-
వెంటాడి వేటాడేసింది.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా పాపులర్ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి అట్లాంటాలో చోటు చేసుకుంది.వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్. ఒకరోజు గొర్రెలమందపై ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే ఉన్న కుక్క వాటిపై ఎటాక్ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.Atlanta Dog fights 13 coyotes attacking his sheep. Kills 8 on the spot. Goes missing 4 days. Comes home after killing the remaining 5. Salute 🫡 pic.twitter.com/OYDKhuzscW— trader (@TicTocTick) June 25, 2024ఇంతటితో దాని కోపం చల్లారలేదు. నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన ఐదు తోడేళ్ల పని కూడా పట్టింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని యజమాని వీర్విల్లే. ఆ తరువాత కొంతకాలం లైఫ్లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్టా,, ఎక్స్లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
వెయ్యి కుక్కలకు తల్లిగా..
-
Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!
అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలా అని యజమానులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెంపుడు శునకాలు, ఇతర పెంపుడు జంతువులను ఖననం చేయడం, దహన సంస్కారాలు చేయడానికో స్థలం లేక నగరజంతు ప్రేమికులు నరకయాతన అనుభవిస్తున్నారు.అపార్ట్మెంట్, విల్లా కల్చర్ వచ్చాక పెంపుడు శునకాలను ఖననం చేసేందుకు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో జీహెచ్ఎంసీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఎవరైనా తమ ఇంట్లో పెంపుడు కుక్క మృతి చెందితే దానికి గౌరవప్రదంగా అంతిమయాత్ర నిర్వహించడం, అంతకుమించి మర్యాదపూర్వకమైన దహన సంస్కారాలు చేయడం అందుబాటులోకి వచ్చిది. ఆ వివరాలు తెలుసుకుందాం.. – బంజారాహిల్స్నగరంలో జంతు ప్రేమికులు చాలా మందే ఉన్నారు.. వారు అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా శునకాలు, ఇతర జంతువులకు కూడా దహన సంస్కారాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పీపుల్ ఫర్ ఎనిమల్స్(పీఎఫ్ఏ) సంయుక్తంగా డోర్ టూ టూర్ క్రిమేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. పెంపుడు జంతువుల యజమానులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి. ఇంటికే వచ్చి మృతి చెందిన శునకాన్నో, ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందుకోసం పీఎఫ్ఏ ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ మృతదేహాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.2,500 దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్న పెట్ క్రిమేషన్ త్వరలోనే గాజుల రామారం, గోపన్పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.డిసెంబర్ 2022 నుంచే..ఫతుల్లాగూడలో ఈ సౌకర్యం 2022 డిసెంబర్ నుంచే అందుబాటులోకి వచ్చిది. చాలా మంది తమ ఇంట్లో కుక్కలు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ బాధపడుతుండటాన్ని గమనించిన పీఎఫ్ఏ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వలంటీర్లను కూడా నియమించింది.డయల్ చేయాల్సిన నంబర్లు.. జంతు ప్రేమికులు తమ ఇళ్లలో పెంపుడు శునకం మృతి చెందితే 73374 50643, 95055 37388 నంబర్కు ఫోన్ చేస్తే ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు క్రిమేషన్కు తీసుకెళ్తారు. దహన సంస్కారాల తర్వాత ఆ బూడిదను ప్రత్యేకంగా ఓ కుండీలో ఉంచి సంబంధిత యజమానులకు అందజేస్తారు. ఆ బూడిదను ఇళ్లలో ఉన్న మొక్కల వద్దకానీ, తమ స్వగ్రామాల్లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు, చెట్ల వద్ద అయినా పూడ్చిపెడితే సరిపోతుందని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ త్వరలోనే ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో కూడా పెట్ క్రిమటోరియంలను నిర్మించే ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. ఒక్క ఫోన్ చేస్తే.. చాలు.. ఎక్కడైనా పెంపుడు జంతువు మృతి చెందిందని యజమానులు ఫోన్ చేయగానే ఆ వలంటీర్లు అక్కడ వాలిపోతారు. క్రిమటోరియంకు ఆ శునకాన్ని తీసుకొచ్చి పూలదండలు వేసి సంప్రదాయబద్ధంగా దహనం చేస్తాం. అనంతరం భస్మాన్ని కుండల్లో భద్రపరిచి యజమానులకు అందిస్తున్నాం. గ్యాస్తో నడుస్తున్న ఈ క్రిమటోరియం వల్ల ఎలాంటి కాలుష్యం వెలువడదు. ఎవరికీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఈ క్రిమటోరియం నిర్మించడం జరిగింది.– వాసంతి వాడి, ఫౌండర్ ప్రెసిడెంట్ పీఎఫ్ఏగ్యాస్తో నడిచే క్రిమటోరియం...ప్రస్తుతం ఫతుల్లాగూడలో అనంతయాత్ర పేరుతో పెట్ క్రిమటోరియంను నిర్వహిస్తున్నాం. త్వరలో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రతి నెలా 25 వరకూ శునకాలకు మర్యాదపూర్వకమైన, సంప్రదాయబద్ధ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. మా వద్ద ఇందుకోసం అంబులెన్స్ను అందుబాటులో ఉంచాం. 14 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వలంటీర్లు కూడా అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్తో ఈ క్రిమటోరియం నిర్వహిస్తున్నాం. ఇకో ఫ్రెండ్లీ క్రిమటోరియంను నడిపిస్తున్నాం.– దత్తాత్రేయ జోషి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పీఎఫ్ఏరూ.80 లక్షలతో మహదేవ్పురం పెట్ క్రిమటోరియం..కూకట్పల్లి సమీపంలోని మహదేవ్పురం సిక్ బస్తీ దగ్గర రూ.80 లక్షల వ్యయంతో పెట్ క్రిమటోరియం నిర్మించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఏ ఎన్జీవోకు ఇవ్వాలన్నదానిపై టెండర్ పిలుస్తారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మంది జంతు ప్రేమికులకు తమ ఇంట్లో చనిపోయే పెంపుడు కుక్కల దహన సంస్కారాలు గౌరవ ప్రదమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.– డాక్టర్ ఎ.లింగస్వామి, వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ -
పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకులు మృతి
-
ఆ గ్రామంలో శునకాలే దైవంగా పూజలు..ఏకంగా ఏడాదికి ఒకసారి..!
మన దేశం ఆధ్యాత్మికత నెలవు. ఇక్కడ దేవుళ్లకు మాత్రమే కాదు, పాములకు, అభిమాన నటులకు, రాజకీయనాయకులకు గుడి కట్టించి మరీ పూజలు చేస్తుంటారు ప్రజలు. సాధారణంగా అందరం దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం వంటివి చేస్తాం. కానీ ఆ గ్రామంలో మాత్రం కుక్కలకు గుడికట్టి మరీ పూజలు చేస్తున్నారు. పైగా ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శునకాలను పూజించడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..కర్ణాటకలోని చన్నపట్న నగరంలో అగ్రహార వలగెరెహళ్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ నగరం చెక్క బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని 'బొమ్మల పట్టణం' అని పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఆలయాన్ని 2010 సంవత్సరంలో ధనవంతుడైన వ్యాపారి రమేష్ నిర్మించాడు. ఇలా కుక్కల కోసం ఆలయం కట్టడానికి గల కారణం..ఆలయం వెనుక చరిత్ర..గ్రామంలో ఎప్పుడూ తిరిగే రెండు శునకాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. అయితే ఇవి చనిపోయాయని గ్రామస్థులు అనుకున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలలో ఓ దేవత కనిపించి గ్రామస్థుల రక్షణ కోసం తప్పిపోయిన కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని తెలిపింది. ఆ గ్రామం కులదేవత కెంపమ్మ. ఆ దేవతే స్వయంగా కలలో కనిపించి గ్రామస్తుల రక్షణ కోసం కనిపించకుండా పోయిన కుక్కల కోసం దేవాలయాన్ని నిర్మించమని చెప్పింది. దీంతో వెంటనే గ్రామస్తులు ఇలా ఆ రెండు కుక్కలకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అంతేగాదు ఈ ఆలయంలో ప్రతీ ఏడాది భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో తప్పిపోయిన ఆ రెండు కుక్కల విగ్రహాలు ఉంటాయి. ఇవి గ్రామంలోకి ప్రతికూల శక్తి రాకుండా కాపాడతాయని అక్కడి గ్రామస్తులు నమ్మకం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటం.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్ టిప్
ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ సంరక్షణ ఇవన్నీ యజమాని బాధ్యత. పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం, మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.Tip for giving medication to dogs, dip the syringe in something they like 📹 igotthissitpic.twitter.com/6yCsPxmIMR— Science girl (@gunsnrosesgirl3) June 10, 2024ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్ వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్ చెక్-అప్లు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి. అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు ఒక పెద్ద టాస్క్అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు. మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్ నెట్లో ఆసక్తికరంగా మారింది. చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్ చేసినట్టే.. పెట్స్కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో మీరూ చూసేయండి. -
ప్రతీ కుక్కకీ ఒక రోజుంటది.. లక్ అంటే నీదేరా!
-
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్ కంపెనీ ‘థింకో ఎల్ఎల్సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్ మంచానికి రూపకల్పన చేసింది.దీని తయారీకి చైనీస్ కంపెనీ లావో ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్ స్మార్ట్ఫోన్కు అనుసంధానమై యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.యాప్ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ బెడ్ను ‘థింకో ఎల్ఎల్సీ’ జూన్ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.బీపీ చెకింగ్ స్మార్ట్వాచీలు..జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్ సెంటర్కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికన్ కంపెనీ వైహెచ్ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్ స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది.మిగిలిన స్మార్ట్వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్ను సులభతరం చేసిన ఈ స్మార్ట్వాచీ కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!ఇవి చదవండి: నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు.. -
జర్ర ఆగరాదే..! చాలా స్మార్ట్ గురూ!
-
పెట్స్తో శ్రీవల్లి ఫోటోలు.. విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్స్ కామెంట్స్!
గతేడాది యానిమల్తో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో నేషనల్ క్రష్ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ జోడీగా కనిపించనుంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పుష్పలో శ్రీవల్లిగా సినీ ప్రియులను అలరించింది. దీంతో పుష్ప-2 చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్మిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెట్ డాగ్స్, క్యాట్స్తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మీతో సమయం వెచ్చించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందని రాసుకొచ్చింది. మీతో ఉన్న అద్భుతమైన క్షణాలను పంచుకోకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్ట్ చేసింది.అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక దిగిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్ డాగ్ కూడా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఫ్యాన్స్ శ్రీవల్లి బ్యూటిఫుల్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్డాగ్ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలో రష్మిక చాలాసార్లు విజయ్ ఫ్యామిలీతో కనిపించింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు రూమర్స్ కూడా వచ్చాయి.Anytime I find a fur ball around me.. it feels like a universal compulsion for me to spend a good amount of time with them.. and I was going through my gallery from since forever and these are some lovely moments I haven’t been able to share with you.. ❤ so here.But on the… pic.twitter.com/ETEWkTNxpB— Rashmika Mandanna (@iamRashmika) May 24, 2024 -
వరల్డ్ ఫ్యామస్ మీమ్ డాగ్ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు
సోషల్మీడియాలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినా జపనీస్ కుక్క(19) ఇకలేదు. సోషల్ మీడియాలో మీమ్స్ ఐకాన్ కబోసు "డాగీ" కన్నుమూసింది. ఈవిషయాన్ని కబోసు యజమాని అత్సుకో సాటో ప్రకటించారు. "మే 26 ఆదివారం నాడు కబో-చాన్కు వీడ్కోలు పార్టీ"ని నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీంతో డాగ్ లవర్స్, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆర్ఐపీ కబోసు సందేశాలు వెల్లువెత్తాయి.Rest in Peace, Doge 💔Doge मीम के पीछे का, करोड़ों लोगों के चेहरों पर मुस्कान लाने वाला जापानी कुत्ता काबोसु (kabosu) 18 साल की उम्र में मर गया, लेकिन काबोसु हमेशा ज़िंदा रहेगा। ❤Miss u kabosu 😥Kabuso the dog behind this meme died , RIP Doge 💔 pic.twitter.com/LLDfWp7xcU— Jayesh Jha (@imjayeshjha) May 24, 2024క్రిప్టోకరెన్సీ డాగ్కాయిన్ను, సోషల్ మీడియా మీమ్స్ బెస్ట్ ఛాయస్గా షిబా ఇను కబోసు పేరుగాంచింది. లుకేమియా , కాలేయ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే అన్నం తిని పుష్కలంగా నీళ్ళు తాగిందనీ, గాఢ నిద్రలో ప్రశాతంగా కన్నుమూసిందని సాటో తెలిపారు. 2022లో లుకేమియా , కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. -
వీధి కుక్కలను చంపి ‘పడేశారు’!
అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట శివారు 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన కాల్వలో కుక్కల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. పదిహేను వీధి కుక్కలను గుర్తు తెలియని దుండగులు చంపి వాటిని కాల్వలో పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం స్థానికుల సమాచారంతో ఎస్ఐ సుజాత అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం కుక్కల కళేబరాలను ట్రాక్టర్లో చక్రాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తరలించి అక్కడ పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుంతను తవి్వంచి పూడ్చి వేశారు. కుక్కల కళేబరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు.కుక్కలకు సంబంధించిన శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్ఖన్న తెలిపారు. పొన్నకల్ ఘటన మరువక ముందే? అసలు ఈ కుక్కలను ఎవరు.. ఎక్కడ.. ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో గ్రామంలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపేసి కళేబరాలను ఇక్కడ వదిలేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అడ్డాకుల మండలం పొన్నకల్లో 21 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు 15 కుక్కల కళేబరాలు హైవే పక్కన కాల్వలో కనిపించడం కలకలం రేపుతోంది. -
పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
వెంగళరావునగర్: పెంపుడు కుక్క అరచిందని పెద్ద గొడవే జరిగింది. ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి చితకబాదారు కొందరు. తన తమ్ముడితో పాటు మరదలును, కుక్కను హత్య చేయబోయారంటూ ఓ వ్యక్తి మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్ నగర్ లో నివాసం ఉండే ఎన్. శ్రీనాధ్, అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీనాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ్ అనే వ్యక్తి భార్య భర్తలను దుర్భాషలాడాడు. ఈ విషయంపై నాడు మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సాయంత్రం శ్రీనాధ్ కుక్కతో బయటకు రాగా ధనుంజయ్ అనే వ్యక్తితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనాధ్ ను, అతని భార్య స్వప్నతో పాటుగా మేనల్లుడు, కోడలును, కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో కొట్టారు. దాంతో శ్రీనాథ్ అపస్మారకస్థితికి వెళ్లాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్.మధు మధురానగర్ పీఎస్ లో ఎల్. మధుతో పాటు మరో నలుగురిపై హత్యయత్నం కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్ తీరును రష్మి తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మి సైతం బదులిచ్చింది.రష్మి గౌతమ్ తన ట్వీట్లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.అయితే దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 The article is about a toddler And yes in this day and age of child rapes and molesters Yes the child shud be 24* 7 monitored The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 -
Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, వికారాబాద్: జిల్లోలోని తాండూర్లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్కు చెందిన దత్తు, లావణ్య దంపతుల కుమారుడు ఐదు నెలల పసి కందును పెంపుడు కుక్క పీక్కుతింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను చంపేశారు. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్లో ఘటన చోటుచేసుకుంది. -
డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
దేశంలో వీధికుక్కల దాడులు, దుర్మరణాలు సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాదీ మిలియన్ల కొద్దీ దాడుల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు , సీనియర్ సిటిజన్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశంలో 3.5 కోట్లకు పైగా వీధికుక్కలు ఉన్న నేపథ్యంలో ఇదొక సవాలుగా మారుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలోక ఒన్ని పెంపుడుకుక్కలు కూడా మనుషులకు తీరనిహాని చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధందేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్వీలర్ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో పిట్బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిన్న (గురువారం, ఏప్రిల్ 9)ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్వీలర్ డాగ్ బాలుడిని గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వీటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటికి గర్భనిరోధకానికి చర్యలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖ రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWO) ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.దూకుడు , మానవులకు హాని కలిగించే లక్షనాలున్న ఈ జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి కేంద్రంస్పష్టం చేసింది . 2024 నాటికి భారతదేశంలో నిషేధించిన జాబితాను ప్రకటించింది. కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా పిట్బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్. ఇంకా సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బ్యాండాగ్ ఉన్నాయి.దాడులు ఎందుకు పెరుగుతున్నాయిభారతదేశంలో దాదాపు 1 కోటి పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే వీధికుక్కల జనాభా చాలా ఎక్కువ.2019లో దేశంలో 4,146 కుక్కకాటు కేసులు నమోదై మానవ మరణాలకు దారితీశాయి. 2019 నుంచి దేశవ్యాప్తంగా భారతదేశం 1.5 కోట్లకు పైగా కుక్క కాటు కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు ,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.వీధికుక్కలు రెచ్చగొట్టినా, బెదిరించినా, లేదా తన బిడ్డలకు (కుక్క పిల్లలకు) హాని జరుగుతుందని భావించిన సూడి కుక్క దాడికి తెగబడుతుంది. వీధి కుక్కల దాడులకు దోహదపడే కారకాలు ప్రభుత్వం, జంతు సంక్షేమ సంస్థల నిర్లక్ష్యం మరియు వ్యక్తిగత ఉదాసీనత.వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి సమర్థవంతమైన చర్యలు లేకపోవడం కూడా ప్రధానకారణంగా నిలుస్తోంది.వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధం కానప్పటికీ, వాటికి ఆహారం ఇచ్చినందుకు వ్యక్తులపై దాడి చేస్తున్న ఘటను చూస్తున్నాం.జంతు ఆరోగ్య సంరక్షణ , నియంత్రణ లేకపోవడంఆకలి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా వీధికుక్కలు దూకుడుగా మారతాయి.19604 నాటి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం వీధి కుక్కలపైక విషప్రయోగం చేయడం చట్టరీత్యా నేరం.వీధి కుక్కల దాడుల సమస్యను పరిష్కరించడానికి మెరుగైన జంతు నియంత్రణ, అవగాహనతోపాటు బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యంతో కూడిన సమగ్ర విధానం అవసరం. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే జంతువుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం చాలా అవసరం. ఇప్పటికే ఈ నిషేధిత జాతులలో ఏదైనా జాతికి చెందిన కుక్క మీ దగ్గర ఉంటే, వాటి సంతానోత్పత్పిని అరికట్టేలా స్టెరిలైజేషన్ చేయించాల్సి ఉంటుంది. -
పెంపుడు శునకానికి ఘనంగా అంత్యక్రియలు
కోదాడ (సూర్యాపేట జిల్లా): మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో చనిపోయిన పెంపుడు శునకానికి కూడా అదేవిధంగా కర్మకాండలు నిర్వహించారు ఓ జంతు ప్రేమికుడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్కు చెందిన భూసాని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో పదిహేనేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకున్నారు. శుక్రవారం ఆ శునకం చనిపోవడంతో ఆయన బ్యాండ్ మేళాన్ని ఏర్పాటు చేసి మరీ అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ దంపతులు. ఇక ఆ శునకానికి చిన్న, పెద్ద కర్మ కాండలు కూడా నిర్వహిస్తామని మల్లారెడ్డి దంపతులు చెబుతున్నారు. -
సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్..!
హైదరాబాద్: పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సొత్తుతో పాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఎఫ్సీనగర్ బాలాజీ నగర్కు చెందిన ఐలయ్య గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అల్మరా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వీటితో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం (వేలి ముద్రల నిపుణులు)తో కలిసి వివరాలు సేకరించారు. ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్ను ఢీకొట్టడంతో.. -
23 జాతుల పెంపుడు శునకాలపై కేంద్రం బ్యాన్!
న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల పెంపకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ ప్రజలపై దాడులకు ప్రాడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కేంద్రం పేర్కొంది. బ్యాన్ విధించిన వాటిలో పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సంతాన వృద్ధి(బ్రీడింగ్)ని కూడా అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
సైన్యంలోని రక్షణ శునకాల శాలరీ ఎంత? పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్ యూనిట్లో 24 శునకాలు, ఉండగా, హాఫ్ యూనిట్లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి. అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి. సైన్యంలోని డాగ్ యూనిట్లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు. -
ఆస్కార్ అవార్డు వేడుకల్లో హైలెట్గా మెస్సీ డాగ్..! ఏం చేసిందంటే..
బోర్డర్ కోలి బ్రీడ్కి చెందిన మెస్సీ అనే కుక్క నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా ఆస్కార్స్ 2024కి నామినేట్ అయ్యింది. అయితే ఆ మూవీకి అవార్డులు రాకపోయినా ఈ కుక్క మంచి ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దాని హావభావాలతో అందర్నీ కట్టిపడేసింది. ఆ మూవీతో 2023లో మంచి స్టార్డమ్ తెచ్చుకున్న ఈ కుక్క ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో మాత్రం అందరి అటెన్షన్ తనవైపుకి తిప్పుకుని మరీ హైలెట్గా నిలిచింది. ఈ వేడుకలకు ఆ మెస్సీ డాగ్ బో టై ధరించి హుందాగా వచ్చింది. ఈ కార్యక్రమంలో 'ఓపెన్ హైమర్' మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రంలో రాబర్డ్ డౌనీ జూనియర్ పాత్రలో అలరించిన ఐరన్ మ్యాన్ నటుడుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఈ ఆస్కార్ వేడుకకు హోస్ట్గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆ అవార్డుని ప్రకటించగానే.. మెస్సీ తన ముందరి కాళ్లతో తప్పట్లుకొడతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో హెస్ట్ జిమ్మీ ఆ కుక్క ఆటిట్యూడ్ని హైలెట్ చేస్తూ మెచ్చుకున్నాడు. the dog from anatomy of a fall looks just like cillian murphy when he's in a public place and needs to socialize, so cute of him. i love you messi pic.twitter.com/cR7vPzoNkp — pau la 🦢 (@sexiestlawyer) March 11, 2024 అంతేగాదు 2006లో వచ్చిన " ది షాగీ డాగ్" మూవీ గురించి ప్రస్తావిస్తూ దానికి సీక్వెల్గా సినిమా తీయాలనుకుంటే ఈ మెస్సీని పెట్టుకుంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మెచ్చుకోలుగా అన్నాడు. ఇక ఈ మెస్సీ డాగ్ నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' మూవీలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ఈ కుక్క ప్రేక్షకుల మనుసులో చెరగని ముద్ర వేయించుకుందని ప్రశంసించాడు. ఈ వేడుకల్లో మెస్సీ డాగ్ హైలైట్గా నిలిచి అందర్నీ అలరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. they really had Messi, the dog from Anatomy of a Fall, applauding Robert Downey Jr. after his acceptance speech lol #Oscars pic.twitter.com/XBrxoAPGq2 — Spencer Althouse (@SpencerAlthouse) March 11, 2024 (చదవండి: ఆస్కార్ 2024: రెడ్ కార్పెట్పై తడబడినా..భలే గమ్మత్తుగా కవర్ చేసిన నటి!) -
ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం! ఆస్తుల జాబితా వింటే..
చాలామంది టైం బాగోకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఛీ.. కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటాంటారు. ఆ కుక్కలా లైఫ్ ఉంటే బాగుండును అనుకుంటారు. దాని ఆస్తుల వివరాలు, బ్యాంకు బాలెన్స్లు వింటే షాకవ్వుతారు. దానికున్న సెక్యూరిటీ, బతుకుతున్న రేంజ్ వింటే వామ్మో అంటారు. ఇప్పుడూ చెప్పబోయే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. దీని పేరు గున్థర్ VI. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. ఇది సుమారు రూ. 500 కోట్ల విలువచేసే విలాసవంతమైన ఇంటిలో ఉంటుంది. అలాగే తిరిగేందుకు బీఎండబ్ల్యూ కార్లు, సరదాగా షికారు చేయడానికి ప్రైవేట్ షిప్ సౌకర్యం తదితరాలు ఉన్నాయి. దీనికి స్వంత ఫుట్బాల్ క్లబ్ ఉంది. ఆ కుక్క డబ్బును పర్యవేక్షించేది 66 ఏళ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిజియో మియాన్. కుక్కకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాని బాగోగోలు చూసుకోవడం అతని బాధ్యత. అయితే ఈ కుక్కకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే..? అ కుక్క తాత గున్థర్ III నుంచి ఈ సంపదను వారసత్వంగా పొందాడు. జర్మన్ కౌంటెస్ కార్లోట్టా లీబెన్స్టెయిన్ అనే ధనికుడు ఈ గున్థర్ IIIని ప్రేమగా పెంచుకునేవాడు. అయితే ఆ ధనికుడు కొడుకు విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారుసులెవరూ లేకుండా పోయారు. దీంతో లీబెన్స్టెయిన్ చనిపోయేంత వరకు ఆ కుక్కనే ప్రేమగా చూసుకునేవాడు. అతను వెళ్తూ వెళ్తూ..దాదాపు రూ. 600 కోట్ల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాసి వెళ్లిపోయాడు. అంతేగాదు ఆ డబ్బును, కుక్కను పర్యవేక్షించేలా ఇటాలియన్ ఫార్మటిస్ట్ మౌరిజియో మియాన్కి బాధ్యతలు కూడా అప్పగించాడు. అలా గుంథర్ ట్రస్ట్ ఏర్పడింది. నాడు ఆరు వందల కోట్లగా ఉన్న ఆస్తి కాస్త గున్థర్ VI టైంకి వచ్చేటప్పటికీ దాని విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లకు చేరింది. యజమాని లిబెన్స్టెయిన్ వదలిపెట్టి వెళ్లిన సంపదతో విలాసవంతమైన ఇళ్లు, విల్లాలు, ఓ ప్రైవేట్ ఓడ కొనుగోలు మౌరిజియో మియాన్చేశాడు. అంతేగాదు ఈ కుక్క బిజినెస్ క్లాస్లోనే ప్రయాణిస్తుందట. అలాగే ఆ కుక్కుబాగోగులు చూసుకునేందుకు సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడూ చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉండటం విశేషం. అంతేగాదు ఈ గున్థర్ VI తర్వాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఈ గున్థర్ కుక్క వంశానికే చెందుతుందన్నమాట. ఈ గున్థర్ కుక్కలు గోల్డెన్ స్పూన్ బేబి మాదిరి కుక్కలన్నమాట. బిజినెస్ మ్యాగ్జైన్లో ఈ కుక్క గురించి పలు కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై పలు డాక్యుమెంటరీలు కూడా రావడం విశేషం. (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!) -
పోఖ్రాన్ యుద్ధ విన్యాసాల్లో ‘రోబో డాగ్’ సత్తా!
భారత సైన్యం వ్యవస్థాగత నిఘాను మెరుగుపరచడానికి, పోరాట కార్యకలాపాల్లో సహాయానికి రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ను అభివృద్ధి చేసింది. ఈ నెల 12న పోఖ్రాన్లో జరగనున్న ఆర్మీ ఎక్సర్సైజ్లో ఈ రోబో డాగ్ తన సత్తా చాటనుంది. ‘మ్యూల్’ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్. దీనిలో పలు ఫీచర్లు ఉన్నాయి. ‘మ్యూల్’.. థర్మల్ కెమెరాలు, రాడార్తో అనుసంధానమై ఉంటుంది. మంచు, ఎడారి, కఠినమైన నేల, ఎత్తయిన మెట్లు, కొండ ప్రాంతాలలో.. ప్రతి అడ్డంకిని దాటగలిగేలా ఈ రోబో డాగ్ను రూపొందించారు. దీనికి శత్రు లక్ష్యాలను మట్టుబెట్టగల సామర్థ్యం కూడా ఉంది. మార్చి 12న భారత సైన్యం రాజస్థాన్లోని పోఖ్రాన్లో స్వదేశీ ఆయుధాలు, సాయుధ దళాలకు చెందిన పరికరాల బలాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీనిలో ఇండియన్ ఆర్మీకి చెందిన రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ యాక్షన్ మోడ్లో కనిపించనుంది. ఈ రోబో డాగ్ 2023లోనే భారత సైన్యానికి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్లో చేరింది. రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ కుక్క మాదిరిగా కనిపిస్తుంది. దీనికి నాలుగు కాళ్లు ఉంటాయి. ‘మ్యూల్’ బరువు దాదాపు 51 కిలోలు. దీని పొడవు 27 అంగుళాలు. ఇది ఒక గంటలో రీఛార్జ్ అవుతుంది. పది గంటల పాటు పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపే సాంకేతికత ‘మ్యూల్’లో ఉంది. #BharatShakti स्वदेशीकरण से सशक्तिकरण Displaying the might of indigenous weapons & equipment of #IndianArmedForces. On 12 Mar 2024 at #Pokaran Field Firing Ranges (Rajasthan).#AatmanirbharBharat#YearofTechAbsorption@DefenceMinIndia@HQ_IDS_India@IAF_MCC@indiannavy pic.twitter.com/poRvYHjOZh — ADG PI - INDIAN ARMY (@adgpi) March 9, 2024 -
రియల్ లైఫ్ మోగ్లీ: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..!
అడవుల్లో జంతువుల మధ్య పెరిగిన మనుషుల గురించి కథకథలుగా విన్నాం. అంతెందుకు కొన్ని జంతువులు పసిపిల్లలను ఎత్తుకు పోయి పెంచడంతో వాళ్లు ఆయా జంతువుల్లానే ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన టార్జాన్, మోగ్లీ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యియి కూడా. నిజజీవితంలో అలాంటి వాళ్లను చూసి ఉండటం కాదుకదా! విని ఉండం కూడా. ఇప్పుడూ చెప్పబోయే మహిళ రియల్ లైఫ్ మోగ్లీ లేదా టార్జాన్ అనొచ్చు. పైగా ఇప్పటికీ ఆమెలో ఆ జంతు లక్షణాలు పోలేదు. ఆ టార్జాన్ విమెన్ గాథ వింటే..