-
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
అమర్నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది. అమర్నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్ఎల్ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్ఎల్ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ! -
గుడ్ న్యూస్.. ఐఫోన్ లవర్స్కి ఇదే మంచి సమయం
Amazon Apple Sale Days: భారతదేశంలో ఐఫోన్కు ఉన్న క్రేజు అంతా .. ఇంతా.. కాదు. యువతరం మొత్తం ఐఫోన్ అంటే పడి సచ్చిపోతారు. అలాంటి వారి కోసం అమెజాన్ కొత్త యాపిల్ డేస్ సేల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్లపై మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు జూన్ 17లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు కార్డుల మీద తగ్గింపులను అందించడం మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ మీద అమెజాన్ అందించే ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 (iPhone 14) దేశీయ మార్కెట్లో ఐఫోన్ 14 128జీబీ మోడల్ ధర రూ. 79,999. ఆఫర్ కింద 15 శాతం తగ్గింపుతో దీనిని రూ. 67,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో 256 జీబీ వేరియంట్ని (రూ. 89,900) 13 శాతం తగ్గింపుతో రూ. 77,999కే.. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 కాగా 11 శాతం తగ్గింపుతో రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) యాపిల్ సేల్ డేస్ ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి పెద్ద స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900. ఆఫర్ సమయంలో 14 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున ఇది రూ. 76,999కే లభిస్తుంది. ఇక 256GB వేరియంట్ ధర రూ. 99,900 కాగా.. అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో 13 శాతం తగ్గుదలతో రూ. 86,999కి లభిస్తుంది. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్ అండ్ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ప్రో అసలు ధరలు వరుసగా రూ. 1,29,900 & రూ. 1,39,900 కాగా.. ఆఫర్ కింద ఇవి రూ. 1,19,999 అండ్ రూ. 1,34,990 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఆపిల్ సెల్ డేస్ ఆఫర్ కింద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారు సాధారణ ధరకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 14 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ. 1,39,900, అదే సమయంలో 256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900. ఆఫర్ కింద వీటిని వరుసగా రూ. 1,27,999 అండ్ రూ. 1,43,990 కే సొంతం చేసుకోవచ్చు. -ఎన్.కుమార్ -
టాటా కార్ల కొనుగోలుపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్ - ఏ కారుపై ఎంతంటే?
Discounts: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి కార్లు ఉన్నాయి. అయితే సంస్థ టాటా పంచ్ మరియు నెక్సాన్ కార్ల మీద ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు. కాగా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా టియాగో (Tata Tiago) భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యాచ్బ్యాక్స్ లో ఒకటైన టియాగో మీద కంపెనీ రూ. 43000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. కావున వేరియంట్ని బట్టి డిస్కౌంట్ మారుతుంది. టియాగో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 20000 వరకు కంజ్యుమర్ స్కీమ్ కింద తగ్గింపు లభిస్తుంది. ఇక CNG వేరియంట్ మీద 43000 తగ్గింపు లభించగా.. ఇందులో కంజ్యుమర్ స్కీమ్ కింద రూ. 30 వేలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్బ్యాక్ మారుతి స్విఫ్ట్, ఇగ్నీస్, గ్రాండ్ ఐ వంటి వాటికి ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. టాటా టిగోర్ (Tata Tigor) టాటా మోటార్స్ ఇప్పుడు టిగోర్ పెట్రోల్ మోడల్ మీద రూ. 33,000 తగ్గింపుని సిఎన్జీ మోడల్ మీద రూ. 48000 తగ్గింపుని ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ మీద ఎక్స్చేంజ్ డిస్కౌంట్, కంజ్యుమర్ స్కీమ్ లభించే డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ తగ్గింపులు కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) టాటా ఆల్ట్రోజ్ మీద ఇప్పుడు రూ. 30000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. ఈ తగ్గింపులు కేవలం పెట్రోల్, డీజిల్ మోడల్స్కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సిఎన్జీ మోడల్ మీద మాత్రం ఎటువంటి తగ్గింపులు లభించవు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు, డీజిల్ మోడల్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) టాటా హారియర్ & సఫారి (Tata Harrier and Safari) టాటా హారియర్ & సఫారి కార్ల కొనుగోలుపైన రూ. 35000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు SUVల మీద రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో కార్పొరేట్ తగ్గింపు కింద రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు మోడల్స్ మీద ఎటువంటి కంజ్యుమర్ బెనిఫిట్స్ లభించవు. "డిస్కౌంట్లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించండి.'' -
46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇలా చేస్తే మీ సొంతం!
Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో సేవింగ్స్ డేస్ సేల్స్లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిషన్లో ఉన్న మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి. -
ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!
Maruti Suzuki Discounts: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు వీటి మునుపటి ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మారుతి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్ మారుతి సుజుకి ఇగ్నిస్ కొనుగోలుపైన రూ. 64,000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.16 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి సియాజ్ సియాజ్ కొనుగోలుపైన రూ. 33,000 అదా చేసుకోవచ్చు. ఇది నెక్సా లైనప్లోని ప్రాధమిక మోడల్. కస్టమర్లు దీనిపైన రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుని పొందవచ్చు. అయితే దీని పైన క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) మారుతి సుజుకి బాలెనో దేశీయ మార్కెట్లో ఎక్కువమందికి ఇష్టమైన మోడల్, ఎక్కువ అమ్ముడవుతున్న బాలెనో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారులు రూ. 35,000 బెనిఫీట్స్ పొందవచ్చు. డెల్టా మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందుతుంది. దీని ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్ను సంప్రదించవచ్చు. -
పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్ను మాత్రమే పీఎస్యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
అజియో ‘బిగ్బోల్డ్’ సేల్.. భారీ డిస్కౌంట్లతోపాటు బహుమతులు!
ముంబై: అజియో ‘బిగ్ బోల్డ్ సేల్’ (Ajio Big Bold Sale) పేరుతో ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 1 నుంచి మొదలు కానుంది. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, హోమ్, డెకార్, బ్యూటీ, జ్యువెలరీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై మంచి డీల్స్ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకమైన డీల్స్లో భాగంగా ఉత్పత్తులపై 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. బిగ్బోల్డ్ సేల్లో అధిక కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు ఐఫోన్ 14ప్రో, యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్, రూ.లక్ష విలువైన బంగారం, శామ్సంగ్ ఎస్23ను ఇస్తున్నట్టు పేర్కొంది. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు రూ.3 లక్షల విలువైన బంగారం గెలుచుకోవచ్చని ప్రకటించింది. -
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కావాలా? తగ్గింపు ధరలో ఇదిగో బెస్ట్ ఆప్షన్!
సాక్షి, ముంబై: లావా అగ్ని-2 5జీ స్మార్ట్ఫోన్పై తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 2000 తగ్గింపుతో బుధవారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు (మే 24) నుండి ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) లావా అగ్ని 2 5జీ ఫీచర్లు 6.78-అంగుళాల FHD+ స్క్రీన్, మీడియా టెక్ సరికొత్త డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్పీ కెమెరా 1.0-మైక్రాన్ (1 um) పిక్సెల్ సెన్సార్తో 50ఎంపీ క్వాడ్ కెమెరా 8 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 6W ఛార్జర్తో 4700mAh బ్యాటరీ ఫోన్ ధర రూ. 21,999 వద్దర ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రధాన క్రెడిట్ , డెబిట్ కార్డ్లపై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో రూ. 19,999 లభించనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!) ఇదీ చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు రూ.1,818 ధరకే విమాన టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ సేల్ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు అందుబాటులో ఉండనుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జులై 1, 2023 నుంచి మార్చ్ 30 ,2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో పాటు 2023లో 18 ఏళ్లు వయసున్న ప్రయాణికులకు రూ.3,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్ను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ కూపన్ కోసం జూన్ 10 తేదీలోపు స్పైస్జెట్కు తమ వివరాలను ఈమెయిల్ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్ బుక్ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి. అయితే, ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. టికెట్ బుకింగ్ విలువ రూ.7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్జెట్ తెలిపింది. స్పైస్మ్యాక్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. Your destination: Savings! Celebrate our 18th anniversary with sky-high discounts. Book your tickets now at https://t.co/PykmFjGBqZ#flyspicejet #spicejet #18thAnniversary #SpiceJetAnniversary #sale #Travel #travelgram #Aviation #travelwithus #addspicetoyourtravel pic.twitter.com/2rjYDRXQ54 — SpiceJet (@flyspicejet) May 23, 2023 -
అదిరిపోయే క్రెడిట్ కార్డ్, భారీ డిస్కౌంట్లు.. ఉచితంగా రైల్వే సదుపాయాలు!
హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుపై లైఫ్స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం! -
మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి బాలెనొ: ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ..
యాపిల్ ఐఫోన్14 (Apple iPhone 14)పై ఈ-కామర్స్ సంస్థలు వరుసకట్టి ఆఫర్లు ప్రకటించాయి. పోటీ పడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు విజయ్ సేల్స్ అనే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్పై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఐఫోన్ 14 కొనుక్కోవాలనుకుంటున్నవారికి ఇప్పుడే సరైన సమయం. ఇదీ చదవండి: Amazon Great Summer Sale: ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్.. ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు! ఫ్లిప్కార్ట్లో అత్యధిక డిస్కౌంట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 128జీబీ వేరియంట్ ఐఫోన్14పై అత్యధికంగా 12 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై ఐదు శాతం క్యాష్బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఫ్లిప్కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్14 మీ సొంతం అవుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్ఫోన్కు కండీషన్ను బట్టీ గరిష్టంగా రూ.29,250 వరకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్లు ఐఫోన్14ని అమెజాన్ 10 శాతం తగ్గింపుతో రూ.71,999లకు విక్రయిస్తోంది. అలాగే వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ. 4,000 వరకు ఆఫర్లను కూడా అందిస్తోంది. అదనంగా ట్రేడ్-ఇన్ ఆఫర్ను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.19,700 వరకు తగ్గింపు ఉంటుంది. తద్వారా రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్14ను కొనుక్కోవచ్చు. విజయ్ సేల్స్లో యాపిల్ డేస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తోపాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్14పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో కొనసాగుతున్న యాపిల్ డేస్లో భాగంగా కేవలం రూ.70,999లకే ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్14పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ కార్డ్లపై రూ.4,000 క్యాష్బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్లపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు వంటి ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్త రెనాల్ట్ కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీనికొత్త వేరియంట్ను తీసుకొచ్చింది. రెనాల్ట్ XT (O) MT వేరియంట్ ధరను 7.99 (ఎక్స్ షోరూం) లక్షలుగా నిర్ణయించింది. రెనాల్ట్ కైగర్ ఎక్స్టీ(ఓ) ఎ ంటీ ఇంజీన్, ఫీచర్లు 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99bhp, 152Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు రెనాల్ట్ కైగర్ గ్లోబల్ ఎన్సిఎపి ద్వారా అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ను కూడా అందుకుంది, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ భద్రత కోసం, నాలుగు ఎయిర్బ్యాగ్లు, ప్రీ-టెన్షనర్లతో కూడిన సీట్బెల్ట్లు, స్పీడ్ అండ్ క్రాష్-సెన్సింగ్ డోర్ లాక్లు , ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్స్క్రీన్, ఎన్ఈడీ హెడ్ల్యాంప్లు, అల్లాయ్ వీల్స్ , హై సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. (మెట్గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) రెనాల్ట్ ఆర్ఎక్స్ జెడ్పై డిస్కౌంట్ కొత్త వేరియంట్ లాంచ్తో పాటు, Renault RXZ ట్రిమ్పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్ కొనుగోలపై రూ. 10వేల నగదు, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 12వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్తోపాటు రూ. 49వేల లాయల్టీ ప్రయోజనాలు లాంటి ఆఫర్లను కూడా ప్రకటించింది ఇదీ చదవండి: దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ! -
ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు!
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus)పై ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ భారతదేశంలో రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దీనిపై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అదనం. యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ 89,999 ఉండగా ఫ్లిప్కార్ట్లో ఇది ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.77,999లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల విషయానికొస్తే, పాత మోడల్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 29,500 వరకు పొందవచ్చు. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు! ఇక రూ. 99,900 ఉన్న 256GB వేరియంట్ ఫోన్ రూ. 87,999లకే కొనుక్కోవచ్చు. రూ. 1,19,900 ధర ఉన్న 512GB వేరియంట్ రూ. 1,07,900లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 14 ప్లస్ పర్పుల్, స్టార్లైట్, మిడ్నైట్, బ్లూ, ప్రొడక్ట్ (రెడ్), ఎల్లో కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్14పైనా తగ్గింపు రూ. 79,999 ధరతో ప్రారంభమైన యాపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 71,999లకే అందుబాటులో ఉంది. అంటే రూ. 8,000 డిస్కౌంట్. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు పరిమాణం మినహా యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. రెండూ A15 బయోనిక్ చిప్సెట్తో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్నాయి. కెమెరా పరంగా ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్ 12MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: ఊరిస్తున్న కార్లు వచ్చేస్తున్నాయి.. మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. -
రాయితీకి జై కొట్టారు.. పన్నులు కట్టేస్తున్నారు
కొవ్వూరు: ఐదు శాతం పన్ను రాయితీ అందిపుచ్చుకున్నారు.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పన్నుదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.. మున్సిపాలిటీల్లో ఈ రాయితీకి విశేష స్పందన లభిస్తోంది. గడచిన ఇరవై నాలుగు రోజుల్లో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో ఏకంగా రూ.28.63 కోట్ల పన్నులు వసూలయ్యాయి. గత ఏడాదితో పోల్చితే రూ.4.79 కోట్లు అదనంగా వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం పన్ను రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఈ రాయితీ పొందడానికి మరో ఐదు రోజులే గడువే ఉంది. దీనిపై పురపాలక సంఘాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాదిలో చెల్లించాల్సిన పన్ను అంతా ఏకమొత్తంలో కడితే ఐదు శాతం రాయితీ లభిస్తుంది. మిగిలిన రోజుల్లో మరో రూ.నాలుగైదు కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతెంత.. ప్రస్తుతం సాధారణ రోజుల్లో కంటే పన్నుల వసూళ్లు నాలుగైదు రెట్లు అదనంగా ఉంది. గత ఏడాది మే 24 నాటికి తూర్పుగోదావరి జిల్లాలో రూ.1,017.73 లక్షలు వసూలైతే ప్రస్తుతం రూ.1,307.76 లక్షలు వచ్చింది. అంటే రోజుకు గత సంవత్సరం రూ.42.40 లక్షలు సరాసరి కాగా ఇప్పుడు రూ.54.49 లక్షల చొప్పున పన్నులు చెల్లించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో గరిష్టంగా రోజుకు సరాసరిన రూ.48 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున పన్నులు వసూలవుతున్నాయి. కొవ్వూరులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల చొప్పున, నిడదవోలులో రూ.3 లక్షల చొప్పున వస్తుంది. ఫ కాకినాడ జిల్లాలో గత ఏడాది రూ.1,080.37 లక్షలు వసూలైతే ఈ సంవత్సరం రూ.1,323.21 లక్షలు వసూలు చేశారు. అంటే గడచిన ఏడాది కంటే ఇప్పుడు రూ.242.84 లక్షలు అదనంగా వసూలైంది. రోజుకు పన్ను వసూలు సరాసరి రూ.45 లక్షల నుంచి రూ.55.13 లక్షలకు పెరిగింది. ఫ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఐదు శాతం పన్ను రాయితీ అంత ఆశాజనకంగా లేదు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి రూ.53.9 లక్షలు తక్కువ వసూలైంది. జిల్లా వ్యాప్తంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.286.13 లక్షలు వసూలైతే ఈ ఏడాది 24వ తేదీకి రూ.232.23 లక్షలు వచ్చింది. జిల్లాలో రోజువారీ సరాసరి పన్నుల వసూలు గత ఏడాది రూ.11.92 లక్షలుంటే, ఇప్పుడు రూ.9.67 లక్షలు ఉంది. -
Viral Video: చీరల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
కర్ణాటక: తగ్గింపు ధరలకు చీరలు కొనే సమయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం జరిగింది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం 8వ మెయిన్ రోడ్డులోని ఒక షాపులో జరిగింది. మైసూరు పట్టు చీరలను 35 శాతం తగ్గింపు ధరలతో అమ్ముతున్నట్లు బోర్డు పెట్టారు. ఆదివారం సెలవు కావటంతో పెద్దసంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. ఒకే చీరను ఇద్దరు మహిళలు ఎంచుకున్నారు, చీరను వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలై జడలు పట్టుకొని కొట్టున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఇతర మహిళలు ఇద్దరినీ విడిపించారు. Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0 — RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023 -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే..!
భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతున్న కార్ల తయారీ సంస్థల్లో ఒకటి 'ఫోక్స్వ్యాగన్' (Volkswagen). ఈ జర్మన్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే టైగన్, వర్టస్ వంటి కార్లను మంచి సంఖ్యలో విక్రయిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ ఈ మోడల్స్ మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 2022 - 2023 మధ్యలో తయారైన బిఎస్-6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న మోడల్లకు కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. దీని కింద ఫోక్స్వ్యాగన్ కార్లను కొనాలనుకునే వారు టైగన్ ఎస్యూవీపై గరిష్టంగా రూ. 1.41 లక్షలు, వర్టస్ సెడాన్పై రూ. 1.03 లక్షల తగ్గింపు పొందవచ్చు. 2022 మోడల్ టైగన్లో మీరు ఎంచుకున్న వేరియంట్ను బట్టి రూ. 65,000 నుంచి రూ. 1.41 లక్షల వరకు తగ్గింపులు లభిస్తాయి. ఇందులో టైగన్ టాప్లైన్ మాన్యువల్ వేరియంట్పై ఎక్కువ, కంఫర్ట్లైన్ మాన్యువల్ వేరియంట్ మీద తక్కువ తగ్గింపు లభిస్తుంది. ఇక 2023 టైగన్ కొనుగోలుపై రూ. 91,000 బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉన్న 2023 మోడల్ టైగన్ మీద గరిష్టంగా రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) ఇప్పుడు వర్టస్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్పై రూ. 1.03 లక్షలు, 2022 ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. 2023 మోడల్ వేరియంట్ను బట్టి డిస్కౌంట్లు రూ. 20,000 నుంచి రూ. 65,000 వరకు తగ్గింపు, అదే సమయంలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉండే మోడళ్లపై ఎంచుకున్న వేరియంట్ను బట్టి రూ. 20,000 నుంచి రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది. కంపెనీ అందించే ఈ ఆఫర్ ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక డీలర్ నుంచి డీలర్కు మారే అవకాశాలు ఉన్నాయి. కావున కొనుగోలుదారుడు ఫోక్స్వ్యాగన్ కొనేటప్పుడు ఖచ్చితమైన వివరాలను పొందటానికి సమీపంలో ఉన్న డీలర్ను సంప్రదించడం మంచిదని భావిస్తున్నాము. -
అక్షయ తృతీయ ‘బంగారం’
సాక్షి, అమరావతి: అక్షయ తృతీయ సందర్భంగా రాష్ట్రంలోని పలు బంగారు నగల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర రూ.62,000 దాటినప్పటికీ వినియోగదారులు వెనుకాడలేదు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది బాగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అయిదురెట్లకు పైగా ఎక్కువ వ్యాపారం జరిగినట్లు చెప్పారు. అక్షయ తృతీయ పర్వదినం పేరుతో అమ్మకాలు పెంచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు 15 రోజుల నుంచి భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల శనివారం ఉదయం ఏడు గంటల నుంచే అమ్మకాలు మొదలయ్యాయి. అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారమూ ప్రత్యేక అమ్మకాలు కొనసాగనున్నాయి. సాధారణంగా తిరుపతి పట్టణంలో సగటున రోజుకు రూ.10 కోట్ల వరకు బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతుంటాయని, కానీ శనివారం దానికంటే అయిదు రెట్లుకుపైగా ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తిరుపతి జ్యువెలరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ తెలిపారు. బంగారం ధర రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోళ్లు తక్కువగా ఉంటాయని అంచనా వేశామని, కానీ దానికి భిన్నంగా కొనుగోలుదారులు భారీగా బంగారాన్ని కొన్నారని విజయవాడలోని ఓ కార్పొరేట్ షాపు ప్రతినిధి ఒకరు తెలిపారు. గతేడాది అక్షయ తృతీయ రోజుకు పదిగ్రాముల బంగారం ధర రూ.53,000 ఉంటేనే కొనుగోళ్లకు అంతగా ముందుకు రాలేదని, సెంటిమెంట్ కోసం చాలా మంది నాణేలతో సరిపెట్టారని తెలిపారు. కానీ ఈ ఏడాది ధర ఎక్కువైనా కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. అక్షయ తృతీయ రోజునే పవిత్ర రంజాన్ పర్వదినం రావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణంగా వ్యాపారులు వివరించారు. నగరాలకే పరిమితం అక్షయ తృతీయ అమ్మకాలు కేవలం పట్టణాలు అందులోనూ కార్పొరేట్ జ్యూవెలరీ సంస్థలకే ఎక్కువగా పరిమితమయ్యాయి. విశాఖ, తిరుపతి, విజయవాడ, నెల్లూరు వంటి నగరాల్లోనే అక్షయ తృతీయ సందడి అధికంగా కనిపించింది. కేవలం కార్పొరేట్ సంస్థల్లో తప్ప చిన్న షాపుల్లో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగినట్లు విశాఖ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50,000కుపైగా నగల దుకాణాలు ఉన్నప్పటికీ ఈ పండుగ అమ్మకాలు రెండొందల షాపులకే పరిమితమైనట్లు జ్యూవెలరీ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన థార్ కొనుగోలుదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఆఫ్ రోడర్ కొనుగోలు చేసేవారు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం డిమాండ్ తగ్గకుండా గొప్ప అమ్మకాలతో ముందుకు సాగుతున్న థార్ ఎంతోమంది ఆఫ్ రోడర్లకు ఇష్టమైన వాహనం. ఇప్పటికి కూడా ఈ SUV కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో కంపెనీ థార్ కొనుగోలు మీద రూ. 65,000 తగ్గింపుని అందించనుంది. నివేదికల ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన డీలర్షిప్లలో మాత్రమే మహీంద్రా థార్పై రూ. 65,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 40వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎంచుకున్న వేరియంట్పై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల మహీంద్రా థార్ ధరలు రూ. 1.05 లక్షల వరకు పెరిగాయి. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD వేరియంట్ ధర ఇప్పుడు మునుపటికంటే రూ. 55,000 ఎక్కువ. దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ 4WD వెర్షన్ ధర రూ. 13.49 లక్షల నుంచి రూ. 16.77 లక్షల మధ్య ఉంది. -
ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!
ప్రత్యేకంగా యాపిల్ ప్రీమియమ్ ఉత్పత్తులను విక్రయించే దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ (Maple) అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14)పై ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో ఐఫోన్ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవచ్చు. లేదా నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్తో ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! ప్రస్తుతం ఐఫోన్ 14 512 GB ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్ఎఫ్సీ క్యాష్బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్లపైనా కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్, హెచ్డీఎఫ్సీ క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్లను పొందవచ్చు. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు ఇక ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్ను మాపుల్ కల్పిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్తో ఐఫోన్ 14ను అందిస్తోంది. ముంబై, మంగళూరులో స్టోర్లను కలిగి ఉన్న మాపుల్ దేశమంతటా ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది. 5 లక్షల మందికిపైగా కస్టమర్లను కలిగి ఉంది. లేటెస్ట్ ఐఫోన్లు, మాక్బుక్లు, ఐపాడ్లు, యాపిల్ వాచ్లపై ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి సమీపంలోని మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో maplestore.in ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్కుక్ -
మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్ టాక్స్
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనాల ఎక్స్షోరూమ్ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ విడదుల చేసి, అమలు ప్రారంభించింది. మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న పన్ను.. ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. -
ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!
యాపిల్ ఐఫోన్13పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 ఒక సంవత్సరం పాతదే అయినా ఇప్పటికీ చాలా మంది దాన్ని కొనడానికి చూస్తున్నారు. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 13 ధర రూ.69,990. కానీ ఫ్లిప్కార్ట్లో దీనిపై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఐఫోన్13 128జీబీ వేరియంట్ రూ.60 వేల కంటే తక్కువకే లభిస్తోంది. యాపిల్ ఐఫోన్13 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.69,990. దీనిపై ఫ్లిప్కార్ట్ రూ.10,901 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.58,999కే ఐఫోన్13ను సొంతం చేసుకోవచ్చు. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించడం ద్వారా అదనంగా మరో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు . అంటే రూ.57,999కే ఐఫోన్13 మీ చేతికి వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మర్ సేల్లో భాగంగా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సమ్మర్ సేల్ ఏప్రిల్ 17న ముగియనుంది. ఐఫోన్13 ఫీచర్లు ఇవే.. సిరామిక్ షీల్డ్తో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే సాధారణ పరిస్థితుల్లో 800 నిట్లు, HDRతో 1200 నిట్ల బ్రైట్నెస్ Apple A15 బయోనిక్ చిప్సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పోర్ట్రెయిట్ మోడ్, ఆటోమేటిక్ నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వంటి అనేక రకాల ఫీచర్లు ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ (బిహు, వైశాఖి) పురస్కరించుకుని ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తాజాగా ఏప్రిల్ 17 నుంచి 19 మధ్య ట్రావెల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. బస్ టికెట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ. 3,000 వరకు క్యాష్బ్యాక్, 1 బస్ టికెట్ కొంటే 1 టికెట్ ఉతం వంటి ఆఫర్లను కూడా పొందేందుకు అవకాశం ఉందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వివరింంది. 2,500 పైలుకు బస్ ఆపరేటర్ల నుంచి తక్కువ చార్జీలకే టికెట్లు పొందవచ్చని తెలిపింది. -
మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం
అసలే ఎండలు మండిపోతున్నాయి, భానుడి ఉష్ణోగ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది ఎయిర్ కూలర్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే AC ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది కొనటానికి సంకోచిస్తారు. అలాంటి వారికోసం ఫ్లిప్కార్ట్ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చింది. దేశీయ ఆన్లైన్ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ కొత్త ఏసీ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ కథనంలో భారతీయ విఫణిలో రూ. 40,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఏసీలను గురించి తెలుసుకుందాం.. ఎల్జీ ఏఐ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: ఎల్జీ కంపెనీకి చెందిన 1.5 టన్ ఎల్జీ ఏసీ ధర ఫ్లిప్కార్ట్లో రూ. 37,990. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 10 శాతం లేదా రూ.1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఇందులో 6 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది. అంతే కాకుండా ఏఐ డ్యూయెల్ ఇన్వర్టర్ 2 వే స్వింగ్, హెచ్డీ ఫిల్టర్ విత్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. శాంసంగ్ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: శాంసంగ్ కంపెనీకి చెందిన 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ధర దేశీయ మార్కెట్లో రూ. 35,499. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో 10% లేదా రూ. 1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఈ ఏసీలో 5 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉండటం వల్ల పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. బ్లూ స్టార్ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: మార్కెట్లో 1.5 టన్ బ్లూ స్టార్ ఏసీ ధర రూ. 36,190. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొనుగోలుచేసే కస్టమర్లు ఇప్పుడు 10% ఆఫర్ పొందవచ్చు. ఈ ఏసీలో 4 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉండటం వల్ల మంచి పనితీరుని అందిస్తుంది. సెల్ఫ్ డయగ్నాసిస్, డస్ట్ ఫిల్టర్, స్టెబులైజర్ ఫ్రీ ఆపరేషన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: వోల్టాస్ కంపెనీకి చెందిన 1.5 టన్ ఏసీ ధర రూ. 33,490 మాత్రమే. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 10 శాతం లేదా రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఆటో అడ్జెస్టెబుల్ టెంపరేచర్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే! మహీంద్రా కార్లపై భారీ తగ్గింపు..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ ఉత్పత్తుల కొనుగోలు మీద ఈ నెలలో (ఏప్రిల్ 2023) భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్స్, బెనిఫీట్స్ అన్నీ మహీంద్రా మొరాజో, బొలెరో, బొలెరో నియో, థార్ 4RD, XUV300 కొనుగోలుపై పొందవచ్చు. మహీంద్రా మొరాజో: మహీంద్రా కంపెనీ ఇప్పుడు మొరాజో కొనుగోలుపైన ఏకంగా రూ. 72,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ తగ్గింపు టాప్ స్పెక్ M6 వేరియంట్పై లభిస్తుంది. అయితే బేస్ వేరియంట్ M2, మిడ్-స్పెక్ వేరియంట్ M4+ మీద వరుసగా రూ. 58,000, రూ. 34,000 తగ్గింపుని పొందవచ్చు. మహీంద్రా బొలెరో: మహీంద్రా బొలెరో కొనుగోలుపైన ఇప్పుడు రూ. 66,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ మీద రూ. 51,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. ఇక మిడ్-స్పెక్ B6 వేరియంట్ మీద రూ. 24000, ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ మీద రూ. 37000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా XUV300: XUV300 కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 52,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా W8 డీజిల్ వేరియంట్ కొనుగోలుపై రూ. 42,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. అదే సమయంలో W8(O), W6 డీజిల్ వేరియంట్ల మీద వరుసగా రూ. 22000, రూ. 10000 తగ్గింపు & పెట్రోల్ వేరియంట్స్ అయిన డబ్ల్యూ8(ఓ), డబ్ల్యూ8, డబ్ల్యూ6 వేరియంట్లపై వరుసగా రూ. 25000, రూ. 20000, రూ. 20000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా బొలెరో నియో: బొలెరో నియో టాప్ స్పెక్ వేరియంట్స్ N10, N10 (O) మీద రూ. 48,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 36,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 12,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. మిడ్ స్పెక్ వేరియంట్, ఎంట్రీ లెవెల్ మోడల్ మీద రూ. 30000, రూ. 22,000 డిస్కౌంట్ లభిస్తుంది. మహీంద్రా థార్ 4X4: దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ కొనుగోలుపై కూడా ఇప్పుడు రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇది కేవలం థార్ 4WD వేరియంట్ మీద మాత్రమే లభిస్తాయి. ఇందులో కూడా AX(O), LX అనే రెండు ట్రిమ్ల మీద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ అందించే డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు ఏప్రిల్ నెలలో మాత్రమే డిస్కౌంట్స్ వర్తిస్తాయి.