-
ఎన్నాళ్లీ తీస్తా వివాదం!
నదీజలాల విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఆ నీళ్లల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చు రేపే నదీజలాలు... పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు. ఈమధ్యే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు దేశాలమధ్యా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతోపాటు తీస్తా నదీజలాల పంపకంపై చర్చలు జరపాలనీ, ఫరక్కా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలనీ ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాన్ని రగిల్చింది. నదీజలాల విషయంలో ఉభయులకూ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయాలని భారత్, బంగ్లాదేశ్లు నిర్ణయించుకున్నాయని మంగళవారం ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు. ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు. ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు. మమత ఇలా స్పందించటం ఇది మొదటిసారేమీ కాదు. ప్రజానీకానికి గుక్కెడు నీళ్లందించాలన్నా, పచ్చటి పైర్లతో పొలాలు కళకళలాడాలన్నా బంగ్లాదేశ్కు ఈ నదీజలాలపై భారత్తో ఒప్పందం కుదరటం, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటం ఎంతో అవసరం. 2011లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ అధినేత మమత అలకబూనటంతో అది ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. రాజకీయంగా యూపీఏకు ఉన్న పరిమితులేమిటో, మమత స్వభావమేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుబట్టకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యం తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు. ఒప్పందం కుదరకపోవటం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా, రాష్ట్రంలో తనకెదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో తీస్తా ప్రాజెక్టు గురించి బంగ్లాదేశ్ ప్రస్తావించకపోలేదు. కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పటిలాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది. నిజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి. దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించటానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలసపాలకులు 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. చివరకు 1911లో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను పెంచింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది పాకిస్తాన్లో భాగంగా మారింది. పాకిస్తాన్ చెరలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించటానికి 1971లో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలి. గంగానదిపై బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీజలాలు అందించటంపై 1996లో 30 ఏళ్లకు ఒప్పందం కుదిరింది.అది మరో రెండేళ్లలో పూర్తికావాల్సి వుంది. కనుక దానిపై కొత్తగా ఒప్పందం అవసరం. 1996లో తమకిచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రం ఇప్పుడు మరోసారి తీస్తా, గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపణ. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా బెంగాల్తో చర్చిస్తూనే ఉన్నామన్నది కేంద్రం జవాబు. 1996లో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారనీ, నిరుడు జూలై 24న కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారనీ కేంద్రం చెబుతోంది. మొన్న 14న ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చేసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమత సర్కారు జవాబు. తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది. దక్షిణాసియాపైనా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్కున్న సంబంధాలపైనా చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీజలాలపై వివాదం రాజేయటం మంచిది కాదు. తీస్తా ప్రాజెక్టుపై అటు చైనా, ఇటు భారత్ ప్రతిపాదనలిచ్చాయనీ, ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామనీ మంగళవారం హసీనా తెలిపారు. ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనావైపు చూస్తామని చెప్పటమే. ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో 80 శాతం వాటావున్న దుస్తుల తయారీ ముడిసరుకంతా చైనాయే సరఫరా చేస్తోంది. పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతి పెద్ద భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ వ్యవహరించాలి. విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిదికాదు. అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కేంద్రం బాధ్యత. గత హామీలు నెరవేర్చలేకపోతే కారణాలేమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. చిరకాల సమస్య అయిన తీస్తా వివాదంపై బెంగాల్ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో కేంద్రం ఆలోచించాలి. -
బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు.. ఏకైక జట్టుగా
టీ20 వరల్డ్కప్లో బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు అన్ని వరల్డ్కప్లు ఆడి ఒక్కసారి కూడా సెమీఫైనల్కు చేరని ఆ జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో సూపర్-8లో రౌండ్లో నిష్క్రమించిన బంగ్లా జట్టు.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2007లో జరిగిన తొట్టతొలి టీ20 వరల్డ్కప్ నుంచి ఈ మెగా టోర్నీలో భాగమవుతున్న బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా సెమీస్లో అడుగుపెట్టలేకపోయింది. టాప్-10లో ఉన్న ఇతర 9 జట్లు కనీసం ఒక్కసారైనా టీ20 వరల్డ్కప్ సెమీస్కు చేరుకున్నాయి.భారత్, ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ జట్లు ఏదో ఒక వరల్డ్కప్లోనైనా సెమీస్కు చేరాయి. చివరగా ఈ ఏడాది సూపర్-8లో సంచలన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్ తొలి సారి టీ20 వరల్డ్కప్ సెమీస్లో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్-2024లో 7 మ్యాచ్లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. -
T20 World Cup: అఫ్‘గన్’ పేలింది
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్కప్లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడతాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్రేట్లో అఫ్గాన్, ఆసీస్లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్డన్’ అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్కప్లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్ల్లో ఇన్నింగ్స్లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్ -
అఫ్గనిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిందా? ఏంటీ డ్రామా? ఫ్యాన్స్ ఫైర్
ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన అఫ్గనిస్తాన్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో అండర్డాగ్స్గా అడుగుపెట్టి టాప్-4లో నిలిచినందుకు రషీద్ ఖాన్ బృందాన్ని క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది.అయితే, అదే సమయంలో అడ్డదారిలో గెలిచారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి.. బంగ్లాదేశ్ను దెబ్బకొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.ఆ ఇద్దరిపై ఆగ్రహంఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రాట్, బౌలింగ్ ఆల్రౌండర్ గుల్బదిన్ నైబ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..వరల్డ్కప్-2024 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడింది. సెయింట్ విన్సెంట్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ రైజ్ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 43 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 18 రన్స్ తీయగా.. వేరెవరు కనీసం పది పరుగుల స్కోరు దాటలేదు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోరు చేసింది అఫ్గన్ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే షాకిచ్చారు అఫ్గన్ పేసర్లు.ఓపెనర్ తాంజిద్ హసన్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో ఐదు పరుగులకే నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు.పట్టుదలగా లిటన్ దాస్ఇలాంటి క్లిష్ట సమయంలో ఓపెనర్ లిటన్ దాస్(54 నాటౌట్) పట్టుదలగా నిలబడ్డాడు. అయితే, బంగ్లా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.లిటన్ దాస్తో కలిసి తంజీమ్ హసన్ సకీబ్ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడే సూచనలు కనిపించాయి. పన్నెండో వోర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో నాలుగో బంతికి తంజీమ్ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.అదే సమయంలో అఫ్గన్ కోచ్ జొనాథన్ ట్రాట్ వాన పడే అవకాశం ఉందని తమ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. కాస్త స్లోగా ఆడండని సైగలు చేశాడు.తొడ కండరాల్లో నొప్పి అంటూఅప్పటికి బంగ్లాదేశ్ స్కోరు 81/7.. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ అఫ్గనిస్తాన్ కంటే కేవలం రెండు పరుగులే వెనుకబడి ఉంది. అంటే.. ఆ సమయంలో వర్షం పడి.. ఆ తర్వాత మ్యాచ్ గనుక రద్దైపోతే ఫలితం అఫ్గనిస్తాన్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు.ఈ నేపథ్యంలో కోచ్ సైగల మేరకు స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న నైబ్.. ఒక్కసారిగా చేతి పైకెత్తి.. తొడ కండరాల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. అతడి చేష్టలు చూసి కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం అసహనంగా కదిలాడు. అసలేమైంది అన్నట్లుగా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.This has got to be the most funniest thing ever 🤣 Gulbadin Naib just breaks down after coach tells him to slow things down 🤣😂 pic.twitter.com/JdHm6MfwUp— Sports Production (@SportsProd37) June 25, 2024 ఇంతలో నైబ్కు సబ్స్టిట్యూట్గా నజీబుల్లా మైదానంలోకి రాగా.. ఫిజియోలతో పాటు నైబ్ మైదానం వీడాడు. అప్పటికి వర్షం పడలేదు. కానీ నైబ్ వల్ల మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాతి బంతికి బంగ్లా ఒక పరుగు చేసింది. ఓవర్లో మొత్తంగా రెండు పరుగులే వచ్చాయి.ఒకవేళ నైబ్ డ్రామా చేయకపోయి ఉంటే.. మరుసటి రెండు బంతుల్లో గనుక బంగ్లా రెండు పరుగులు చేసి.. ఆ తర్వాత వర్షం పడి మ్యాచ్ రద్దైతే కచ్చితంగా బంగ్లానే గెలిచేది.సెమీస్ రేసు నుంచి అవుట్అయితే, నైబ్ గాయం వల్ల ఆలస్యానికి తోడు వరణుడు కూడా అప్పటికి కరుణించడంతో మ్యాచ్ కొనసాగింది. ఇక పదమూడవ ఓవర్లో బంగ్లాదేశ్ కేవలం ఆరు పరుగులే చేయగా.. గ్రూప్-1 సమీకరణలకు అనుగుణంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.అప్పుడు సెమీస్ బెర్తు కోసం ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లా ఇన్నింగ్స్ను 19 ఓవర్లకు కుదించి విజయ లక్ష్యాన్ని 114 పరుగులుగా విధించారు అంపైర్లు. అయితే, అఫ్గన్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ 17.5 ఓవర్లలో కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చిఫలితంగా అఫ్గనిస్తాన్ గెలిచి సెమీస్లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అంతకుముందు గాయంతో విలవిల్లాడిన గుల్బదిన్ నైబ్.. కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి ఓ వికెట్ తీయడంతో పాటు.. గెలుపు సంబరాల్లో అందరికంటే వేగంగా పరిగెత్తడం.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్కాగా గుల్బదిన్ నైబ్ ‘లీల’ల గురించి చర్చ మొదలైంది. కామెంటేటర్ సైమన్ డౌల్ అయితే.. ‘‘ఆస్కార్ గెలుచుకునే నటన.. ఆ ఫిజియోలు సూపర్.. మరీ ఇంత త్వరగా గాయం నుంచి కోలుకోవడం నిజంగా ఆశ్చర్యమే’’ అంటూ సెటైర్లు వేశాడు.టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం గుల్బదిన్కు రెడ్కార్డ్ ఇవ్వాలంటూ సరదాగా కామెంట్ చేయగా.. అతడు బదులిస్తూ ఒక్కోసారి సంతోషం.. ఒక్కోసారి దుఃఖం అంతే అంటూ అంతే లైట్గా తీసుకున్నాడు.No words.... @ICC shouldtake action on this pic.twitter.com/61n3N2SuhG— Hassan Abbasian (@HassanAbbasian) June 25, 2024 -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8 మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్కప్లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లను ఓడించి సెమీస్కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
T20 World Cup 2024 : సెమీస్కు ఆఫ్ఘనిస్తాన్..ఆస్ట్రేలియా ఇంటికి (ఫొటోలు)
-
ఉత్కంఠ పోరులో బంగ్లాపై గెలుపు.. సెమీస్కు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా ఇంటికి
టీ20 వరల్డ్కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. తాజాగా బంగ్లాదేశ్ను ఖంగుతినిపించారు. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుత పోరాటం చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరగా.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయినా సెమీస్కు చేరే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో ఛేదించి ఉంటే సెమీస్కు చేరి ఉండేది. అయితే ఇలా జరగకపోగా చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. లక్ష్య ఛేదనలో పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు. ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ ఈ స్కోర్ను కూడా ఛేదించలేకపోయింది. నవీన్ ఉల్ హక్ (3.5-0-26-4), రషీద్ ఖాన్ (4-0-23-4), ఫజల్ హక్ (2-0-15-1), గుల్బదిన్ నైబ్ (2-0-5-1) ధాటికి 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
T20 World Cup 2024: బంగ్లా లక్ష్యం 116.. 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్కు..!
