తాడేపల్లిగూడెం: విద్యార్థులకు నైతిక విలువలు అవసరం అని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.జానకీరామ్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల 18వ వార్షికోత్సవం గురువారం రాత్రి జరిగింది,. వీసీ మాట్లాడుతూ విద్యార్ధులు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. ఈ సందర్బంగా యూట్యూబ్లో వర్చువల్ క్లాస్రూమ్ను ప్రారంభించారు. కళాశాల మ్యాగజైన్ సౌగంధిని ఆవిష్కరించారు. ప్రతిభ చూపిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. వర్సిటీ అధికారులు పద్మావతమ్మ, సలోమి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతానికి కూలీ మృతి
ఉండి: రొయ్యల పట్టుబడికి వెళ్లిన ఓ కూలీ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి కాళింగపేటకు చెందిన సింగూరి నాగరాజు (40) మరో ఎనిమిది మందితో కలిసి గురువారం చిలుకూరులోని గుగ్గిలపు శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన చెరువులో రొయ్యల పట్టుబడికి వెళ్లాడు. రొయ్యలు పట్టుబడి చేస్తున్న సమయంలో చెరువు గట్టుపై ఉన్న విద్యుత్ ఎర్త్వైర్ పైపును పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుని భార్య మంగ ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment