-
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్బాట్కు కాల్ చేసే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్లో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్లు, పిచ్లు, యాసలు ఎంచుకోవచ్చు. -
యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా తయారుచేసిన లామా ఏఐ చాట్బాట్ను యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్ స్పష్టతనిచ్చింది. రెండు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది.జనరేటివ్ఏఐకు ఆదరణ పెరుగుతుండడంతో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీను వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. దాంతో గతంలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. అందులో భాగంగానే మార్చిలో మెటాతోనూ చర్చించింది. అయితే గోప్యతాపరమైన కారణాల వల్ల ఈ భాగస్వామ్యం కుదరలేదని చెప్పింది. ఇటీవల యాపిల్ ప్రొడక్ట్ల్లో మెటా కంపెనీకు చెందిన లామా చాట్బాట్ను వినియోగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో బ్లూమ్బర్గ్ వేదికగా యాపిల్ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాయి. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశాయి.ఇదీ చదవండి: రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!ఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఈ కాన్ఫరెన్స్లో తెలిపింది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్లో ఈ ఫీచర్ను అందించనున్నట్లు చెప్పింది. -
యూట్యూబ్ కొత్త ఫీచర్.. డీప్ఫేక్ వీడియోలకు గుడ్బై
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న తరుణంలో దాదాపు అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని డీప్ఫేక్ వీడియోలను సృష్టించడానికి ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా బలైపోతున్నారు.సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్శించడానికి కొంతమంది తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూడటానికి అసలైన వీడియోల మాదిరిగానే ఉండటం వల్ల, అసలైన వీడియో ఏది? నకిలీ వీడియో ఏది, అని గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి వాటిని పరిష్కరించడానికి యూట్యూబ్ చర్యలు తీసుకుంటోంది, ఇందులో భాగంగానే కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తోంది.ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలను గానీ, వారి వాయిస్ గానీ ఉపయోగించి వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాటిపైన రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాకూండా ఏఐను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేసేవారు తప్పకుండా ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని యూట్యూబ్ పేర్కొంది.ఏఐను ఉపయోగించి డీప్ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తే.. యూజర్ల రిపోర్ట్ మేరకు యూట్యూబ్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ కంటెంట్ డిలీట్ చేస్తుంది. ఈ విధంగా డీప్ఫేక్ వీడియోలను పూర్తిగా రూపుమాపే అవకాశం ఉంది. దీంతో డీప్ఫేక్ భయానికి లోనయ్యేవారు నిశ్చింతగా ఉండవచ్చు. యూజర్ల భద్రతే ప్రధానంగా భావించిన యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఏఐ కంపెనీని స్థాపించిన చాట్జీపీటీ కోఫౌండర్
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.గత ఏడాది నవంబర్లో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్తోపాటు సట్స్కేవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్కేవర్ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..సట్స్కేవర్తో పాటు మాజీ ఓపెన్ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్లో మాజీ ఏఐ లీడ్గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్లుగా చేరారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్తోపాటు యూఎస్లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. -
ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా..
‘కృత్రిమ నవ్వు’ అని వెక్కిరిస్తాం. ‘వారి మాటల్లో అంతా కృత్రిమత్వమే’ అని విమర్శిస్తాం. ‘కృత్రిమత్వం’ ‘సహజత్వం’ భిన్న ధ్రువాలు అనే వాస్తవాన్ని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తిరగ రాసింది. కృత్రిమ మేధస్సు నుంచి పుట్టిన అందాల యువతులు నవ్వితే ఆ నవ్వులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. మాట్లాడితే... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందేగానీ ఎక్కడా కృత్రిమ ఛాయ కనిపించదు.మానవులతో పోటీ పడుతూ ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటున్న డిజిటల్ సొగసరులకు ఏఐ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ అందాల పోటీ నిర్వహించింది. ‘మిస్ ఏఐ’ పోటీ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘మిస్ ఏఐ’ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఏఐ మోడల్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. ‘టాప్ –10’ ఫైనలిస్ట్ జాబితాలో మన దేశం నుంచి డిజిటల్ దివా జరా శతవరి చోటు సాధించింది.బ్యూటీ, టెక్ స్కిల్స్, సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఎంత... మొదలైన అంశాలు ‘మిస్ ఏఐ’ ఎంపిక ప్రక్రియలో ఉంటాయి. న్యాయ నిర్ణేతలలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం విశేషం. ‘మిస్ ఏఐ విజేత’ ఎవరవుతారో అనే ఆసక్తికంటే ‘ఎవరీ జరా శతవరి?’ అనే ఆరా ఎక్కువ అయింది. అందానికి అక్షరాలా నిర్వచనంలా ఉన్న ఈ శతవరి ఎవరో తెలుసుకుందాం..ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి శతవరి సృష్టికర్త. శతవరిని ‘డిజిటల్ మీడియా మేధావి’గా అభివర్ణించాడు రాహుల్. ‘మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో శతవరికి ‘టాప్–10’ చోటు దక్కిన సందర్భంగా తన లింక్డ్ ఇన్ పోస్ట్లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాహుల్.‘ఈ గుర్తింపు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి జరా శతవరి చేసిన విశేష కృషిని తెలియజేస్తుంది. ప్రపంచ వేదికపై భారత్, ఆసియాకుప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాను. శతవరి భారత్ నుంచి ఏకైక ఫైనలిస్ట్, ఆసియా నుంచి ఇద్దరిలో ఒకరు’ అని పోస్ట్లో స్పందించాడు రాహుల్.కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ని ఎలా చూడాలి?’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తోంది. అందం, సోషల్ మీడియాలోని అభిమాన గణం మాత్రమే శతవరి విలువకుప్రాతిపదిక కాదు. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తుంది. కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణానికి సంపూర్ణంగా అద్దం పడుతుంది.‘ఏ.ఐ. సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ఆమె లక్ష్యం’ అంటున్నాడు జరా శతవరి సృష్టికర్త రాహుల్. కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ పనితీరును ఎలా చూడాలి? ’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తుందిశతవరి శక్తి ఇది...– ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ–పవర్డ్ సోషల్ మీడియా స్ట్రాటజీ, ఎనాలటిక్స్ నేర్చుకుంది.– 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంది.– ‘ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్’గా తన టాలెంట్ను చూపించింది.– సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ‘వావ్’ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 8000 మంది ఫాలోవర్లు ఉన్నారు.– స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది. -
మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్గా జరా శతావరి!
ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్ టెన్ ఫైనలిస్ట్గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్ , డిప్రెషణ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్ హ్యుమన్ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..ఎవరీ జరా శతావరి.?ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్ ఎల్ఎల్పీలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్గా చేరింది.అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్లో, కంటెంట్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్ అడ్వకేసీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్ సంరక్షణ కౌన్సిలింగ్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. తనని తాను డిజిటల్ మీడియా మావెన్గా అభివర్ణించే రాహుల్ చౌదరి మిస్ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. అంతేగాదు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే ఫ్యాన్వ్యూ వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డ్స్ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్ కావడం విశేషం అన్నారు బ . కాగా, ఈ మిస్ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్ ఏఐ క్రియేటర్ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్ షిప్ ప్రోగ్రామ్లు, పీఆర్ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: -
మిస్ ఏఐ అందాల పోటీ టాప్లో జరా శతావరి! ఎవరీ బ్యూటీ..? (ఫోటోలు)
-
వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!
పుర్రె భాగాన్ని స్కాన్చేసి వ్యక్తులను గుర్తించే ఏఐ సాంకేతికత ‘దివ్యదృష్టి’ను తయారు చేసినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తెలిపింది. డీఆర్డీఓ ఏర్పాటు చేసిన ‘డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0’లో ఈ టెక్నాలజీను ఆవిష్కరించిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచిందని చెప్పింది.డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం..‘దేశవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కొత్త ఏఐ టూల్ను పరిచయం చేసిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ గెలుపొందింది. శివాని వర్మ అనే మహిళా వ్యాపారవేత్త ఈ కంపెనీను స్థాపించారు. సంస్థ తయారు చేసిన ‘దివ్యదృష్టి’ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న వ్యక్తులను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇందులో భాగంగా మానవుల పుర్రె భాగాన్ని వివిధ శారీరక పరామితులను ఉపయోగించి స్కాన్ చేస్తారు. పుర్రె పరిమాణం, అందులోని ఇతర పరామితులు వ్యక్తులనుబట్టి మారుతాయి. దాంతో విభిన్న వ్యక్తుల ముఖాలను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. అడ్వాన్స్డ్ బయోమెట్రిక్ సాంకేతికతను కూడా ఈ ‘దివ్యదృష్టి’లో ఉపయోగించారు.కొత్తగా కనుగొన్న ఏఐ టూల్ను రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్, కార్పొరేట్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా విభిన్న రంగాల్లో వినియోగించవచ్చని డీఆర్డీఓ తెలిపింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్(సీఏఐఆర్) మార్గదర్శకత్వంతో ఈ టూల్ను కనుగొన్నట్లు ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ తెలిపింది.ఇదీ చదవండి: మార్కెట్ ట్రెండ్ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ..కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేలా డీఆర్డీఓ అనుసరిస్తున్న మార్గాలు అభినందనీయమన్నారు. ‘దివ్యదృష్టి’ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (టీడీఎఫ్) సహాయం చేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫేస్ రికాగ్నిషన్ టెక్నాలజీలో కేవలం ముఖ కవలికలు, ముక్కు, కళ్లు, కనుబొమ్మలు.. వంటి భాగాలను స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తున్నారు. అయితే దాదాపు ఒకేలా ఉన్న వ్యక్తులను ఈ టెక్నాలజీతో కనిపెట్టడం కొంత కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ‘దివ్యదృష్టి’ ఏకంగా పుర్రె భాగాలను స్కాన్ చేస్తుంది కాబట్టి మరింత కచ్చితత్వంతో కనిపెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్లో గూగుల్ ‘జెమిని’ యాప్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపారు. తాజాగా గూగుల్కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
టెకీలకు గుడ్న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.ఒరాకిల్ సర్టిఫికేషన్ను ప్రొఫెషనల్స్కు ఇండస్ట్రీ స్టాండర్డ్గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు. -
ఇదో డిఫరెంట్ ఇంటెలిజెన్స్.. 'ఏఐ'పై సత్యనాదెళ్ళ
టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టింస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఆ పదమే నచ్చదని అన్నారు. దీనికి ఓ కొత్త పేరు కూడా ప్రతిపాదించారు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే, దాన్ని మనుషులతో పోల్చడం సరికాదని అన్నారు.1950లలో పుట్టుకొచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే పదం పట్ల సత్య నాదెళ్ల అయిష్టతను వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి 'కృత్రిమ మేధస్సు' అని నేను అనుకుంటున్నాను, మనం దానిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని పిలువవచ్చు. ఎందుకంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది, కాబట్టి ఏఐ అవసరం లేదని సత్య నాదెళ్ల అన్నారు.టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సుకు సరికాదు. ఎందుకంటే మనిషికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలామంది మనిషి సృష్టించినదాన్ని మనిషి కంటే గొప్పదని అనుకుంటున్నారు. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. ఇలాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో లెక్కకు మించి రావొచ్చు. ఆ ఘనత మొత్తం మనిషికే చెందుతుంది. ఎందుకంటే వాటిని రూపొంచేది మనిషే కాబట్టి.ఏఐ ఇలా పనికొస్తుందిఏఐ మానవ పరిభాషలో కావలసిన విషయాలను వెల్లడిస్తుందని అంగీకరించారు. సాఫ్ట్వేర్ పనితీరును వివరించడానికి "లెర్నింగ్" వంటి సాపేక్ష పదాలను ఉపయోగించి సాఫ్ట్వేర్ వెనుక ఉన్న అల్గారిథమ్లను అర్థం చేసుకోవడానికి ప్రజలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. -
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఆర్థిక వృద్ధి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 89 శాతం మంది భారతీయులు సాంకేతికతను కీలక అంశంగా భావిస్తున్నారని హెచ్పీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 76 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది సాంకేతికత పరివర్తన శక్తిపై భారత్ బలమైన నమ్మకాన్ని నొక్కిచెబుతోందని హెచ్పీ ఒక ప్రకటనలో తెలిపింది.పర్యావరణ, సామాజిక లక్ష్యాల దిశగా తన పురోగతిని తెలియజేస్తూ హెచ్పీ తన సుస్థిర ప్రభావ నివేదిక 2023తో పాటు ఈ ఫలితాలను ఆవిష్కరించింది. టెక్నాలజీ అందుబాటును పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి సానుకూల సామాజిక ప్రభావం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడానికి హెచ్పీ చేస్తున్న ప్రయత్నాలను నివేదికలో వివరించింది. ఈ అంశంపై స్వతంత్ర పరిశోధనలు జరిపేందుకు హెచ్పీ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ను నియమించింది. 2023 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, జర్మనీ, జపాన్, చైనా, మెక్సికో, బ్రెజిల్, కెనడా వంటి 10 దేశాలకు చెందిన 1,036 మంది బిజినెస్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.భారత్లో ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్న హెచ్పీతన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా తన డిజిటల్ బిజినెస్ స్కిల్స్ ‘హెచ్పీ లైఫ్’ ప్రోగ్రామ్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉచిత కృత్రిమ మేధ శిక్షణను మిళితం చేయాలని హెచ్పీ యోచిస్తోంది. వర్క్, సృజనాత్మక ప్రక్రియలను పెంచడానికి హెచ్పీ భారత్లో నెక్ట్స్ జనరేషన్ ఏఐ పీసీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.అదనంగా 2030 నాటికి హెచ్పీ లైఫ్ ఉచిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో 27.5 లక్షల మంది వినియోగదారులను నమోదు చేయాలనే తన లక్ష్యాన్ని హెచ్పీ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హెచ్పీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటికే 12 లక్షల మంది యూజర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ అత్యధికంగా కొత్త యూజర్లను కలిగి ఉంది.టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలని హెచ్పీ గ్లోబల్ హెడ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్, హెచ్పీ ఫౌండేషన్ డైరెక్టర్ మిషెల్ మాలెజ్కీ సూచించారు. డిజిటల్ ఎకానమీలో వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. "పురోగతిని నడిపించడానికి సాంకేతికత ఒక గొప్ప శక్తివంతమైన సాధనం" అని మాలెజ్కీ పేర్కొన్నారు. -
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్ను ఓ చిన్న కంప్యూటర్తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్వర్క్లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024 -
Apple WWDC 2024: సిరి 2.0 వస్తోంది.. కొత్త ఫీచర్స్ ఇవే!
యాపిల్ కంపెనీ 'వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమాన్ని సోమవారం (జూన్ 10) ప్రారంభించనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. రాబోయే ఉత్పత్తులకు సంబంధించి కొత్త ప్రకటనలను కూడా చేసే అవకాశం ఉంది.యాపిల్ కంపెనీ నిర్వహించనున్న డబ్ల్యుడబ్ల్యుడీసీ కార్యక్రంలో ఏఐ అప్డేట్లను, సిరి 2.0 పేరుతో లేటెస్ట్ ఫీచర్స్ పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ సిరి 2.0 మీద ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది. దీంతో కంపెనీ కొత్త ఫీచర్స్ ఆవిష్కరించనున్నట్లు సమాచారం.యాపిల్ సిరి 2.0 కింద.. బుక్, కెమెరా, కీనోట్, మెయిల్, నోట్స్, ఫోటోస్, రిమైండర్లు, సఫారీ, స్టాక్స్, వాయిస్ మెమోస్, సిస్టమ్ సెట్టింగ్స్, ఫ్రీఫార్మ్ అండ్ ఫైల్స్, కాంటాక్ట్ అండ్ మాగ్నిఫైయర్ ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సిరి 2.0 కింద మాత్రమే కాకుండా.. అప్డేటెడ్ ఐఓఎస్ 18 అప్లికేషన్లకు పరిచయం చేయనుంది. -
ఈ ఏఐ స్కిల్కి క్రేజీ డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు!
కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అన్నింటా ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక భయాలు, సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఏఐ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది.. దానికి సిద్ధంగా ఉన్నామా.. వెనుకబడిపోతామా అన్న భయంతో అవసరమైన ఏఐ నైపుణ్యం కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.సీఎన్బీసీ నివేదిక ప్రకారం, దాదాపు 96 శాతం మంది కంపెనీల అధినేతలు తమ సంస్థల నిర్వహణలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. 2024 మార్చిలో స్లాక్ వర్క్ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది కార్యాలయ ఉద్యోగులు తాము ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేయలేదని అంగీకరిస్తున్నారు.ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం మానేసే వారు కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడింట్ లిడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కర్లేదని ఆమె చెబుతున్నారు.అంత డిమాండ్ ఎందుకంటే..ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాలలో ఒకటైన చాట్జీపీటీని మీరు ఉపయోగించినట్లయితే, మీ ప్రాంప్ట్ లు ఎంత కచ్చితమైనవి అయితే, ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని మీరు గమనించే ఉంటారు. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కు ఇంత డిమాండ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన ఎంప్లాయర్ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ చాట్బాట్లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు. ఈ జాబ్ కోసం బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేకపోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు వంటి సరికొత్త ఉద్యోగాలకు సాంప్రదాయ డిగ్రీల కంటే టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వివరించారు.ప్రాంప్ట్ ఇంజనీర్కు భారత్లో జీతాలు ఇలా..లింక్డ్ఇన్, జాబ్-సెర్చ్ సైట్ ఇన్డీడ్లోని లిస్టింగ్స్ ప్రకారం కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్కు సంవత్సరానికి రూ .93 లక్షల నుంచి రూ .16 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్లో 2-5 ఏళ్ల అనుభవం ఉన్న ఇంజినీర్ ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సంపాదించవచ్చు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు వార్షిక వేతనం రూ .12 లక్షలు దాటి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. -
డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్కు చెందిన నెక్ట్స్వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.హైదరాబాద్ సంస్థ నెక్ట్స్వేవ్తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్ అట్టులూరి, గుజ్జుల శశాంక్ రెడ్డి, అనుపమ్ ఏర్పాటు చేసిన నెక్ట్స్వేవ్ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్ కోర్సులను ఆన్లైన్లో అందిస్తోంది.భారత్ చెందిన కంపెనీలు ఇవే..ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్ పరీక్షను నిరమాయ్ అభివృద్ధి చేస్తోంది. పిక్సెల్ కంపెనీ జియో స్పేషియల్ డేటాను అందించే హైపర్స్పెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్ఫారాలను సర్వమ్ ఏఐ సిద్ధం చేస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను యాంపియర్అవర్ తయారుచేస్తోంది. క్రాప్ఇన్ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది. హెల్త్ప్లిక్స్ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ(ఐబీసీ) రీఛార్జబుల్ ప్రిస్మాటిక్ లిథియం అయాన్ నికెల్ మాంగనీజ్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్ట్రింగ్ బయో అనే మరో కంపెనీ విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తోంది. -
2030 నాటికి జాబ్ మార్కెట్ షేక్.. కలవరపెడుతున్న రిపోర్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చే దశాబ్దంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. మెకిన్సే నివేదిక ప్రకారం.. 2030 నాటికి సుమారు 1.2 కోట్ల వృత్తిపరమైన పరివర్తనలకు దారితీస్తుంది. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కనిపించిన ఉద్యోగ మార్పులతో పోల్చదగిన వేగం.మెకిన్సే సీనియర్ పార్ట్నర్, దాని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వైలిన్ ఎలిన్గ్రుడ్ ఇటీవల జరిగిన మీడియా డే సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా కొన్ని రంగాలు ముఖ్యంగా హెల్త్ కేర్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలు వృద్ధిని చవిచూస్తాయని భావిస్తున్నారు.ప్రభావితమయ్యే రంగాలు ఇవే..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావిత ఉద్యోగ మార్పులు ప్రధానంగా నాలుగు ప్రధాన విభాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్, ఫుడ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్. ఈ విభాగాల్లో పునరావృత పనులు, డేటా కలెక్షన్, ప్రాథమిక డేటా ప్రాసెసింగ్ నిర్వహించే వారిపై మార్పు ప్రభావం ఉంటుందని ఎల్లిన్గ్రుడ్ పేర్కొన్నారు. ఈ విధులు ఆటోమేషన్కు ప్రధాన లక్ష్యమని, వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆమె చెబుతున్నారు. 2030 నాటికి డిమాండ్ తగ్గుతున్న ఉద్యోగాల్లోని సుమారు 1.18 కోట్ల మంది కొత్త పనులకు మారాల్సి ఉంటుందని మెకిన్సే నివేదిక అంచనా వేసింది.ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎలిన్గ్రుడ్ ఎత్తిచూపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకోవడం, ఆటోమేషన్ కు తక్కువ అవకాశం ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడం వ్యక్తులకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మానవ సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను యంత్రాలు భర్తీ చేయలేవు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు. -
వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయం
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఆధ్వర్యంలోని సీబీఆర్ స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి విప్రో సీబీఆర్తో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్ను తయారుచేయనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్త టెక్నాలజీ ఇంజిన్లో వాడే కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్డేటా అనలిటిక్స్ నిత్యం వ్యక్తులతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తాయి. గుండె, న్యూరోడిజెనరేటివ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం, వాటిని నిర్వహించడంపై దృష్టి పెడుతాయి. సీబీఆర్ సహకారంతో డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్ను విప్రో పరీక్షిస్తుంది.ఇదీ చదవండి: రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..విప్రో లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి మాట్లాడుతూ..‘సాంకేతిక ఆవిష్కరణల ద్వారా హెల్త్కేర్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈమేరకు కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ ఆధ్వర్యంలోని సీబీఆర్తో భాగస్వామ్యం కావడం సంతోషకరం. విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్ పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు. -
మస్క్ ఏఐ కంపెనీ Xaiకి పెట్టుబడుల వరద..
ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్ఏఐ అధికారికంగా తెలిపింది. ఈ నిధుల్ని xAIని మార్కెట్కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది. అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం. మస్క్ చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఏఐ చాట్జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్కు సలహా ఇచ్చారు. -
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా రంగంలోనూ ప్రవేశించింది. ఏఐని విద్యలో విలీనం చేసే దిశగా గౌహతిలో రాయల్ గ్లోబల్ స్కూల్ తొలి ఏఐ టీచర్ 'ఐరిస్'ను ఆవిష్కరించింది.సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ‘ఐరిస్’ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా, ఉదాహరణలతో చక్కగా సమాధానాలు ఇచ్చింది.విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు.. కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) ప్రాజెక్టు కింద మేకర్ల్యాబ్స్ ఎడ్యు-టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ‘ఐరిస్’ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. -
‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పారిస్లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్లో మస్క్ రిమోట్గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న మస్క్ కంప్యూటర్, రోబోట్లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు. -
అరుదైన ప్రతిభ.. అక్షత!
చిన్న వయసులోనే కృత్రిమ మేధా(ఏఐ) రంగంలో పెద్ద పేరు తెచ్చుకుంది అక్షతా కిశోర్ మొహరిర్. అభిరుచితో మొదలైన ప్రయాణం...అధ్యయనం, పట్టుదలతో మెషిన్ లెర్నింగ్ రంగంలో అక్షతను అగ్రగామిగా నిలిపింది.కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్శిటీ(విటీయు–బెళగావీ)లో కంప్యూటర్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లకు సంబంధించిన ఆసక్తి మరింత పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్పార్క్(యూఎంసీపీ)లో మెషిన్ లెర్నింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.ఇంటర్ప్రెటబుల్ అండ్ ఇంటరాక్టివ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అక్షతకు ఏడు యూఎస్ పేటెంట్లు లభించాయి. యూజర్ ఫ్రెండ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోల్యూషన్లను రూ΄÷ందించడంపై అక్షత దృష్టి పెట్టింది.ఇవి చదవండి: డెనిమ్ న్యూ లుక్ డిజైన్..! -
పవర్ఫుల్ ప్రఫుల్..!
‘కవిత్వం ఒక తీరని దాహం’ అనేది ప్రసిద్ధమైన మాట. ప్రఫుల్ ధరివాల్కు కవిత్వం పెద్దగా పరిచయం లేకపోవచ్చు. అయితే భౌతిక, గణిత శాస్త్రాలు అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టం భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో అంతులేని దాహం అయింది. ‘ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. నెక్ట్స్ ఏమిటి’ అనే అతడి సూపర్ స్పీడ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేలా, తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడింది. అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ‘ఓపెన్ఏఐ’ గుర్తించే స్థాయికి చేరుకుంది. ‘ఓపెన్ ఏఐకి గర్వకారణం’ అని చెప్పుకునేలా చేసింది. ‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు. అది విజయానికి గట్టి పునాది’ అనే మాట పుణెకి చెందిన ప్రఫుల్ ధరివాల్ విషయంలో మరోసారి నిజమైంది...ఓపెన్ఏఐ సీయివో సామ్ ఆల్ట్మాన్ ఫ్రఫుల్ ధరివాల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ధరివాల్ లేకుండా ‘జీపిటీ 4వో’ సాధ్యమయ్యేది కాదని ట్వీట్ చేశాడు. చిన్నప్పటి నుంచే సైన్స్, గణితంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తున్నాడు ప్రఫుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ టాలెంట్ రిసెర్చ్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. చైనాలో జరిగిన అంతర్జాతీయ ఖగోళ ఒలింపియాడ్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లోనూ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.ప్రఫుల్ అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎక్యుకేషన్కు సంబంధించి అబాసాహెబ్ నరవానే మెమోరియల్ ప్రైజ్కు ఎంపికయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. 2016లో ‘ఓపెన్ఏఐ’లో రిసెర్చ్ ఇంటర్న్గా చేరాడు.జీపీటి–3, డాల్–ఇ 2, జ్యుక్బాక్స్, గ్లోతో సహా ఎన్నో సంచలనాత్మక ఏఐ మోడల్స్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. ఓపెన్ ఏఐకి ముందు క్వాంటిటేటివ్ అనలిస్ట్ ఇంటర్న్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్గా, సెంటర్ ఫర్ బ్రెయిన్, మైండ్ అండ్ మెషిన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ రిసెర్చర్గా పనిచేశాడు.తాజా విషయానికి వస్తే..ఓపెన్ఏఐ సీయివో సామ్ ఆల్ట్మాన్ ట్విట్తో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు ప్రఫుల్. ప్రఫుల్ కీలకపాత్ర పోషించిన మల్టీలింగ్వల్, మల్టీమోడల్ జెనరేటివ్ ప్రీ–ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ ‘జీపీటి–4వో’ గురించి...‘అందరి కృషి వల్లే జీపీటి–4వో లాంచ్ సాధ్యమైంది’ అంటాడు ప్రఫుల్. ‘ఈప్రాజెక్ట్లో భాగంగా అద్భుతమైన వ్యక్తులతో కలిసిపనిచేసే అవకాశం దొరికింది’ అంటాడు వినమ్రంగా.ఇంతకీ ప్రఫుల్ సక్సెస్ మంత్రా ఏమిటి?సామ్ ఆల్ట్మాన్ మాటల్లో చె΄్పాలంటే... విటిసిడి.వి... విజన్ టి... టాలెంట్సి... కన్విక్షన్డి... డిటర్మినేషన్. -
తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్మెంట్కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్జీపీటీ ఎఫెక్ట్ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్మెంట్లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్పై చాట్జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు.