! ►10: మొరార్జీ దేశాయ్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరుగులేని రికార్డు. దేశాయ్ జవహర్లాల్ నెహ్రూ (1958-1963), ఇందిరా గాంధీ (1967-1969) హయాంలో భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1996-1998, 2004-2008, 2012-2014 మధ్య తొమ్మిది బడ్జెట్లతో పి.చిదంబరం రెండవ స్థానంలో ఉండగా, ఎనిమిది బడ్జెట్లను సమర్పించిన ప్రణబ్ ముఖర్జీ (1982-1984, 2008-2012) జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ►మూడు: సాధారణ ఆర్థిక మంత్రి లేకపోవడంతో ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముగ్గురూ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. టిటి కృష్ణమాచారి రాజీనామా తర్వాత జవహర్లాల్ నెహ్రూ 1958 బడ్జెట్ను సమర్పించారు. బ్యాంక్ జాతీయీకరణకు వ్యతిరేకంగా తన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత ఇందిరా గాంధీ 1970 బడ్జెట్ను సమర్పించారు. రాజీవ్ గాంధీ 1987లో VP సింగ్ను రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసిన తర్వాత బడ్జెట్ను సమర్పించారు, ఆ పోర్ట్ఫోలియోను తాత్కాలికంగా తన వద్ద ఉంచుకున్నారు. ►800: 1977లో హెచ్ఎం పటేల్ బడ్జెట్ ప్రసంగంలోని పదాల సంఖ్య. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఆర్థిక మంత్రి చేసిన అతి చిన్న ప్రసంగం అంటే ఇదే. ►18,700: డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 బడ్జెట్లోని పదాల సంఖ్య - అత్యధిక పదాలు కలిగిన బడ్జెట్ ఇది. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే ఉంది. దేశంలో ఆర్థిక సరళీకరణకు నాంది పలికినందున 1991 బడ్జెట్ చరిత్రలో అత్యధికంగా కోట్ చేయడంతో పాటు విశ్లేషించబడిన బడ్జెట్ ఇది. ►162: 2020 బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు సీతారామన్ మాట్లాడిన మొత్తం నిమిషాల సంఖ్య. ఈ బడ్జెట్ ప్రసంగం ద్వారా గతంలో తను నమోదు చేసిన రికార్డ్ను ఆమె అధిగమించింది. 2019లో 137 నిమిషాల మాట్లాడి సుదీర్ఘంగా ప్రసంగించి రికార్డ్ నమోదు చేసింది. సీతారామన్ కంటే ముందు, 135 పాటు మాట్లాడిన జస్వంత్ సింగ్ (నిడివి పరంగా) అత్యధిక ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ►1999: కేంద్ర బడ్జెట్ సమయం సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 11 గంటలకు మార్చిన సంవత్సరం. ►2017: రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్తో విలీనమైన సంవత్సరం. ఫిబ్రవరి మొదటి రోజున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం కల్పించేందుకు ఈ తేదీ మార్పు ఉపయోగపడుతోంది. ►3,94,49,09,00,00,000: భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాలని ప్రతిపాదించిన మొత్తం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ₹ 39.44 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనా కంటే 4.6 శాతం పెరిగింది. ►13.3: 2022 బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం 13.3 శాతం. రక్షణ పెన్షన్ల కోసం ₹ 1.19 లక్షల కోట్లతో సహా ₹ 5.25 లక్షల కోట్ల బడ్జెట్ను మంత్రిత్వ శాఖకు కేటాయించారు. ►10,40,00,00,00,000: మొత్తం విద్యా బడ్జెట్ 2022-23లో మొదటిసారిగా ₹ 1-లక్ష కోట్లు దాటింది. గత ఏడాది విద్యకు కేటాయింపులు ₹ 1.04 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే 18.5 శాతం ఎక్కువ. చదవండి: బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా? -
Allah Comments: ఆర్థిక మంత్రిని తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం(పెను) కొనసాగుతున్న దరిమిలా.. ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాఖ్ దార్ చేసిన వ్యాఖ్యలు జనాలకు మంట పుట్టించాయి. పాక్ను అల్లానే సృష్టించాడని, కాబట్టి దేశాన్ని బాగు చేయడం కూడా ఆయనే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. దీనిపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలో ఉండి కూడా చేతకాని దద్దమ్మలా మాట్లాడొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పాక్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత కొనసాగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా.. పరిస్థితి దిగజారుతోందే తప్ప కొలిక్కి రావడం లేదు. ఈ తరుణంలో ఓ రైల్వే లాంఛ్ ఈవెంట్కు హాజరైన దార్ మాట్లాడుతూ.. ఇస్లాం పేరిట ఈ గడ్డను(పాక్) అల్లానే సృష్టించాడు. కాబట్టి, దేశాన్ని సుభిక్షంగా మార్చే బాధ్యత కూడా ఆయనదే. అందుకే దేశం మళ్లీ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందనే నమ్మకం ఉంది అని వ్యాఖ్యానించారు. ఒకవేళ అల్లానే గనుక పాకిస్థాన్ను సృష్టించి ఉంటే.. ఆయనే రక్షిస్తారు. ఆయనే అభివృద్ధి చేశారు. బాగోగులు కూడా ఆయనే చూసుకుంటారు అని దార్ వ్యాఖ్యానించారు. ప్రధాని షెహ్బాజ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం పరిస్థితిని బాగు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తోందని పేర్కొన్నారాయన. ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వం రాత్రింబవలు కృషి చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నా కొన్ని ప్రతిబంధకాలు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే దార్ కామెంట్లపై ప్రతిపక్షాలు, మేధావులు సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఉండికూడా.. పరిస్థితిని చక్కదిద్దకుండా చేతకానీ దద్దమ్మలా మాట్లాడారంటూ అని మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగి.. నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, పైగా తీవ్ర సంక్షోభం దిశగా పాక్ అడుగులు వేసిందని కొందరు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో పాక్ ప్రజలు గట్టి బుద్ధి చెప్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఆర్థిక మంత్రిగా పని చేసినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.. ఎందుకో తెలుసా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023-24ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఐదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం! బడ్జెట్ అనే పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రులలో మొరార్జీ దేశాయ్ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ చెక్కు చెదరకుండా ఆయన పేరునే కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయంటే నమ్మడమే కష్టమే. కానీ ఈ జాబితాలో ఇద్దరు ఉన్నారు. హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కలిగి ఉన్నప్పటికీ, ఏ కేంద్ర బడ్జెట్ను సమర్పించలేదు. వీరివురూ చాలా తక్కువ వ్యవధిలో పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం లేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండవ ఆర్థిక మంత్రిగా నియమితులై, కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోయారు. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
రైల్వే బడ్జెట్ 2023: వందే భారత్ రైళ్లు, కేటాయింపులు, సామాన్యుడికి ఊరట!?
న్యూఢిల్లీ: 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కీలకమైన హల్వా వేడుక ముగిసింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, వేతన జీవులతో పాటు ఆర్థిక నిపుణులు,పెట్టుబడిదారులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇదే బడ్జెట్లో చేయనున్నారు. ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ , మిజోరం మినహా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈశాన్య రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ రైల్వే కేటాయింపులపై మరింత ఉత్కంఠ నెలకొంది. రైల్వే బడ్జెట్ ఒకపుడు విడిగా 2017 వరకు కూడా రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్తో కాకుండా విడిగా ప్రవేశపెట్టేవారు. 1924లో తొలిసారిగా రైల్వే బడ్జెట్ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.దేశంలో రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం నాటి బ్రిటిష్ పాలకులు రైల్వేకు ఎక్కువ నిధులు కేటాయించేది అప్పటి ప్రభుత్వం. ఇది సరకు రవాణాకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆ తరువాతి కాలంలో ఏర్పాటైన రైల్వే వ్యవస్థ జాతీయంపై 1920లో 10 మంది సభ్యుల సర్ విలియం అక్వర్త్ కమిటీ రైల్వే వ్యవస్థను సంఘటితం చేయాలని సూచించింది. అందుకోసం ప్రత్యేకంగా రైల్వేకు నిధులు కేటాయించాలని బ్రిటిష్ పాలకులకు సిఫార్సు చేసింది, దీనికి ఆమోదం లభించడంతో 1924 నుంచి రైల్వే బడ్జెట్ని ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతోంది. దాదాపు 93 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సాంప్రదాయం కొనసాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి టర్మ్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపింది 2017లో తొలిసారిగా వార్షిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను ప్రకటించారు. అయితే తాజా బడ్జెట్లో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు,కేటాయింపులపై తదితర విషయాలపై భారీ ఆసక్తి నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా సమాచారం మేరకు కేంద్రం ఈసారి రైల్వే బడ్జెట్ ను పెంచబోతోంది. అలాగేప్రీ బడ్జెట్ మీటింగ్ రైల్వే బోర్డు తమకు 25 నుంచి 30 శాతం వరకూ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసింది. ఈక్రమంలో రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండీచర్తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్లో నూతన రైల్వే లైన్లను ప్రతిపాదనతోపాటు, ఆయా రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థలను మెరుగు పరిచేందుకుప్రాధాన్యత ఇవ్వనుంది. అంచనాలు 2023 బడ్జెట్ కేటాయింపుల్లో వేగవంతమైన రైళ్లకు అనుగుణంగా ట్రాక్స్ అప్గగ్రేడేషన్పై దృష్టి సారించాలని రైల్వే నిపుణులు చెబుతున్నారు. అధికంగా నిధులు, ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణం, లైన్ల గేజ్లు మార్పు, ఎలక్ట్రిఫికేషన్ చేయడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం లాంటివాటిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ►డిసెంబర్ 2023 నాటికి బ్రాడ్ గేజ్ రైల్వేల 100 శాతం విద్యుదీకరణ పూర్తి. ►మెట్రో రైల్వే వ్యవస్థను టైర్-2 నగరాలు , టైర్-1 నగరాల వెలుపలి ప్రాంతాలలో అభివృద్ధి ►తద్వారా భారతీయ రైల్వేలు 2030 నాటికి ప్రపంచంలోనే తొలి100 శాతం గ్రీన్ రైల్వే సర్వీస్గా అవిష్కారం ► హైపర్లూప్ టెక్నాలజీని అవలంబిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. ► దీనితో పాటు సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రాథమిక సౌకర్యాలపై భారీ ప్రకటన రానుందని అంచనా. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4000 కి.మీ పొడవు లైన్ వేయడం ఉద్దేశ్యం ►రాబోయే రైల్వే బడ్జెట్లో 7,000 కి.మీ బ్రాడ్ గేజ్ లైన్ విద్యుదీకరణప్రకటన ► రైల్వే విజన్ 2024 ప్రాజెక్ట్ కింద, కొత్త ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు హై-స్పీడ్ ప్యాసింజర్ కారిడార్లను పరిచయం చేయడంతో పాటు, రద్దీ మార్గాల్లో మల్టీట్రాకింగ్ , సిగ్నలింగ్ అప్గ్రేడ్స్ లక్క్ష్యం. ► కోవిడ్ సమయంలో తొలగించిన రైల్వేలో సీనియర్ సిటిజన్ల కుల్పిస్తున్న 50 శాతం రాయితీని పునరుద్ధించాలని కూడా పలువురు కోరుతున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Budget Halwa: హల్వానే కాదు ప్రతుల ముద్రణ వెనుక అంత కథ ఉందా?
యూనియన్ బడ్జెట్ దరిమిలా.. మరో ముఖ్యమైన బడ్జెట్ హల్వా. బడ్జెట్ తయారీలో చివరి ఘట్టంగా దీనిని పేర్కొంటారు. బడ్జెట్ తయారీలో పని చేసే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది కోసం హల్వా సిద్ధం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అయితే కాస్త గ్యాప్తో జరిగిన కార్యక్రమం కూడా ముగిసింది. ఏడాది గ్యాప్ తీసుకుని.. బడ్జెట్ హల్వా మళ్లీ మన ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడాయిలో వండిన హల్వా సీల్ను తెరిచి.. అందరికీ పంచి ఈ ఆనవాయితీని కొనసాగించారు. గురువారం నార్త్ బ్లాక్లో జరిగింది ఈ కార్యక్రమం. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం, పదిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కాకతాళీయంగా ఈసారి గణతంత్ర దినోత్సవం నాడే ఇది జరగడం గమనార్హం. కిందటి ఏడాది కరోనా కారణంగా హల్వాకు బదులకు స్వీట్లను పంచారు. బడ్జెట్ హల్వా కార్యక్రమం.. ఆర్థిక మంత్రి సమక్షంలో జరుగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా.. ఇతరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా ఐదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత రెండు బడ్జెట్లా మాదిరే ఈ ఏడాది కూడా పేపర్లెస్గా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారామె. హల్వా వేడుక.. అనేది బడ్జెట్లో ఓ ముఖ్యమైన ఘట్టం. బడ్జెట్ రూపొందించిన అధికారులకు, సిబ్బంది సేవలకు గుర్తింపుగా.. తీపిని అందించడం ద్వారా ఈ వేడుకను ప్రతీ ఏటా నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కిందటి ఏడాది మాత్రం బదులుగా స్వీట్లు పంచారు. బడ్జెట్ తయారీ అంతా ఫైనల్ బడ్జెట్ డాక్యుమెంట్ బయటకు వచ్చేదాకా అంతా గోప్యంగానే ఉంటుంది. బడ్జెట్ రూపొందించే అధికారులు, సిబ్బంది అంతా వందమంది దాకా ‘లాక్ ఇన్ పీరియడ్’లో ఉండిపోతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా(కుటుంబ సభ్యులతో సహా) ఉండిపోతారు. లోక్సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాతే వాళ్లు బయటకు వచ్చేది. ఒక రకంగా చూసుకుంటే.. ఇది క్వారంటైన్ లాంటిదే!. గతంలో లాక్ఇన్ పీరియడ్ రెండు వారాలు ఉండేది. తర్వాత పదిరోజులు అయ్యింది. ఇప్పుడు బడ్జెట్ అనేది డిజిటల్ ఫార్మట్కు మారడంతో.. ఐదు రోజులకు కుదించారు. 1950లో బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించారు. అయితే ఆ సమయంలో బడ్జెట్ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి. దీంతో పెనుకలకలమే రేగింది. ఆపై ఢిల్లీ మింట్ రోడ్లోని ప్రింట్ ప్రెస్కు మారింది. ఆపై 1980 నుంచి నార్త్బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ ప్రెస్ను ఇందుకోసం శాశ్వతంగా వినియోగిస్తున్నారు. నార్త్ బ్లాక్ బేస్మెంట్లో 1980-2020 మధ్య కాలంలో బడ్జెట్ ప్రతులను ముద్రించేవాళ్లు. ఆ తర్వాత బడ్జెట్ డిజిటల్ కావడం, మొబైల్ యాప్ లేదంటే వెబ్సైట్ ద్వారా ప్రతులను పంచడంతో.. కేవలం కొన్ని డాక్యుమెంట్ల ముద్రణ మాత్రమే ఉంటోంది. యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in, యూనియన్ బడ్జెట్ యాప్లో అందుబాటులో ఉంటుంది. -
త్వరలో కేంద్ర బడ్జెట్.. ఉద్యోగుల ఆశలన్నీ వాటిపైనే!
మరికొద్ది రోజుల్లో కేంద్రం బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టబోతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తులు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాలకు ఎన్నికలతో పాటు 2024లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్ ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు నిపుణులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ప్రజారంజకంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వేతన జీవులు బడ్జెట్పై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పన్ను మినహాయింపుల మాటేమిటి గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపు పన్నుపై కేంద్రం ఎటువంటి సంస్కరణలను ప్రకటించలేదు. ప్రస్తుత బడ్జెట్లో పన్ను విధానంలో మార్పు కీలకమైన డిమాండ్గా వినిపిస్తోంది. ఐచ్ఛిక ఆదాయపు పన్ను ప్రకటించబడినప్పటికీ, ఉపశమనం అందించే విషయంలో ఇది చాలా వరకు ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు చెబుతున్నారు. పాత ఆదాయపు పన్ను విధానంలో వర్తించే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 పెంచాలని అనేక వినతులు వచ్చాయి. అలాగే కొన్ని మినహాయింపులను కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మరో వైపు అధ్వానంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో పాటు ఆర్థిక మాంద్యం ప్రభావాలు కలిసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కఠినమైన సవాలును ఎదుర్కొంటుందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చేరారు. అయితే ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. వైరల్ ఫీవర్, పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగానే నిర్మాలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారని అధికారులు పేర్కొన్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారు. మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్పేయీ జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. కానీ ఆ మరునాడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. చదవండి: రాహుల్ స్పీచ్లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్ -
ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే ఉన్నాం
న్యూఢిల్లీ: అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం గమనిస్తూనే ఉందని, ధరల భారం పెరగకుండా చూస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి రాకతో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోకుండా, పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన లకి‡్ష్యత విధానాలు తోడ్పడినట్టు చెప్పారు. రాజ్యసభలో మధ్యంతర నిధుల బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ట స్థాయికి తగ్గినట్టు చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అదనంగా రూ.3.25 లక్షల కోట్లను వ్యయం చేసేందుకు అవకాశం ఉంటుంది. బిల్లును లోక్సభ సైతం ఆమోదించడం గమనార్హం. పన్నుల వసూళ్లు బలంగా ఉన్నాయని వివరిస్తూ.. ప్రభుత్వం ఖర్చు చేసే రూ.3.25 లక్షల కోట్ల అదనపు వ్యయాలకు తగిన వనరులున్నాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2022–23 సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్రం 6.4 శాతంగా పేర్కొనడం గమనార్హం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, ఇతర అనుకూల విధానాలతో ప్రైవేటు మూలధన నిధుల వ్యయాలు పుంజుకుంటున్నాయని మంత్రి సీతారామన్ చెప్పారు. బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి, ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గినట్టు సభకు తెలిపారు. మధ్యంతర నిధుల డిమాండ్లు అన్నవి ఆహార భద్రత, ఎరువుల సబ్సిడీల కోసం, దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు నిచ్చేందుకేనని వివరించారు. చదవండి: లక్ష్మీ మిట్టల్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడితో ఎలాన్ మస్క్ -
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ(రైటాఫ్) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైటాఫ్ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్ లోన్లు ఉన్నాయని తెలియజేశారు. ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు -
బడ్జెట్పై నిర్మలా సీతారామన్ సమావేశం.. హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన
ఢిల్లీ: వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా రామన్ ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ భేటీలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సహా అభివృద్ధి పథకాలకు నిధులు వంటి అంశాలను లేవనెత్తారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు రానున్న బడ్జెట్లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యాలను కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. చదవండి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష -
ప్రీ-బడ్జెట్ సమావేశం: వాటిపై నిషేధం ఎత్తివేయండి!
న్యూఢిల్లీ: గోధుమ వంటి వ్యవసాయ వస్తువుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని అలాగే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పామాయిల్కు బదులుగా సోయాబీన్, ఆవాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి స్థానిక నూనె గింజల దేశీయ ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా రైతు సంఘాలు సూచించాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్పై అధిక పన్నుల విధించాలని కోరాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో వెర్చువల్గా ప్రీ-బడ్జెట్ 2023 సంప్రదింపులను ఇక్కడ నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. వారు వ్యక్తం చేసిన మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే.. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువగా ఉన్న ఉత్పత్తుల దిగుమతిని ప్రభుత్వం అనుమతించకూడదని తన కోర్కెల పత్రంలో భారత్ కృషిక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో మౌలిక వనరులు, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ‘వ్యవసాయం రాష్ట్ర సబ్జెక్ట్గా ఉంది. చాలా రాష్ట్రాలు సంబంధిత శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీని కారణంగా పలు అంశాల్లో తీవ్ర దుర్వినియోగం చోటు చేసుకుంటోంది. రసాయనాల వినియోగం, అటెండర్ సమస్యలు ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రిత్వశాఖ మార్గాలను కనుగొనాలి’’ అని ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. పర్యావరణ అంశాలకు సంబంధించి రైతులకు అంతర్జాతీయంగా స్వచ్ఛంద కార్బన్ క్రెడిట్ ప్రయోజనాలు కల్పించే చర్యలనూ చేపట్టాలని ఆయన కోరారు. ► అగ్రి ఉత్పుత్తుల ఎగుమతుల నిషేధం వల్ల రైతాంగం ఆదాయాలు పడిపోతున్నాయని ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ కన్సార్టియం (సీఐఎఫ్ఏ) ప్రెసిడెంట్ రఘునాథ్ దాదా పాటిల్ పేర్కొన్నారు. నిషేధం ఎత్తివేతకు విజ్ఞప్తి చేశారు. దేశానికి విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా రావడానికి దోహదపడే చర్య ఇదని కూడా ఆయన సూచించారు. భారత్కు వంట నూనెల దిగుమతుల అవసరాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దిశలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, వేరు సెనగ పంటల ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్టర్ ఫోరమ్ (కేరళ) కార్యదర్శి విరెన్ కె ఖోనా, గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (ఉత్తరాఖండ్) డైరెక్టర్ ఏఎస్ నైన్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ గ్రోవర్స్ అసోసియేషన్ (హిమాచల్) రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ చౌహాన్, యూపీఏఎస్ఐ (తమిళనాడు) అధ్యక్షుడు జెఫ్రీ రెబెల్లోసహా పలువురు వ్యవసాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. లైసెన్స్ ఫీజు తగ్గించండి: సీఓఏఐ లైసెన్స్ ఫీజును ప్రస్తుత మూడు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని మొబైల్ ఆపరేటర్ల సంఘం–-(సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా– సీఓఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే 5జీ రోల్అవుట్ కోసం నెట్వర్క్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖకు తమ ‘బడ్జెట్ విష్లిస్ట్’ను సమర్పించింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) రద్దు చేయాలని కూడా సీఓఏఐ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్దీకరణ అవసరమని ఆర్థికమంత్రితో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో సూచించింది. లైసెన్స్ రుసుము, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు, వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ చెల్లింపులపై జీఎస్టీ తొలగించాలని విజ్ఞప్తి చేసింది. సేకరించిన జీఎస్టీ ఇన్పుట్ పన్ను క్రెడిట్ (రూ32,000 కోట్లు) వాపసు, టెలికాం టవర్లపై అమర్చిన క్లిష్టమైన పరికరాలపై ఇన్పుట్ ట్యాక్స్ లభ్యతపై స్పష్టత నివ్వడం వంటి డిమాండ్లు సీఓఏఐ చేసిన డిమాండ్లలో మరికొన్ని. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం ఆపరేటర్లకు సీఓఏఐలో సభ్యత్వం ఉంది. చివరి పూర్తిస్థాయి బడ్జెట్ 2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. సీతారామన్కు రానున్నది ఐదవ బడ్జెట్. అలాగే 2024 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇదే మోదీ–2 ప్రభుత్వానికి తుది పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. పారిశ్రామిక రంగం ప్రతినిధులతోపాటు, మౌలిక, పర్యావరణ (క్లైమేట్ చేంజ్) రంగాల నిపుణులతో చర్చల ద్వారా సోమవారం ఆర్థికమంత్రి తన 2023-24 ప్రీ బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించారు. మంగళవారం వ్యవసాయం, ఆగ్రో పాసెసింగ్, ఫైనాన్షియల్, క్యాపిటల్ మార్కెట్, టెలికం ఆపరేటర్ల విభాగాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. 24వ తేదీన సేవలు, ఆరోగ్యం, విద్య, జల వనరులు, పారిశుధ్యంసహా సామాజిక రంగం నిపుణులతో భేటీ అవుతారు. 25వ తేదీన రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: తగ్గేదేలే.. బ్రెజిల్లో రికార్డు సృష్టించిన భారత కంపెనీ, 48 గంటల్లోనే..