-
కొనుగోలు దారులకు శుభవార్త!
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ దీపావళి సందర్భంగా ‘అన్లిమిటెడ్సెలబ్రేషన్స్’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలు, మొబైల్స్, వాషింగ్ మెషిన్లు, ల్యాప్ట్యాప్లు, వైర్లెస్ ఇయర్బర్డ్లు, స్మార్ట్వాచ్లు, గృహోపకరణాలపై భారీ రాయితీ పొందవచ్చు. క్రిడెట్, డెబిట్ కార్డులపై గరిష్టంగా రూ.15వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, సులభ ఫైనాన్స్ సదుపాయాలు ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లు, రిలయన్స్డిజిటల్.ఇన్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లు పొందవచ్చు. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం
విజయదశమితో మొదలైన పండుగ సీజన్ జోరుగా ముందుకు సాగుతోంది. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ పండుగ సీజన్లో టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కార్ డీలర్లు తమ లైనప్లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్.. 👉టాటా ఆల్ట్రోజ్ - రూ. 30,000 👉టాటా టియాగో - రూ. 40,000 👉రెనాల్ట్ క్విడ్ - రూ. 50,000 👉హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ - రూ. 55,000 👉మారుతి సుజుకి బాలెనో - రూ. 55,000 👉మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ. 58,000 👉మారుతి సుజుకి ఇగ్నిస్ - రూ. 65,000 👉మారుతి సుజుకి ఆల్టో కే10 - రూ. 70,000 👉మారుతి సుజుకి సెలెరియో - రూ. 73,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్
రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, మహీంద్రా, స్కోడా, జీప్, సిట్రోయెన్ కంపెనీలు రూ. 50000 నుంచి రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్ కేవలం కొన్ని ఎంపిక చేసిన మోడల్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా డిస్కౌంట్స్ మహీంద్రా ఎక్స్యూవీ400 - రూ. 3.5 లక్షలు మహీంద్రా ఎక్స్యూవీ300 - రూ. 1.2 లక్షలు మహీంద్రా బొలెరో - రూ. 70,000 మహీంద్రా బొలెరో నియో - రూ. 50,000 మహీంద్రా మొరాజో - రూ. 73.300 సిట్రోయెన్ డిస్కౌంట్స్ సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ - రూ. 99,000 సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్ - రూ. 2,00,000 సిట్రోయెన్ సీ3 - రూ. 99,000 మారుతి సుజుకి డిస్కౌంట్స్ మారుతి జిమ్నీ - రూ. 1,00,000 స్కోడా డిస్కౌంట్స్ స్కోడా కుషాక్ - రూ. 1.5 లక్షలు జీప్ డిస్కౌంట్స్ జీప్ మెరిడియన్ - 1.30 లక్షలు జీప్ కంపాస్ - రూ. 1.45 లక్షలు ఫోక్స్వ్యాగన్ డిస్కౌంట్ ఫోక్స్వ్యాగన్ టైగన్ - రూ. 1,00,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
వాహనదారులకు మారుతి సుజుకీ ప్రత్యేక డిస్కౌంట్లు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్యూవీ మోడల్ జిమ్నీపై రూ.లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది. జిమ్నీ ఎస్యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ లేదా లాయల్టీ బోనస్ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ ఆఫర్ మాన్యువల్, పెట్రోల్ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. -
‘బిగ్ దసరా సేల్’లో అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది. దసరా సేల్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. -
బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్పాడ్స్ కేవలం రూ. 16749కే..
భారత్లో ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి ప్రొడక్స్ మీద కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకెండ్ జెన్పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఎయిర్పాడ్స్ ప్రో 2 ధర రూ. 24,900 వరకు ఉంది. అయితే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో మాత్రం రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డుల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఫలితంగా ఫ్లిప్కార్ట్లో రూ. 16,999 & అమెజాన్లో రూ. 16,749కి కొనుగోలు చేయవచ్చు. ఇదీ చదవండి: రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!! 2022లో విడుదలైన యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఈ ఏడాది సెప్టెంబర్లో వండర్లస్ట్ ఈవెంట్లో ప్రో 2 గా విడుదలైంది. ఇది లాస్లెస్ ఆడియో విత్ అల్ట్రా-లో లేటేన్సీ పొందుతుంది. ఇందులో హెచ్2 చిప్సెట్ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రోలో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. మొత్తం మీద ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023 -
యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే!
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్.మరికొన్ని రోజుల్లో యాపిల్ మెగా ఈవెంట్కు రడీ అవుతున్న తరుణంలో భారీ డిమాండ్ ఉన్న పాపులర్ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 ప్రో దశలవారీగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో iPhone 14 Pro ఏకంగా రూ. 66,999 తగ్గింపుతో లభిస్తోంది. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు, యాపిల్ వాచెస్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14 ప్రో లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో లాంచింగ్ ప్రైజ్ రూ. 1,29,900.ఇపుడు ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ.66,999 తగ్గించింది. ఇందులో HDFC బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపును పొందవచ్చు.అలాగే స్మార్ట్ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్ దాదాపు రూ. 50,000 ఉంటుంది. ఫలితంగా iPhone 14 Pro ధర కేవలం రూ. 69,999కి దిగి వచ్చింది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్ఫాల్ ట్యాక్స్ కట్) ఐఫోన్ 14 ప్రో ఫీచర్లు: 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, అత్యాధునిక A16 బయోనిక్ చిప్, 48ఎంపీ ట్రిపుల్ కెమెరా 12 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) -
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్ను సంప్రదించవచ్చు. -
ఫ్యాన్స్కు గుడ్న్యూస్: మహీంద్ర థార్పై బంపర్ ఆఫర్
భారత్ మార్కెట్లో మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్ ఎస్యూవీ కున్న ఆదరణ, క్రేజే వేరు. మరోవైపు హీంద్రా థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఆవిష్కరణకు ముందు మహీంద్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. థార్ వెహికల్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఈవీ ఆవిష్కరణకు ముందు, 3-డోర్ల మహీంద్రా థార్ గరిష్టంగా రూ. 20,000 ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని మహీంద్రా షోరూమ్లు కొత్త థార్పై రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ మహీంద్రా థార్ 4x4 వేరియంట్లపై ఆఫర్ లభిస్తోంది. థార్ 4x4 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ,2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో ఉంది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్) కాగా మహీంద్రా థార్ ధరలను కంపెనీ ఇటీవల భారతదేశంలో రూ. 1.05 లక్షల వరకు పెంచేసింది. ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 4WD వెర్షన్ ఇప్పుడు రూ. 13.49 లక్షల నుండి రూ. 16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD మహీంద్రా థార్ చౌకైన వేరియంట్ ఇప్పుడు రూ. 55,000 ఎక్కువ. LX డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు పెరిగింది. ఆగస్ట్ 15న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో థార్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ను వెల్లడించేందుకు మహీంద్రా సిద్ధంగా ఉంది. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో) -
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ-కామర్స్ సైట్లో భారీ డిస్కౌంట్!
REVOLT RV400 electric bike sale on Amazon: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ రెవోల్ట్ మోటర్స్ అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్లో భాగంగా రెవోల్ట్ ఆర్వీ 400 బైక్పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ బైక్ వాస్తవ ధర రూ.1.54 లక్షలు. అయితే ఈ ఈ-కామర్స్ సైట్లో నేరుగా రూ. 15 వేల డిస్కౌంట్తో రూ.1.39 లక్షలకు లిస్ట్ చేసింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎస్బీఐ కార్డు ద్వారా వచ్చే తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ను కలుపుకొంటే మొత్తంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐలో ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ఏకంగా రూ. 10,500 వరకు వడ్డీ డిస్కౌంట్ పొందొచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, ఏడాది వరకు టెన్యూర్తో నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. రెవోల్ట్ 400 ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. -
విమాన ప్రయాణికులకు శుభవార్త
-
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్ల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్స్క్రైబర్లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. ఐఫోన్ 14 (iPhone 14) అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది భారత్లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్కు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G) Snapdragon 8 Gen 1 చిప్సెట్తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది. ఐకూ 9 5జీ (iQoo 9 5G) ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్ఫోన్ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్సెట్ 5nm స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ని ఎక్సేంజ్కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) 6.6-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రెడ్మీ 12సీ (Redmi 12C) MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్మీ 12సీ హ్యాండ్సెట్ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. -
రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?
Apple iPhone 14 యాపిల్ ఐఫోన్ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం యాపిల్ లైనప్లో చౌక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14. త్వరలోనే ఐఫోన్ 15ను లాంచ్ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కానున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అందుబాటులోకి రావడం గమనార్హం. దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో రూ. 26,399కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అధికారిక స్టోర్లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్ అయింది. దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్కార్ట్ సేల్ కంటే ముందుగా యాపిల్ ఐఫోన్ 14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు. కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్ ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం. కాగా యాపిల్ ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, యాపిల్ 14 ప్రో మాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
అన్లిమిటెడ్ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు
హైదరాబాద్: అరవింద్ లైఫ్స్టైల్ గ్రూప్ అనుబంధ సంస్థ అన్లిమిటెడ్ సోర్ట్ అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలపై 60% వరకు ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది. -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్కార్ట్లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
యాపిల్ ఎయిర్పాడ్స్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..రూ.20వేల డిస్కౌంట్!
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ లవర్స్కు శుభవార్త చెప్పింది. యాపిల్ ఫస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ను భారీ డిస్కౌంట్కే అందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ హెడ్ఫోన్స్ ధర ఎక్కువ ఇప్పుడా ప్రొడక్ట్లపై రూ.20,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్ పాడ్స్ ప్రో ధరని సైతం రూ.8,000 పైగా తగ్గిస్తుండగా.. వీటిపై బ్యాంక్ ఆఫర్లను అదనంగా పొందవచ్చు. యాపిల్ సంస్థ ఆన్లైన్ స్టోర్లో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ను రూ.59,900కే విక్రయిస్తుంది. ఫ్లిప్కార్ట్ మాత్రం వాటి ధరను రూ.19,901 తగ్గించి రూ.39,999కే అమ్ముతుంది. అదనంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై రూ.1250 డిస్కౌంట్,ఈఎంఐ సదుపాయం ఉంది. దీంతో ఫ్లిప్కార్ట్లో వాటి ధర రూ.38,749కి తగ్గుతుంది. అయితే, ఈ డీల్ పింక్ మోడల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్కు మాత్రమే వర్తిస్తుంది. గ్రీన్, సిల్వర్ కలర్ ధర రూ.44,999. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్తో రూ.41,999కే సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోను ఫ్లిప్ కార్ట్ కేవలం రూ.16,990కే అమ్ముతుంది. వీటి మార్కెట్ ధర రూ. 24,900 గా ఉంది. యాపిల్ ఫస్ట్ జనరేషన్ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఫ్లిప్కార్ట్లో రూ. 7,910 డిస్కౌంట్ లభిస్తుండగా పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్తో వాటి ధర రూ.15,740కి తగ్గుతుంది. 2వ తరం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో రెండవ తరం ఎయిర్పాడ్స్ ప్రోని యాపిల్.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వైర్లెస్ ఇయర్బడ్లు యాపిల్ అధికారిక వెబ్సైట్లో ధర రూ. 26,900 అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులు ఎటువంటి బ్యాంక్ కార్డ్ని ఉపయోగించకుండా ఫ్లిప్కార్ట్ ద్వారా తగ్గింపు ధరతో రూ. 24,990కే పొందవచ్చు. -
ఇంత మంచి డిస్కౌంట్ మళ్ళీ రాదు.. హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్!
Toyota Hilux Discounts: భారతీయ మార్కెట్లో 'టయోటా' (Toyota) కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇప్పుడు తన పికప్ ట్రక్కు 'హైలక్స్' (Hilux) మీద కనీవినీ ఎరుగని డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇప్పటికే మంచి సంఖ్యలో అమ్ముడవుతున్న 'టయోటా హైలక్స్ పికప్' (Toyota Hilux Pickup) ట్రక్కు మీద కంపెనీ రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో సంస్థ ఈ వెహికల్ బేస్ వేరియంట్ ధరలు రూ. 3.60 లక్షలు తగ్గించి, ఇతర వేరియట్ల ధరలను రూ. 1.35 లక్షల వరకు పెంచింది. కాగా ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. టయోటా హైలక్స్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ ఎమ్టి, హై ఎమ్టి, హై ఏటీ. ఈ పికప్ ట్రక్కు ఇప్పటి వరకు 1300 యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ధరలు రూ. 30.40 లక్షల నుంచి రూ. 37.90 లక్షల మధ్య ఉన్నాయి. (ఇదీ చదవండి: యమహా ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!) ప్రస్తుతం దేశంలోని కొన్ని కంపెనీ డీలర్షిప్లు రూ. 6 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నట్లు, ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలోని డీలర్షిప్లు రూ. 8 లక్షల వరకు తగ్గింపుని అందిస్తున్నట్లు సమాచారం. అయితే తగ్గింపులు ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే అధికారిక డీలర్షిప్లను సందర్శించి తెలుసుకోవచ్చు. (ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!) 2022 మార్చిలో ప్రారంభమైన ఈ హైలక్స్ అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చింది. మాన్యువల్ వేరియంట్లలో 201 బిహెచ్పి, 420 ఎన్ఎమ్ టార్క్.. ఆటోమేటిక్ వేరియంట్లలో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
షాపింగ్ లవర్స్కు అమెజాన్ బంపరాఫర్.. కేవలం రెండు రోజులే!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. కేవలం రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్లో కొనుగోలు దారులు వారికి కావాల్సిన వస్తువుల్ని డిస్కౌంట్ ధరలో పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఎక్స్క్లూజివ్గా స్మార్ట్ఫోన్స్,ల్యాప్ట్యాప్స్,ఎలక్ట్రానిక్స్,హోమ్అప్లయెన్సెస్పై అందిస్తుంది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ వివరాలు భారత్లో అమెజాన్ రెండు రోజుల పాటు ఈ సేల్ను నిర్వహించనుంది. జులై 12ఏమ్ నుంచి ప్రారంభమై..జులై 16 వరకు కొనసాగుతుంది.ప్రత్యేక అమ్మకాల్లో కొనుగోలు దారులు డిస్కౌంట్స్, సేవింగ్స్, కొత్తగా మార్కెట్లో విడుదలైన ప్రొడక్ట్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో బ్యాంక్ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదే కార్డ్లపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్పై 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీకు ప్రయాణాలంటే ఇష్టమైతే..ట్రావెల్స్ బుకింగ్స్లో ఈ కార్డ్ వినియోగంతో అన్లిమిటెడ్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు బిల్లు చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటిపై 50 శాతం డిస్కౌంట్ వన్ప్లస్, ఐక్యూ, రియల్మీ నార్జో, శాంసంగ్, మోటరోలా,బోట్,సోనీ ఇలా 400 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులపై తగ్గింపును అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు మొదలైన వాటిపై తగ్గింపును పొందుతారు. అదనంగా, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. చదవండి👉 ఎలాన్ మస్క్కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
క్రోమా ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’.. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్లైన్లో www.croma.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. ల్యాప్టాప్లపై డీల్స్ నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్టాప్లు ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్టాప్లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి. టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లపై.. క్రోమా సేల్లో రూ.11,999తో టాబ్లెట్ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్వాచ్ను పొందవచ్చు. -
మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్!
భారతీయ విద్యార్ధులకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘బ్యాక్ టూ యూనివర్సిటీ 2023’ పేరుతో జూన్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ సేల్లో విద్యార్ధులు కొనుగోలు చేసే ఐపాడ్, మ్యాక్బుక్స్,డెస్క్ ట్యాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 11 అంగుళాల యాపిల్ ఐపాడ్ ప్రో, 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో, 24 అంగుళాల ఐపాడ్ పో’లు డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఈ సేల్లో కొనుగోలు చేసే ప్రొడక్ట్లపై ఉచితంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్స్ పై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాక్ టూ యూనివర్సిటీ సేల్లో విద్యార్ధులతో పాటు బోధన,బోధనేతర సిబ్బంది యాపిల్ ప్రొడక్ట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే పొందవచ్చు. ప్రస్తుతం, కొనసాగుతున్న సేల్లో అర్హులైన కస్టమర్లు 11 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.96,900 ఉంటే రూ.76,900కే కొనుగోలు చేయొచ్చు. 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.1,12,900 ఉంటే రూ.1,02,900కే, రూ.59,900 ఐపాడ్ను రూ.54,900కే పొందవచ్చు. ఈ మూడు ఐపాడ్ మోడళ్లపై సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్లు ఉచితంగా అందిస్తుంది. ఎం 1 పవర్డ్ 13 అంగుళాల మాక్ బుక్ ఎయిర్ను రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు లాంచ్ ధర రూ.99,900గా ఉంది. 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ 13 అసలు ధర రూ.1,29,900 కాగా రూ.1,04,900 కే విద్యార్ధులు కొనుగోలు చేయొచ్చు. సేల్లో 15 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ. 1,24,900, అసలు ధర రూ. 1,34,900 గా ఉంది. తాజా,ఆఫర్లు ధృవీకరించబడిన విద్యార్ధులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు,ఇతర సిబ్బంది యాపిల్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి అర్హులో, కాదో తెలుసుకోవచ్చు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఇక మెడ్ప్లస్ సొంత బ్రాండ్ మందులు.. 80 శాతం వరకు డిస్కౌంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయంలో ఉన్న హైదరాబాద్ సంస్థ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్.. సొంత బ్రాండ్లో మందుల అమ్మకాల్లోకి ప్రవేశించింది. 50–80% డిస్కౌంట్తో వీటిని విక్రయిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. కంపెనీ సీవోవో చెరుకుపల్లి భాస్కర్ రెడ్డి, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ చేతన్ దీక్షిత్తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివిధ చికిత్సలు, దీర్ఘకాలిక జబ్బులకువాడే 500లకుపైగా పేటెంట్యేతర ఔషధాలను మెడ్ప్లస్ బ్రాండ్లో ప్రవేశపెట్టినట్టు మధుకర్ చెప్పారు. జీఎంపీ, ఈయూ జీఎంపీ ధ్రువీకరణ పొందిన ప్లాంట్లలో మందులు తయారవుతున్నట్టు వివరించారు. ఏటా 1,000 స్టోర్లు.. ప్రతి ఏటా మెడ్ప్లస్ ఫార్మసీ విభాగంలో 1,000 రిటైల్ ఔట్లెట్లను తెరుస్తామని మధుకర్ రెడ్డి తెలిపారు. ‘వీటి ఏర్పాటుకు ఏటా సుమారు రూ.300 కోట్లు అవసరం అవుతాయి. ఏడు రాష్ట్రాల్లోని 552 నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం 3,822 స్టోర్లు ఉన్నా యి. ఈ ఏడాదే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ రా ష్ట్రాల్లో అడుగుపెడుతున్నాం. 2022–23లో రూ. 4,550 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 25% వృద్ధి ఆశిస్తున్నాం. డిస్కౌంట్ల వల్ల లాభాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు’ అని వెల్లడించారు. సంస్థకు 22 వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.