మనసు కకలావికలం అయ్యిపోతుంది. లోకంలో ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా? అనిపిస్తుంది. ఉక్రెయిన్ చెందిన ఆక్సానా మలయా అనే 40 ఏళ్ల మహిళ బాల్యంలో కుక్కల మధ్యే పెరిగింది. వాటిలానే ఉండటం, తినడం, మొరగడం వంటివన్నీ చేసింది. ఎంతలా అంటే ఆమె 'మానవ కుక్కేమో'! అని అనిపించేలా ఉండేది ఆమె ప్రవర్తన. మలయా తల్లిదండ్రులు మధ్యానికి బానిసలయ్యి ఆమె పసిపాపగా ఉన్నప్పటి నుంచి ఆమె బాగోలు సరిగా చూడలేదు. సరిగ్గా మూడేళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి దక్కాల్సిన ప్రేమానురాగాలకి నోచుకోకపోగా ఆమె ఆలనా పాలనాని గాలోకి వదిలేసి అత్యంత హేయంగా ప్రవర్తించేవారు. ఒక రోజు గజగజలాడే చలిలో ఆమెను బయటే వదిలేసి మద్యం మత్తులో తలుపులు వేసుకుని ఇంటి లోపలికి వెళ్లిపోయారు. ఆ కటిక చలిలో వణికిపోతూ ఏం చేయాలో దిక్కు తోచక అక్కడే ఉన్న పెంపుడు కుక్కల బోనులో తలదాచుకుంది. ఇక అక్కడే నిద్రపోయింది. వాటితోనే ఉండేది. అవేలా తింటున్నాయి అలానే తినడం, మొరగడం వంటివి చేయడం చేసింది. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూతురు ఏమయ్యిందనేది గాలికి వదిలేశారు. కనీసం ఎక్కడుందన్న ఆరా కానీ ఏమీలేదు. కొన్ని రోజులకు ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరీ దారి వారు చూసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ చిన్నారి అలా 9 ఏళ్లు వచ్చే వరకు ఆ కుక్కలే లోకంగా పెరిగింది. ఆ కుక్కలు ఆ చిన్నారికి ఆత్మీయులుగా మారిపోయాయి. ఆ చిన్నారితో ఓ తోటి కుక్క మాదిరిగా స్నేహంగా మెలిగేవి ఆ కుక్కలు. ఇదంతా గమనించిన ఇరుగపొరుగు ఆ కుక్కల బోను నుంచి ఆ చిన్నారిని తీద్దామనుకున్నా ఆ కుక్కలు ఊరుకునేవి కావు. పోనీ ఆ అమ్మాయితో సంభాషిద్దామన్నా ఆమె కుక్కలానే మొరుగుతూ సమాధానమివ్వడంతో వారంతా గందరగోళానికి గురయ్యేవారు. ఇక లాభం లేదనుకుని స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఇక ఉక్రెయిన్ అధికారులు రంగంలోకి దిగి ఆమెను కాపాడేందుకు యత్నించగా..అక్కడ ఉండే కుక్కల దండు అందుకు ఒప్పుకోలేదు. అవన్నీ ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడ్డాయి. దీంతో వాటికి ఆహారాన్ని ఎరగా చూపి వాటి దృష్టి మరల్చి ఆ చిన్నారిని రక్షించారు. వెంటనే ఆమె ఉక్రెయిన్ ఫోస్టర్ హోమ్కి తరలించారు. అక్కడ ఆ చిన్నారి రెండు కాళ్లపై నడవడం, సంభాషించడం నేర్చుకుంది. అయితే ఆమె కుక్కల మధ్య ఊహ తెలిసినప్పటి నుంచి పెరగడంతో ఆమెలో కుక్కలాంటి లక్షణాలు చాలా వరకు పోలేకపోవడం గమనార్హం. ఆమె మానసిక స్థితి ఆరేళ్ల పాపలా ఉందని వైద్యుల తేల్చి చెప్పారు. ఆమె ఎప్పటికీ చదవలేదని తేల్చి చెప్పారు మానసిక వైద్యులు లిన్ ఫ్రై. ఎందుకంటే ఐదేళ్ల లోపు భాష నేర్చుకోకపోతే చదవడం అనేది కష్టమవుతుందని అన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా 2000 సంవత్సరంలో తన తల్లిదండ్రులను కలుసుకుంది మలయా. బహుశా అప్పటికీ ఆ నిర్లక్షపూరిత తల్లిదండ్రులకు కూతురు గుర్తోచ్చింది కాబోలు. విధి కలిపిందో లేక ఆ తల్లిదండ్రులకు జ్క్షానోదయం అయ్యిందో గానీ మళ్లీ ఆ కుటుంబ అంతా ఒక్కచోటకు చేరింది. ఇలాంటి దిగ్భాంతికర ఘటనలకు సంబంధించిన వంద కేసుల్లో సదరు చిన్నారి ఆక్సానా మలయా కేసు ఒకటని అధికారులు చెబుతున్నారు. (చదవండి: రష్యా డాన్స్ ఇంత అందంగా ఉంటుందా?)