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయిన సెమీస్కు చేరే సువర్ణావకాశం బంగ్లాదేశ్కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న మ్యాచ్లో 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని (116 పరుగులు) ఛేదిస్తే.. భారత్తో పాటు సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో మ్యాచ్ను ఆపేశారు. -
T20 World Cup 2024: రసవత్తరంగా మారిన గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ రేసు
టీ20 వరల్డ్కప్ 2024లో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి టీమిండియా తొలి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా (ఆసీస్పై విజయంతో).. రెండో బెర్త్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీమిండియా చేతిలో ఆసీస్ ఓటమితో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు ముందు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతాల్లో చెరి 2 పాయింట్లు ఉండగా.. బంగ్లాదేశ్ ఖాతా పాయింట్లేమీ లేవు.ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో కూడా 2 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు బంగ్లాదేశ్ కూడా సెమీస్ రేసులో ఉంటుంది.ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 61 పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో గెలిచినా.. 13 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించినా భారత్తో పాటు సెమీస్కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్ను ఓడిస్తే భారత్తో పాటు సెమీస్కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ 61 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, సెయింట్ విన్సెంట్ వేదికగా ఇవాళ (జూన్ 25) ఉదయం 6 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ ఎంచుకుంది. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులుగా ఉంది. గుర్బాజ్ (43), ఇబ్రహీం జద్రాన్ (18), ఒమర్జాయ్ (10) ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (4), నబీ (1) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, ముస్తాఫిజుర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంపై గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది. -
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్లో ఎవర్కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 దశలో పెను సంచనలం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి, ఒకదాంట్లో ఓడిన (భారత్ చేతిలో) ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!భారత్తో జరుగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడి.. ఆతర్వాత జరుగబోయే మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుతాయి.ఇలా జరిగినా ఆసీస్ ఇంటికే..!ఒకవేళ భారత్తో రేపు జరిగే మ్యాచ్లో ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలుపొందినా సెమీస్ చేరుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. తదుపరి బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే.. అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరి నాలుగు పాయింట్లు ఉంటాయి. నెట్ రన్రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (2.425) మిగతా జట్లకంటే మెరుగ్గా ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా సెమీస్ అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. బంగ్లాదేశ్పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్తో పాటు ఆఫ్ఘన్ సెమీస్కు చేరుతుంది. ఆసీస్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి..గ్రూప్-1 నుంచి ఆసీస్ సెమీస్కు చేరాలంటే రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆసీస్ సెమీస్కు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే టెక్నికల్గా ఆ జట్టుకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి (ఆస్ట్రేలియాపై భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ భారీ తేడాలతో గెలవాలి). -
డ్రెస్సింగ్ రూమ్ ‘బెస్ట్ ఫీల్డర్’గా సూర్య.. ఈసారి ‘గెస్ట్’ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చే ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను ఈసారి స్టార్ బ్యాటర్ సుర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్పై అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచినందుకు సూర్యకు ఉత్తమ ఫీల్డింగ్ మెడల్ అవార్డు వరించింది. కాగా ప్రత్యేకంగా గెస్ట్ను పిలిచి ఈ అవార్డు అందజేయడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి అవార్డు అందజేసేందుకు వెస్టిండీస్ గ్రేట్ ,దిగ్గజ బ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్ను భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తీసుకు వచ్చాడు. వివియన్ రిచర్డ్స్ డ్రెస్సింగ్ రూమ్లోకి రాగానే భారత టీమ్ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతించారు. వివియన్ రిచర్డ్స్ చేతుల మీదగా సూర్య బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
India vs Bangladesh Photos : 50 పరుగులతో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్యపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. మయన్మార్ పరిణామాలతోపాటు రోహింగ్యా కాందిశీకుల అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్తో సంబంధ బాంధవ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఈపీఏపై చర్చలు ప్రారంభించామని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించామన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, సైనిక దళాల ఆధునీకరణ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.భారత్ విశ్వసనీయ మిత్రదేశం: హసీనా ఇండో–పసిఫిక్ కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘ఇరు దేశాల బంధానికి పౌరుల మధ్య సంబంధాలే పునాది. వైద్య సేవల కోసం వచ్చే బంగ్లా పౌరులకు ఈ–మెడికల్ వీసా కలి్పస్తాం. బంగ్లాదేశ్లోని రంగపూర్లోని కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం. 1996 నాటి గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి సాంకేతిక చర్చలు ప్రారంభిస్తాం. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణపై చర్చించడానికి బంగ్లాదేశ్కు టెక్నికల్ టీమ్ను పంపుతాం’’ అని ప్రధాని వివరించారు. సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్ను బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ కలలుగన్నారని, ఆ కలను నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ తమకు అతిపెద్ద పొరుగు దేశమని, తమకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశమని షేక్ హసీనా పునరుద్ఘాటించారు. భారత్తో సంబంధాలకు అత్యధిక విలువ ఇస్తున్నామని ఆమె పునరుద్ఘాటించారు.10 ఒప్పందాలపై సంతకాలు డిజిటల్, సముద్రయానం, సముద్ర వనరుల వినియోగం, రైల్వే, అంతరిక్షం, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్య వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్ శనివారం 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో షేక్ హసీనా భేటీ న్యూఢిల్లీ: వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, బంగ్లాదేశ్ వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. నూతన రంగాల్లో సహకారం పెంపొందించుకుంటున్నాయని, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ సహకారమే నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేలా కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చారు. షేక్ హసీనాను కలవడం సంతోషంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. -
T20 World Cup: బంగ్లాపై విజయభేరి.. భారత్ సెమీ ఫైనల్ చేరడం లాంఛనమే!
నార్త్సౌండ్: భారత్ ఆల్రౌండ్ షోకు బంగ్లాదేశ్ తెల్లమొహం వేసింది. బ్యాటింగ్లో కలిపికొట్టి, తర్వాత పేస్, స్పిన్తో వికెట్లను చెదరగొట్టింది. టి20 ప్రపంచకప్ సూపర్–8 రెండో మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఇక సెమీస్కు చేరడం లాంఛనమే. టాస్ నెగ్గిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే (24 బంతుల్లో 34; 3 సిక్స్లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్ నజు్మల్ హుస్సేన్ (32 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్లు) కొద్దిగా ప్రతిఘటించగలిగాడు. కుల్దీప్ 3, బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు తీశారు. సూపర్–8 దశలో తమ చివరి మ్యాచ్లో సోమవారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. కలిసిమెలిసి దంచేసి... కోహ్లితో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ కాసేపట్లోనే వేయాల్సినంత వేగవంతమైన పునాదిని వేసి వెళ్లాడు. ఇక కోహ్లి, పంత్ తమ కెపె్టన్ వేగాన్ని అందిపుచ్చుకోవడంతో పవర్ప్లేలో భారత్ 53/1 స్కోరు చేసింది. పవర్ప్లే ఆఖరి ఓవర్ (6)లో కోహ్లి కొట్టిన సిక్సర్తోనే జట్టు స్కోరు 50కి చేరింది. రిషాద్ వేసిన 8వ ఓవర్లో కోహ్లి మరో సిక్స్ బాదాడు. పంత్ కూడా బౌండరీ కొట్టడంతో 8 బంతుల ఈ సుదీర్ఘ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇది భారత శిబిరాన్ని ఉత్సాహపరిస్తే... మరుసటి 9వ ఓవర్ భారత్ను దెబ్బమీద దెబ్బ తీసింది. తొలి బంతికే కోహ్లి, మూడో బంతికి సూర్యకుమార్ (6)లను తన్జీమ్ పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ వికెట్ల ప్రభావం ఇన్నింగ్స్పై పడకుండా తర్వాత వచి్చన బ్యాటర్లు చెలరేగారు. హార్దిక్ మెరుపు ఫిఫ్టీ 11వ ఓవర్ నుంచి శివమ్ దూబే అండతో రిషభ్ పంత్ బ్యాట్ ఝుళిపించాడు. ముస్తఫిజుర్ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాదాడు. మరుసటి ఓవర్లో రిషాద్పై విరుచుకుపడే క్రమంలో 6, 4 కొట్టిన పంత్ అదే జోరులో ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. 14 ఓవర్లలో భారత్ 120/4 స్కోరు చేసింది. ఆ తర్వాత 6 ఓవర్లలోనే (36 బంతులు) 76 పరుగులు చేసింది.ఇంత స్కోరుకు, ఇన్నింగ్స్ జోరుకు హార్దిక్ పాండ్యా కారణమయ్యాడు. 15వ ఓవర్లో 6, 4తో 14 పరుగులు, 16, 17 ఓవర్లలో దూబే ఒక్కో సిక్సర్తో వరుసగా 12 పరుగులు, 9 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో సిక్స్ కొట్టిన దూబే అవుట్ కాగా, హార్దిక్ మరో భారీ సిక్సర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. తన్జిమ్, ముస్తఫిజుర్ సహా బౌలర్లందరినీ చితకబాదిన హార్దిక్ 27 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి నాటౌట్గా నిలిచాడు. నజు్మల్ ఒక్కడే... టాప్–3 బ్యాటర్లలో లిటన్ దాస్ (13) విఫలమవగా, తన్జీద్ హసన్ (31 బంతుల్లో 29; 4 ఫోర్లు), కెపె్టన్ నజు్మల్ మెరుగ్గానే ఆడారు. ఒక వైపు నజు్మల్ పోరాడినా... మరోవైపు తౌహీద్ హ్రిదయ్ (4), ప్రతీ ప్రపంచకప్ ఆడిన విశేషానుభవజు్ఞడు షకీబ్ (11), మహ్ముదుల్లా (13) చేతులెత్తేయడంతో బంగ్లా పరాజయం తప్పలేదు. ఆఖర్లో రిషాద్ (10 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు . స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జాకీర్ (బి) షకీబ్ 23; కోహ్లి (బి) తన్జీమ్ హసన్ 37; పంత్ (సి) తన్జీమ్ హసన్ (బి) రిషాద్ 36; సూర్యకుమార్ (సి) లిటన్ దాస్ (బి) తన్జీమ్ హసన్ 6; దూబే (బి) రిషాద్ 34; పాండ్యా నాటౌట్ 50; అక్షర్ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–39, 2–71, 3–77, 4–108, 5–161. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–28–0, షకీబ్ 3–0–37–1, తన్జీమ్ హసన్ 4–0–32–2, ముస్తఫిజుర్ 4–0–48–0, రిషాద్ హుస్సేన్ 3–0–43–2, మహ్ముదుల్లా 2–0–8–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 13; తన్జీద్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 29; నజు్మల్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 40; తౌహీద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 4; షకీబ్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 11; మహ్ముదుల్లా (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 13; జాకిర్ అలీ (సి) కోహ్లి (బి) అర్ష్ దీప్ 1; రిషాద్ (సి) రోహిత్ (బి) బుమ్రా 24; మెహిది హసన్ నాటౌట్ 5; తన్జీమ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–35, 2–66, 3–76, 4–98, 5–109, 6–110, 7–138, 8–145. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–30–2, బుమ్రా 4–0–13–2, అక్షర్ 2–0–26–0, హార్దిక్ పాండ్యా 3–0–32–1, జడేజా 3–0–24–0, కుల్దీప్ 4–0–19–3. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: కింగ్స్టౌన్; ఉ.గం.6.00 నుంచి ఇంగ్లండ్ X అమెరికా వేదిక: బ్రిడ్జ్టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్కు పనిచెప్పాడు. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్తో మెరిశాడు.ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 3 సిక్స్లు, ఒక ఫోర్తో 37 పరుగులు చేశాడు. ఈ వరల్డ్కప్లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వరల్డ్కప్(వన్డే అండ్ టీ20)లలో 3000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్గా విరాట్ నిలిచాడు. ఓవరాల్గా వరల్డ్కప్లలో కోహ్లి 3002 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్లలో 37 మ్యాచ్లు ఆడి 1795 పరుగులు చేసిన కోహ్లి.. టీ20 వరల్డ్కప్లలో 32 మ్యాచ్లు ఆడి 1207 పరుగులు చేశాడు. -
IND vs BAN: బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం
India vs bangladesh live updates and highlights:బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయంటీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 16వ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్లో షాంటో(40) ఔట్ కాగా.. 17వ ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో జకీర్ అలీ ఔటయ్యాడు.నాలుగో వికెట్ డౌన్..98 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.మూడో వికెట్ డౌన్..బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హృదయ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో షాంటో(37), షకీబ్(5) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..66 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన టాంజిద్ హసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి హృదయ్ వచ్చాడు. 11 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 76/2తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లిట్టన్ దాస్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నజ్ముల్ హోస్సేన్ శాంటో వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో టాంజిద్(27), శాంటో(7) పరుగులతో ఉన్నారు.3 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 16/0197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో టాంజిద్ హసన్(14), లిట్టన్ దాస్(2) పరుగులతో ఉన్నారు. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. టీమిండియా భారీ స్కోర్బంగ్లాదేశ్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఐదో వికెట్ డౌన్.. దూబే ఔట్18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(28), అక్షర్ పటేల్(1) పరుగులతో ఉన్నారు. కాగా ఐదో వికెట్గా శివమ్ దూబే(34) వెనుదిరిగాడు.నాలుగో వికెట్ డౌన్.. పంత్ ఔట్110 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రిషబ్ పంత్.. రిషద్ హోస్సేన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 110/4టీమిండియా మూడో వికెట్ డౌన్.. సూర్య ఔట్టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. విరాట్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా(6) పెవిలియన్కు చేరాడు. టాంజిమ్ హసన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్లకు టీమిండియా స్కోర్: 80/3రెండో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్71 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాంజిమ్ హసన్ సకిబ్ బౌలింగ్లో ఔటయ్యాడు.8 ఓవర్లకు టీమిండియా స్కోర్: 71/18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(37), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.3 ఓవర్లకు టీమిండియా స్కోర్: 29/0టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), రోహిత్ శర్మ(12) పరుగులతో ఉన్నారు. టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8లో భాగంగా ఆంటిగ్వా వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లాదేశ్ మాత్రం ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్కు బంగ్లా పేసర్ టాస్కిన్ ఆహ్మద్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో టాంజిమ్ హసన్ సకిబ్ వచ్చాడు.తుది జట్లుబంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
కోహ్లి విషయంలో సంతోషంగా లేను: టీమిండియా బ్యాటింగ్ కోచ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శల నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి పరుగులు చేయకపోవడం పట్ల తానూ సంతోషంగా లేనని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో పరుగుల వరద(741) పారించిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్గా బరిలోకి దిగుతున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం 88 పరుగులే చేశాడు.న్యూయార్క్ వేదికగా లీగ్ మ్యాచ్లలో పూర్తిగా విఫలమైన కోహ్లి.. వెస్టిండీస్లో సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. అఫ్గనిస్తాన్తో పోరులో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో కోహ్లి స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అతడిని తన రెగ్యులర్ పొజిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆంటిగ్వా వేదికగా శనివారం రాత్రి ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్కు కోహ్లి స్థానం గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘కోహ్లిని వన్డౌన్లో ఆడించాలనే ఆలోచన మాకు లేదు. ప్రస్తుత మా బ్యాటింగ్ ఆర్డర్ పట్ల మేము సంతోషంగానే ఉన్నాం.పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి జట్టును బట్టి మాత్రమే మా జట్టులో మార్పులు ఉంటాయి’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు.ఇక కోహ్లి ప్రదర్శన గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘‘అవును నేను ఈ విషయంలో సంతోషంగా లేను. అతడు పరుగుల వరద పారిస్తే చూడాలని ఉంది.అయితే, ఒక్కోసారి సవాళ్లు ఎదురుకావడం కూడా మన మంచికోసమే. ప్రస్తుత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇండియాలో బ్యాటింగ్ చేసేటపుడు తడబడ్డారు.ఇప్పుడు ఇక్కడ మాత్రం మెరుగ్గా ఆడుతున్నారు. మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రస్తుతం అదరగొడుతున్నారు. ఈ విషయంలో మాత్రం సంతోషంగా ఉంది’’ అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లికి వన్డౌన్లోనే మెరుగైన రికార్డు ఉంది. మూడో స్థానంలో వచ్చి 113 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్.. 53.96 సగటుతో 135.26 స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ఓపెనర్గా అతడి సగటు 39. స్ట్రైక్రేటు 39. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 121 మ్యాచ్లు ఆడిన కోహ్లి 4066 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ.. కీలక చర్చలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా కీలక చర్చలు జరిపారు.రక్షణ సంబంధాలు, రక్షణ ఉత్పత్తి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారం, సరిహద్దు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. పరస్పర వృద్ధి ప్రాంతీయ సహకారంపై దృష్టి సారించే ఉమ్మడి కార్యక్రమాలు, ఒప్పందాలపై చర్చించారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు..ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ భారతదేశానికి అతి పెద్ద అభివృద్ధి భాగస్వామని తెలిపారు. బంగ్లాతో తమ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రక్షణ ఉత్పత్తి నుండి సాయుధ బలగాల ఆధునీకరణ వరకు వివరణాత్మక చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.బంగ్లాదేశీయులు వైద్య చికిత్స కోసం భారతదేశానికి రావడానికి వీలుగా ఈ-మెడికల్ వీసా సౌకర్యాన్ని భారతదేశం ప్రారంభిస్తుందని మోదీ ప్రకటించారు. బంగ్లాదేశ్లోని వాయువ్య ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం రంగ్పూర్లో కొత్త అసిస్టెంట్ హైకమిషన్ను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. అదే విధంగా నేడు సాయంత్రం జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో తలబడబోయే భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.ఉగ్రవాదం, ఛాందసవాదం సరిహద్దు వద్ద శాంతియుత నిర్వహణపై తమ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల తమ రెండు దేశాల దృష్టి కూడా ఒకటేనని.. ఇండో-పసిఫిక్ మహా సముద్రాల చొరవలో చేరాలన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. తాము BIMSTEC, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై మా సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు.#WATCH | Delhi: PM Narendra Modi says, "India will start e-medical visa facility for people coming from Bangladesh to India for medical treatment. We have taken the initiative to open a new Assistant High Commission in Rangpur for the convenience of the people of the North West… pic.twitter.com/qNXwEWrcpl— ANI (@ANI) June 22, 2024 గతేడాది మేలో సమావేశమై.. అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు, అందులో భారత్-బంగ్లాదేశ్ మద్య గంగా నదిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ప్రారంభించి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసినట్లు పేర్కొన్నారు.బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్లో అధికారిక పర్యటనకు వచ్చిన తొలి విదేశీ నేత హసీనాయే కావడం గమనార్హం. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు. -
Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్తో గురువారం నాటి మ్యాచ్లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్తో బిజీగా గడిపింది.ప్రత్యేకంగా ప్రాక్టీస్ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్లో సంజూ శాంసన్తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్స్పోర్ట్స్ వెల్లడించింది.అతడిపై వేటు?ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్కే పరిమితమైన సంజూ శాంసన్కు బంగ్లాదేశ్తో మ్యాచ్లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హిట్టర్గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్రేటు 83.అందుకే సంజూకు లైన్ క్లియర్ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.పటిష్ట ఆసీస్ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W— BCCI (@BCCI) June 22, 2024 -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత క్రికెటర్ మహ్మద్ షమీ.. ఫిట్నెస్పై దృష్టి సారించాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ పేస్ బౌలర్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న షమీ.. ట్రెయినింగ్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ డాక్టర్ నితిన్ పటేల్, కండిషనింగ్ కోచ్ రజినీకాంత్ ఆధ్వర్యంలో పురోగోతి సాధిస్తున్నాడు.అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడువీలైనంత త్వరగా టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ విషయం గురించి షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు కానీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాల్ రిలీజ్ చేయగలుగుతున్నాడు. ఏదేమైనా తను ఈ మాత్రం కోలుకోవడం శుభసూచకం’’ అని న్యూస్18తో పేర్కొన్నాడు.కాగా రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.వికెట్ల వీరుడిగావన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన షమీ.. చీలమండ గాయంతో గతేడాది నవంబరు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో పలు ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఐపీఎల్-2024, టీ20 ప్రపంచకప్-2024 కూడా ఆడలేకపోయాడు. ఇక గాయానికి సర్జరీ చేయించుకుని కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఇలా ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. టీమిండియా షెడ్యూల్ ఇదే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు స్వదేశంలో 5 టెస్టులు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబరులో భారత్లో బంగ్లాదేశ్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్తో బంగ్లాదేశ్ 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్లు ఆడుతుంది.అక్టోబర్ 12న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. విదేశీ టూర్ల వివరాలున్యూజిలాండ్తో సిరీస్ ముగిశాక భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది.ఇక ఈ ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టి20 సిరీస్ను ఆడుతుంది. నవంబర్ 8న డర్బన్లో జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది. ఆ తర్వాత పోర్ట్ ఎలిజబెత్లో 10న రెండో టి20, 13న సెంచూరియన్లో మూడో టి20, 15న జొహన్నెస్బర్గ్లో జరిగే చివరిదైన నాలుగో టీ20తో పర్యటన ముగుస్తుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్-2024తో బిజీగా ఉంది. సెమీస్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.బంగ్లాదేశ్తో తొలి టెస్టు: సెప్టెంబరు 19–23 (చెన్నై) రెండో టెస్టు: సెప్టెంబరు 27–అక్టోబర్ 1 (కాన్పూర్) తొలి టి20: అక్టోబర్ 6 (ధర్మశాల) రెండో టి20: అక్టోబర్ 9 (న్యూఢిల్లీ) మూడో టి20: అక్టోబర్ 12 (హైదరాబాద్) న్యూజిలాండ్తో తొలి టెస్టు: అక్టోబర్ 16–20 (బెంగళూరు) రెండో టెస్టు: అక్టోబర్ 24–28 (పుణే) మూడో టెస్టు: నవంబర్ 1–5 (ముంబై) ఇంగ్లండ్తో తొలి టి20: జనవరి 22 (చెన్నై) రెండో టి20: జనవరి 25 (కోల్కతా) మూడో టి20: జనవరి 28 (రాజ్కోట్) నాలుగో టి20: జనవరి 31 (పుణే) ఐదో టి20: ఫిబ్రవరి 2 (ముంబై) తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్పూర్) రెండో వన్డే: ఫిబ్రవరి 9 (కటక్) మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్).చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
T20 WC 2024: సెమీఫైనల్ లక్ష్యంగా...
నార్త్సౌండ్ (ఆంటిగ్వా): టి20 వరల్డ్ కప్లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత్ సెమీఫైనల్ వేటలో మరో కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్–8 దశలో భాగంగా గ్రూప్–1లో నేడు జరిగే పోరులో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్పై అలవోకగా నెగ్గిన టీమిండియా అమితోత్సాహంతో ఉండగా... తమ మొదటి మ్యాచ్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి మధ్య మరో మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్కు చేరడం దాదాపు ఖాయమవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్లోనూ ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. బలాబలాలు, ఫామ్ను బట్టి చూస్తే మరో సందేహం లేకుండా భారత జట్టే ఫేవరెట్గా కనిపిస్తోంది. రోహిత్, కోహ్లి రాణిస్తే... టోరీ్నలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్లను బట్టి చూస్తే ఓపెనర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్పై మాత్రమే కాస్త ఆందోళన కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై రోహిత్ అర్ధ సెంచరీ చేసినా, తర్వాతి మూడు మ్యాచ్లలో విఫలమయ్యాడు. తొలి మూడు మ్యాచ్లలో విఫలమైన కోహ్లి...అఫ్గాన్పై 24 పరుగులు చేసినా అది అతని స్థాయికి తగిన ఇన్నింగ్స్ కాదు. ఈ నేపథ్యంలో బంగ్లాపై వీరిద్దరు చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. శివమ్ దూబే కూడా ఆశించిన రీతిలో ఆడటం లేదు. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్గా ఏకైక ప్రత్యామ్నాయం కావడంతో అతనికి మరో అవకాశం దక్కవచ్చు. ఇది మినహా ఇతర అంశాల్లో జట్టు పటిష్టంగా ఉంది. సూర్యకుమార్, పంత్ల బ్యాటింగ్తో పాటు పాండ్యా కూడా దూకుడుగా ఆడటం భారత్కు సానుకూలాంశం. బౌలింగ్లో అఫ్గాన్పై కుల్దీప్ ఆకట్టుకున్న నేపథ్యంలో తుది జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. అన్నింటా తడబాటు... సూపర్–8కు చేరినా లీగ్ దశలోనూ బంగ్లాదేశ్ ఆట అంతంతమాత్రమే. ఆసీస్తో పోరులో కూడా అది కనిపించింది. టాపార్డర్లో ఒక్క దూకుడైన బ్యాటర్ కూడా లేకపోవడం జట్టు ప్రధాన బలహీనత. తౌహీద్ ఫర్వాలేదనిపించడం మినహా ప్రధాన బ్యాటర్లు తన్జీద్, దాస్, కెపె్టన్ నజు్మల్ వరుసగా విఫలమయ్యారు. సీనియర్ మహ్ముదుల్లా కూడా ప్రభావం చూపలేదు. రికార్డు స్థాయిలో 9వ టి20 వరల్డ్ కప్ ఆడుతున్న షకీబ్ ఒక్క మ్యాచ్ మినహా బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్లలో కలిపి 2 వికెట్లు తీశాడు. భారత్పై అతను ఏమైనా ఆకట్టుకోగలడా అనేది చూడాలి. బౌలర్లు ముస్తఫిజుర్, తన్జీమ్, తస్కీన్ నిలకడగా రాణించడం వల్లే బంగ్లా ఇక్కడి వరకు వచ్చింది. వీరు టీమిండియా స్టార్ బ్యాటర్లను ఎంత వరకు నిలువరిస్తారనేది ఆసక్తికరం. టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X అమెరికావేదిక: బ్రిడ్జ్టౌన్; ఉదయం గం. 6 నుంచి భారత్ X బంగ్లాదేశ్వేదిక: నార్త్సౌండ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.కమిన్స్ హ్యాట్రిక్ఈ మ్యాచ్లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్లో నమోదైంది. ఆ ఎడిషన్లో బ్రెట్ లీ బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.వార్నర్ మెరుపు అర్ధ శతకం141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్కు అంతరాయం కలిగించి, డక్వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్తో (31) కలిసి ఆసీస్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
టీ20 వరల్డ్కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదు
టీ20 వరల్డ్కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కమిన్స్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024బంగ్లాదేశ్తో మ్యాచ్లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
T20 WC: ఓవరాక్షన్.. బంగ్లాదేశ్ పేసర్కు ఐసీసీ షాక్
బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్కు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి అతడికి గట్టి షాకిచ్చింది.నేపాల్తో మ్యాచ్ సందర్భంగా అతి చేసినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం చేయవద్దని హెచ్చరించింది.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ నేపాల్తో తలపడింది. కింగ్స్టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో నేపాల్ను 21 పరుగుల తేడాతో ఓడించింది.సకీబ్ అద్భుత బౌలింగ్తద్వారా గ్రూప్-డి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది బంగ్లాదేశ్. ఇక కీలక మ్యాచ్లో బంగ్లా గెలుపొందడంలో రైటార్మ్ పేసర్ తంజీమ్ హసన్ సకీబ్(Tanzim Hasan Sakib)కి ప్రధాన పాత్ర. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులిచ్చి.. 4 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.అయితే, ఆట పరంగా ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నా.. నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్తో అనుచితంగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు ఈ 21 ఏళ్ల ఫాస్ట్బౌలర్. రోహిత్ను వెనక్కి నెట్టేశాడునేపాల్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బౌలింగ్ చేస్తున్న తంజీమ్ రోహిత్ పౌడేల్ డిఫెన్స్ షాట్లు ఆడుతుండటంతో సహనం కోల్పోయి అతడి పైకి దూసుకెళ్లాడు.కోపంలో రోహిత్ను వెనక్కి నెట్టేశాడు తంజీమ్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక తంజీమ్ దురుసు ప్రవర్తన పట్ల స్పందించిన ఐసీసీ క్రమశిక్షణ చర్యలకు దిగింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఐసీసీ నిబంధనలోని ఆర్టికల్ 2.12 ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నపుడు సహచర ఆటగాడు, లేదంటే సహాయక సిబ్బంది, అంపైర్, మ్యాచ్ రిఫరీ, ప్రేక్షకులు.. ఇలా ఎవరిపట్లనైనా అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు.తప్పు చేశాడు ఇక రోహిత్ విషయంలో తంజీమ్ సకీబ్ తప్పు చేసినట్లు ఆన్ ఫీల్డ్ అంపైర్లు అషన్ రాజా, సామ్ నొగాస్కి.. థర్డ్ అంపైర్ జయరామన్ మదనగోపాల్, ఫోర్త్ అంపైర్ కుమార్ ధర్మసేన రిపోర్టు ఇవ్వడంతో ఐసీసీ అతడి ఫీజులో 15 శాతం కోత వేసింది.కాగా రోహిత్ పౌడేల్ వికెట్ను తంజీమ్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తంజీమ్కు తనకు మధ్య వివాదం అక్కడితోనే సమసిపోయిందని తెలిపాడు. అదే విధంగా.. తంజీమ్ గొప్పగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ సూపర్-8లో భాగంగా తదుపరి ఆస్ట్రేలియాతో (జూన్ 21) తలపడనుంది.చదవండి: కెప్టెన్సీకి గుడ్ బై.. విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై