సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో కోహ్లీకి క్రేజ్ మామూలు రేంజ్లో ఉండదు. ఎంత అంటే డానియెల్లి యాట్ సైతం విరాట్ను పెళ్లి చేసుకోమని కోరింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఈసారి పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో తనను పెళ్లి చేసుకోమని ఓ పోస్టర్ పట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియా ట్విట్టర్లో వైరల్ అయింది.
ఇక ఇటీవల పాకిస్తాన్లో ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు పర్యటించింది. ఇందులో ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ఇందులో భారత్ నుంచి ఏఒక్కరు ఆడలేదు. దీంతో పాక్లోని కోహ్లీ, ధోని అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను వ్యక్త పరిచారు. భారత ఆటగాళ్లు కోహ్లీ, ధోని ఈ మ్యాచ్ల్లో ఆడుంటే పాకిస్తాన్ క్రికెట్కు మరింత ప్రభావం ఉండేదన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో చాలా మంది అభిమానులు 'వీ మిస్ ధోని, కోహ్లీ' అనే ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. అందులో ఒకరు 'కోహ్లి మేరీ మీ' ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు.
కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్
Published Mon, Sep 18 2017 5:03 PM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement
Related news by tags
-
టీమిండియా తాత్కాలిక కోచ్గా సాయిరాజ్ బహుతులే
త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియాకు తాత్కాలిక బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. 51 ఏళ్ల బహుతులే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్గా పని చేస్తున్నాడు. లంక పర్యటనకు రెగ్యులర్ బౌలింగ్ కోచ్ లేకపోవడంతో బీసీసీఐ బహుతులేను తాత్కాలిక ప్రతిపదికన ఎంపిక చేసింది. బహుతులే.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కటే, టి దిలీప్లతో కలిసి గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత కోచింగ్ శిబిరంలో జాయిన్ అవుతాడు. బహుతులే.. 1997-2003 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన బహుతులే టీమిండియా తరఫున రెండు టెస్ట్లు, ఎనిమిది వన్డేలు ఆడాడు. కాగా, టీమిండియా.. శ్రీలంక పర్యటన ఈనెల 27 నుంచి మొదలవ్వనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతోనే గంభీర్ భారత హెడ్ కోచ్గా తన ప్రస్తానాన్ని మొదలుపెడతాడు. గంభీర్ కోచింగ్ టీమ్లో దిలీప్ తప్పించి మిగతా వారంతా కొత్తవారే. భారత రెగ్యులర్ బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి. అయితే మోర్కెల్ వ్యక్తిగత కారణాల చేత లంక టూర్కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బీసీసీఐ తాత్కాలిక ఏర్పాటు చేసింది. మోర్కెల్.. స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ సమయానికి అందుబాటులోకి రావచ్చు.ఇదిలా ఉంటే, లంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు పల్లెకెలె.. వన్డేలకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇదివరకే ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డే టీమ్కు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. -
రిచా ఘోష్ ఊచకోత.. టీమిండియా ఖాతాలో మరో విజయం
మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.రిచా ఘోష్ ఊచకోత.. హర్మన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు.మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.తిరుగులేని భారత్ఈ టోర్నీలో గ్రూప్-ఏలో పాకిస్తాన్, నేపాల్, యూఏఈలతో పోటీపడుతున్న భారత్.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. నేపాల్, పాక్ చెరో మ్యాచ్లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో థాయ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్లాండ్, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
Asia Cup 2024: టీమిండియా భారీ స్కోర్.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి..!
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యూఏఈతో ఇవాళ (జులై 21) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రిచా ఘోష్ చివరి ఐదు బంతులను బౌండరీలుగా తరలించింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్లో స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. -
Asia Cup 2024: పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్మన్ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగెజ్ (3) భారత్ను విజయతీరాలకు చేర్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్ జులై 21న జరుగనుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో యూఏఈపై నేపాల్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్ను ఆసియా కప్లో మొదటిది. -
Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో యూఏఈపై నేపాల్ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా
Related News by category
-
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
బెదిరించేందుకు మహిళ..
పార్వతీపురం: కుటుంబసభ్యులను బెదిరించేందుకు సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన మండల అపర్ణ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆమెను చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యపై భర్త దాడి
పార్వతీపురం: వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఓ భర్త, భార్యపై దాడిచేసి తీవ్రంగా ఆదివారం గాయపరియాడు. ఈ సంఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని వేమకోటివారి వీధికి చెందిన కె. ఆదిలక్ష్మి శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భర్త కృష్ణ అనుమానంతో కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆదిలక్ష్మికి ముఖంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆదిలక్షి్మని కుమారుడు ద్విచక్రవాహనంపై చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
యాస్ తుపాను ‘అల’జడిలో జననం
భువనేశ్వర్: ‘యాస్’ తుఫాన్ అలజడి సమయంలోనూ పలు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. బాలాసోర్, భద్రక్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా జిల్లాల్లో తుపాను ముంచెత్తుతున్న తరుణంలో పలువురు గర్భిణులు ప్రసవించారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర సమాచార, ప్రసార విభాగం ప్రకటించింది. నెలలు నిండిన గర్భిణులను అంబులెన్సుల్లో తుఫాన్కు ముందుగానే ప్రసూతి కేంద్రాల్లో చేర్చిన విషయం తెలిసిందే. జగత్సింగ్పూర్ జిల్లాలో నెలలు నిండిన 31 మంది గర్భిణుల్లో 10 మంది ప్రసవించినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల సమాచారం అందాల్సి ఉంది. -
తప్పిన ప్రమాదం: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్లో ఆగిఉన్న గూడ్సు వ్యాగన్లోని ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అతికష్టం మీద ఆక్సిజన్ లీకేజీని అదుపుచేశారు. రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గూడ్సు స్థానిక రైల్వేస్టేషన్కి చేరుకోగానే సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో అక్కడే కాసేపు దానిని నిలపాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి వాయువు బయటకు వచ్చినట్లు అక్కడి వారు గుర్తించారు.