-
గుప్త నిధుల కోసం తవ్వకాలు
పల్నాటి వీరుల గుడిలో ఘటన కారంపూడి : కారంపూడి (కార్యమపూడి)లోని పల్నాటి వీరుల గుడిలో గుప్త నిధుల కోసం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. క్రీ.శ.1182లో ప్రసిద్ధ పల్నాటి యుద్ధంలో వీరులు వాడిన ఆయుధాలున్న గుడిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయంత్రం ఏడు గంటలకు పూజారి పూజల పెదనరసింహ గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 9 గంటలకు గుడికి వచ్చిన ఆయనకు గేటు తాళాలు పగుల గొట్టి కనిపించాయి. గర్భగుడిలో బండలు తొలగించి గుంత తవ్వి, మళ్లీ మట్టిపూడ్చి బండలు పెట్టినట్లుగా సంఘటన స్థలం ఉంది. ఈ ఘటనపై పీఠాధిపతి పడిగు తరుణ్ చెన్నకేశవ పూజారులు ఏఎస్సై ఫైయింబర్కు ఫిర్యాదు చేశారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన గ్యాంగ్ ఈ సంఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసు, ఇంటెలిజñ న్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. శివాలయంలోనూ తవ్వకాలు.. చింతపల్లి గ్రామ పొలాల్లో ఉన్న పల్నాటి చరిత్ర కాలం నాటి శివాలయంలో కూడా గురువారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో శివాలయం పరిసరాల్లో బంగారు నాణేలు దొరికాయని స్థానికులు చెబుతారు. ఈ సంఘటనల నేపథ్యంలో పథకం ప్రకారం గుప్తనిధుల త్వకాల బ్యాచ్ ఈ సంఘటనలకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘటన స్థలానికి చేరుకున్న ప్రకాశం జిల్లా ఆచారవంతుడు నరేంద్ర తదితరులు డిమాండ్ చేశారు. రక్షిత కట్టడానికి రక్షణ ఇదేనా? పురావస్తు శాఖ 2011లో వీరుల గుడిని రక్షిత కట్టడంగా గుర్తించి రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. వీరుల గుడి నిర్వహణ పీఠాధిపతి ఆధ్వర్యంలోని పూజారులైన ఎర్రగొల్లల ఆధ్వర్యంలో ఉంది. బ్రహ్మనాయుడు చాపకూడు భవనం తదితరాలు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన వాచ్మెన్ల పర్యవేక్షణలో ఉన్నాయి. వాచ్మెన్లు సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతారు. దీంతో రాత్రి వేళల్లో రక్షణ కరువై ఈ సంఘటనకు కారణమైంది. గతంలోనూ వీరుల ఆయుధాలను కొనడం.. అమ్మడం లాంటి రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే గుప్తనిధుల కోసం అన్వేషణ జరగడం ఇదే ప్రథమం. ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఆదేశాలతో ఆ శాఖ ఏడీఏ బి.దీపక్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుప్త నిధులుంటాయనే ఊహతో జరిగిన విద్రోహ చర్యని, గుప్త నిధులున్నాయా? లేదా? అని చెప్పడం సాధ్యం కాదని దీపక్ తెలిపారు. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటి వరకు గుడి అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, రక్షణ లోపంపై డైరెక్టర్కు నివేదిస్తానని చెప్పారు. -
ఎన్ని ఉన్నా.. కూల్చేయాల్సిందే..
► అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న శిథిలావస్థలోని భవనాలను వెంటనే కూల్చివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు స్వయంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఎడతెగని వర్షం కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అంశంలో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శిథిల భవనాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా వారికి నచ్చజెప్పాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు పదిశాతం, జోనల్ కమిషనర్లు ఐదు శాతం శిథిలావస్థలోని ఇళ్లను తనిఖీ చేయాలని, ఏసీపీలు నూరు శాతం ఇళ్లు తనిఖీ చేయాలని సూచించారు. ఇతర ఆశ్రయం లేని వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్న ప్రాంతాల్లోని ప్రజలకు వాటి గురించి వివరించి వారిని ఒప్పించాల్సిందిగా జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్బ్యాక్స్ తదితరమైన వాటికి సంబంధించి వచ్చేవారం నుంచి బిల్డర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లను త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. -
ముక్కలైన రష్యా హెలికాప్టర్లు.. ట్రక్కులు
సిరియా: రష్యాపై ఆగ్రహాన్ని మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చూపించారు. తమపై సిరియా దేశ ప్రభుత్వ బలగాల అండతో దాడులకు దిగుతున్న రష్యా బలగాలు ఉపయోగించుకుంటున్న సిరియా వ్యూహాత్మక ప్రాంతంపై పదేపదే ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడింది. తియాస్ వద్ద ఉన్న ఎయిర్ బేస్ను దాదాపు ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను బీబీసీ సాధించి బయటపెట్టింది. గత కొద్ది రోజులుగా సిరియాలోని ఉగ్రవాదులను నిలువరించేందుకు రష్యా ఆ దేశంలోని తియాస్ ఎయిర్ బేస్ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే రష్యా యుద్ధ హెలికాప్టర్లు.. 20 ట్రక్కులు ఇక్కడ నిలిపి ఉంచుతుంది. ప్రస్తుతం వాటన్నింటిని కూడా ఇస్లామిక్ స్టేట్ ధ్వంసం చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. -
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యా
డెమాస్కస్: చెప్పిన మాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకు వెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటిపై కునుకులేకుండా చేస్తుంది. తమ దేశానికి చెందిన వైమానిక దళాన్ని రంగంలోకి దించి ఎక్కడికక్కడ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసిన రష్యా రాత్రిపూట కూడా దాడులు చేస్తోంది. రాత్రిపూట ప్రయోగించి నైట్ టైం క్రూయిజ్ మిసైల్స్ ను ప్రయోగించి సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలను కూల్చిపడేసింది. సిరియాలోని మూడు కీలక ఉగ్రవాద స్థావరాలపై భారీ మిసైల్స్తో రష్యా రాత్రి దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. క్యాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రయోగించిన క్షిపణి ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీని, ఆయుధ నిల్ల ప్రాంతాలను, ఇంధన స్టోరేజిలను, శిక్షణ ఇచ్చే క్యాంపులను ధ్వంసం చేసి పారేసిందని, దీంతో ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఒకప్పుడు ఘనమైన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లిన సిరియాలో నేడు ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కూడా భయాందోళనలతో తమ మాతృభూమిని వదిలి వివిధ యూరోపియన్ దేశాలకు వలస వెళుతున్నారు. దీంతో ప్రపంచంలోని శక్తిమంతమన దేశాలైన రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు సిరియాలోని ఉగ్రవాదులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాయి. -
చైనా తీరాన్ని ముంచెత్తిన సూపర్ టైఫూన్
బీజింగ్: సూపర్ టైఫూన్ దుజువాన్ చైనా తీరాన్ని ముంచెత్తింది. తీర ప్రాంతాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా జిజియాంగ్, ఫుజియాన్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఒకే ఏడాదిలో ఇది 21వ టైఫూన్. దీనివల్ల ప్రాణనష్టం తక్కువగానే(ఇద్దరు దుర్మరణం) జరిగినా గాయపడిన వారు మాత్రం అధికంగానే (324మంది) ఉన్నారు. ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది. తమ స్వస్థలాలను దాదాపు 4,30, 200 మంది ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రత్యక్షంగా 2.4 బిలియన్ యువాన్ల నష్టం సంభవించిందని, 400 నివాసాలు ధ్వంసం అయ్యాయి. 31వేల హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకుంది. అయితే, గురువారం నాటికి కొంత మేరకు వర్షాలు తగ్గిపోయి వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. -
నాటుసారా నిల్వలు ధ్వంసం
బెజ్జూరు (ఆదిలాబాద్) : భారీ మొత్తంలో దాచిన నాటుసారా నిల్వలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మరిపెడ తండాలో భారీమొత్తంలో సారా నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేసి 10 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మరో 50 లీటర్ల గుడుంబాను కూడా సీజ్ చేశారు. -
3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం
వైఎస్సార్ (పులివెందుల) : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ముద్దనూర్లలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం చేశారు. అలాగే 65 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి తొమ్మిది కేసులు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
1000 లీటర్ల సారా ధ్వంసం
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : ఎక్సైజ్, పోలీసు అధికారులు వెయ్యి లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని సుండుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని ఉండ్రరాజుపల్లి, నాయినివారిపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్, పోలీసు అధికారులు ఏక కాలంలో దాడులు చేసి 1000 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. -
'అనంత'లో భారీ వర్షం
రాయలసీమలో కరువు ప్రాంతమైన అనంతపురంలో జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. జిల్లా పరిధిలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, ధర్మవరం, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో విపరీతమైన వరణుడు విజృంభించాడు. ఇన్నిరోజులు కరుణించని వరణుడు ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో జనాన్ని బెంబేలిత్తించాడు. ఈదురుగాలులతో విరుచుకుపడ్డాడు. దెబ్బకు ఎన్నో చెట్లు నేలవాలాయి. పలు ట్రాన్స్ ఫార్మర్లలో విద్యుత్ నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. నదుల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ఈ అకాల వర్షానికి ఉరుములు, మెరుపులకు భయపడి పెవరలిలో రామక్క (65) అనే వృద్ధురాలు మరణించింది. అదే విధంగా నక్కలదొడ్డిలో లక్ష రూపాయల విలువ చేసే గడ్డివాములు పిడుగుపాటు కారణంగా దగ్ధమయ్యాయి. కరెంటు లేక పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇదిలా ఉండగా శుక్రవారం సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలిత్తించాదు. జిల్లాలోని తాడిమర్రిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దెబ్బతిన్న నర్సరీలు: రూ.కోటి నష్టం కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులకు భారీ నష్టం సంభవించింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న టమాటా, మిరప, వంగ నార్లు పెంచుతున్న నర్సరీలు గాలి తీవ్రతకు ధ్వంసమయ్యాయి. నాలుగు నర్సరీలు పూర్తిగాను, మరో 13 వరకు పాక్షికంగానూ దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.కోటి మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపారు. -
జింకల దాడితో.. పంటలు నాశనం
వల్లూరు: రబీలో సాగు చేసిన పంటలపై జింకలు దాడులు చేసి నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు చేసిన పంట మొలకెత్తక ముందే జింకలు తిని వేస్తుండటం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగుచేసిన పంటలు తమ కళ్లెదుటే నాశనమవుతుంటే ఏమి చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్లో పంటలను సాగు చేయలేక పోయిన రైతులు రబీలో నవంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ధనియాలు, బుడ్డ శనగ , నూగు , పెసర తదితర పంటలను సాగు చేశారు. మూడు మండలాల్లో తీవ్ర ఇబ్బందులు వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన ఈ పంటలపై జింకలు మందలు మందలుగా దాడులు చేసి తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. మొలకెత్తిన వెంటనే పంటను తిని వేస్తుండటంతో పలువురు రైతులు తిరిగి విత్తనం పూడుస్తున్నారు. ఆరేడేళ్లుగా జింకల సమస్య ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా సమస్య మరీ తీవ్రంగా మారింది. ఆ ఆశ అడియాసే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మూడు మండలాల సరిహద్దుల్లో పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న విమానాశ్రయం ఆవరణలో సైతం జింకల మందలు తిరుగుతుండటంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని అధికారులు గుర్తించారు. రన్వేపై జింకలు తిరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు జింకలను అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గత ఏడాది ప్రకటించారు. దీంతోనైనా తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశపడ్డారు. అయితే విమానాశ్రయం ప్రారంభానికి నోచుకోక పోవడంతో ఆ ఆశలు కూడా అడియాశలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జింకలను అటవీ ప్రాంతాలలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏనుగులు దాడి.. పంటలు ధ్వంసం
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. కుప్పం మండలంలోని మోట్లచేను, కూసూయ, డోళ్లగుట్టు గ్రామాల పరిధిలో పొలాలపై దాడి చేశాయి. అరటి, బీన్స్, టమోటా తదితర పంటలను నాశనం చేశాయి. -
వినాశనాన్ని మళ్లీ చూస్తారా?!
టీవీక్షణం: వినాశనం అన్న మాట వింటే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎన్ని యేళ్లయినా మర్చిపోలేనంత దారుణమైన వినాశనాలు, ఉత్పాతాలు చాలానే సంభవించాయి ప్రపంచంలో. ప్రపంచాన్ని కంగారు పెట్టిన అలాంటి ఘోర దుర్ఘటనలు, వినాశనాలను చూపించే కార్యక్రమమే ‘డిస్ట్రాయిడ్ ఇన్ సెకెండ్స్’. క్షణాల్లోనే పెద్ద నష్టాన్ని కలిగించిన సంఘటనలను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది డిస్కవరీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం. చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గుండె దడదడలాడుతుంది. నిజానికి ఈ కార్యక్రమం వల్ల ఉపయోగమేమీ లేదు. ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది, అలా జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలి వంటి విషయాలేమీ మనకు చెప్పరు. కాబట్టి ఆసక్తి ఉంటే చూడొచ్చు. భయమేస్తే టీవీ కట్టేయొచ్చు. గుండె బలహీనంగా ఉండేవాళ్లు చూడకపోవడమే బెటర్. -
గజ రాజుల బీభత్సం, వణుకుతున్న గిరిజనులు
హిర : శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హిర మండలం బొందిగూడలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇళ్లు, పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగులు రెచ్చిపోతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు భయంతో వణికి పోతున్నారు. అడవిలో ఉండాల్సిన ఏనుగులు ఆవాసాలలోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి. పొలాలకు వెళితే ఎటువైపు నుంచి తమపై దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు గిరిజనులను గ్రామం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. గత వారం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. -
రసాయన ఆయుధాల నాశనానికి ఏడాది పడుతుంది: బషర్ అల్-అసద్
సిరియా అధ్యక్షుడు అసద్ వెల్లడి డమాస్కస్: సిరియాలో రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ స్పష్టంచేశారు. సిరియా ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని, విదేశాల మద్దతుతోనే అల్కాయిదా చొరబాటు శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని చెప్పారు. 80కిపైగా దేశాలకు చెందిన అల్కాయిదా గెరిల్లాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. అంతేతప్ప ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కానేకాదని చెప్పారు. అమెరికా వార్తా చానల్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాలు వెల్లడించారు. రసాయన ఆయుధాలను నాశనం చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, సాంకేతికంగా ఇదో పెద్ద సంక్లిష్ట ప్రక్రియ అని అసద్ పేర్కొన్నారు. దీనికి కనీసం 100 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు.