-
అబుదాబి ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి, ఇద్దరు భారతీయుల దుర్మరణం!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, ఏడీఎన్ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తాన్ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో చిన్న విమానానికి సంబంధించిన భాగాలు కనిపించాయని, రెండు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదానికి డ్రోన్ దాడులు కారణమని పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: Viral Video: హార్ట్ రైజింగ్ వీడియో: ఎదురుగా వస్తున్న రైలు ముందుకి తోసేసి.. -
నాకు కరోనా పాజిటివ్.. మరేం ఫర్వాలేదు: టెన్నిస్ స్టార్
Covid 19 Positive: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. అబుదాబి టోర్నీలో ఆడిన నాదల్ స్వదేశానికి తిరిగి రాగానే నిర్వహించిన టెస్టులో పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. ‘‘అబుదాబి టోర్నమెంట్ తర్వాత స్పెయిన్కు తిరిగి వచ్చాను. ఈ సందర్భంగా నిర్వహించిన పీసీఆర్ టెస్టులో కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయింది. కాస్త ఇబ్బందిగా ఉంది. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదు. నాతో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు.. నాకు కరోనా సోకిన విషయం తెలిపాను ’’ అని నాదల్ పేర్కొన్నాడు. కాగా 20 సార్లు గ్రాండ్స్లామ్ విజేత అయిన నాదల్... కాలి గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అబుదాబి వేదికగా జరిగిన ముబదాలా వరల్డ్ టెన్నిస్ చాంపియన్షిప్తో పునరాగమనం చేశాడు. ముర్రే చేతిలో ఓటమిపాలై ఇంటిబాట పట్టాడు. చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. Hola a todos. Quería anunciaros que en mi regreso a casa tras disputar el torneo de Abu Dhabi, he dado positivo por COVID en la prueba PCR que se me ha realizado al llegar a España. — Rafa Nadal (@RafaelNadal) December 20, 2021 -
Rohit Sharma: ఆఖరి బాల్కు సిక్సర్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం!
Rohit Sharma & Usman Khawaja React On Verstappen Win: గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉంటేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేయవచ్చంటారు... రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్కు ఈ మాటలు చక్కగా సరిపోతాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన అబుదాబి గ్రాండ్ప్రి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్ను ఓడించి తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్ 1) ప్రపంచ చాంపియన్గా అవతరించాడు వెర్స్టాపెన్. తన చిరకాల కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. గెలవగానే.. ‘‘నిజంగా.. ఇది నా అదృష్టమనే చెప్పాలి’’ అని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విజేతను నిర్ణయించిన తీరుపై నిర్వాహకులపై విమర్శలు కూడా వస్తున్నాయి. రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. అబుదాబి గ్రాండ్ప్రి రేసులో వెర్స్టాపెన్ విజయంపై పలువురు క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు. కొంతమంది అతడిని అభినందిస్తే.. మరికొంతమంది మాత్రం మెర్సిడెస్కు వత్తాసు పలికారు. ఎవరెవరు ఏమన్నారంటే.. ఆఖరి బాల్.. సిక్స్ కొట్టేశాడు... ‘‘ఒక్క బాల్ సిక్సర్ కొట్లాలి.. ఏం జరిగిందో ఊహించండి.. మాక్స్ వెర్స్టాపెన్ సిక్స్ కొట్టేశాడు. నమ్మశక్యం కాని విజయం ఇది. అబుదాబి గ్రాండిప్రి.. కొత్త చాంపియన్ వెర్స్టాపెన్’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెర్స్టాపెన్కు శుభాకాంక్షలు తెలిపాడు. 1 ball 6 required and guess what, Max Verstappen hits it. Unbelievable win #AbuDhabiGP #F1TitleChampionship — Rohit Sharma (@ImRo45) December 12, 2021 అతిపెద్ద తప్పిదం ఇది.. ‘‘ఎఫ్ 1 చరిత్రలో అతిపెద్ద తప్పిదం ఇది’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ట్వీట్ చేశాడు. That is the biggest mistake in F1 history. — Usman Khawaja (@Uz_Khawaja) December 12, 2021 హామిల్టన్ మాటల్ని ఉటంకించిన మాంటీ పనేసర్.. ‘‘కచ్చితంగా.. నేను ఏమాత్రం సంతోషంగా లేను. నా పట్ల ఎలా వ్యవహరించాలనుకున్నారో వాళ్లు అలాగే వ్యవహరించారు. దృఢ సంకల్పంతో నేను తిరిగి వస్తాను’’ అని మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ మాటల్ని ఉటంకిస్తూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అతడికి మద్దతు పలికాడు. Obviously I am not happy but they can throw what they want at me, I will come back stronger. @LewisHamilton #LewisHamilton #MaxVerstappen #F1Finale #AbuDabhiGP pic.twitter.com/NGNLf5hmNc — Monty Panesar (@MontyPanesar) December 12, 2021 నిజంగా ఇది ఏమాత్రం సరికాదు.. ‘‘ఇద్దరు డ్రైవర్లు... రెండు జట్లు... అయినా ఇది సరికాదు... ఏం మాట్లాడాలో అర్థంకాలేదు’’ అని ఇంగ్లండ్ ఫస్ట్క్లాస్ క్రికెటర్ టిమ్ బ్రెస్నన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్ I like both drivers and both teams. But surely that wasn't right. Speechless #Formula1 #AbuDabhiGP — Tim Bresnan (@timbresnan) December 12, 2021 The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
Max Verstappen: ఎఫ్1లో సంచలనం.. తొలిసారి చాంపియన్గా..
Max Verstappen wins Abu Dhabi Grand Prix, beats Lewis Hamilton: గత నాలుగు సీజన్లలో ఎదురులేని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆధిపత్యానికి గండికొడుతూ ఫార్ములావన్ (ఎఫ్1)లో మాక్స్ వెర్స్టాపెన్ రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్ప్రిలో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ ఆఖరి ల్యాప్లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో ఏడు ప్రపంచ టైటిల్స్ తో జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన హామిల్టన్ మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. అబుదాబి: ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్ప్రి రేసులో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నిరూపించాడు. బ్లాక్ బాస్టర్ సినిమాను తలపించిన 2021 ఎఫ్1 సీజన్ వివాదాస్పదంగా ముగిసింది. డ్రైవర్ చాంపియన్షిప్ను తేల్చే అబుదాబి గ్రాండ్ప్రిలో 58 ల్యాప్ల ప్రధాన రేసును వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్ చాంపియన్షిప్లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్స్టాపెన్ తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. 57వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్లో వెనుకబడిన హామిల్టన్ (బ్రిటన్) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్ కొంపముంచిన సేఫ్టీ కార్... రెండో స్థానం నుంచి రేసును మొదలు పెట్టిన హామిల్టన్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి రేసులో ఆధిక్యంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అద్భుతంగా డ్రైవ్ చేసిన హామిల్టన్ వెర్స్టాపెన్కు అందకుండా దూసుకెళ్లాడు. ల్యాప్ ల్యాప్నకు రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్తో అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక ఎనిమిదో డ్రైవర్ చాంపియన్షిప్ టైటిల్ ఖాయం అనుకున్న తరుణంలో ‘సేఫ్టీ కార్’ ట్విస్ట్ హామిల్టన్ ఆశలపై నీళ్లు చల్లింది. 53వ ల్యాప్లో విలియమ్స్ డ్రైవర్ నికోలస్ లతీఫీ కారు ప్రమాదానికి గురికావడంతో రేసు స్టీవర్డ్స్ సేఫ్టీ కారును ట్రాక్ మీదకు పంపారు. ఇదే సమయంలో పిట్లోకి వచ్చిన వెర్స్టాపెన్ టైర్లను మార్చుకొని మళ్లీ ట్రాక్పై హామిల్టన్ వెనకగా రెండో స్థానంలో నిలిచాడు. 53వ ల్యాప్ ముందు వరకు హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య 11 ఉన్న సెకన్ల గ్యాప్ .... 57వ ల్యాప్లో సెకను కంటే తక్కువకు తగ్గింది. చివరి ల్యాప్లో రేసు మరోసారి ఆరంభం కాగా... రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్ తన కారుకు ఉన్న కొత్త టైర్ల సాయంతో ఐదో మలుపు వద్ద హామిల్టన్ను అధిగమించి విజేతగా నిలవడంతో పాటు డ్రైవర్ చాంపియన్షిప్ టైటిల్ను కూడా సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ నిరసన... రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్కు మెర్సిడెస్ ఫిర్యాదు కూడా చేసింది. 53వ ల్యాప్లో సేఫ్టీ కారు ట్రాక్పైకి రాగా... ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత ల్యాప్డ్ (ఒక ల్యాప్ తక్కువగా పూర్తి చేసిన కార్లు) కార్లు అన్ల్యాప్ కాకూడదంటూ ఆదేశాలు జారీ చేసి... అనంతరం అన్ల్యాప్ చేయొచ్చుంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాంతో హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య ఉన్న ఐదు ల్యాప్డ్ కార్లు హామిల్టన్ను దాటుకుంటూ వెళ్లాయి. అదే సమయంలో సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లి రేసును మళ్లీ ఆరంభించాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. సేఫ్టీ కారు వచ్చే సమయానికి మొత్తం ఎనిమిది ల్యాప్డ్ కార్లు ట్రాక్పై ఉన్నాయి. కేవలం ఐదు కార్లకు మాత్రమే అన్ల్యాప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి మిగిలిన మూడు కార్లకు ఎందుకు కల్పించలేదంటూ మెర్సిడెస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్ కార్లు అన్ల్యాప్ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్ ఫిర్యాదును స్టీవర్డ్స్ తోసిపుచ్చి వెర్స్టాపెన్ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి... ఎఫ్1 కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెర్సిడెస్ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్ 613.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ఎఫ్1కు కిమీ రైకొనెన్ గుడ్బై అబుదాబి గ్రాండ్ప్రితో ఫార్ములావన్కు ఫిన్లాండ్ డ్రైవర్ కిమీ రైకొనెన్ గుడ్బై చెప్పాడు. 2001లో సాబర్ జట్టు ద్వారా ఎఫ్1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్... మెక్లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్గా 2007లో డ్రైవర్ చాంపియన్షిప్ టైటిల్ను నెగ్గాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ గెలిచిన రేసుల సంఖ్య. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్ (రెడ్బుల్), ఒకాన్ (అల్పైన్ రెనౌ), రికియార్డో (మెక్లారెన్), బొటాస్ (మెర్సిడెస్) ఒక్కో రేసులో గెలిచారు. The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
ఫార్ములా వన్ రేసింగ్లో సంచలనం..
Max Verstappen Wins Formula One Title: ఫార్ములా వన్ రేసింగ్ ఛాంపియన్షిప్లో సంచలనం నమోదైంది. రెడ్ బుల్స్కి చెందిన డ్రైవర్ మ్యాక్స్ వెర్ట్సాపెన్ తన మొట్టమొదటి ఎఫ్1 టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మెర్సడెజ్కి చెందిన రేసర్, ఏడుసార్లు ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ని ఆఖరి లాప్లో ఓడించి, అబుదాబీ గ్రాండ్ ప్రీ 2021 టైటిల్ను సొంతం చేసుకున్నాడు. MAX VERSTAPPEN. WORLD CHAMPION!!! A stunning season by an extraordinary talent#HistoryMade #F1 @Max33Verstappen pic.twitter.com/FxT9W69xJe — Formula 1 (@F1) December 12, 2021 హోరాహోరీ సాగిన రేస్లో ఓ దశలో ఇద్దరు రేసర్లు చెరో 369.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి లాప్ను ప్రత్యర్థి కంటే 1.22.09 సెకన్లు ముందుగా ముగించిన 24 ఏళ్ల మ్యాక్స్ వెర్ట్సాపెన్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. చదవండి: Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..! -
సుమారు రూ. 15 వేల కోట్లు..! అబుదాబీ కంపెనీతో జతకట్టిన రిలయన్స్..! ఎందుకంటే..!
అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ (TA'ZIZ)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కట్టింది. అబుదాబిలోని రువైస్లో రసాయన ప్రాజక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. యూఎఈలో పెట్రోకెమికల్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సంయుక్తంగా 2 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 15 వేల కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నాయి. పశ్చిమ అబుదాబిలోని రువైస్లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం (ADNOC) రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ (ADQ) ఇటీవల ఏర్పరిచిన TA'ZIZ జాయింట్ వెంచర్లో రిలయన్స్ చేరనుంది. ఈ కొత్త ‘TA'ZIZ EDC & PVC’ జాయింట్ వెంచర్తో 2 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడితో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్ , పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సౌకర్యాన్ని నిర్మించి, నిర్వహించనున్నాయి. యూఎఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి TA'ZIZ మిషన్ మద్దతునివ్వనుంది.రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్ వెంచర్ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ADNOC మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో, యూఎఈ ఇండస్ట్రీస్ మినిష్టర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ , రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అధినేతల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...భారత్, యూఎఈ మధ్య దీర్ఘకాల, విలువైన సంబంధాలను మరింత సుస్థిరం చేస్తోందని అన్నారు. చదవండి: 120 సెకండ్లలో హాట్కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...! -
Wanindu Hasaranga: వారెవ్వా హసరంగ.. పాదరసంలా కదిలి.. ఎగిరి..
Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్తో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హసరంగ.. ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై బ్రేవ్స్తో మ్యాచ్లో పాదరసంలా కదిలి.. జట్టుకు ఐదు పరుగులు సేవ్ చేశాడు. సిక్సర్ ఖాయమనుకున్న తరుణంలో హసరంగ బంతిని ఆపడంతో కంగుతినడం బ్యాటర్ వంతైంది. అబుదాబిలో షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డేవిడ్ వీజ్ బౌలింగ్లో ఓపెనర్ మహ్మద్ షెహజాద్ భారీ షాట్ ఆడాడు. సిక్స్ ఖాయం అనుకున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హసరంగ మెరుపులా కదిలి బంతిని లోపలికి విసిరాడు. ఎలాగో ఆరు పరుగులు వస్తాయి కదా అనుకున్న చెన్నై బ్రేవ్స్ హసరంగా షాక్తో ఒక పరుగు మాత్రమే సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన హసరంగ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో దక్కన్ గ్లాడియేటర్స్ 5 వికెట్ల తేడాతో బ్రేవ్స్పై గెలుపొందింది. చదవండి: Ind Vs Nz 1st Test Highlights: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. Wow wow Wanindu 😱😱#CBvsDG pic.twitter.com/H7IeUxlVIj — Stay Cricket (@staycricket) November 26, 2021 -
T20 WC 2021 NZ Vs ENG: మన క్యూరేటర్కు నివాళిగా...
T20 WC 2021 NZ Vs ENG: Tribute To Indian Curator Minutes Silence Observed: భారత్కు చెందిన అబుదాబి చీఫ్ క్యూరేటర్ మోహన్ సింగ్ మృతికి ఇరు జట్ల క్రికెటర్లు నివాళులర్పించారు. షేక్ జాయెద్ స్టేడియానికి 45 ఏళ్ల మోహన్ సింగ్ సుదీర్ఘ సేవలు అందించారు. అయితే తీవ్రమైన డిప్రెషన్తో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. కాగా అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ దశలో తమను దెబ్బ కొడుతున్న ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకుని దర్జాగా ఫైనల్ చేరుకుంది. ఇక నవంబరు 10న జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నవంబరు 14న కివీస్తో ఫైనల్ ఆడనుంది. స్కోర్లు: ఇంగ్లండ్: 166/4 (20) న్యూజిలాండ్: 167/5 (19) చదవండి: మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది -
అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య
అబుదాబి: భారత్కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ ఆదివారం అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్గా పని చేస్తున్నారు. భారత్లోని మొహాలీ పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ దగ్గర సుదీర్ఘకాలం పనిచేసిన మోహన్ తదనంతరం యూఏఈకి తరలివెళ్లారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 45 ఏళ్ల మోహన్ న్యూజిలాండ్–అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ కు ముందే ఆత్మహత్యకు పాల్పడినట్లు యూఏఈ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఉదయమే గ్రౌండ్కు వచ్చిన ఆయన పిచ్ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి మళ్లీ ఎంతకీ తిరిగి రాలేదు. గ్రౌండ్ సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించారు. -
T20 WC: మంచు కొంప ముంచుతోంది.. ఒక్కటి మినహా భారత్ మ్యాచ్లన్నీ అక్కడే.. టాస్ ఓడారో
T20 World Cup 2021: Is Team India Winning Chances Depends On Toss How: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా విజయాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టాస్ గెలిచి... తొలుత బౌలింగ్ ఎంచుకున్న జట్లదే పైచేయిగా ఉంటోంది. అక్టోబరు 17 నుంచి ఆరంభమైన క్వాలిఫయర్ పోటీల నుంచి నేటి దాకా ఎక్కువ శాతం మ్యాచ్లలో ఇదే తంతు కొనసాగుతోంది. మెగా ఈవెంట్లో మస్కట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఒమన్.. 10 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాపై గెలుపొందింది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు అక్కడ జరిగిన దాదాపు అన్ని మ్యాచ్లలోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. మంచు ప్రభావం టాస్ ఓడిన జట్ల కొంప ముంచుతోంది. ఉదాహరణకు.. అక్టోబరు 24 నాటి టీమిండియా- పాకిస్తాన్.. తాజాగా అక్టోబరు 28 నాటి ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్లు. వీటిలో టాస్ గెలిచిన పాకిస్తాన్ 10 వికెట్లు, ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. ఒక్కటి మినహా టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడే.. పరిస్థితులు అన్నీ బాగుంటే భారత్లోనే టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ జరగాల్సింది. అయితే, కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఈ వేదికను యూఏఈకి మార్చింది. ఈ క్రమంలో హోస్ట్ భారత జట్టు ఒక్కటి మినహా మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడనుంది. అన్నీ కూడా రాత్రి 7: 30 నిమిషాలకే ఆరంభం అవుతాయి. ఇక సూపర్-12లో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్తో మ్యాచ్ పూర్తి చేసుకున్న కోహ్లి సేన.. అక్టోబరు 31న న్యూజిలాండ్తో జరిగే కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఆ తదుపరి అబుదాబి వేదికగా అఫ్గనిస్తాన్తో నవంబరు 3న తలపడనుంది. ఇక అన్నీ సజావుగా సాగి ఫైనల్ చేరితే దుబాయ్లోనే తుదిపోరుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. టాస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అక్టోబరు 24న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు కనీవిని ఎరుగని రీతిలో ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ప్రపంచకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, మంచు ప్రభావం కూడా ఈ మ్యాచ్పై ఎంతగానో ఉందని.. ఓటమి అనంతరం కోహ్లి పేర్కొన్నాడు. ఆ మాట వాస్తవమేనని.. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే వంటి మాజీలు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సెమీస్ చేరే క్రమంలో కోహ్లి సేనకు మార్గం సుగమం కావాలంటే కివీస్తో ఆడబోయే మ్యాచ్ కీలకంగా మారింది. కాబట్టి టాస్ గెలవాల్సిన ఆవశ్యకత కూడా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టాస్ ఓడినట్లయితే పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పటికే అంచనా వేసిన అభిమానులు.. కోహ్లి తప్పక టాస్ గెలువు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సూపర్-12 రౌండ్: టీ20 ప్రపంచకప్లో టీమిండియా షెడ్యూల్ ఇలా.. ►ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అక్టోబరు 24-దుబాయ్ ►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్-అక్టోబరు 31- దుబాయ్ ►ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్- నవంబరు 3- అబుదాబి ►ఇండియా వర్సెస్ స్కాట్లాండ్- నవంబరు 5-దుబాయ్ ►ఇండియా వర్సెస్ నమీబియా- నవంబరు 8-దుబాయ్ చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్ -
T20 WC Aus Vs SA: ఆసీస్ ఏం చేస్తుందో... దక్షిణాఫ్రికాకు అదే సానుకూలాంశం..
T20 World Cup 2021: ధనాధన్ పోరులో రెండో అంకానికి రంగం సిద్ధం. 16 జట్ల సమరం 12 జట్లకు మారింది. వినోదం మాత్రం అంతకంటే రెట్టింపు కానుంది. టాప్ టీమ్ల మధ్య హోరాహోరీకి నేటితో తెర లేవనుండగా, మెగా టోర్నీని గెలుచుకునే లక్ష్యం దిశగా తొలి మ్యాచ్ నుంచే సత్తా చాటాలని జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఒక్కసారి కూడా పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడని రెండు అగ్రశ్రేణి జట్లు ఈ సారైనా కల నెరవేర్చుకునేందుకు శుభారంభంపై దృష్టి పెట్టాయి. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తేల్చుకునేందుకు పదునైన అస్త్రాలతో భారత్ రేపు రంగంలోకి దిగనుంది. నవంబర్ 14న జరిగే ఫైనల్ వరకు మెరుపు ప్రదర్శనలు, విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో ఈ 23 రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే! అబుదాబి: సరిగ్గా ఏడాది క్రితం ఆస్ట్రేలియా గడ్డపై ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా మా వల్ల కాదంటూ ఆ్రస్టేలియా చేతులెత్తేసింది... అక్కడ ఏం జరిగినా మేం మాత్రం షెడ్యూల్ ప్రకారం 2021లో మా దేశంలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ 2021 ఏప్రిల్కు వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కోవిడ్ ఉధృత దశకు చేరుతున్న వేళ క్రికెట్ గురించి మాట్లాడే స్థితి లేకపోయింది. పైగా ఐపీఎల్కు కరోనా కాటు తగలడంతో రాబోయే ప్రమాదాన్ని ఊహించిన భారత బోర్డు మన దేశంలో మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసింది. చివరకు ఆతిథ్యం మనదే కానీ ఆట మాత్రం విదేశాల్లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 తొలి దశ పోటీలు శుక్రవారంతో ముగియగా, ముందంజ వేసే జట్లేవో ఖరారైపోయింది. ఇప్పుడు ఈ ‘సూపర్–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం. ఆసీస్ ఏం చేస్తుందో! సుదీర్ఘ కాలంపాటు క్రికెట్ను శాసించినా టి20 ప్రపంచకప్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్లో ఓపెనర్లు వార్నర్, ఫించ్ పేలవ ఫామ్లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్లో మ్యాక్స్వెల్, స్మిత్, స్టొయినిస్లను జట్టు నమ్ముకుంది. ఆ జట్టు పేస్ దళం మెరుగ్గానే ఉన్నా... స్పిన్కు అనుకూలించే యూఏఈ పిచ్లపై జంపా, అగర్ స్థాయి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్లో ఫైనల్ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం. చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు -
T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2021: మరికొన్ని గంటల్లో మరో క్రికెట్ పండుగ మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లోని మజా పంచేందుకు ఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీ మన ముందుకు రానుంది. అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన షెడ్యూల్, జట్లు, సమయ పట్టిక, వేదిక తదితర అంశాల గురించి పరిశీలిద్దాం. 16 జట్లు టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమన్, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4 స్థానాల కోసం పోటీ ►సూపర్ 12లో భాగంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. ►గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూపులో టాపర్గా నిలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. సూపర్ 12లో ఉన్న జట్లు ►గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్- ఏ(A1) టాపర్, గ్రూప్-బీ(B2)లోని రెండో జట్టు ఉంటాయి. ►గ్రూప్-2లో టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, A2, B1 ఉంటాయి. ►ప్లేఆఫ్ చేరుకున్న ఇరు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్లో తలపడతాయి. ►మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలు, రాత్రి 7:30 నిమిషాలకు మొదలవుతాయి. మ్యాచ్ నెంబర్ తేదీ మ్యాచ్ సమయం వేదిక స్టేజ్ 1, అక్టోబరు 17 ఒమన్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 2 అక్టోబరు 17 బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్- 1 3 అక్టోబరు 18 ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్- 1 4 అక్టోబరు 18 శ్రీలంక వర్సెస్ నమీబియా 07:30 అబుదాబిi రౌండ్- 1 5 అక్టోబరు 19 స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 6 అక్టోబరు 19 ఒమన్ వర్సెస్ బంగ్లాదేశ్ 07:30 మస్కట్ రౌండ్- 1 7 అక్టోబరు 20 నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్ 1 8 అక్టోబరు 20 శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ 07:30 అబుదాబి రౌండ్ 1 9 అక్టోబరు 21 బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్ 1 10 అక్టోబరు 21 ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్ 1 11 అక్టోబరు 22 నమీబియా వర్సెస్ ఐర్లాండ్ 03:30 అబుదాబి రౌండ్ 1 12 అక్టోబరు 22 శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ 07: 30 అబుదాబి రౌండ్ 1 13 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్ 12 14 అక్టోబరు 23 ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ 07:30 అబుదాబి సూపర్ 12 15 అక్టోబరు 24 A1 vs B2 03:30 షార్జా సూపర్ 12 16 అక్టోబరు 24 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 17 అక్టోబరు 25 అఫ్గనిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 18 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ 03:30 దుబాయ్ సూపర్ 12 19 అక్టోబరు 26 పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ 07:30 షార్జా సూపర్ 12 20 అక్టోబరు 27 ఇంగ్లండ్ వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 21 అక్టోబరు 27 B1 వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 22 అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్ A1 07:30 దుబాయ్ సూపర్ 12 23 అక్టోబరు 29 వెస్టిండీస్ వర్సెస్ B2 03:30 షార్జా సూపర్ 12 24 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 25 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్ A1 03:30 షార్జా సూపర్ 12 26 అక్టోబరు 30 ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 07:30 దుబాయ్ సూపర్ 12 27 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్ వర్సెస్ A2 03:30 అబుదాబి సూపర్ 12 28 అక్టోబరు 31 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 07:30 దుబాయ్ సూపర్ 12 29 నవంబరు 1 ఇంగ్లండ్ వర్సెస్ A1 07:30 షార్జా సూపర్ 12 30 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 31 నవంబరు 2 పాకిస్తాన్ వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 32 నవంబరు 3 న్యూజిలాండ్ వర్సెస్ B1 03:30 దుబాయ్ సూపర్ 12 33 నవంబరు 3 ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ 07:30 అబుదాబి సూపర్ 12 34 నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్ B2 03:30 దుబాయ్ సూపర్ 12 35 నవంబరు 4 వెస్టిండీస్ వర్సెస్ A1 07:30 అబుదాబి సూపర్ 12 36 నవంబరు 5 న్యూజిలాండ్ వర్సెస్ A2 03:30 షార్జా సూపర్ 12 37 నవంబరు 5 ఇండియా వర్సెస్ B1 07:30 దుబాయ్ సూపర్ 12 38 నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ 03:30 అబుదాబి సూపర్ 12 39 నవంబరు 6 ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా 07:30 షార్జా సూపర్ 12 40 నవంబరు 7 న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ 03:30 అబుదాబి సూపర్ 12 41 నవంబరు 7 పాకిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 42 నవంబరు 8 ఇండియా వర్సెస్ A2 07:30 దుబాయ్ సూపర్ 12 43 నవంబరు 10 సెమీ ఫైనల్-1 07:30 అబుదాబి ప్లే ఆఫ్ 44 నవంబరు 11 సెమీఫైనల్-2 07:30 దుబాయ్ ప్లేఆఫ్ 45 నవంబరు 14 ఫైనల్ 07:30 దుబాయ్ ఫైనల్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్
అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్న్యూస్. ఆన్లైన్ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్ క్లియర్ అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్లెష్ పేమెంట్స్కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు సింగపూర్, భూటాన్లు యూపీఐ పేమెంట్స్కు అనుమతి ఇచ్చాయి. భారత్లో మొత్తం 50 థర్డ్పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, అమెజాన్ పే మార్కెట్లో పాపులర్ అయ్యాయి. చదవండి: అఫ్గన్ కార్మికుల సంగతి ఏంటి? ప్రయాణికులకు ఊరట పాస్పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్సైట్లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు -
ముఖేష్ అంబానీ రూ.11,100 కోట్ల ఇన్వెస్ట్, ఒప్పందం పూర్తి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) యూఏఈలో నిర్మితమవుతున్న భారీ పెట్రోకెమికల్ కేంద్రం(హబ్)లో ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ఇందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,100 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు అంచనా. అబుధాబి ప్రభుత్వ ఇంధన దిగ్గజం అడ్నాక్, హోల్డింగ్ కంపెనీ ఏడీక్యూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాజిజ్ జేవీ పశ్చిమ అబుధాబిలో రువాయిస్ డెరివేటివ్ పార్క్ను అభివృద్ధి చేస్తోంది. ఈ జేవీతో ముఖేష్ అంబానీ చేతులు కలపనున్నారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. అయితే ఇన్వెస్ట్మెంట్ వివరాలు వెల్లడించలేదు. పార్క్కు సంబంధించి జత కలవగల భాగస్వాముల కోసం టాజిజ్ చర్చలు నిర్వహిస్తోంది. 2025కల్లా కార్యకలాపాలు ప్రారంభించే వీలున్న ఈ పార్క్ 500 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలదని అంచనా. అబుధాబి జాతీయ చమురు కంపెనీ(అడ్నాక్) రోజుకి 3 మిలియన్ బ్యారళ్ల చమురును సరఫరా చేయనుంది. తద్వారా రువాయిస్లో డౌన్స్ట్రీమ్ కార్యకలాపాలకు తెరతీయనుంది. ఇందుకు వీలుగా భాగస్వాముల ద్వారా 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించాలని ప్రణాళికలు వేసింది. డౌన్స్ట్రీమ్ కార్యకలాపాల అభివృద్ధిలో భాగంగా రిఫైనింగ్, పెట్రోకెమికల్ సామర్థ్యాలను భారీగా పెంచుకోవాలని చూస్తోంది. చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్ఫోన్ ఎప్పుడో తెలుసా ? ఆర్ఐఎల్ ప్రణాళికలు రువాయిస్లో చమురు రిఫైనరీతోపాటు.. పెట్రోకెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాజిజ్ ప్రణాళికలు వేసింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఆర్ఐఎల్ ప్రపంచస్థాయి క్లోర్ ఆల్కలీ, ఎథిలీన్ డైక్లోరైడ్, పీవీసీ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్ఐఎల్ సంతకాలు చేసినట్లు అడ్నాక్ తాజాగా పేర్కొంది. తద్వారా కీలకమైన పారిశ్రామిక ముడిసరుకులకు పెరుగుతున్న డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు గ్లోబల్ ఇంధన దిగ్గజాలైన రెండు సంస్థల శక్తి, సామర్థ్యాలను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందం ప్రకారం టాజిజ్, ఆర్ఐఎల్ సంయుక్తంగా సమీకృత ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. దీనిలో భాగంగా వార్షికంగా 9,40,000 టన్నుల క్లోర్ ఆల్కలీ, 1.1 మిలియన్ టన్నుల ఎథిలీన్ డైక్లోరైడ్, 3,60,000 టన్నుల పీవీసీ తయారీ సామర్థ్యాలు ఏర్పాటు కానున్నట్లు అడ్నాక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 0.2 శాతం పుంజుకుని రూ. 2,090 వద్ద ముగిసింది. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
అమ్మా.. నాన్న ఫోన్ ఎందుకు చేస్తలేడు?
మేడిపెల్లి (వేములవాడ): ‘దుబాయ్ పోయి పైసలు సంపాదించి పిల్లలకు ఏ లోటు రాకుండా చూద్దామని అంటివి. అమ్మను ఏడిపించొద్దు.. చెప్పినట్టు వినాలని పిల్లలకు చెప్తివి. పిల్లలను మంచిగ చూసుకో.. డబ్బులు పంపిస్త.. అని చెప్పి పోయి ఆరు నెలలైతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ లేదు. అమ్మా.. నాన్న ఎందుకు ఫోన్ చేస్తలేడని పిల్లలు అడిగితే ఇప్పటిదాకా ఏదోలాగా సమాధానం చెప్పుకొచ్చిన. నువ్వు ఎక్కడున్నా మాతో ఫోన్లో మాట్లాడి క్షేమంగా ఉన్నానని చెప్పు’అంటూ జాడలేని తన భర్తకోసం ఓ ఇల్లాలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంకు చెందిన శ్రీరాముల హరిప్రసాద్ (40) ఊళ్లోనే టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య నీరజతో పాటు పవన్ (9), రక్షిత (7) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు ఎదుగుతుండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆశ పడ్డాడు. గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని, అబుదాబిలో హోటల్లో పనికోసం రూ.2 లక్షలు చెల్లించి గతేడాది డిసెంబర్ 27న అక్కడికి వెళ్లాడు. కరోనా నిబంధనల ప్రకారం కంపెనీ వారు హరిప్రసాద్ను 10 రోజులపాటు క్వారంటైన్లో ఉంచారు. జనవరి 5న కంపెనీ కేటాయించిన రూములోకి మారాడు. రూల్స్ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించి జనవరి 19 నుంచి పనికి రావాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే జనవరి 18న చిన్న పని ఉందని తనతో రూమ్లో ఉన్నవారికి చెప్పి బయటకు వెళ్లిన హరిప్రసాద్ అదృశ్యమయ్యాడు. ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త అబుదాబి వెళ్లి ఫోన్ చేయకపోవడంతో భర్త పనికి కుదిరిన ప్రాంతంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీరజ. వారు అక్కడికి వెళ్లి చూడగా హరిప్రసాద్ ఫోన్తోపాటు లగేజీ కూడా రూములోనే ఉన్నాయి. కంపెనీ వారు సైతం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. హరిప్రసాద్ ఇంటి నుంచి వెళ్లి ఆరు నెలలు అవుతున్నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఇంటికి రప్పించేలా చూడాలని భార్యా పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని, స్వగ్రామానికి తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఔదార్యం..
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గత 53 ఏళ్లుగా ప్రవాస భారతీయుల సంక్షేమానికి కోసం పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ అండగా నిలుస్తోంది. అయితే భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగసామ్యం కావడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు కరోనా బాధితులకు అవసరమయ్యే సుమారు రూ.10 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్స్ని ఢిల్లీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి పంపించింది. భారత దౌత్య కార్యాలయ విజ్ఞప్తి మేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని ఉచితంగా ఇండియాకు రవాణా చేసింది. ఎమిరేట్స్ విమానయాన సంస్థకి యూఏఈలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆ సంస్థ సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాసరావు అన్నారు. రానున్న రోజుల్లో మరింత సహాయం అందిస్తామని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు జార్జ్ వర్గీస్, క్రీడా కార్యదర్శి ఫ్రెడ్డీ జె. ఫెర్నాండెజ్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సి. జార్జ్ వర్గీస్, జనరల్ మేనేజర్ రాజు పాల్గొన్నారు. (చదవండి: TikTok: నేను మరీ అంత సోషల్ కాదు.. సీఈఓగా ఉండలేను) -
విజేత వెర్స్టాపెన్
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020–సీజన్ ముగింపు రేసులో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్ప్రిలో నిర్ణీత 55 ల్యాప్లను వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్స్టాపెన్కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. గతవారం సాఖిర్ గ్రాండ్ప్రి విజేత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్–ఆర్పీ) ఎనిమిదో ల్యాప్లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా ఈ సీజన్లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు. 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది. -
హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..
అబుదాబి : ఓ పెద్ద బిల్డింగ్ను అతి తక్కువ సమయంలో కూల్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిందో రియల్ ఎస్టేట్ సంస్థ. వివరాలు.. అబుదాబికి చెందిన మోడన్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొద్దిరోజుల క్రితం 541.44 అడుగుల సొంత బిల్డింగ్ ‘మినా ప్లాజా’ను 10 సెకన్లలో కూల్చేసింది. 4 టవర్లు, 144 ఫ్లోర్లు ఉన్న ఆ పెద్ద భవనం అతి తక్కవ సమయంలో పేకమేడలా కూలిపోయింది. దీంతో గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ సొంతమైంది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ సంస్థ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. ( ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు ) దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘అవెంజర్స్ సినిమాలో టోనీ స్టార్క్.. హల్కుతో గొడవపడి ఎప్పుడో ఇలాంటి బిల్డింగ్ను కూల్చేశాడు’.. ‘అదో పిచ్చి పని’.. ‘ డబ్బుల్ని, వనరుల్ని వృధా చేస్తున్నారు’.. ‘అద్బుతంగా ఉంది’.. ‘ హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు
అబుధాబి: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు శునకాల సాయం తీసుకుంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ వాసనని శునకాలు పసిగడతాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే. యూఏఈ, ఫిన్ల్యాండ్, లెబనాన్ దేశాల్లో రోగుల్లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు రోగుల్ని గుర్తిస్తున్నాయి. లెబనాన్ విమానా శ్రయానికి వచ్చిన 1,680 మంది ప్రయాణికుల్లో 159 మందిని కరోనా రోగులుగా శునకాలు గుర్తిస్తే, వారిలో 92 శాతం మందికి కరోనా ఉన్నట్టుగా ఆ తర్వాత తేలిందని అధికారులు చెప్పారు. (కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత) -
జాక్పాట్ అంటే నీదే తమ్ముడు
షార్జా : కొందరికి వద్దన్నా అదృష్టం నక్కలాగా అతుక్కుపోతుందంటారు. ఏదో సరదాకు కొన్న లాటరీ టికెట్ ద్వారా అంత పెద్ద మొత్తం వస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. లాటరీలో నీకు కోట్లు తగిలాయరా అని మొదటిసారి వచ్చి చెప్పినప్పుడు అతను నమ్మలేదు.. తీరా అది నిజమేనని తెలిశాక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి... 'జాక్పాట్ అంటే నీదే తమ్ముడు' అంటూ కామెంట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. పంజాబ్కు చెందిన గుర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం యూఏఈ వెళ్లాడు. షార్జాలో ఐటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న ఆయన.. ఆగస్ట్ 12న అబుదాబిలో బిగ్ టికెట్ రాఫెల్ లాటరీ టికెట్ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న లక్కీ డ్రా నిర్వాహకులు డ్రా తీయగా.. గుర్ప్రీత్ సింగ్ 10 మిలియన్ దిర్హామ్స్( భారత కరెన్సీలో రూ.19.90కోట్లు) గెలుచుకున్నాడు. ( చదవండి : ప్లీజ్.. బోన్లెస్ చికెన్ పేరును మార్చండి) దీనిపై గురుప్రీత్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ' లాటరీలో నేను కోట్ల రూపాయలు గెలుచుకున్నా అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అదృష్టం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. లక్కీ డ్రాలో గెలుచుకున్న డబ్బులతో యూఏఈలో ఓ ఇల్లు కొనుగోలు చేస్తా. నా తల్లిదండ్రులంటే నాకు చెప్పలేనంత ఇష్టం.. ఈ డబ్బులతో వారిని యూఏఈకి తీసుకొస్తా'నంటూ చెప్పుకొచ్చాడు.(చదవండి : విమర్శకుల నోళ్లుమూయించాం : రష్యా) -
అబుదాబిలో భారత దంపతుల అనుమానాస్పద మృతి
దుబాయ్ : అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫ్లాట్లో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మృతులను కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్ధనన్ పట్టీరీ(57), మినిజ(52) దంపతులుగా గుర్తించారు. అయితే వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. వీరు 18 ఏళ్ల నుంచి అబుదాబిలో నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనార్ధనన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మినిజా చార్టర్ అకౌంటెంట్గా ఉన్నారు. అయితే జనార్ధన్ ఇటీవలే తన ఉద్యోగం కోల్పోయినట్టుగా సమాచారం.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. ‘జనార్థనన్, మినిజ చాలా మంచివారు. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడు. ఈ ఘటనపై అతని సహోద్యోగులు, స్నేహితులు షాక్కు గురయ్యారు. ఇలా జరిగి ఉండాల్సి కాదు’ అని పేర్కొన్నారు. కాగా, జననార్ధనన్కు-మినిజ దంపతకుల ఒక కుమారుడు ఉన్నాడు. అతడు అబుదాబిలోనే చదువుకున్నప్పటకీ.. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.(అన్లాక్ 3.0 : సినిమా హాళ్లు, జిమ్లకు అనుమతి?) -
జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో డీల్
సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వరుసగా ఆరోసారి మెగా డీల్ సాధించింది. జియో ప్లాట్ఫామ్స్లో మరో భారీ ఒప్పందాన్ని అధికారికంగా అంబానీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆరు వారాల్లో ఆరు దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సేకరించడం విశేషం. ఆర్ఐఎల్ టెలికాం విభాగం జియో ప్లాట్ఫామ్స్లో అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 9,093.6 కోట్లు. ఈక్విటీ విలువ, రూ. 4.91 లక్షల కోట్లు కాగా ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జియో సేకరించిన మొత్తం పెట్టుబడులు విలువ రూ.87,655.35 కోట్లకు చేరినట్టు ప్రకటించింది. ఆరు భారీ ఒప్పందాల ద్వారా 18.97 శాతం వాటాలను విక్రయించింది. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు) కాగా జియో వాటాల అమ్మకాల ద్వారా రూ. 85వేల నుంచి రూ. 90 వేల కోట్లు సేకరించాలని ఆర్ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఏప్రిల్ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మొదలు వరుసగా మెగా డీల్స్ ను ప్రకటిస్తోంది. అనంతరం సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ , తాజాగా ముబదాలా లాంటి దిగ్గజ సంస్థలు ఈ వరుసలో నిలిచాయి. (జియోలో కేకేఆర్ భారీ పెట్టుబడి) జియోలో మొత్తం పెట్టుబడుల వివరాలివి.. 9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్బుక్ పెట్టుబడులు రూ. 43,574 కోట్లు 1.15 శాతం వాటాతో సిల్వర్లేక్ పార్ట్నర్స్ రూ.5,656 కోట్లు 2.32 శాతం వాటాతో విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ రూ.11,367 కోట్లు 1.34 శాతం వాటాతో జనరిక్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు 2.32 శాతం వాటాతో కేకేఆర్ రూ.11,367 కోట్లు తాజాగా 1.8 5శాతం వాటాతో ముబదాల రూ.9,094 కోట్లు -
కరోనా: మీ పౌరులను తీసుకువెళ్లండి.. లేదంటే..
అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశాలకు తీసువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలు కఠినతరం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులకు కరోనా నిరార్ధరణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే స్వదేశాలకు పంపిస్తామని యూఏఈ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించింది. అయితే ఇప్పటి వరకు చాలా దేశాలు ఇందుకు స్పందించకపోవడంతో వర్క్ వీసాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు? ) కాగా దాదాపు 90 లక్షల జనాభా కలిగిన యూఏఈలో చాలా మంది పొట్టికూటి కోసం వచ్చిన వారే ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో కరోనా నెగటివ్గా తేలి... స్వదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని తమ దేశాలకు పంపుతామని రెండు వారాల క్రితం యూఏఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 25 వేల మంది పాకిస్తానీలు దుబాయ్, అబుదాబిలో చిక్కుకుపోయారని పాకిస్తాన్ యూఏఈ రాయబారి గులాం దస్తగిర్ గల్ఫ్ న్యూస్కు వెల్లడించారు. వారిని స్వదేశానికి తరలించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మిగతా దేశాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో యూఏఈ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కరోనా ధాటికి ఇప్పటివరకు యూఏఈలో 20 మంది మరణించగా.. 3736 మంది దీని బారిన పడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా మాల్స్, రెస్టారెంట్లు మూసివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.(కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు) భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా -
అబుదాబిలో సత్తా చాటిన తెలుగువాడు
అబుదాబిలో తెలుగువారు తమ సత్తా చాటుకున్నారు. అక్కడ జరిగిన ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన రాజా శ్రీనివాసరావు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ తెలుగువారికి ప్రాధాన్యత లేదు. అయితే ఈ విజయంతో తెలుగు వాడికి గత మూడున్నర దశాబ్దాలుగా లేని ప్రాధాన్యత ఈ సారి దక్కడంతో తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజా శ్రీనివాసరావు సెంటర్ సదరన్ రీజియన్ సెక్రటరీగా ఎన్నిక కావడంపట్ల.. పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమంలో కూడా యూఏఈలో ఉంటూ తన వంతు సహకారం అందించారు. సదరన్ రీజియన్ సెక్రటరీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన గెలుపు యూఏఈలోని ప్రతి తెలుగు వారికి అంకితమన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. -
రాజుగారు ఇంటికొచ్చారు
చిన్నారులు మనసు చిన్నబుచ్చుకుంటే పెద్దవాళ్ల ప్రాణం ఉసూరుమంటుంది. చిన్నబుచ్చింది తామే అని తెలిస్తే వెళ్లి ఊరడించేవరకు ఊరుకోరు. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ పెద్ద మనిషి మనిషి మాత్రమే కాదు, అబుదాబికి యువరాజు కూడా! అంతటి మనిషి తనకు తెలియకుండానే ఓ బాలిక మనసు నొప్పించారు. ఓ విందు కార్యక్రమానికి ఆయన హాజరు అవుతున్నారని తెలిసి ఆయనకు స్వాగతం పలికేందుకు కొందరు చిన్నారులను ఎంపిక చేశారు నిర్వాహకులు.ఆ పిల్లలందర్నీ పలకరిస్తూ ముందుకు వెళుతున్న యువరాజు వారిలోని ఒక చిన్నారి చాచిన స్నేహ హస్తాన్ని గమనించకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత ఆ వీడియో వైరల్ అయి యువరాజు వరకు వచ్చింది. వెంటనే ఆయన ఆ బాలిక ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆప్యాయంగా కరచాలనం చేశారు. అంతేకాదు. బాలిక నుదుటిపై ముద్దు కూడా పెట్టారు. ఇక చూడండి.. ఆ పాప ఆనందం, ఆ ఇంటి ఆనందం.