-
9 రోజులు.. 500 కోట్ల మందికి చుక్కలు చూపించిన ఎండలు!
న్యూఢిలీ: ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ నెలలో తొమ్మిది రోజులు నమోదైన అధిక ఎండలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన ‘క్లైమెట్ సెంట్రల్’ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.జూన్ నెలలోని 9 రోజులు అధిక ఉష్ణోగ్రత నమోదై.. ఎండలు మండిపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లమంది, భారత్లో 61.9 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనాలో 57.9 కోట్ల మంది, ఇండోనేషియాలో 23.1 కోట్ల మంది, నైజిరియాలో 2.06 కోట్ల మంది, బ్రెజిల్లో 1.76 కోట్లమంది, బంగ్లాదేశ్లో 1.71 కోట్ల మంది, అమెరికా 1.65 కోట్లమంది, యూరోప్లో 1.52 కోట్ల మంది, మెక్సికోలో 1.23 కోట్ల మంది, ఎథియోపియాలో 1.21 కోట్ల మంది, ఈజిప్ట్లో 1.03 కోట్ల మంది ప్రజలు జూన్లో తొమ్మిది రోజల ఎండ వేడిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.వాతావరణ మార్పుల కారణంగా జూన్ 16 నుంచి 24 తేదీల మధ్య రోజుల్లో ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది మూడుసార్లు అధిక ఎండకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. ‘‘ సుమారు శతాబ్దం పైగా బొగ్గు, ఆయిల్, నాచురల్ గ్యాస్ను మండించటం మూలంగా ప్రపంచానికి అధిక ఎండల ప్రమాదం పెరుగుతోంది. అర్బన్ జనాభాను కట్టడి చేయకపోవటంతో ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యాయి’’ అని క్లైమెట్ సెంట్రల్ చీఫ్ ఆండ్రూ పెర్షింగ్ తెలిపారు.అదే విధంగా జూన్ 16నుంచి 24 వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4. 97 వందల కోట్ల మంది మూడు సార్లు తీవ్రమైన ఎండకు ప్రభావిత అయినట్లు క్లైమెట్ ఫిఫ్ట్ ఇండెక్స్ (సీఎస్ఐ)తెలిపిందన్నారు. భారత్లో అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన వేడి గాలులు రికార్డుస్థాయిలో నమోదైనట్ల రిపోర్టులో వెల్లడించింది. ఉష్ణోగ్రత, వేడి గాలులు కారణంగా సుమారు వంది మంది మరణించగా, 40 వేల మంది వడదెబ్బ తగిలిన కేసులు నమోదయ్యాయిని తెలిపింది. అధిక ఎండ, వడగాలులతో దేశరాజధాని ఢిల్లీ నీటి సంక్షోభం, పవర్ కట్ సంభవించినట్లు పేర్కొంది. అదేవిధంగా సౌది అరేబియాలో సైతం ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రపంచవ వ్యాప్తంగా హజ్ యాత్రకు అక్కడి వచ్చిన సుమారు 1300 మంది ఎండ తీవ్రత కారణంగా మృతి చెందారు. అదే విధంగా భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్, జూన్ నెలల్లో దేశంలో 40 శాతం మంది సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. అదీ కాక కొన్ని రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పలు చోటు రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రాత్రి పూటి ఉష్ణోగ్రత సైతం 35 డిగ్రీల వరకు నమోదైనట్లు పేర్కొంది. -
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్మెంట్కు మారినప్పుడు బీచ్లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
వాతావరణ మార్పులతో ‘బ్రెయిన్ స్ట్రోక్’
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో స్ట్రోక్ మరణాలు, పక్షవాత వైకల్య బాధితులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం ముడిపడి ఉన్నట్టు నిర్ధారించారు. 2019లో 5.20 లక్షలకు పైగా స్ట్రోక్ మరణాలపై శీతల గాలులు, మండే వేడి తరంగాలు తీవ్ర ప్రభావం చూపాయని న్యూరాలజీ జర్నల్లో ప్రచురించిన కొత్త అధ్యయనం వెల్లడించింది. స్ట్రోక్ మరణాల్లో అధిక భాగం 4.70 లక్షల కంటే ఎక్కువ మరణాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సంభవించినప్పటికీ.. 1990తో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతల పెరుగుదలతో మరణించిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు కనుగొంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంనాటకీయ ఉష్ణోగ్రత మార్పులు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చైనాలోని చాంగ్షాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీకి చెందిన అధ్యయనం నివేదిక చెబుతోంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్ట్రోక్ ప్రమాదం వేగంగా పెరుగుతోందని, పదేళ్లు దాటిన వారితో పాటు ఆఫ్రికా వంటి వెనుకబడిన దేశాల్లో ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. వృద్ధాప్యం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. భారతదేశంలో సరైన ఉష్ణోగ్రతలు లేని కారణంగా 33 వేల స్ట్రోక్ మరణాలు సంభవిస్తే.. వాటిల్లో 55 శాతం ఉష్ణోగ్రతలు పెరగడంతో, 45 శాతం ఉండాల్సిన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ప్రధాన కారణమని విశ్లేషించింది. పురుషుల్లోనే ఎక్కువఉష్ణోగ్రతల్లో మార్పులతో పక్షవాతం వచ్చి మరణించే వారి సంఖ్య ప్రతి లక్ష మందిలో 5.9 శాతం మంది మహిళలు కాగా.. పురుషుల్లో 7.7 శాతం ఉన్నట్టు అధ్యయన బృందం తేల్చింది. మధ్య ఆసియాలో లక్ష మందిలో 18 మంది అనుకూలంగా లేని (నాన్–ఆప్టిమల్) ఉష్ణోగ్రతల కారణంగా అత్యధిక స్ట్రోక్కు మరణాల రేటు నమోదైంది. శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, పారిశ్రామిక కాలుష్యం వాతావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలు పని చేయాలని సూచిస్తోంది.ఎందుకు జరుగుతోందంటే..!చల్లని ఉష్ణోగ్రతలు మానవ శరీరంలోని సునిశిత నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు రక్తనాళాల్లో అధిక రక్తపోటును పెంచి స్ట్రోక్లకు దారి తీస్తోందని అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతలో వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయని.. తద్వారా రక్తం చిక్కబడటం (క్లాట్స్) వల్ల స్ట్రోక్ ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. -
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్పూర్లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
యువతరం ఎకో–యాంగ్జయిటీ! క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన..!
‘ఈ నెట్ఫ్లిక్స్, ఐపీఎల్ మ్యాచ్ల కాలంలో వాతావరణ మార్పులపై యూత్ దృష్టి పెడుతుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని చెబుతుంది డెలాయిట్ తాజా నివేదిక. ‘డెలాయిట్ 2024 జెన్ జెడ్, మిలీనియల్స్ సర్వే’ ప్రకారం వీరిలో ఎక్కువమంది ‘క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత మాట ఎలా ఉన్నా ఎకో–యాంగ్జయిటీ అనేది వారిలో కనిపించే మరో కోణం.ఢిల్లీలో ఒకరోజు...‘ఇల్లుదాటి బయటికి వెళ్లవద్దు అని పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. అయినా సరే వారి కనుగప్పి ఇంటి నుంచి బయటికి వచ్చి అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్లాను’ అంటుంది యశ్న ధృరియా. ఇంతకీ ఇరవై సంవత్సరాల యశ్న వెళ్లింది ఎక్కడికి? ఆరోజే విడుదలైన సినిమాకు కాదు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి కాదు. మహానగరంలో జరుగుతున్న గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్లో పాల్గొనడానికి. ‘వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్’ అంటూ పర్యావరణ సంక్షోభం గురించి యశ్న కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది.‘పరీక్షలో ఫెయిలైనట్లు ఏడుస్తున్నావేమిటి?’ అని అడిగారు ఒకరు. కానీ ఆ ఒకరికి తెలియనిదేమిటంటే వాతావరణానికి సంబంధించిన కీలకమైన పరీక్షను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సంక్షోభ నేపథ్యంలో యశ్నలాంటి వాళ్లు ఆశాదీపాలై వెలుగుతున్నారు. తాము వెలుగు దారిలో పయనిస్తూ ఎంతోమందిని తమ తోపాటు తీసుకువెళుతున్నారు. ‘తెలిసో తెలియకో, ఏమీ చేయలేకో పర్యావరణ సంక్షోభంలో భాగం అవుతున్నాం’ అనే బాధ. పశ్చాత్తాపం బెంగళూరుకు చెందిన శ్రీరంజనిలో కనిపిస్తుంది. గ్లోబల్ స్ట్రైక్ మూమెంట్ ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్(ఎఫ్ఎఫ్ఎఫ్) ఇండియా’లో భాగంగా ఎన్నో కార్యక్రమాల్లో శ్రీరంజని పాల్గొంది. పర్యావరణ సంక్షోభం తాలూకు ఆందోళన తట్టుకోలేక యూత్ క్లైమెట్ యాక్టివిస్ట్లలో కొందరు ట్రీట్మెంట్కు కూడా వెళుతున్నారు. ఎన్విరాన్మెంట్ యాక్షన్ గ్రూప్ ‘దేర్ ఈజ్ నో ఎర్త్ బి’తో కలిసి పనిచేసిన దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ అగ్రిమ ఛటర్జీ పర్యావరణ సంక్షోభంపై యూత్ ఆందోళనను దగ్గరి నుంచి గమనించింది. ‘తమ పరిధిలో వారు చేయగలిగింది చేస్తున్నారు. మరోవైపు సమస్య పెద్దగా ఉంది. కొన్నిసార్లు తాము చేస్తున్న ప్రయత్నం అర్థరహితంగా అనిపించి ఆందోళనకు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు’ అంటుంది అగ్రిమ. బెంగళూరుకు చెందిన సైకోథెరపిస్ట్ మోహినీ సింగ్ ఎంతోమంది యువ క్లైమెట్ యాక్టివిస్ట్లతో కలిసి పనిచేసింది. ‘పరీక్షల్లో ఫెయిల్ కావడం, లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ సందర్భంగా ఇతరుల నుంచి సానుభూతి, ఓదార్పు దొరికినట్లు క్లెమెట్ యాంగ్జయిటీ విషయంలో దొరకదు. ఎందుకంటే అది చాలామందికి అనుభవం లేని విషయం’ అంటుంది మోహిని. శివానీ గోయల్ తన స్వరాష్ట్రం అస్సాంలో వాతావరణ విధ్వంసంపై పరిశోధన చేస్తోంది. పత్రికలకు వ్యాసాలు రాస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్ను క్రియేట్ చేస్తుంటుంది. ‘నా ప్రయత్నం ఏ కొంచమైనా ఫలితాన్ని ఇస్తుందా?’ అనేది తనకు తరచుగా వచ్చే సందేహం.‘చేయాల్సింది చాలా ఉంది’ అంటున్న గోయల్ ‘ఇక ఏమీ చేయలేం’ అనే నిస్సహాయ స్థితిలోకి వెళ్లి ఆందోళన బారిన పడి ఉండవచ్చుగానీ దాని నుంచి బయటపడడానికి క్లైమెట్ యాక్టివిస్ట్గా తిరిగి క్రియాశీలం కావడానికి ఎంతో సమయం పట్టదు. అలా తొందరగా ఆందోళన నుంచి బయటపడడమే వారి బలం. సమాజానికి వరం.ఐడియాలు ఉండగా ఆందోళన ఏలనోయి!‘పర్యావరణంపై మన ప్రేమ ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న నయన ప్రేమ్నాథ్ డే–టు–డే సస్టెయినబుల్ లైఫ్స్టైల్ ప్రాక్టీసెస్కు సంబంధించిన వీడియోలు, రీల్స్ను యువతరం ఇష్టపడుతోంది. ఆచరిస్తోంది. ‘ధరించకుండా మీరు మూలకు పడేసిన దుస్తులతో ఏంచేయాలి?’ ‘పీసీఆర్ ప్లాస్టిక్ గురించి తెలుసుకుందాం’ ‘జీరో–వేస్ట్ లైఫ్ స్టైల్’... మొదలైన వాటి గురించి బెంగళూరు చెందిన నయన ప్రేమ్నాథ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పాపులరయ్యాయి. ‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా కొంత’ అనే భావనకు మద్దతును, బలాన్నీ ఇస్తున్నాయి.పశ్చిమ కనుమల పరిమళంనా మూలాలు పశ్చిమ కనుమలలలో ఉన్నాయి. ఇల్లు బెంగళూరులో ఉంది. ప్రకృతి అంటే ఇష్టం. ‘ఇండియన్ యూత్ క్లైమెట్ మూవ్మెంట్’లో కమ్యూనిటీ ఆర్గనైజర్ని. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్తో నా ప్రయాణం మొదలైంది. ‘నేచర్ అండ్ ఫ్లూరివర్శిటీ’కి ఫౌండర్ని. అధిక జీతం, పెద్ద సంస్థ అనే దృష్టితో కాకుండా విలువలతో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల ఎకో యాంగ్జయిటీ తగ్గుతుంది. ఎక్కువ జీతం వచ్చే సంస్థలో పనిచేయడం కంటే, పర్యావరణ సంరక్షణకు ఉపయోగపడే సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... తుఫాను ఒక్కటే. అయితే మనం వేరు వేరు పడవల్లో ఉన్నాం. పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా చేయాల్సింది ఎంతో ఉంది.– శ్రీరంజని రమణ్, క్లైమెట్ యాక్టివిస్ట్ (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..) -
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్ చేశారు. ఈ థీమ్ ఉద్దేశ్యం..వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది. ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ముఖ్యోద్దేశం. అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేగాదు ఈ రోజు కుటుంబ (చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్గా తొలి భారతీయ యువతి!) -
చిరు జల్లులు.. చినుకుల్లో తడిచిన జనం (ఫోటోలు)
-
కోకో.. ధర కేక
సాక్షి అమలాపురం: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దిగుబడి తగ్గినప్పటికీ.. కోనసీమ కోకో రైతులు కలలో కూడా ఊహించని విధంగా ధర పలుకుతుండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేజీ ఎండబెట్టిన కోకో గింజల ధర రూ.200 నుంచి ఏకంగా రూ.800 వరకు ఎగబాకింది. గతేడాది నుంచి చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో దిగుబడి గణనీయంగా పడిపోవడంతో.. కోకో గింజల డిమాండ్ను బట్టి ధర పెరగడానికి కారణమైందని రైతులు చెబుతున్నారు. దశాబ్దాలుగా సాగు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కాకినాడ , తూర్పుగోదావరి, ఏలూరు, పశి్చమగోదావరి జిల్లాల్లో సుమారు 5,800 ఎకరాల్లో కోకో సాగవుతున్నట్లు అంచనా. కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో కోకో అంతరసాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నది. దిగుబడి తగ్గినా.. తూర్పుగోదావరి జిల్లాలో ఎకరాకు దిగుబడి 1.50 క్వింటాళ్ల నుంచి రెండు క్వింటాళ్ల వరకు వస్తుండగా, ఏలూరు జిల్లా పరిధిలో నాలుగు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మనదేశంతోపాటు కోకో అధికంగా ఐవరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియా, నైజీరియా వంటి దేశాలలో పండిస్తారు. ఆ దేశాల్లో 70 శాతం దిగుబడి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఆగస్టు వరకు వేసవిని తలపించే ఎండల వల్ల కోకో పూత రాలిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు దిగుబడిపై కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగటు దిగుబడి ఒక క్వింటాల్కు తగ్గింది. కాగా, గతేడాది కోకో ఎండబెట్టిన గింజల ధర క్వింటాల్కు రూ.180 నుంచి రూ.240 మధ్యలో ఉండేది. ఈ ఏడాది జనవరి నుంచి స్వల్పంగా ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.800కు చేరింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే ధర మరింత పెరిగే అవకాశముందని రైతులు అంచనా వేస్తున్నారు. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్లో ప్రకాష్ రాజ్ బర్త్డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
గడ్డ కట్టే చలిలో 16 రోజులుగా ‘‘క్లైమేట్ ఫాస్ట్"
లడఖ్కు చెందిన ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్చుక్ 'లడఖ్ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణ పరిరక్షణోద్యమంలో స్వరాన్ని వినిపిస్తున్న సోనమ్ లడఖ్ను కాలుష్య కోరల నుంచి రక్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్చుక్ విమర్శించారు. వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్" 21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. BEGINNING OF DAY 16 OF #CLIMATEFAST 120 people sleeping outdoors under clear skies. Temperature: - 8 °C 16 days of just water n salts is finally taking a toll. Feeling quite week. But I can still drag for another 25 days n perhaps will. I'm sure our path of truth will win… pic.twitter.com/jsTFlvgD4c — Sonam Wangchuk (@Wangchuk66) March 21, 2024 > సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్చుక్ క్లైమాట్ ఫాస్ట్కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం. ఎప్పటికపుడు దీక్ష వివరాలను ట్వటర్లో షేర్ చేస్తున్నారు. 16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ‘‘8 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్చుక్ కాగా ఇక్కడ పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, రాబోయే రోజుల్లో హిమానీ నదాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించిన సోనమ్ అనేక ఉద్యమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎవరీ సోనమ్ వాంగ్చుక్ 1966లో ఆల్చి సమీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక 1977లో ఢిల్లీకి తరలిపోయాడు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్లో ఎర్త్ ఆర్కిటెక్చర్ ను అధ్యయనం చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాగ్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అలాగే 2018లో రామన్ మెగసెసే అవార్డు , ఐసీఏ, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన దక్కించుకున్నారు. -
Chief Economic Adviser V Anantha Nageswaran: వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్షాప్లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
NASA: సౌర రేడియేషన్తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్షాప్లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్మెన్స్ విశ్లేíÙంచారు. -
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ను ప్రారంభించి ముంబైలోని బీచ్ల క్లీనింగ్కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
నులివెచ్చని చలికాలాలు
ఇదివరకటి చలికాలాలు వజవజ వణికించేవి. జనాలను చలిమంటలు వేసుకునేలా పురిగొల్పేవి. ఏడాదంతా బీరువాల్లో మగ్గిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువాలు ఒంటి మీదకు వచ్చేవి. ఏటా అక్టోబర్లో శరన్నవరాత్రులు మొదలయ్యే నాటికే వాతావరణంలో తేడా స్పష్టంగా తెలిసేది. గాలి పొడిబారడం, సాయంత్రం అయ్యేసరికి చిరుచలి ప్రారంభం కావడం జరిగేది. చలికాలం దుస్తులను అమ్మే దుకాణాలు ఊరూరా వీథుల్లో వెలిసేవి. ఆ దుకాణాలు జనాలతో కళకళలాడేవి. ఇక డిసెంబరు వచ్చిందంటే రాత్రంతా దుప్పట్లో ముసుగుతన్ని పడుకున్న మనుషులు ఉదయాన్నే లేచి బయటకు రావడానికి వెనుకాడే పరిస్థితులు ఉండేవి. కొన్నేళ్లుగా చలికాలాలు బాగా మారిపోయాయి. క్రమంగా నులివెచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. చలికాలాలు మనుషులను వజవజ వణికించడం అటుంచితే, ఇప్పుడవి చిరుచెమటలు పట్టిస్తున్నాయి. చలికాలం దుస్తులను అమ్మే దుకాణాలు గిరాకీల్లేక వెలవెలబోతున్నాయి. చలికాలాలు కాలక్రమేణా వెచ్చబడుతుండటం మన దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా అనుభవపూర్వకంగా తెలుసు. చలికాలాల్లో హిమపాతంతో వణికిపోయే చాలా దేశాల్లో కొద్ది సంవత్సరాలుగా చలి తీవ్రత తగ్గుముఖం పడుతూ వస్తోంది. భూతాపం పెరుగుతుండటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా శీతకాలాల్లో చలితీవ్రతలు తగ్గుముఖం పడుతుండటం, వేసవుల్లో ఉష్ణోగ్రతలు ఇదివరకటి కంటే గణనీయంగా పెరుగుతుండటం సంభవిస్తున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడచిన యాభయ్యేళ్లుగా వేసవులు వేడెక్కుతుండటంతో పోల్చి చూస్తే, చలికాలాలు ఎక్కువగా వెచ్చబడుతూ వస్తున్నాయని అమెరికాలోని నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ డికీ ఆరంట్ వెల్లడించడం విశేషం. పారిశ్రామిక విప్లవం తర్వాతి నుంచి ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన ‘గాడాడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ సైన్స్’ లెక్కల ప్రకారం 1880 నుంచి చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు కనీసంగా 1.1 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగాయి. ఈ పెరుగుదలలో దాదాపు మూడొంతులు 1975 తర్వాతి నుంచే నమోదవుతూ వస్తోంది. చలికాలాలు వెచ్చబడుతుండటం మన భారత్ వంటి ఉష్ణమండల దేశాలకు మాత్రమే పరిమితమైన పరిణామం కాదు, హిమపాతంతో వణికిపోయే చలి దేశాల్లోనూ ఈ దిశగా మార్పులు కనిపిస్తున్నాయి. హిమపాతం పరిమాణంలో గణనీయమైన తగ్గుదల నమోదవుతోంది. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ: చలి దేశాల్లో హిమపాతం పరిమాణం ►136 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 6.9 అంగుళాలు ►50 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 5.7 అంగుళాలు ►10 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 4.1 అంగుళాలు భూతాపం పెరుగుదలే కారణం భూతాపం పెరుగుదల కారణంగానే చలికాలాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉష్ణమండల దేశాల్లోనైతే, కొన్ని ప్రాంతాల్లో చలికాలంలో కూడా చిరుచెమటలు పట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. గడచిన యాభయ్యేళ్లుగా భూతాపం పెరుగుదల ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా, పద్దెనిమిదో శతాబ్ది చివర్లో పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక యంత్రాల వినియోగం పెరగడం వల్ల 1830–50 నాటికే భూతాపం పెరుగుదలలో తొలి సూచనలు కనిపించసాగాయి. జనాభా పెరుగుదల, పారిశ్రామిక విప్లవం ఫలితంగా అడవుల నరికివేత, వ్యవసాయం సహా రకరకాల అవసరాల కోసం పశుపోషణ పెరగడం, మోటారు వాహనాల ఉత్పత్తి, వినియోగం పెరగడం వల్ల పెట్రో ఉత్పత్తుల వినియోగంలో పెరుగుదల, వీటన్నింటి ఫలితంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాల పెరుగుదల భూతాపాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో భూతాపం పెరుగుదల కొన్ని దశాబ్దాలుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1880 నాటికి 13.6 డిగ్రీల సెల్సియస్ ఉండగా, 1960 నాటికి 13.9 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఇప్పుడిది 14.8 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలలో 1970 తర్వాతి నుంచి మరింతగా దిగజారింది. 1970 నుంచి 2000 వరకు ప్రతి దశాబ్దికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదవుతూ రాగా, 2000 తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఈ పెరుగుదల ప్రతి దశాబ్దికి సగటున 2.07 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. వెచ్చని చలికాలాలతో వెతలుతప్పవు చలికాలాల్లో ఉష్ణోగ్రతలు ఎప్పటి మాదిరిగా పడిపోకుండా, కొంత వెచ్చగా ఉంటే చలి బాధలు లేకుండా బాగానే అనిపించవచ్చు. అయితే, ఈ పరిస్థితి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెచ్చని చలికాలాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తాయి. ఈ వ్యాధులు కొందరికి ప్రాణాంతకం కూడా కావచ్చు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువై, అలెర్జీల వంటి బాధలు కూడా పెరుగుతాయి. కొన్నిరకాల వృక్షజాతులు గాలిలోకి పుప్పొడి వెదజల్లే కాలం మరింతగా పెరగడం వల్ల కంటి జబ్బులు, చర్మంపై దద్దుర్లు, రకరకాల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. దీనివల్ల పిల్లలు బడులకు, పెద్దలు పనులకు వెళ్లలేని రోజులు పెరుగుతాయి. విలువైన పనిదినాలు వ్యర్థమవుతాయి. నులివెచ్చని చలికాలాలు ఆరోగ్యంపై నేరుగాను, ఆర్థిక వ్యవస్థలపై పరోక్షంగాను దుష్ప్రభావం చూపుతాయి. చలికాలాలు వెచ్చబడటం వల్ల హిమాలయాలు సహా ప్రపంచంలోని పలు మంచు పర్వతాలపై పేరుకునే మంచు మందం తగ్గిపోతుంది. పర్వతాలపై మందంగా పేరుకునే మంచు వేసవికాలంలో నదుల్లోని నీటికి ఆధారం. మంచు మందం తగ్గిపోవడం వల్ల నదుల్లోకి నీటి ప్రవాహం కూడా ఆ మేరకు తగ్గిపోతుంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడి, కరవు కాటకాలు తలెత్తుతాయి. నేలలోని తేమ ఇంకిపోయి సున్నితమైన పలు వృక్షజాతులు అంతరించిపోతాయి. అంతేకాదు, ఈ పరిస్థితుల వల్ల కార్చిచ్చులు కూడా పెరుగుతాయి. వెచ్చని చలికాలాలు వేసవి తీవ్రతను మరింతగా పెంచుతాయి. వేసవి రోజులను కూడా మరింత పెంచుతాయి. ఇప్పటికైనా భూతాపాన్ని అరికట్టలేకపోతే, 2050–2100 మధ్య కాలానికి పరిస్థితులు మరింతగా దిగజారి, వేసవి బాధలు మూడురెట్లు పెరుగుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో పరిస్థితి మన దేశంలో ఈసారి చలికాలం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. మన దేశంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇదివరకటి స్థాయిలో పడిపోయే పరిస్థితులు లేవని ఐఎండీ అంచనా. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో ప్రకటించారు. మంచు ప్రదేశాల మీదుగా వీచే పడమటి గాలుల తీవ్రత తగ్గడమే కాకుండా, మరోవైపు ‘లా నినా’ పరిస్థితి నెలకొనడం వల్లనే ఈసారి చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ఈ చలికాలం వెచ్చగానే ఉంటుందని ఆయన వెల్లడించారు. మన దేశంలో 1901 నుంచి రికార్డులను చూసుకుంటే, తొలిసారిగా 1912–13 చలికాలంలో సాధారణం కంటే 0.69 సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, 1926లో సాధారణం కంటే 0.70 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శతాబ్దిలో 2009 శీతాకాలంలో సాధారణం కంటే ఏకంగా 1.25 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్థూలంగా చూసుకుంటే, 1901–2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. గంగా నది పరివాహక ప్రాంతంలోని నగరాల్లో పరిశ్రమల పెరుగుదల, దేశవ్యాప్తంగా మోటారు వాహనాల వినియోగంలో పెరుగుదల తదితర అంశాలు మన దేశంలో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఫలితంగా చలికాలాలు ఏడాదికేడాది వెచ్చబడుతూ వస్తున్నాయి. వాతావరణ మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. ఈ జాబితాలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో నమోదవుతున్న పెరుగుదలను అరికట్టేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే ఈ దేశాల్లో 2050 నాటికి అత్యంత విపత్కర పరిస్థితులు తప్పవని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జల వనరులకూ చేటు చలికాలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జలవనరులకూ చేటు తప్పదు. వెచ్చని చలికాలాలు గాలిలో తేమను పెంచుతాయి. ఫలితంగా మంచు కురిసే ప్రాంతాల్లో హిమపాతం తగ్గుతుంది. తీర ప్రాంతాల్లో అకాల వర్షాలు, తుఫానులు పెరుగుతాయి. సముద్ర తీరానికి సుదూరంగా ఉండే ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడతాయి. తీర ప్రాంతాల్లో అతివృష్టి కారణంగా నదులు, సరస్సుల్లోకి నీటి ప్రవాహం ఉధృతమవుతుంది. ‘యూఎస్ గ్లోబల్ చేంజ్ రీసెర్చ్ ప్రోగ్రామ్’ వాతావరణ మార్పులపై విడుదల చేసిన మూడో నివేదిక ప్రకారం... భూగర్భజలాల్లో అవసరమైన పోషకాలు తగ్గిపోయి, నాణ్యత లోపిస్తుంది. సముద్రాల్లో నీటిమట్టం పెరుగుతుంది. నదుల్లోని మంచినీటిని మానవ అవసరాల కోసం మళ్లించడం వల్ల నదుల్లో తగ్గిన నీటిమట్టాన్ని భర్తీ చేయడానికి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది. చెరువులు, సరస్సులు, నదుల్లో ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘హైపోక్సియా’ పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా జలవనరులను ఆశ్రయించుకుని పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. సముద్రాల్లో నీటిమట్టాలు పెరగడం, తరచు తుఫానులు, వరదలు ముంచెత్తడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి కోతకు గురవుతుంది. ఆహార ధాన్యాల పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. జలవనరులు కలుషితమై వ్యాధులు విజృంభిస్తాయి. నీటి లభ్యత, నీటి నాణ్యత క్షీణించడం వల్ల వ్యవసాయానికే కాకుండా, విద్యుదుత్పాదన రంగానికి, ఇతర మౌలిక రంగాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ప్రజారోగ్యం గడ్డు సమస్యలుగా పరిణమిస్తాయి. వ్యవసాయానికీ నష్టాలు వెచ్చని చలికాలాలు వరుసగా వస్తుంటే వ్యవసాయానికి కూడా నష్టాలు తప్పవు. ఉత్తరార్ధ గోళంలోని దేశాల్లో నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు మొదటి వారానికల్లా చలి తీవ్రత స్పష్టంగా పెరగడం సహజం. అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లయితే, పంట దిగుబడుల్లో దాదాపు 25 శాతానికి పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని బ్రిటన్కు చెందిన జాన్ ఇనిస్ సెంటర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. చలికాలంలో ఉండాల్సినంత చలి లేకుంటే, పంటల పెరుగుదల నెమ్మదించి, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని, ముఖ్యంగా చల్లని వాతావరణంలో త్వరగా పెరిగే నూనెగింజల పంటలకు మరింతగా నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలంలో ఉండాల్సినంత చలి లేకుంటే, పొలాల్లో నాటిన మొక్కలు చురుకుదనాన్ని కోల్పోతాయి. ఫలితంగా వ్యవసాయ పంటల దిగుబడి చేతికి రావాల్సిన కాలం పెరుగుతుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి గణనీయంగా క్షీణిస్తుంది. దోమలు, నల్లులు వంటి కీటకాల బెడద ఎక్కువవుతుంది. ఈ పరిస్థితులు రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు పాడి పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వెచ్చని చలికాలాల వల్ల కార్చిచ్చుల ముప్పు పెరిగి పంట భూములకు, గడ్డి భూములకు తీరని నష్టం వాటిల్లుతుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా చలికాలంలోని ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా పెరిగినా, ఆ ప్రాంతంలో పంటల దిగుబడి కనీసం 6 శాతం వరకు పడిపోతుందని, ఈ పరిస్థితి ఆహార భద్రతకు చేటు కలిగిస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండు మూడు దశాబ్దాలలో పంట దిగుబడులకు వాటిల్లే నష్టం 12 శాతం వరకు పెరగవచ్చని, ఈ శతాబ్ది చివరి నాటికి ఈ నష్టం 25 శాతానికి చేరుకోగలదని ఎఫ్ఏఓ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఏఓ అంచనాల ప్రకారం చలికాలాలు వెచ్చబడుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార పంటలైన మొక్కజొన్న, గోధుమలు, వరి, బంగాళదుంపలు, అరటి దిగుబడులు ఏడాదికేడాది తగ్గిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతే, వరి దిగుబడులు 5.5 శాతం, గోధుమ దిగుబడులు 3 శాతం, మొక్కజొన్న దిగుబడులు 3 శాతం, బంగాళదుంపల దిగుబడులు 6 శాతం, అరటి దిగుబడులు 15 శాతం మేరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలం దుస్తుల దుకాణాలు వెలవెల మన దేశంలో ఏటా దసరా రోజులు పూర్తి కాగానే నగరాల్లోను, పట్టణాల్లోనూ వీథుల పక్కన చలికాలం ధరించే స్వెటర్లు, మఫ్లర్లు, శాలువలు, మంకీ క్యాప్లు, రగ్గులు, రజాయిలు వంటి చలికాలం దుస్తులు విక్రయించే తాత్కాలిక దుకాణాలు వెలుస్తాయి. ఇదివరకు ఈ దుకాణాలు నవంబర్ ప్రారంభంలోనే జనాలతో కళకళలాడేవి. అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగేవి. గడచిన దశాబ్దకాలంలో చలికాలాల్లో ఉండాల్సినంత చలి లేకపోతుండటంతో జనాలు చలికాలం దుస్తుల కొనుగోళ్లను తగ్గించుకున్నారు. ఫలితంగా చలికాలం దుస్తుల తాత్కాలిక దుకాణాలు బేరాలు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సైతం స్వెటర్లు, మఫ్లర్లు, శాలువలు, వింటర్ కోట్లు వంటి వాటి అమ్మకాలు దాదాపుగా జరగడం లేదు. మాల్స్లో ఈ దుస్తులు ఏళ్ల తరబడి అలాగే పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో కంటే చలి ఎక్కువగా ఉండే అమెరికాలోను, పలు యూరోప్ దేశాల్లోనూ కనిపిస్తోంది. ‘కొద్ది సంవత్సరాలుగా మా స్టోర్స్లో స్వెటర్లు, వింటర్ జాకెట్లు, కోట్లు వంటివి పేరుకుపోయి ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి డిస్కౌంట్లు భారీగానే ప్రకటించాం. అయినా, వీటి అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు’ అని అమెరికాలోని హెచ్ అండ్ ఎం స్టోర్స్ సీఈవో హెలీనా హెల్మర్సన్ మీడియా వద్ద వాపోవడం వెచ్చని చలికాలాల పరిస్థితికి అద్దంపడుతోంది. -
చేసిన బాసలు చెదిరిపోతే ఎలా?
‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) సమావేశాలు దుబాయ్లో ప్రారంభమయ్యాయి. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు ఇవి. ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ సైతం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా పుడమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం.అంత స్థాయికి చేరడం భూమిని కాష్ఠం చేసినట్లే. ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. వాతావరణం విషయంలో ఎన్నో రికార్డులు బద్ధలైన సంవత్సరం ఇది.ఇంకో నెల మాత్రమే ఉన్న 2023లో వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షించుకునేందుకు ఉద్దేశించిన ‘కాప్– 28’ సమావేశాలూ మొదలయ్యాయి. అంతర్జాతీయ సమాజం ఏదో ఒక అత్యవసర చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందన్న ప్రమాద ఘంటికలూ వినిపిస్తున్న తరుణమిది! ఐక్యరాజ్య సమితి సమావేశం (కాప్–28) ఇంకోటి దుబాయ్లో నవంబరు 30వ తేదీ మొదలైంది. ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నవి. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలూ, వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచదేశాలన్నీ కూర్చుని సమీక్షి స్తారిక్కడ. మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమా అని ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒకటి 2015 నాటి ‘ప్యారిస్ ఒప్పందం’. అత్యవసరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాలు కోకొల్లలు. అన్నింటి లక్ష్యం మాత్రం ఒక్కటే. సురక్షితమైన భూమి! ఈ అంతర్జాతీయ నిర్ణయాలు, చట్టాలు లేకపోయి ఉంటే భూమి సగటు ఉష్ణోగ్రతలు 2,100 నాటికి కనీసం నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగి పోతాయి. అయితే ఇప్పుడేదో చాలా గొప్పగా జరిగిపోతుందని కాదు. ఎందుకంటే భూమి ఇప్పటికీ ప్రమాదం నుంచి బయటపడలేదు మరి!ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ కూడా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా భూమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం. 2021 నాటి ‘గ్లాస్ గౌ’ సమావేశాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేస్తామని ప్రపంచం ప్రతిన బూనింది! షరతుల్లేని వాగ్దానాల విషయానికి వస్తే... ఇవి కూడా పూర్తిస్థాయిలో అమలైన పక్షంలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది 2.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఐపీసీసీ 2022 నాటి నివేదిక కూడా దేశాల ఆర్థికసాయంలో మూడు నుంచి ఆరు రెట్లు తక్కువగా అందినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. భూమి సగటు ఉష్ణోగ్రతలు 2.9 డిగ్రీ సెల్సియస్కు పెరగ డమంటే భూమిని కాష్ఠం చేసినట్లే! ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మనిషిపై వీటి ప్రభావం కూడా అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఊహించుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఇది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే దుబాయ్లో మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఐరాస వాతావరణ చర్చలే సరిపోవు... వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే కేవలం చర్చలు సరిపోవు. ప్యారిస్ ఒప్పందం ఏకాభిప్రాయంపై ఏర్పడని కారణంగా... నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైన వ్యవస్థ లేక పోవడం వల్ల మనం అనుకున్నంత వేగంగా పురోగతి సాధించ లేకపోయాం. ఈ ఒప్పందంలో కేవలం కొన్ని వాగ్దానాలూ, ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. కొంత వినూత్నంగా ఆలోచించ గలిగితే ఇంతకంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని అప్పట్లోనే చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు కానీ పట్టించు కున్నది కొందరే! ఏదో ప్రజల ఆందోళనను కొంత నెమ్మదింప జేసేందుకా అన్నట్లు గొప్ప గొప్ప ప్రకటనలైతే జారీ అయ్యాయి. ఈ ప్రకటనలు మఖలో వచ్చి పుబ్బలో పోయే రకాలు. 2021లో జరిగిన గ్లాస్గౌ సమావేశాల్లో... ‘దశల వారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించాలి’ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తొలగించాలన్న విషయానికి భారత్ అభ్యంతరం తెలిపింది. ఫలితంగా దశలవారీగా అన్న పదం వచ్చి చేరింది. అయితే భారత్లోనే కాదు... చాలా దేశాల్లోనూ బొగ్గు వాడకం తగ్గనూ లేదు. పూర్తిగా నిలిచిపోనూ లేదు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే దానికి సర్వతోముఖ ప్రయత్నాలు అవసరం. భాగస్వాములందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐరాస చర్చలు ఈ అంశంపై నియమ నిబంధనలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. దుబాయ్లో జరిగే చర్చలు మన లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాలి. అలాగే దేశాలు తగిన చర్యలు తీసుకునేలా చేయాలి. కాప్–28 లక్ష్యం ఇదే కావాలి. తొలిసారి ప్రపంచస్థాయి సమీక్ష... దుబాయ్లో జరుగుతున్న కాప్–28 సమావేశాల్లో మొట్ట మొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై తాజా సమీక్ష ఒకటి చేపట్టనున్నారు. ‘గ్లోబల్ స్టాక్ టేక్’ ద్వారా ప్యారిస్ ఒప్పందం అమలు విషయంలో ఇప్పటికి మనం సాధించింది ఏమిటి? సాధించాల్సింది ఏమిటన్న స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధ మయ్యాయి. ఆశయాలకు, ఆచ రణకు మధ్య అంతరాన్ని విస్ప ష్టంగా ఈ నివేదికల్లో పేర్కొ న్నారు. కాప్–28 ఇంకో ముంద డుగు వేసి ప్రపంచం నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్న విష యాన్ని స్పష్టం చేయాలి. ప్రస్తుత వాగ్దానాలు సరిపోవని, ఆర్థిక సహకారం తగినంత అందని నేపథ్యంలో వీటి అమలు కూడా అసాధ్యమన్న విషయాన్ని సుస్పష్టం చేయాలి. కాప్–28 ద్వారా ప్రపంచానికి అందించాల్సిన సందేశం ఇంకోటి కూడా ఉంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, అందుకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడంపై ఎక్కువ దృష్టి పెట్టక పోవడం మంచిది. ఎందుకంటే గతంలో కాప్ సమావేశాలు మిగిలిన విషయాలను పక్కనబెట్టి కేవలం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకన్నట్లు భారీ భారీ లక్ష్యాలు ప్రకటించి చతికిలబడ్డాయి కాబట్టి! ఈ రకమైన భారీ లక్ష్యాలు చాలాసార్లు ఆయా దేశాల ఆశయాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. జాతీయ రాజకీయాలు పరిస్థి తులు (కొన్ని సందర్భాల్లో చట్టపరమైన అంశాల) అసలైన, ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయే కానీ.. అంతర్జాతీయ ఒత్తిడి కాదు. ఈ లక్ష్యాలకు అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞాన, మానవ వనరుల పరమైన సాయం లభించినప్పుడు మాత్రమే వాస్తవంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. తద్వారా మన విశ్వాసం మరింత పెరుగుతుంది. మరింత ఉన్నత స్థాయి లక్ష్యాల కోసం పనిచేసే స్థైర్యం లభిస్తుంది. లక్ష్యాలకన్నా ఆచరణ మిన్న వాతావరణ మార్పులను తట్టుకునేందుకు చేయాల్సిన పనుల విషయంలోనూ కొంచెం పట్టువిడుపు ధోరణి అవసరం. మరింత కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే సంప్ర దాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని, ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాప్–28 వేదికగా పిలుపునివ్వాలి. దీనికీ శిలాజ ఇంధనాల వాడకం తగ్గేందుకూ మధ్య పొంతన కుదిరేలా చూడాలి. అంటే.. లక్ష్యాలను నిర్దేశించడం కాకుండా మార్పు జరిగేందుకు, సక్రమ అమలుకు పూనికగా నిలవాలి అని అర్థం. దీనికి అదనంగా కాప్–28 బాధ్యతల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేశాల అంతర్గత లక్ష్యాలు కావచ్చు. దేశాల మధ్య కావచ్చు అన్నింటి విషయంలో సమదృష్టి పాటించడం అవసరం. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించాలంటే వ్యవస్థలకు వ్యవస్థలు మారాల్సి ఉంటుంది. ఇది కొంత విధ్వంసాన్నయితే సృష్టిస్తుంది. దీని ప్రభావం కూడా దిగువ వర్గాలపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా న్యాయమైన, అందరినీ కలుపుకొనిపోయే ఏర్పాట్లు అవసరం. ప్రత్యామ్నాయ జీవ నోపాధులతో పాటు తమదన్న భావనను కల్పించడం కీలక మవుతుంది. కాప్–28 సమా వేశాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి అమలును చురు కుగా పర్యవేక్షించడం ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత తక్షణ కర్తవ్యం కావాలి. ఐక్యరాజ్య సమితి పరిధిలో.. బయట కూడా చేసిన వాగ్దానాలు నెరవేరేలా చూసేందుకు ఒక ప్రణాళిక కూడా అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలనేవి ప్రభుత్వాల్లోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆచరించినప్పుడు వాటికి సార్థకత. అలాగే ఈ చర్యలు ప్రభావశీలంగా ఉండాలంటే భాగస్వాములందరి చర్యలూ, తోడ్పాటు అత్యవసరం. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాతావరణ సంబంధిత వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. అంతర్జాతీయ కోర్టుల్లోనూ హై ప్రొఫైల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఇదంతా బాధ్యత ఎవరిదన్న విషయంపైనే! దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా తాము చేసిన వాగ్దానాలు కచ్చితంగా, సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలి. తద్వారా మానవాళిని పరిరక్షించాలి. లావణ్యా రాజమణి వ్యాసకర్త ప్రొఫెసర్,ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ లా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
గుంటూరు యువకుడికి ఆస్ట్రేలియా అవార్డు
గుంటూరు మెడికల్: వాతావరణ మార్పులపై గుంటూరుకు చెందిన ఎన్.వి.శరత్చంద్ర చేసిన పరిశోధనకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్షిప్ను, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్షిప్లను అందజేసింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్ పరిశీలించడానికి, విపరీతమైన వేడి మానవులను ఎలా ప్రభావితం చేస్తోందో పరిశీలించడానికి ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ షానన్ రూథర్ఫోర్డ్, డాక్టర్ హోక్, డాక్టర్ ఎడ్ మోర్గాన్లు పరిశోధన చేస్తున్నారు. వారి పర్యవేక్షణలో శరత్చంద్ర తన పరిశోధన పత్రాలను సమర్పించారు. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి, డాక్టర్ జ్యోతి ల తనయుడు ఎన్.వి.శరత్చంద్ర రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీలో బీటెక్ చదివాడు. అనంతరం రాజకీయ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ, హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వాతావరణ మార్పులో ఎంటెక్ మాస్టర్ డిగ్రీ చదివాడు. వాతావరణ మార్పుకు సంబంధించి అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పరిశోధకుడిగా పనిచేశాడు. విపరీతమైన వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని శరత్చంద్ర తెలిపాడు. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ పరిశోధన అవార్డులను అందుకున్న శరత్చంద్రకు గుంటూరుకు చెందిన పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు. -
పర్యావరణ హిత జీవనశైలి అవశ్యం
క్రమపద్ధతి లేని ఉష్ణోగ్రత, వర్షపాతాల రూపంలో వాతావరణ మార్పు పరిణామాలు అనుభవిస్తున్నాం. ఒక శతాబ్దానికి పైగా, మండుతున్న శిలాజ ఇంధనాలు, అసమానమైన, నిలకడలేని శక్తి, భూవినియోగాల వలన, యావత్ ప్రపంచం మితిమీరి వేడెక్కడానికి దారితీసిందని, వాతావరణ మార్పును పరిశీలించడానికి నియమింపబడిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ తన నివేదికలో నిర్ధారించింది. పర్యావరణాన్ని రక్షించడానికి సమగ్రమైన ప్రతిస్పందన, ప్రతి ఒక్కరికీ దానిని రక్షించాలనే భావన అనివార్యం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విపరీత పర్యావరణ సవాలును ఎలా ఎదుర్కోవాలనే విషయమై సతమతమవుతున్నాయి. పర్యావరణ రక్షణకు ఉపయోగపడే స్థిరమైన జీవనశైలి, ప్రతి వ్యక్తి తీసుకునే చర్యలు పెద్ద మార్పును తేగలవు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడా నికి తక్షణ, నిశ్చయాత్మకమైన ప్రయత్నాల అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను వాతావరణ నిపుణులు, సర ఫరా, వినియోగ ప్రవర్తన వైపు పరిష్కారాలు ప్రతిపాదించారు.ఇందులో ఉద్గారాలు, వాటి నిర్వహణ, సాంకేతిక ఎంపికలు, జీవనశైలి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకుని, పరిష్కారాలు సూచించారు. వినియోగ నిర్వహణ అనునది, ఉత్పత్తి వ్యవస్థల నుండి వచ్చే ప్రతి కూల పర్యావరణ ప్రభావాలను తగ్గించడం కొరకే గానీ, నాణ్యమైన జీవితం కోల్పోవడానికి కాదనీ వక్కాణించారు. ఈ ప్రయత్నంలో, వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేశంలోని నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) వారిచే సంయుక్తంగా ఒక కార్యాచరణ నివేదిక 2023లో విడుదల అయింది. భారతదేశంతో సహా అనేక దేశాలలో నిర్వహించిన అధ్య యనాల ఫలితాలను క్రోఢీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడే ఏడు ముఖ్యమైన అంశాలు ఈ నివేదికలో పొందుపర చారు. వీటిలో నీటి పొదుపు, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరమైన ఆహార వ్యవస్థ, ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన జీవన శైలి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఉన్నాయి. అన్ని అధ్యయనాలు భారతదేశంలో జరగనప్పటికీ, ఫలితాలు మాత్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనకు కూడా వర్తిస్తాయి. ఆహార రంగం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారాన్ని సక్రమంగా వినిగించు కొని, పంట నుండి వినియోగం వరకు వృథాను తగ్గించాలి. మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తిని, జంతు ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ‘ఆహారాన్ని ప్రేమించు – వ్యర్థాలను ద్వేషించు’ అను నినాదం, ఆహార వృథాను తగ్గించడానికి ఉపయోగపడటంతోపాటు, ఆహారం తయారీ యజమానులలోను, చిల్లర వ్యాపారులలోను, వినియోగదారులలోను గణనీయమైన సాను కూల ఫలితాలను అందించింది. గృహ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం వల్ల కంపోస్ట్ తయారీకి దారితీసి, నేల సారాన్ని పెంపొందించడంలో సహాయపడింది. స్థానికంగా పండించిన, కాలానుగుణమైన, ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని వినియోగిస్తున్నవారు, శాకాహారులు, యితర వ్యక్తు లతో పోలిస్తే, తక్కువ తలసరి ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని కలిగిస్తున్నారని ఫలితాలు చూపించాయి. వ్యవసాయం, భూమి నిర్వహణ పద్ధతులు ఉత్పాదకతను పెంచడానికి పచ్చిక బయళ్లలో చెట్లను పెంచడం, వార్షిక పంటలతోపాటు చెట్లను పెంచడం, ప్రకృతి వ్యవసాయం పాటించడం, అనగా కంపోస్ట్ ఎరువు వాడకం, కలుపు అణచివేసే కవరు పంటలు వేయడం, రసాయన ఎరువుల వాడకం నిషేధించడం, యితర సహజ/సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించడం, సారం క్షీణించిన వ్యవసాయ భూమిని పునరుద్ధరించడం,పంట మార్పిడి చేయడం, పంట వేయడానికి నేలను తక్కువసార్లు దున్నడం, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా పంటలకిచ్చే నీటి విని యోగాన్ని, వృథాను బాగా తగ్గించడం లాంటివన్నీ పర్యావరణ పరిరక్షణకు దారి తీస్తాయి. నీటికి సంబంధించిన లెక్కలు, తనిఖీ ప్రయోగం విజయవంతమైన వ్యూహంగా నిరూపితమైంది. నీటి విని యోగదారుల సంఘాలను ఏర్పాటు జేసుకోవడం, నీటి సంరక్షణ, వాతావరణ అంచనా కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను స్వీకరించడం వలన నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరచు కోవచ్చని ధ్రువీకరించడమై నది. ఆంధ్రప్రదేశ్లో, సహజ వ్యవసా యంతో బాటు, రుతుపవనా లకు ముందు అనగా వేసవి కాలంలో పంట వేయడం, స్థిరమైన వ్యవసాయం వైపు ప్రోత్సహించడం దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ పద్ధతులు నీటి సంరక్షణకు తోడ్పడుతూ, నేల నాణ్యతను సైతం మెరుగుపరుస్తున్నాయి. దీనికితోడు, రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తూ, భూమిలో 365 రోజుల పచ్చ దనాన్ని, చల్లటి వాతా వరణాన్ని యిస్తున్నాయి. రవాణా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రవాణా కీలక పాత్ర వహిస్తు న్నది. పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి, ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. బ్యాటరీతో నడిచే వాహనాలను ఉప యోగించడం, గమ్యస్థానాలు చేరుకోడానికి సైకిలు ఉపయోగించడం, సాధ్యమైన చోటల్లా నడవడం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి వాహనాల్లో వెళ్ళడం, కార్పూలింగ్ పద్ధతులను పాటించడం, భౌతిక ఉనికికి బదులుగా వీడియో సాంకేతికతలను ఉపయోగించి టెలిప్రెసెన్స్ను పెంపొందించి రవాణా ఖర్చు తగ్గించడం వంటి చర్యలన్నీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. రవాణాలో రద్దీని, ఖర్చును తగ్గించడానికి, సమర్థవంతమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం సహాయపడుతున్నది. శక్తి సంబంధిత పదార్థాలు శక్తి వినియోగంలో, పొదుపు ప్రవర్తన పెద్ద సవాలుగా మారింది. భవనం పైకప్పులో సోలార్ను అమర్చడం, వేడి నీటి కోసం సోలార్ హీటర్లను అమర్చుకోవడం, ఇంట్లో వెలుతురు, వంట కోసం బయో గ్యాస్ ఏర్పాటు చేసుకోవడం, ఎల్ఈడీ బల్బులు ఉపయోగించడం, ఇంధన సమర్థవంతమైన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం, పైకప్పులో తోటలను పెంచడం పర్యావరణ పరిరక్షణకు గణ నీయంగా దోహదపడతాయి. వంటకు మెరుగైన స్టవ్లు (పొయ్యిలు) వాడితే, పొగ స్థాయిలను 55 శాతం వరకు తగ్గించాయని మన దేశంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. అవసరమైన వ్యూహాలు మీడియా ప్రసారాలు, ప్రకటనలు, వార్తాపత్రికలలో కథనాలు అవగాహన స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తున్న వినియోగదారులను, ప్రభుత్వాలు తగు రీతిలో ప్రోత్సహించి, ప్రశంసిస్తే ఇతరులు కూడా అనుసరిస్తారని పరిశోధనలలో తేలింది. వినియోగదారుల నిర్ణయం ప్రభావితం చేయ డానికి, వస్తువులపై ‘పర్యావరణ అనుకూలమైనది’ అని ముద్రించాలి. వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనము నకు, స్థిరమైన ఆహార పద్ధతులను స్వీకరించడానికి దోహదపడుతుంది. పల్చటి ప్లాస్టిక్ కలిగించే ప్రతికూల ప్రభావాలను పాఠశాల పిల్లలకు తెలియబరిచాక, వారిలో గణనీయమైన మార్పు వచ్చింది. ధూమపానం చేసేవారు, తమ సిగరెట్ పీకలను నిర్ణీత ప్రదేశంలో పడ వేసేలా అవగాహన కల్పించాలి. సిగరెట్ పీకలు పర్యావరణంలోకి హానికరమైన రసాయనాలను వెదజల్లి, మైక్రోప్లాస్టిక్లుగా విడ దీయడం వల్ల పర్యావరణం కలుషితమవుతున్నది. కుళాయిలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడం, నీటి లీకేజీలను ఆపడం, పళ్ళు తోముకునే టప్పుడు కుళాయిని ఆపివేయడం వంటి చర్యల ద్వారా గృహాలలో నీటి ఆదా చేయవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యర్థాలను తగ్గించడానికి, చిన్న చిన్న మోతాదులలో వస్తువులను ప్యాకేజి చేయడం, ఒకసారి ఉపయోగించి పారవేయకుండా తిరిగి వాడటం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. సూట్కేసులు, ప్రింటర్లు, బూట్లు, వాషింగ్ మెషీన్లు సుదీర్ఘ కాలం ఉండేవి కొనుగోలు చేయ డానికి వినియోగదారులు ఇష్టపడతారు, కాబట్టి వీటి జీవితకాలాన్ని ప్రముఖంగా కనబడేటట్లు ముద్రించాలి. తద్వారా వీటి వ్యర్థాలను తగ్గించవచ్చు. మొబైల్, టెలివిజన్, కంప్యూటర్ తయారీదారులు, వాటి వ్యర్థాలను రీసైకిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పైన చెప్పినట్లుగా, వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తన మార్పులు వచ్చి నచో, కచ్చితంగా పర్యావరణాన్ని రక్షించవచ్చు. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
పీకల మీదకొచ్చింది!
ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది. ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తేల్చింది. ఇక, ‘కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అంటూ గత వారం లాన్సెట్ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్ నివేదిక హెచ్చరిస్తోంది. భారత్కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి. అలాగే, ‘బ్రోకెన్ రికార్డ్’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట. ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఈజిప్ట్లో నిరుడు కాప్27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు. ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్లో కాప్28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్ ఇంటర్నేషనల్ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం. రానున్న దుబాయ్ సదస్సు లోనూ ప్యారిస్ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. -
దిద్దుకోలేని దశకు వాతావరణం
ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల ముప్పునకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రకృతి ప్రకోపం అనండి లేదా ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. భూమ్మీదమనిషి మనుగడ క చ్చితంగా ప్రమాదంలో పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేసిన నివేదిక ప్రకారం పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఉన్న సమయం కూడామించిపోయింది. ఇకపై ఏం జరుగుతుందన్నది చెప్పడంతమ చేతుల్లోనూ లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 2023 డేనియల్ తుపాను లిబియాసహా ఆగ్నేయ యూరప్లోని కొన్నిప్రాంతాల్లో అకాల వరదలకుకారణమైంది. వేల మంది నిర్వాసితులయ్యారు. ఆస్తినష్టం రూ.16,658 కోట్ల పైమాటే! 2023 స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్ ‘ఎంటరింగ్ అన్చార్టడ్ టెరిటరీ’పేరుతో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రెస్ గత నెలలో ఓ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఇక తప్పించుకునే అవకాశం లేదు. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో మార్పులు వస్తాయని, అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతాయని, కార్చిచ్చులు దహించి వేస్తాయని, పంట దిగుబడులు తగ్గడంతోపాటు సముద్రమట్టాలు పెరిగిపోయి భూమ్మీద మనిషి బతకడం అసాధ్యంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం తదితర అనేక చర్యల ద్వారా ఈ మార్పులను అడ్డుకోవచ్చని, భూతాపోన్నతిని కట్టడి చేయొచ్చని నిన్న మొన్నటివరకూ అనుకునేవారు. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన ప్రకృతి వైపరీత్యాలను పరిశీలిస్తే.. అవేవీ సహజసిద్ధమైన వాతావరణ మార్పుల వల్ల వ చ్చినవి కావని, మానవ చర్యల పర్యవసానంగానే ఇవన్నీ జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ నివేదికను 2020లో రిపల్ అండ్ వూల్ఫ్లు మొదటిసారి సమర్పించినప్పటికీ తాజాగా 15,000 మంది శాస్త్రవేత్తలు ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రికార్డులు బద్ధలు 2023లో అసాధారణ ప్రకృతి వైపరీత్యాలు నమోదయ్యాయి. వాతావరణానికి సంబంధించి పలు రికార్డులు బద్ధలయ్యాయి. ప్రాంతాలకు అతీతంగా వడగాడ్పులు, రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఒక హెచ్చరికైతే.. సముద్ర ఉపరితల జలాల వేడి కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. అంటార్కిటికాలోనూ మునుపెన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జూలై మొదట్లో భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే జూన్–ఆగస్టు మధ్యమునుపటితో పోలిస్తే ఎక్కువ వేడి ఉన్నట్లు రికార్డు అయ్యింది. బహుశా ఇది లక్ష ఏళ్ల చరిత్ర కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని దశకు.. పారిశ్రామిక విప్లవ సమయానికి ముందునాటి ఉష్ణోగ్రతల కంటే భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత 2000 సంవత్సరం వరకూ ఏనాడూ 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ నమోదు కాలేదు. తరువాతి కాలంలోనూ అడపాదడపా ఈ స్థాయిని దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ.. 2023లో మాత్రం సెపె్టంబరు 12 నాటికే మొత్తం 38 రోజులు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఏడాది పూర్తయ్యే సరికి ఇది మరింత పెరుగుతుందని అంచనా. 2023 జూలై 7న అంటార్కిటిక్ సముద్రం పరిసరాల్లోని మంచు ప్రాంతం ఉపగ్రహ సమాచారం లభించడం మొదలైన తరువాత అతితక్కువ విస్తీర్ణంలో ఉన్నట్లు స్పష్టమైంది. 1991–2023 మధ్య మంచుప్రాంతం కంటే 26.7 లక్షల చదరపు కిలోమీటర్లు తక్కువ. మానవ చర్యల ఫలితమే... ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాలకు మానవ చర్యలే కారణమన్నది సుస్పష్టం. ఉదాహరణకు అట్లాంటిక్ మహా సముద్ర ఉపరితల జలాలు వేడెక్కేందుకు ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో రేగే దుమ్ము, కురిసే వర్షపాతానికి సంబంధం ఉండటం. ఇంకో ఆసక్తికరమైన అంశం.. నీటిలోపల ఉన్న అగ్నిపర్వతాల నుంచి కొన్ని కి.మీ. ఎత్తువరకూ ఎగజిమ్మే నీటి ఆవిరి (కర్బన ఉద్గారం మాదిరే ప్రమాదకరమైంది) మోతాదులో తేడా వ చ్చినా భూతాపోన్నతి సంభవిస్తుంది. ఏడాది కాలంగా ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కర్బన ఉద్గారాల నియంత్రణ చర్యల్లో భాగంగా సముద్రయానానికి గంధకం తక్కువగా ఉన్న ఇంధనాలను వాడటం తప్పనిసరి చేయడమూ కావచ్చు. ఇవేవీ కాదనుకున్నా ఈ ఏడాది ఎల్ నినో కారణంగానూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్–నినో, లా–నినా వంటి సహజ ప్రక్రియలు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఎక్కువవుతాయి. కిం కర్తవ్యం... పరిస్థితి చేయిదాటిపోతోంది.. మరి గట్టెక్కేందుకు ఏం చేయాలి? ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికాభివృద్ధి పేరుతో ఇప్పుడు మనం చేస్తున్న విచ్చలవిడి కార్యకలాపాలకు తక్షణం ఫుల్స్టాప్ పెట్టాలి. శిలాజ ఇంధనాలు, నేల వినియోగంలో మార్పుల వల్ల వెలువడుతున్న కర్బన ఉద్గారాల కట్టడికి శక్తులన్నీ కూడగట్టుకుని యత్నించాలి. కర్బన ఉద్గారాలను సహజసిద్ధంగా నిల్వ చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో వాతావరణంలోకి చేరిన అదనపు కార్బన్డయాక్సైడ్ను వేగంగా తొలగించేందుకు అన్ని రకాల వ్యూహాలను వాడుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో భూమి కొంచెం చల్లగా ఉంటుంది. వాతావరణంలోకి చేరుతున్న కార్బన్డయాక్సైడ్లో 80 శాతానికి కారణమవుతున్న బొగ్గు వాడకాన్ని వీలైనంత వేగంగా తగ్గించే ప్రయత్నం జరగాలి. ఈ శతాబ్దపు చివరి నాటికి 300 నుంచి 600 కోట్ల మంది ప్రజలు జీవించేందుకు అనువుగా లేని ప్రాంతాల్లో ఉంటారని అంచనా. ఇలాంటి మహా విపత్తుల పరిష్కార మార్గాలు కూడా అంతే పెద్దవిగా ఉండాలనడంలో సందేహం లేదు. అవీ.. ఇవీ.. ♦ కోవిడ్–19 సమయంలో కర్బన ఉద్గారాలు కొంతమేరకు తగ్గినప్పటికీ ఆ తరువాతి కాలంలో మునుపటి కంటే ఎక్కువయ్యాయి. ♦ సౌర, వపన విద్యుత్తుల వాడకం 2021–22 మధ్య 17 శాతం వరకూ పెరిగింది.. కానీ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ఈ పెరుగుదల చాలాచాలా తక్కువ. ♦ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం యూరప్లో చౌక రష్యన్ సహజవాయువు నుంచి బొగ్గు వాడకం వైపు మళ్లించింది. ఫలితంగా ఇప్పటికే శిలాజ ఇంధనాలపై ఇచ్చే సబ్సిడీ విలువ 53,100 కోట్ల డాలర్ల (2021) నుంచి 1,09,700 కోట్ల డాలర్లు (2022)కు పెరిగిపోయింది. ♦ 2021–22 మధ్య భూమ్మీద చెట్లు వ్యాపించి ఉన్న విస్తీర్ణం ఏకంగా 9.7 శాతం తగ్గిపోయి 2.28 కోట్ల హెక్టార్లకు పరిమితమైంది. ♦ కెనడాలో మునుపెన్నడూ లే¯స్థాయి లో అడవులు కార్చిచ్చులకు బలవుతున్నాయి. ఈ ఏడాది కోటీ 66 లక్షల హెక్టార్లలో అడవులు బూడిదయ్యాయి. ♦ వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ల మోతాదు కూడా బాగా ఎక్కువైంది. కార్బన్డయాక్సైడ్ ప్రతి పది లక్షల భాగాలకు 420 భాగాల స్థాయికి చేరింది. ♦ సముద్రాల ఆమ్లత, హిమానీనదాల మందం, గ్రీన్ల్యాండ్లోని మంచు.. అన్నీ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో సముద్రమట్టం, ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జూలై–ఆగస్టు 2023 చైనా బీజింగ్లో 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షం. 12.9 లక్షల మందిపై ప్రభావం... 1,47,000 ఇళ్లు ధ్వంసం... 33 మంది మృతి! భారత్.. రుతుపవనాల వర్షాలు కాస్తా ఆకస్మిక వరదలుగా మారిపోయాయి. ఉత్తర భారతంలో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. వంద మందికిపైగా చనిపోయారు. అమెరికాలో... హవాయి ప్రాంతంలోని మావుయిద్వీపంలో కార్చిచ్చు ప్రబలి 111 మందిమృత్యువాత పడ్డారు. -(కంచర్ల యాదగిరిరెడ్డి) -
ఐదు రెట్ల మరణాలు.. ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక
శిలాజ ఇంధనాల నిర్మూలనకు సాహసోపేతమైన చర్యలు తీసుకోకుంటే వాతావరణ సంక్షోభం మరింత మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని తాజా నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. వాతావరణ చర్యను ఆలస్యం చేయడం వల్ల 2050 నాటికి ఉష్ణ సంబంధిత మరణాలు దాదాపు ఐదు రెట్లు పెరుగుతాయని ప్రముఖ సైన్స్ జర్నల్ లాన్సెట్లో నవంబర్ 14న ప్రచురితమైన వార్షిక కౌంట్డౌన్ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆరోగ్యం శిలాజ ఇంధనాల నిర్మూలనపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. మానవాళికి ముప్పు ఓ వైపు మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ, వాతావరణ మార్పులతో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ మేల్కోవడం లేదని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని, విస్తరణను ప్రోత్సహిస్తూనే ఉన్నాయని నివేదిక రూపకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రణాళికల విస్తరణ, ఫైనాన్సింగ్తో శిలాజ ఇంధనంవైపు పయనిస్తూ మానవ మనుగడకు ముప్పు తెస్తున్నాయని లాన్సెట్ కౌంట్డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రధాన రచయిత మరీనా రొమనెల్లో సీఎన్ఎన్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకూ నష్టమే ప్రపంచం శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కొనసాగితే , దాని పర్యవసానాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా విపత్తుగా మారవచ్చని రోమనెల్లో నొక్కిచెప్పారు. 1800ల చివరిలో పారిశ్రామిక పూర్వ యుగం నుంచి ఈ గ్రహం ఇప్పటికే దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. ఇది 2 డిగ్రీలకు చేరుకుందంటే ప్రపంచ దేశాలు 50 శాతం కార్మిక సామర్థ్యాన్ని నష్టపోతాయని, తద్వారా అపారమైన ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది. -
మొత్తం మానవాళికే సమస్య!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ‘కాప్ 28’ సదస్సు జరగనుంది. పూర్వ సగటు ఉష్ణోగ్రతల కంటే 2023లో 1.4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. వాతావరణ మార్పుల సదస్సు కోసం ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు సమావేశమవుతున్నప్పుడు, ఇంతకంటే కీలక సమస్య వేరేదీ లేదు. ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలలో వరద బీభత్సం విదితమే. దేశమంతటా వర్షాలు సకాలంలో పడలేదు. వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నది. పంటల విస్తీర్ణం, దిగుబడి మీద వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) లోని అన్ని సభ్యత్వ పక్షాలు దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సమావేశం కానున్నాయి. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం తొలి ‘గ్లోబల్ స్టాక్ టేక్’ (జీఎస్టీ) పూర్తి చేయడం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి పురోగతిని అంచనా వేయడం, ముఖ్యంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం అంచనా వేయడం ఈ జీఎస్టీ లక్ష్యం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మదింపు తదుపరి పర్యావరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గేనా? 2023 సెప్టెంబర్లో విడుదలైన మొదటి జీఎస్టీ అధ్యయన ఫలితం, స్పష్టంగా ఉన్నది: ప్రపంచం మొత్తం అనుకున్న లక్ష్యం నుంచి దారి తప్పింది. ఈ నేపథ్యంలో దుబాయ్లో జరగనున్న ‘కాప్ 28’(కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్– భాగస్వామ్య పక్షాల 28వ సమావేశం)లో దీని దిద్దుబాటు మీద చర్చ జరుగుతుందని ఆశిస్తున్నారు. అనేక చర్యల మీద ఏకాభిప్రాయం లేదు. ఈ నివేదిక వల్ల కొన్ని చర్యల పైన విశాల ఒప్పందాలు జరుగుతాయని అంచనా. ప్రధానంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు చేయాలనే లక్ష్యం ఒకటి కాగా, శిలాజ ఇంధనాల వినియోగం దశల వారీగా తగ్గించే లక్ష్యం పైన చర్చలు వివాదాస్పదంగా ఉన్నాయి. దుబాయ్ సమావేశం అధ్యక్షుడు ఒక చమురు కంపెనీ అధిపతి అయిన నేపథ్యంలో చమురు ఉపయోగం తగ్గించడానికి చర్చలు జరుగుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. రెండవ పెద్ద అంశం, ‘నష్టం మరియు హాని’. పేద దేశాలు, వెనుకబడిన దేశాల మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ ఉండడంతో భూగోళ కాలుష్యానికి కారక దేశాలు నష్ట పరిహారం అందించాలని చర్చలు జరుగుతున్నాయి. గత కాప్ 27 సమావేశంలో ఆఫ్రికన్ దేశాలు పట్టుబట్టి నష్టం మరియు హాని పరిహార నిధి ఏర్పాటును తీర్మానం చేశాయి. అటువంటి నిధిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఆ సమావేశ పురోగతిగా వర్ణించారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్నా, దాని ఏర్పాటు విషయం దశలలో తేలాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది నుంచి ఈ విషయం మీద సమావేశాలు జరుగు తున్నాయి. పురోగతి ఆశాజనకంగానే ఉన్నది. కర్బన ఉద్గారాల వల్ల భౌగోళిక కాలుష్యం పెరిగి, సగటు ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణ మార్పులు జరిగి నష్టపోతున్న దేశాలు, ప్రాంతాలు వాటిని ఎదుర్కొనే ప్రతి చర్యల మీద నిధులు సొంతంగా పెట్టుకునే సామర్థ్యం లేక ఈ ప్రపంచ నిధి గురించి ఆలోచించాయి. భారత దేశంలో ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో విపరీత వర్షాల వల్ల నదీ ప్రవాహం పెరిగి కొన్ని ఆనకట్టలు కొట్టుకుపోయి జరిగిన ఆస్తి నష్టం అంచనా లక్ష కోట్ల రూపాయలు. ఇటువంటి నష్ట భర్తీకి, పునర్నిర్మాణానికి సొమ్ములు ప్రపంచ నిధి నుంచి ఇవ్వాలని ఆశిస్తున్నారు. కానీ ఆ నిధికి డబ్బులు ఎవరు, ఎంత ఇవ్వాలి అనే విషయం నుంచి ఎవరికి, ఏ విధంగా,ఎంత ఇవ్వాలి అనే వరకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయి. నష్ట పరిహార నిధి పూర్తి స్థాయి ఏర్పాటుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా. వేగంగా నిర్ణయించాలని పేద దేశాల ఆకాంక్ష. ధనిక దేశాలకు ఈ నిధి ఏర్పాటు ఇష్టం లేదు. అది తమ ఆర్థిక రంగం మీద భారం అవుతుంది అని వారి భావన. ఆహార, ఆరోగ్యాలపై ప్రభావం 2023 అంతటా వివిధ రూపాల్లో (రెండవ గ్లాస్గో సంభాషణ, ప్రత్యేక వర్క్ షాప్లు, మంత్రుల సంప్రదింపులతో సహా) దీనిపై చర్చలు జరిగాయి. కాల పరిమితులతో కూడిన లక్ష్యసాధన, అర్హత ప్రమాణాలు, ఆర్థిక వనరులు వంటి విషయాలపైన ఆలోచనలను రూపొందించడానికి ఒక పరివర్తన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పని చిన్నదేమీ కాదు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఐదేళ్లు పట్టింది. పరివర్తన కమిటీ పని తీరును పరిశీలిస్తే, పరిష్కరించ వలసిన సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా, విభేదాలను పరిష్క రించడానికి రాజకీయ మార్గదర్శకత్వం అవసరమని తెలుస్తుంది. యూఎన్ఎఫ్సీసీసీ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, ఎస్బీఐ, ఎస్బీఎస్టీఏలకు సంబంధించిన ఐదు భారీ అంశాలతో పాటు అనేక ఇతర సమస్యలను కాప్ 28 ప్రస్తావించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాప్ 28 సమావేశ అధ్యక్ష (యూఏఈ) పాత్ర కీలకం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా శిలాజ ఇంధనాల ఉత్పత్తిని ఎలా పరిష్కరిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. వాతావరణ మార్పులకు, ఆహారం, ఆరోగ్యానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకుని, తగిన చర్యల మీద దృష్టి పెంచడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. స్థూలంగా, వాతావరణ మార్పుల సదస్సు అంటే కేవలం చెట్లు, అడవులు, కాలుష్యం గురించే కాదు. ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ అభివృద్ధి విధానాలు, ఆర్థిక విధానాలు, ఉత్పత్తి పద్ధతులు, జీవన శైలి మార్పులతో సహా సమస్త మానవాళి చర్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సామాజిక న్యాయం, సమానత్వం, సహకారం, గౌరవం, మానవ హక్కులు వంటి సూత్రాలు విధిగా ఉంటాయి. భారతదేశం పాత్ర భారతదేశం వహించే పాత్ర కూడా అనేక అంతర్జాతీయ సమావేశాల మాదిరిగానే కాప్ 28 సదస్సులో కూడా ముఖ్యమైన అంశంగా మారుతున్నది. నిర్ణయాలు తీసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు, అంతర్గతంగా ఎదురు అవుతున్న ప్రకృతిపరమైన నష్టాలకు భారత ప్రతినిధి వర్గం పని తీరును కూడా నిశితంగా గమనించాల్సి ఉన్నది. ఈ ప్రతినిధి వర్గంలో ఎవరు ఉంటారు, వారికి ప్రభుత్వం ఇచ్చిన సందేశం లేదా ఆదేశాలు ఏమిటి అని మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ధనిక దేశాలు, పేద దేశాల మధ్య వారధిగా, అమెరికా దేశాల కూటమికీ, రష్యా, చైనా దేశాల కూటమికీ మధ్య కీలకంగా పరిణమించిన భారత్ ఈ సదస్సులో వ్యవహరించే తీరు మీద ఆసక్తి ఉన్నది. ‘అభివృద్ధి’ మార్గం వివాదస్పదం అవుతున్న సందర్భంలో, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, పేదరికం, అనారోగ్యం,ఆకలి వంటి అంశాలను పరిష్కరించే వివిధ మార్గాలు, చర్యలు కూడా అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికి లోను అవుతున్నాయి. కాబట్టి అక్కడ జరిగేది వేరు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. మన రాజకీయ వ్యవస్థ, ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ అంశాల మీద తమ పరిజ్ఞానం పెంచుకుంటేబాగుంటుంది. దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు