-
ప్రేమ వివాహం.. యువతి బంధువులపై కేసు
ముసునూరు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న మేజర్లు అయిన ఓ జంట పోలీసులను ఆశ్రయించగా, యువతి తరపు బంధువులు వ్యతిరేకిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కల్పించడంతో యువతి మేనత్తలు, తండ్రితోపాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కాట్రేనిపాడుకు చెందిన సొంగా వంశీకృష్ణ, అదే గ్రామానికి చెందిన గుత్తి లావణ్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి యువతి తరపు బంధువులు నిరాకరించారు. దీంతో వీరు గుడిలో పెళ్లి చేసుకుని, రక్షణ కోసం ముందుగా చింతలపూడి పోలీసులను, అనంతరం ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరుపక్షాల పెద్దలకు కబురు చేశారు. గురువారం యువకుని బంధువులు స్టేషన్కు రాగా, యువతి తరపు బంధువులు రాలేదు. దీంతో యువకుని తల్లిదండ్రులకు ఎస్సై కౌన్సెలింగ్ నిర్వహించి, నూతన వధూవరులను జాగ్రత్తగా చూసు కోవాలని హెచ్చరించి వారికి అప్పగించారు. దీనికి ఆగ్రహిస్తూ, యువతి మేనత్తలు గుత్తి నాగమణి, సొంగా నాగమణి, మరి కొందరు బంధువులు గురువారం రాత్రి స్టేషన్కు వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ధర్నాకు దిగారు. ఎస్సై వారికి ఎంత నచ్చచెప్పినా వినకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యువతిని తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన యువతి బంధువులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పాముకాటుకు మహిళ మృతి ముదినేపల్లి రూరల్: శ్రీహరిపురంలో పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆరే నాగాంజలి (30) భర్తకు దూరంగా ఉంటూ తన ఇద్దరు ఆడపిల్లలతో గ్రామంలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాలకు పంపించేందుకు బట్టలు తీస్తుండగా వాటిలో ఉన్న పాము అకస్మాత్తుగా చేతిపై కాటువేసింది. చికిత్స కోసం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందింది. తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు చేయగా ఏఎస్సై పద్మజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడు అంబుల మనోజ్ తన కుమార్తె, వైద్యవిద్యార్ధిని వైష్ణవితో నాగాంజలి మృతికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్ధికసాయంగా రూ.10వేలు తల్లి వెంకటేశ్వరమ్మకు అందజేశారు. -
వ్యయ పరిమితిపై అవగాహన తప్పనిసరి
ఏలూరు (మెట్రో): ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు గరిష్ట పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హులవుతారని, ఎన్నికల వ్యయంపై అవగాహన తప్పనిసరి అని నియోజకవర్గ ఎన్నికల పరిశీల కులు మేశ్రం గౌరవ్ మధుకర్ (ఐఆర్ఎస్) తెలిపారు. శుక్రవారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అభ్యర్థుల వ్యయ నమోదు ప్రక్రియను ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఖర్చుల నమోదు ప్రక్రియను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ వి.మురార్జీ ఆయనకు వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్.వెంకటకృష్ణ ఉన్నారు. 13న వేతనంతో కూడిన సెలవు ఏలూరు (టూటౌన్): వచ్చే నెల 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నందున జిల్లాలోని దుకాణాలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్టు కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఏదైన ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే సదరు యజమాని జరిమానాతో పాటు శిక్షార్హులుగా తెలిపారు. అజయ్రాజుకు సత్కారం ఉంగుటూరు: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హెచ్.అజయ్రాజును ఆర్జేడీ, జిల్లా వృత్తి విద్యాధికారి బి.ప్రభాకరరావు అభినందించారు. శుక్రవారం నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 75 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 6వ, రెండో సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచిందన్నారు. అజయ్రాజుకు అడ్వకేట్ కూన కృష్ణారావు (ఏలూరు) రూ.2 వేల నగదు పారితోషికం అందించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. నేత్రపర్వం.. ఏకాదశి ఉత్సవం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఏకాదశి ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి వేడుకగా నిర్వహించారు. క్షేత్ర పురవీధుల్లో తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. పూజాదికాలను జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. అడుగడుగునా భక్తులు శ్రీవారికి నీరాజనాలను సమర్పించారు. హోం ఓటింగ్పై అవగాహన ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పలు రూపాల్లో ఏర్పాట్లు చేసిందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి రాకాడ మణి అన్నారు. శుక్రవారం స్థానిక సీనియర్ సిటిజన్ భవనంలో సీనియర్ సిటిజన్లకు హోమ్ ఓటింగ్పై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీనిలో భాగంగా ఫారం–12డీ, ఫారం–13సీ పై అవగాహన కల్పించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయీస్ స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు తెలిపారు. 8లో uఅభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టండి ఎమ్మెల్యే కొఠారు దెందులూరు: గత ఐదేళ్లలో సీఎం జగన్ పాల నలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గత చంద్ర బాబు హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాత్రి పెరుగ్గూడెం గ్రామంలో ఆయన ఎన్ని కల ప్రచారం చేశారు. ప్రజలందరి బాగు కో సం సీఎం జగన్ నవరత్నాల పథకాలతో పా టు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమం అందిస్తారన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్కుమార్ యాదవ్కు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, సర్పంచ్ యలమర్తి రేవతి, కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నల్లూరి వెంకట్రామయ్య (బాబి), పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు యలమర్తి సత్తిబాబు, ఎంపీటీసీ యలమర్తి బాపూజీ, పార్టీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని, నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ వర్తించదా
దెందులూరు: దెందులూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఎన్నికల కోడ్ అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రస్తుతం కోడ్ అమలులో ఉన్నా మూసివేయకుండా అధికారులు అలాగే వదిలివేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఇక్కడి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని కొన్ని గ్రామాల్లో నేటికీ టీడీపీ శిలాఫలకాలు, బోర్డులకు ముసుగు వేయకుండా అలాగే వదిలివేశారని, అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాద్ విలేకరులకు చెప్పారు. -
ఉప్పొంగిన జనగోదావరి
మేమంతా.. మీ వెంటే.. తేతలిలో అభిమానుల సందడిరావులపాలెం.. జన సంద్రం.. రావులపాలెంలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్●సాక్షి, భీమవరం: జననేత జనాదరణ ముందు మండు వేసవి చిన్నబోయింది.. ఓ వైపు నిప్పుల కొలిమిని తలపిస్తూ ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు వేడిసెగలు కక్కుతున్న జాతీయ రహదారి.. సంక్షేమ సారథిని చూసేందుకు పోటెత్తిన జనాభిమానం ముందు ఇవన్నీ వెలవెలబోయాయి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదారిని తలపిస్తూ దిగ్విజయంగా ముగిసింది. ఒకరోజు విరామం తర్వాత శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బుధవారం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తణుకు మండలం తేతలి వద్ద రాత్రి బస క్యాంపు నుంచి గురువారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అప్పటికే వేడిగాలులతో సూర్యప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఎం జగన్ను చూ సేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు క్యాంపు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సీఎం జగన్ వారందరినీ చూసి బస్సు ఆపి బయటకు వచ్చి అభివాదం చేస్తూ, పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ‘ప్లీజ్ హెల్ప్’ అంటూ ప్లకార్డులతో ఉన్న మహిళలను చూసి.. వారితో మాట్లాడారు. తేతలి సెంటర్, తణు కు వై.జంక్షన్, శర్మిష్ట్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై.జంక్షన్ మీదుగా బస్సు యాత్ర సా గింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు ఆయా కూడళ్ల వద్దకు చేరుకుని జననేత రా క కోసం ఎదురుచూశారు. బస్సులోని సీఎం జగన్ ను చూసి జై జగన్, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సైతం జనం ఉన్న ప్రతిచోటా బస్సు ఆపి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే వారి వినతులపై తక్షణమే స్పందిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సత్వరమే స్పందించి.. పక్షవాతంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల చిన్నారికి పింఛన్ ఇప్పించాలని వడ్డూరుకు చెందిన తల్లి కో రగా, తేతలిలో జన్యుపరమైన సమస్యలతో బాధడుతున్న నరసింహ అనే దివ్యాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్ రూ.5 వేలు చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కోరారు. ఆయా వినతులపై వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సిద్ధాంతం.. ఘన స్వాగతం గోదావరి వశిష్ట వారధి (సిద్దాంతం బ్రిడ్జి) సమీపంలో ఆచంట నియోజకవర్గం దొంగరావిపాలెం వద్ద ఎమ్మెల్యే, ఆచంట అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ప్రజలు ఘ నంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ బయటకు వచ్చి వారిని పలకరించారు. దొడ్డివారిపాలెంకు చెందిన రవికుమార్ రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని, సిద్ధాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి వేండ్ర మోహనరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెనుగొండకు చెందిన విద్యార్థి మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్ ట్రై స్కూటీ, జగనన్న విద్యాదీవెన కోసం అభ్యర్థించగా ఆయా వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తన సిబ్బందికి సూచించారు. అనంతరం వశిష్ట వారధి దాటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి యాత్ర ప్రవేశించడంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బస్సు యాత్రలో మంత్రి, తణుకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల సీఎం జగన్ పక్కన ఉన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ను స్వయంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సమస్యను సావధానంగా విని సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. నాకు ట్రైస్కూటీ మంజూరు చేయమని, జగనన్న విద్యాదీవెన ఆఖరి విడత నిలిచిపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. – మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్, పెనుగొండ సావధానంగా విన్నారు కొబ్బరి బొండాల వ్యాపారంలో తీవ్రంగా నష్ట పోయానని, ఆర్థికంగా చితికి పోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్కు విన్నవించుకున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. ఆయన నా సమస్యను సావధానంగా విని భరోసా ఇచ్చారు. – వేండ్ర మోహనరావు, సిద్ధాంతం అడుగడుగునా అమితాదరణ సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన జాతీయ రహదారిపైకి పోటెత్తిన జనం జై జగన్ నినాదాలతో మార్మోగిన హైవే ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర -
బస్సు యాత్ర విజయవంతం
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరంలో సిద్ధం సభ జనసంద్రమైందని, బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అ వ్వాతాతలు, యువత, చిన్నారులు, మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి సీఎం జగన్కు అభివాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయన్నారు. రాజకీయంగా ఇంతటి ప్రజాదరణ పొందిన సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. బస్సుయాత్ర, సిద్ధం సభలతో వెన్నులో వణుకు పుడుతున్న చంద్రబాబు అండ్కో దాడులకు దిగుతున్న పరిస్థితుల్లో సైతం జగన్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి కారుమూరి కృతజ్ఞతలు చెప్పారు. యాత్ర సాగిందిలా.. పశ్చిమగోదావరి జిల్లా తేతల్లిలో రాత్రి బస క్యాంపు నుంచి సీఎం జగన్ తణుకు, సిద్దాంతంమీదుగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, జొ న్నాడ జంక్షన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూలస్థానం క్రాస్, చెముడులంక, మడికి జంక్షన్, పొట్టిలంకకు చేరుకున్నాక బస్సు యాత్ర భోజన విరామానికి కొద్దిసేపు ఆగింది. సా యంత్రం వేమగిరి జంక్షన్, ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా, బొమ్మూరు సెంటర్ రాజ మండ్రి సిటీ ముఖద్వారం మోరంపూడి జంక్షన్ కు సాయంత్రం 5.34 గంటలకు సీఎం జగన్ చే రుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి నగరంలోకి యాత్ర ప్రవేశించింది. మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట, షెల్టన్ సెంటర్, దేవీచౌక్, పేపరు మిల్లు, కాతేరు గామన్ బ్రిడ్జి, ది వాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రా జాపురంలో రాత్రి బస క్యాంపునకు చేరారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన కూటమి నేతలు
తాడేపల్లిగూడెం అర్బన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీలోకి కూటమి నేతలు వలసలు కొనసాగుతున్నాయి. గురువారం పలు చోట్ల టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన గమిని సుబ్బారావు గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గమినిని మంత్రి కొట్టు వైఎస్సార్ సీపీ కండువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ వైస్ చైర్యన్, వ్యాపారవేత్త గమిని సుబ్బారావు వైఎస్సార్ సీపీలో చేరడం శుభసూచకమన్నారు. ఆర్యవైశ్యులు ప్రశాతంగా వ్యాపారాలు చేసుకోవాలి, అందరితోను స్నేహంగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వెళతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. ఇది చూసిన కూటమి నేతలు అయోమయంలో ఉన్నారన్నారు. గమని సుబ్బారావు మాట్లాడుతూ వైఎస్సార్సిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై జగన్ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. ప్రజల భవిష్యత్తు జగన్మోహనరెడ్డి అని సుబ్బారావు అన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ గమని సుబ్బారావు వంటి వ్యక్తులు వైఎస్సార్సిపిలోకి చేరడం సంతోషకరమన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: సీఎం వైఎస్ జగన్ పాలన మెచ్చే ఇతర పార్టీల నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గూడాల గోపి అన్నారు. పాలకొల్లులో గురువారం 18వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 25 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి గుడాల గోపి వైఎస్సార్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు ఇన్చార్జి రామాంజుల పెద్దమదు, ఖండవల్లి వాసుల సమక్షంలో పసుపులేటి రమేష్, పసుపులేటి సుధ, పసుపులేటి జాన్,కొండేటి హనోక్, పసుపులేటి దివ్య, పసుపులేటి రాజేష్, కౌంజు మరేష్, కొల్లి పాప, బెజవాడ లక్ష్మీ, కంకిపాటి శ్రీదర్, వడ్లపాటి పల్లంరాజు, తెన్నేటి రాజేష్బాబు, తానేటి బ్రూస్రామ్, కానూరి రమణ, అనపర్తి రవిబాబుల కుటుంబ సభ్యులు వైఎస్సార్ పార్టీలో చేరారు. సంచారజాతుల కార్పోరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, యడ్ల తాతాజీ, గుమ్మాపు వరప్రసాద్, పాలపర్తి కృపానాథ్, సనమండ సురేష్, పసుపులేటి వీరాస్వామి, రామాంజు చిన్నమధు, కె.జక్కరయ్య, ఎం.జయరావు పాల్గొన్నారు. గుండుగొలనులో.. భీమడోలు: గుండుగొలనుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ భీమడోలు మండల ఇన్చార్జి పుప్పాల కార్తీక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గ్రామాన్ని అభివృద్ధి చేశారని, సొంతింటి కలను సాకారం చేశారన్నారు. అనంతరం పుప్పాల కార్తీక్ సమక్షంలో టీడీపీకి చెందిన వెలగల కృష్ణ, పి.సతీష్, పి.ప్రసాద్, రెడ్డి ప్రసాద్, విశాఖ పవన్, విశాఖ రంగ, గోంగాడ శివ, గుమ్మడి దుర్గారావు, ఆళ్ల దుర్గారావు, ఆళ్ల హేమంత్ తదితరులకు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ను గెలిపించేందుకు యుద్ద సైనికుల్లా పని చేయాలని కార్తీక్ వారిని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదుండి సూర్యనారాయణరాజు, నాయకులు జహీర్, పసుపులేటి శ్రీను, వార్డు సభ్యుడు గొటికల మురళీ, నాయకులు నల్ల శ్రీను పాల్గొన్నారు. -
వ్యయ పరిశీలకుల రాక
ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పి.కీర్తి నారాయణ్, షెరింగ్ జోర్డన్ భూటియా, మేశ్రామ్ గౌరవ్ మధుకర్ గురువారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారికి స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. జిల్లా లోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖర్చుల అంచనా వివరాలు, రికార్డులు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను వ్యయ పరిశీలకులు పరిశీలించారు. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, సీ–విజిల్, సోషల్ మీడియా, కాల్ సెంటర్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ విధానం, వ్యయ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్–రిడ్రెసల్ సెల్ తదితర విభాగాల గురించి కలెక్టర్ వారికి వివరించారు. కంట్రోల్ రూమ్ సేవలపై వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్వో డి.పుష్పమణి, కలెక్టరేట్ ఏఓ కె.కాశీవిశ్వేశ్వరరావు, ఎన్నికల నోడల్ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది ఉన్నారు. తనిఖీల్లో రూ.5 లక్షల నగదు స్వాధీనం ఏలూరు (మెట్రో): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న క్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ముక్కంటి వెల్లడించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో ఎఫ్ఎస్టీ టీమ్ జరిపిన తనిఖీల్లో రూ.5 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఒకచోట లక్ష రూపాయలు, మరో చోట రూ.4 లక్షలు సీజ్ చేశారన్నారు. స్వాధీన పరచుకున్న నగదును జిల్లా ట్రెజరీకి అప్పగించామన్నారు. నగదు తీసుకువెళ్ళే సమయంలో సంబంధిత పత్రాలు లేదా ఆధారాలను తమతో ఉంచుకోవాలని వాహనాల యజమానులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు రూ.50 వేల కంటే ఎక్కువ తరలిస్తే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆధారాలను చూపితే స్వాధీనం చేసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చివేస్తామన్నారు. -
విద్యార్థులకు నైతిక విలువలు అవసరం
తాడేపల్లిగూడెం: విద్యార్థులకు నైతిక విలువలు అవసరం అని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.జానకీరామ్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల 18వ వార్షికోత్సవం గురువారం రాత్రి జరిగింది,. వీసీ మాట్లాడుతూ విద్యార్ధులు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. ఈ సందర్బంగా యూట్యూబ్లో వర్చువల్ క్లాస్రూమ్ను ప్రారంభించారు. కళాశాల మ్యాగజైన్ సౌగంధిని ఆవిష్కరించారు. ప్రతిభ చూపిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. వర్సిటీ అధికారులు పద్మావతమ్మ, సలోమి, మాధవి, తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతానికి కూలీ మృతి ఉండి: రొయ్యల పట్టుబడికి వెళ్లిన ఓ కూలీ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి కాళింగపేటకు చెందిన సింగూరి నాగరాజు (40) మరో ఎనిమిది మందితో కలిసి గురువారం చిలుకూరులోని గుగ్గిలపు శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన చెరువులో రొయ్యల పట్టుబడికి వెళ్లాడు. రొయ్యలు పట్టుబడి చేస్తున్న సమయంలో చెరువు గట్టుపై ఉన్న విద్యుత్ ఎర్త్వైర్ పైపును పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుని భార్య మంగ ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
22, 23 తేదీల్లో గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు బాలురకు పెదవేగి గురుకుల పాఠశాలలో ఈనెల 22న, బాలికలకు పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి యన్.భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెదవేగి, చింతలపూడి, ఆరుగొలను, నరసాపురం, న్యూ ఆరుగొలను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న బాలికలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల పెదవేగిలో ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని కోరారు. పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఆచంట గురుకుల బాలుర పాఠశాలల్లో చేరేందుకు పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఈ నెల 23న ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఇప్పటికే ఆన్లైన్ విధానంలో సీట్ల భర్తీ జరిగినట్లు తెలిపారు. మెరిట్తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే ద్యార్థులు ప్రవేశపరీక్ష హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాలుగో తరగతి స్టడీ సర్టిఫికెట్, ఆధార్ వెంట తీసుకురావాలని సూచించారు. బాలురకు సంబంధించి ఎస్సీ–48, బీసీ–7, బీసీ (సీ)–26, ఎస్టీ–14, ఓసీ–1 కలిపి మొత్తం 96 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. బాలికలకు సంబంధించి ఎస్సీ–36, బీసీ–7, బీసీ(సీ)–31, ఎస్టీ–12, ఓసీ–1 కలిపి మొత్తం 87 సీట్ల ఖాళీలు ఉన్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఎన్.భారతి వివరించారు. -
నేటి నుంచి బాస్కెట్బాల్ అంతర్ జిల్లా పోటీలు
నూజివీడు: పట్టణంలోని బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఏపీ స్టేట్ 9వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలుర, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు బాస్కెట్బాల్ కోచ్ వాకా నాగరాజు గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన బాస్కెట్బాల్ జట్లు పాల్గొంటాయన్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ఈ పోటీలను బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్, విక్టోరియా పురమందిరంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
నామినేషన్లసందడిషురూ
తొలిరోజు పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఆరు ఏలూరు (మెట్రో): నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన మొదటి రోజు ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంట్కు ఒకటి, అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున మెండెం సంతోష్ కుమార్ తన నామినేషన్ను కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్కు అందజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), దెందులూరు నియోజకవర్గానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఆలపాటి నరసింహమూర్తి, పోలవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ నుండి చిర్రి బాలరాజు, గోండ్వానా దండకారణ్య పార్టీ నుంచి మడకం వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముద్దరబోయిన రాధిక నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు, చింతలపూడి, కై కలూరు నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు కాలేదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏలూరు జిల్లాలో ఆరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమలో రాజకీయ సందడి తారాస్థాయిలో ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం, పాదయాత్రలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తొలిరోజు ఏలూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తాలు చూసుకుని.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగనుంది. పార్లమెంట్ అభ్యర్థులు ఆయా జిల్లాల కలెక్టర్లకు, అసెంబ్లీ అభ్యర్థులు తహసీల్దార్ కార్యాలయాల్లోని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించాలి. అధికార వైఎస్సార్ సీపీతో పాటు ప్రతిపక్ష కూటమి పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. నేడు భారీగా నామినేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు తణుకు నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆచంట నుంచి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం నుంచి చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నుంచి ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, ఉండి నుంచి పీవీఎల్ నర్సింహరాజు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. ఏలూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దెందులూరు నుంచి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. అలాగే పశ్చిమలో కూటమి అభ్యర్థులుగా టీడీపీ నుంచి పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 25 వరకు నామినేషన్ల సందడి ● 20న చింతలపూడి వైఎస్సార్సీపీ అభ్యర్థి కంభం విజయరాజు, 22న కై కలూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్, నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, ఉండి టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు (అభ్యర్థిత్వం ఖరారు అయితే) నామినేషన్లు వేయనున్నారు. ● 23న నూజివీడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప అప్పారావు, కై కలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి, ఉంగుటూరు జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ● 24న పోలవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి, పాలకొల్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి నామినేషన్లు వేయనున్నారు. ● 25న తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం తొలిరోజు ఏలూరు జిల్లాలో 6, పశ్చిమలో ఒకటి దాఖలు ఏలూరు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆళ్ల నాని నేడు రెండు జిల్లాల్లోనూ భారీగా నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు -
24,385 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జేసీ బి.లావణ్యవేణి వెల్లడి ఏలూరు (మెట్రో): ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 2,038 మంది రైతులకు చెందిన 24385.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 5,497 మంది రైతులకు చెందిన 50,878 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించుకునేందుకు నమోదు చేసుకున్నారన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులతో షెడ్యూలింగ్ చేసే టెక్నికల్ సహాయకుని ద్వారా నమూనాలను సేకరించి తేమ శాతం, ఇతర నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన 67.16 లక్షల గోనె సంచులను, 200 పైగా జీపీఎస్ పరికరం రవాణా వాహనం నేటి వరకు సమకూర్చామన్నారు. మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ధాన్యం కొనుగోలు ఫిర్యాదులు స్వీకరించుటకు జిల్లాస్ధాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812–230448, 77020 03584, 75695 62076, 75695 97910 ఏర్పాటు చేశామన్నారు. తేమ శాతం 16 నుంచి 17 వరకు ఉండేలా చూసుకుని ధాన్యంలో తాలు, తప్పలు మొదలైన వ్యర్ధాలు గరిష్టంగా 1 శాతం మించకుండా ఉండాలన్నారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు కామన్ రకం రూ.2,183, గ్రేడ్–ఎ రకం రూ.2,203 అందిస్తున్నామని జేసీ చెప్పారు. పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ కామవరపుకోట: ఓ బాలికను ప్రేమించానని మోసం చేసిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తడికలపూడి ఎస్సై జయ బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావికంపాడు గ్రామపంచాయతీ, వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతి ఏలూరులో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బొబ్బిలి లీలాకిరణ్ అనే యువకుడు ఏడాది నుంచి బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి గత సంక్రాంత్రి సెలవులకు ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, లీలాకిరణ్ నిరాకరించాడు. దీంతో తాను మైనర్గా ఉన్నప్పుడు లీలాకిరణ్ తనను లోపరుచుకున్నట్లు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
రంగనాథరాజు తరపున తనయుడి ప్రచారం
పెనుగొండ: ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పెనుగొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే తనయుడు నరేష్ రాజు అన్నారు. బుధవారం పెనుగొండలోని చెరుకువాడ బైపేవారి పేట, అంబేడ్కర్ కాలనీ, కోటిపల్లివారి వీధి, మంగెన వారి వీధిల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం మరింత జరగాలంటే రెండు ఓట్లూ ఫ్యాన్ గుర్తుపైనే వేయాలని కోరారు. ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు(పెద్ద), పంచాయతీ సభ్యురాలు మానుకొండ నీలిమా సునీల్, ఎంపీటీసీలు మద్ధింశెట్టి లక్ష్మీ, తాడి సుబ్బిరెడిల్డు, మండల కన్వీనర్లు పలివెల శ్రీను, బాలం సత్తిరాజు, సుంకర నాగబాబు, పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి పవన్, పార్టీ నాయకులు గండ్రోతు రాజేష్, పోడూరి రామయ్య పాల్గొన్నారు. -
యాదవులు ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర పోషించాలి
కై కలూరు: శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో పాండవులను ధర్మం వైపు ఏ విధంగా నడిపించారో అదే విధంగా సార్వత్రిక ఎన్నికల్లో యాదవులు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని యాదవ ప్రముఖులు పిలుపునిచ్చారు. నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమావేశం కైకలూరులో బుధవారం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ స్థానికంగా ఉండే వ్యక్తి కాదన్నారు. జనసేన నుంచి వైఎస్సార్సీపీలో సీఎం సమక్షంలో చేరిన బీవీ రావు మాట్లాడుతూ జగన్ మాత్రమే బీసీలకు అన్నిట్లో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషన్ చైర్మన్ యనమల సాయి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ మరో పర్యాయం సీఎం జగన్ను గెలిపించుకుంటే బీసీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ యాదవులు వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. అనంతరం సెల్ఫోన్లో మంత్రి కారుమూరి తన బిడ్డ సునీల్కుమార్ యాదవ్ను ఆశీర్వదించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ చేబోయిన వీరరాజు, టీటీడీ బోర్డు సభ్యులు నెరుసు నాగసత్యం, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ బొర్రా సత్యవతి, భట్రాజు శివాజీ, శీలం రామకృష్ణ, గంగుల అశోక్ పాల్గొన్నారు. 22 నుంచి వేసవి శిక్షణ శిబిరం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా యోగాసన అసోసియేషన్, సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిబిరంలో యోగ, ధ్యానం, డ్రాయింగ్, సింగింగ్, పద్యాలు, శ్లోకాలు, కాగితాలతో బొమ్మలు చేయడం, డ్రామా అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఇతర వివరాలకు 9885567789 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
పీడీ యాక్ట్ కింద నలుగురి అరెస్టు
జంగారెడ్డిగూడెం: పదే పదే నేరాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన నలుగురు నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ యు.రవిచంద్ర బుధవారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణం, పరిసర గ్రామాల్లో చట్టంపై గౌరవం లేకుండా పదే పదే నేరాలకు పాల్పడుతూ నేరప్రవృత్తిని కలిగి, తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించామన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు వీరిని ఆంధ్రప్రదేశ్ అక్రమ సారాదారులు, బందిపోట్లు, మాదకద్రవ్యాల నేరస్తులు, గూండాలు, భూఆక్రమణదారులు, డబ్లింగ్ కరెన్సీ తదితర అపాయకర కార్యకలాపాల నిరోధక చట్టం (పీడీ యాక్ట్) కింద వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరైస్టెన వారిలో పట్టణానికి చెందిన కోడూరి రవితేజ (ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం), కోన శ్రీనివాస్ అలియాస్ పెప్పీ నాని, మద్దిపాటి కల్యాణ్, షేక్ నాగూర్ మీరావల్లీ అలియాస్ బబ్లూ ఉన్నారు. కోడూరి రవితేజపై ఏలూరు, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లలో మొత్తం 13 కేసులు, కోన శ్రీనివాస్పై జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, ఏలూరు, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లలో మొత్తం 9 కేసులు, మద్దిపాటి కల్యాణ్పై జంగారెడ్డిగూడెం, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లలో మొత్తం 10 కేసులు, షేక్ నాగూర్ మీరావల్లీపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, నల్లజర్ల పోలీస్స్టేషన్లలో మొత్తం 4 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నలుగురితో పాటు మరికొంతమంది కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 21న నల్లజర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 3.5 కేజీల బంగారు ఆభరణాలు, కొంత నగదును ఒక బంగారు వ్యాపారిని అడ్డగించి దోచుకున్నారని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో ప్రస్తుతం వీరు ఏలూరు జైలులో రిమాండ్లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ పి.రాజేష్, ఎస్సై పి.జ్యోతిబాస్ పాల్గొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడి -
కూటమివి అన్నీ బూటకపు మాటలే
రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ద్వారకాతిరుమల : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చెబుతున్న బూటకపు మాటలను ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని పి.కన్నాపురం, శరభాపురం, సత్తాల, సండ్రకుంట, తక్కెళ్లపాడు, గుణ్ణంపల్లి, మహదేవపురం గ్రామాల్లో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రి వనితకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. పి.కన్నాపురంలోని రామాలయాన్ని సందర్శించి, సీతారాములకు పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రచారంలో ఆమె మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడూ పేదలను పట్టించుకోలేదన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు జనసేన, బీజేపీలను కలుపుకుని ప్రజలకు మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా జగనన్నను ఢీకొట్టే మగాడే లేడని ఆమె గళమెత్తారు. జగనన్న ఐదేళ్ల పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భవిష్యత్తులో మరింత సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాలన్నారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే వారు చేసే అరాచకాలకు అడ్డూ, అదుపు ఉండదన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని ఓడించాలన్న తపనే తప్ప, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం కూటమికి ఏమాత్రం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మన పేదల పార్టీని గెలిపించుకుని, మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందామన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబు, ఎంపీపీ బొండాడ మోహిని, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, సర్పంచ్లు దాసరి సుబ్బలక్ష్మి, కొండాబత్తుల సుభద్ర, పెద్దిన దిలీప్, నున్న పద్మ, కొప్పిశెట్టి గంగ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, మానుకొండ కన్నయ్య, చెరుకూరి ప్రసాదరావు, వామిశెట్టి పరమేశ్వరరావు, ఆచంట సురేష్, కారుమంచి రమేష్, దాసరి రాంబాబు, కుక్కల గట్టియ్య, తోలేటి వెంకట సుబ్బయ్య తదితరులున్నారు. మేమంతా సిద్ధం సభలతో కూటమి నేతల్లో వణుకు భీమవరం: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తుంటే కూటమి నేతల వెన్నుల్లో వణుకు పుడుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. బుధవారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు జీర్ణించుకోలేక డబ్బులిచ్చి తీసుకువస్తున్నారని చిల్లర జనమంటూ అవాకుచవాకులు పేలడం దుర్మార్గమన్నారు. మరోసారి వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారని మంగరాజు స్పష్టం చేశారు. -
బీవీ రావు రాకతో ఉత్సాహం
కై కలూరు: కై కలూరు జనసేన పార్టీ ఇన్చార్జిగా సే వలు అందించి సీటు కోసం ప్రయత్నించి భంగపడిన నియోజకవర్గ జనసేన నేత బుసనబోయిన వెంకటేశ్వరరావు (బీవీ రావు) వైఎస్సార్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఎ మ్మెల్సీ జయమంగళ వెంకటరమణల ఆధ్వర్యంలో చేరిక జరిగింది. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్ ఆయనతో పాటు ఉన్నారు. విజయమే లక్ష్యంగా పనిచేస్తానని బీవీ రావు అన్నారు. -
నూజివీడులో ఎమ్మెల్యే కుమారుడి ప్రచారం
నూజివీడు: చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటు వేసి కష్టాలు తెచ్చుకోవద్దని వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) అన్నారు. పట్టణంలోని 29వ వార్డులో బుధవారం రాత్రి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల సంక్షేమానికి, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడ్డారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రతాప్ అప్పారావు వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీ తరుపున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావును, కారుమూరి సునీల్కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ, పార్టీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యన్నారాయణ, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కోటగిరి పూర్ణిమ, క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు పిళ్లా చరణ్ పాల్గొన్నారు. -
No Headline
సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 16వ రోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ దారిలో ముందురోజు నుంచే పండగ వాతావరణం కనిపించింది. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు బస్సుయాత్ర సాగే రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జగన్ రాక కోసం ఎదురుచూడటం కనిపించింది. అడుగడుగునా బస్సు ఆపి చిన్నారులు, వృద్ధులు, మహిళలు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ.. సీఎం జగన్ ముందుకు సాగారు. వేయి కళ్లతో ఎదురుచూసి.. భీమవరం బహిరంగ సభ అనంతరం రాత్రి తేతలి లో రాత్రి బస క్యాంపునకు సీఎం జగన్ చేరుకున్నా రు. రాత్రి 8 గంటలకు తేతలి వద్దకు చేరుకోవాల్సి ఉండగా వెల్లువెత్తిన జనప్రవాహంతో పర్యటన రెండు గంటల ఆలస్యంగా సాగింది. అయినా ఆయన రాక కోసం ఊళ్లకు ఊళ్లే రోడ్లపైకి వచ్చాయి. చిన్నాపెద్దా అంతా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లకు చేరుకుని జననేత కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. పలు కూడళ్ల వద్ద సీఎం జగన్ బస్సుపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేస్తూ వారిలో ఉ త్సాహం నింపారు. జగన్ బాబు నన్ను పలకరించారని, ఆరోగ్యం జాగ్రత్తని చెప్పానని వృద్ధులు, జగనన్నతో సెల్ఫీ తీసుకున్నానంటూ యువతీ యువకులు, నాకు నుదుటన ముద్దుపెట్టారంటూ చిన్నారులు, సమస్యను ఆలకించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఫోన్ చేయమని నంబర్ ఇచ్చారంటూ అర్జీదారులు సంభ్రమాశ్చర్యాలకు గురికావడం దారిపొడవునా కనిపించింది. గాయాన్ని చూసి చలించిన హృదయాలు హత్యాయత్నం ఘటనలో సంక్షేమ సారథి నుదుటన అయిన గాయాన్ని చూసి చలించని హృదయం లేదు. జిల్లావాసులతో పాటు కర్నూలు, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి అభిమానులు తరలివచ్చి దారిలో ఆయన్ను పలకరించి వెళ్లారు. మా కోసం కష్టపడుతున్న మీకు ఎంత ఆపద వచ్చిందంటూ వృద్ధులు ఆవేదన చెందారు. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా ఉంటాయని, దాడిచేసిన దుర్మార్గులకు దేవుడే తగిన శాస్తి చెస్తాడంటూ ధైర్యం చె ప్పారు. గాయం త్వరగా నయం కావాలని వృద్ధులు, ఆరోగ్యం జాగ్రత్త అన్న అంటూ మహిళలు ఆప్యాయత చూపించారు. వినూత్న ప్ల్లకార్డులతో.. బస్సు యాత్రతో పాటు భీమవరం బహిరంగ సభలో అభివృద్ధి ప్రధాతపై వినూత్న ప్ల్లకార్డులను ప్రదర్శిస్తూ యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిద్ధం.. ఇకపై యుద్ధం, మ్యాన్ ఆఫ్ మాస్, ఏపీ కింగ్, రాజ్యం మాదే.. పాలన మాదే, కింగ్ ఆఫ్ ఆంధ్ర, పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు అంటూ యువత ప్రదర్శించిన ప్ల్లకార్డుల చిత్రాలతో ‘వెస్ట్గోదావరి ఫ్యానిజం అంటే మినిమం ఉంటాదంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. కూటమి ఆశలపై నీళ్లు చల్లుతూ జిల్లాలో బస్సుయాత్ర విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. సీఎం జగన్ బస్సు యాత్ర, బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల్లో వణుకు పుట్టింది. వైఎస్సార్సీపీలో నవోత్సాహం సీఎం జగన్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ వెల్లువలా తరలివచ్చిన జనం మండుటెండను లెక్కచేయని వైనం జననేత కోసం ఎదురుచూసిన ఊళ్లు రెట్టించిన ఉత్సాహంలో పార్టీ శ్రేణులు -
ప్రచారంలో వైఎస్సార్ సీపీ దూకుడు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ దూసుకెళుతోంది. ఓ వైపు అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరికీ రెండు ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఓటర్లను కోరుతున్నారు. సీఎం వైఎస్ జగనపాలనలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓట్లు అభ్యర్థించిన మంత్రి కొట్టు తనయుడు తాడేపల్లిగూడెం అర్బన్: జగన్ సంక్షేమ పాలన కోరుకునే వారందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు రాజేష్ అన్నారు. తాడేపల్లిగూడెం 12వ వార్డులో రాజేష్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ తన త్రండి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉంటేనే తాడేపల్లిగూడెంలో రౌడీయిజం, గుండాయిజం అదుపులో ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఓట్లు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణను గెలపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ 12వ వార్డు ఇన్చార్జి చామన సూర్యచంద్రరావు, కోడే శ్రీను, బోణం విజయనిర్మల ఉన్నారు. పాలకొల్లు అర్బన్: పేదల బాగు కోసం కృషి చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని, వైఎస్సార్ సీపీతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. పాలకొల్లు 12, 16 వార్డుల్లో బుధవారం గుడాల గోపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పెద్దలను ఆశీర్వదించాలని కోరారు. విద్య, వైద్య రంగాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వేలాది కోట్లు వ్యయం చేసి పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చారన్నారు. వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకు పాలన అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎం జగన్ను మరోసారి సీఎం చేయాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తానన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఇంటి స్థలాలు మెరక, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయకుండా ఇలా ప్రతి అభివృద్ధి పనిలో అడ్డుతగిలిన ఎమ్మెల్యే నిమ్మలను ఇంటికి సాగనంపాలని కోరారు. టీటీడీ పాలక మండలి సభ్యులు మేకా శేషుబాబు, వైఎస్సార్ సీపీ చింతలపూడి పరిశీలకులు గుణ్ణం నాగబాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, మండల పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత చిట్టూరి ఏడుకొండలు, పార్టీ నాయకులు గుణ్ణం సర్వారావు, వీరా శ్రీనివాసరావు, కుంచిలపల్లి వినిస్టన్బాబు, మద్దా చంద్రకళ, కర్రా జయసరిత పాల్గొన్నారు. -
ఓటు వేయడం అందరి బాధ్యత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కుతో పాటు బాధ్యత అని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. పోలింగ్ శాతం పెంపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు హోమ్ ఓటింగ్కు అవకాశం కల్పిస్తామన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గురువారం నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుందని, అదే రోజు తుది జాబితా వెల్లడిస్తామని ప్రకటించారు. మే 13న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, జూన్ 4న ఓట్ల లెక్కింపు, జూన్ 6తో ఎన్నికల కోడ్ ముగుస్తుందని షెడ్యూల్ వివరించారు. 16.34 లక్షల మంది ఓటర్లు : జిల్లాలో 16,34,187 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో కొత్త ఓటర్లు 42,995 మంది ఉన్నారని, అలాగే 85 ఏళ్లు పైబడిన వారు 8,489 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 1,744 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటిలో 415 క్రిటికల్, 1,022 పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఈనెల 15వరకు అందిన ఫాం–6 దరఖాస్తులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరిస్తామన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాల స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంలను పంపించామన్నారు. వాటికి పటిష్ట భద్రత కల్పించామన్నారు. నేటి నుంచి నామినేషన్లు : నామినేషన్ల దాఖలకు రిటర్నింగ్ అధికారి వద్దకు అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులకు అనుమతి ఉంటుందని, రిట ర్నింగ్ అధికారి కార్యాలయం పరిధిలో 100 మీటర్ల లోపు మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎక్కడెక్కడ దాఖలు చేయాలంటే.. ఏలూరు పార్లమెంట్కు సంబంధించి అభ్యర్థులు నామినేషన్ కలెక్టర్ చాంబర్లో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దెందులూరుకు దెందులూరు తహసీల్దార్ కా ర్యాలయంలో, పోలవరానికి కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయంలో, ఉంగుటూరుకి ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో, ఏలూరుకు ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో, చింతలపూడికి చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో, నూజివీడుకు నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయంలో, కైకలూరుకు కై కలూరు తహసీల్దార్ కార్యా లయంలో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. 8 చెక్పోస్టులు.. రూ.13.17 కోట్ల స్వాధీనం జిల్లాలో అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇప్పటివరకు రూ.13.17 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, సీజ్ చేశామని కలెక్టర్ తెలిపారు. తొలిసారిగా హోమ్ ఓటింగ్ నామినేషన్ల చివరి రోజు అనంతరం పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. 85 ఏళ్ల వయసు పైబడి వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కదలలేని స్థితిలో ఉన్నవారికి హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించామని కలెక్టర్ తెలిపారు. అలాగే అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారికి, ఎన్నికల వి ధుల్లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ రోజున పరిశ్రమల్లో పనిచేసే ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ముగ్గురు పరిశీలకులు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వ్యయ పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకుని చార్జ్ తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఐఏఎస్ స్థాయి అధికారులను మరో ఇద్దరు జనరల్ ఆబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించిందని, వారు ఈనెల 24న విధులకు హాజరవుతారన్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహణకు అనుమతులు తీసుకోవాలని, కార్యక్రమాలు పాఠశాలలు, మతపరమైన ప్రదేశాలలో నిర్వహించకూడదన్నారు. సమావేశంలో డీఆర్ఓ డి.పుష్పమణి ఉన్నారు. ఓటర్లు పురుషులు 7,97,807 మహిళలు 8,36,254 థర్డ్ జెండర్ 126 మొత్తం 16,34,187 పోలింగ్ శాతం పెంపునకు స్పెషల్డ్రైవ్ 85 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ జిల్లాలో 16.34 లక్షల మంది ఓటర్లు నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ -
సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి
జంగారెడ్డిగూడెం రూరల్: రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. మండలంలోని ఎ.పోలవరం, చిన్నవారిగూడెం గ్రామాల్లో బుధవారం విజయరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు హారతులిస్తూ విజయరాజుకి ఘన స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. విజయరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చారన్నారు. మున్ముందు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ్ బుద్దాల సీతారామరాజు, జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పార్టీ నాయకులు గురజాల పార్థసారథి, మల్నీడి బాబి, బెజవాడ నాగరాజు, బండారు వెంకట సుబ్బారావు, ముప్పిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఫ్యాన్స్లో ఫుల్ జోష్
● జగమంతా.. రామమయం సీతారాముల కల్యాణం.. చూసిన కనులదే భాగ్యం.. అన్నట్టుగా శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఊరూవాడా సీతారాముల కల్యాణోత్సవాలతో సందడి నెలకొంది. ద్వారకాతిరుమల క్షేత్రంతో పాటు ప్రముఖ ఆలయాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించారు. రథోత్సవాలు, అన్నసమారాధనలు జరిగాయి. – సాక్షి నెట్వర్క్ ఉండిలో మూడు చక్రాల సైకిల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’బస్సుయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదావరిని తలపించింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు మండుటెండను లెక్కచేయకుండా ఊళ్లకు ఊళ్లే రోడ్లపైకి వచ్చాయి. పొద్దుపోయినా వేచి ఉండి జన నీరాజనం పట్టాయి. జై జగన్ అంటూ నినదించాయి. యువత ప్రదర్శించిన ఫ్లకార్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిల్లాలో బస్సు యాత్ర, భీమవరం బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్జోష్ నింపగా, మరోపక్క కూటమి గుండెల్లో దడ పుట్టిస్తోంది. నేడు తణుకులో పర్యటన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం తణుకు నియోజకవర్గంలో జరుగనుంది. ఉదయం 9 గంటలకు తేతలిలోని నైట్ హాల్ట్ క్యాంపు వద్ద నుంచి బయలుదేరి తణుకు క్రాస్ మీదుగా సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటారు. నియోజకవర్గంలో యాత్ర విజయవంతానికి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
25న గురుకుల ప్రవేశ పరీక్ష
ముసునూరు: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు, ఏలూరు జిల్లా కన్వీనర్, ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, 5, 6, 7, 8 తరగతులు, ఏపీఆర్ఎస్ కాట్–2024 విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలకు వరకు ఏపీఆర్జేసీ, డీసీ సెట్–2024 విద్యార్థులకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, పోస్ట్ ద్వారా ఇంటికి పంపడం ఉండదని అభ్యర్థులకు ఆమె సూచించారు.