అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయీస్ స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు తెలిపారు. 8లో u
అభివృద్ధి, సంక్షేమానికి
పట్టం కట్టండి
ఎమ్మెల్యే కొఠారు
దెందులూరు: గత ఐదేళ్లలో సీఎం జగన్ పాల నలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గత చంద్ర బాబు హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాత్రి పెరుగ్గూడెం గ్రామంలో ఆయన ఎన్ని కల ప్రచారం చేశారు. ప్రజలందరి బాగు కో సం సీఎం జగన్ నవరత్నాల పథకాలతో పా టు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమం అందిస్తారన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్కుమార్ యాదవ్కు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, సర్పంచ్ యలమర్తి రేవతి, కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నల్లూరి వెంకట్రామయ్య (బాబి), పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు యలమర్తి సత్తిబాబు, ఎంపీటీసీ యలమర్తి బాపూజీ, పార్టీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment