-
కోహ్లి ఫామ్ పెద్ద సమస్య కాదు.. అతడు రాజులకే రాజు: భారత మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తన పేలవ ఫామ్ను విరాట్ కొనసాగిస్తున్నాడు. గ్రూపు స్టేజి, సూపర్ 8లో నిరాశపరిచిన విరాట్.. సెమీఫైనల్లో కూడా అదే ఆటతీరును కనబరిచాడు.గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో కింగ్ కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 10.71 సగటుతో 100 స్ట్రైక్ రేట్తో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సెమీస్లో విరాట్ విఫలమైనప్పటికి భారత్ మాత్రం ఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 29(శనివారం)న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.ఈ క్రమంలో కనీసం ఫైనల్లో నైనా కోహ్లి సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత జట్టు మెనెజ్మెంట్ కూడా విరాట్కు సపోర్ట్గా ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్కు ముందు విరాట్ కోహ్లి ఫామ్ భారత జట్టును ఎటువంటి ఆందోళన కలిగించదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. "కోహ్లి భారీ స్కోర్ చేయకపోయినా ఇబ్బంది లేదు. అతడు రాజులకే రాజు. నా స్నేహితుడు కూడా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా భారత్- దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. -
కోహ్లి ఫైనల్లో ఫామ్లోకి వస్తాడు.. టైటిల్ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఓపెనర్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హిట్మ్యాన్ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని రోహిత్ కితాబునిచ్చాడు. కోహ్లి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసని అన్నాడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమని తెలిపాడు. 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడిన వ్యక్తికి ఫామ్ను తిరిగి దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య కాదని అన్నాడు. ఫైనల్ కోసం కోహ్లి తన ఫామ్ను దాచిపెట్టుకున్నాడని పేర్కొన్నాడు.ఇంగ్లండ్ను మట్టికరిపించి ఫైనల్కు అర్హత సాధించిన అనంతరం రోహిత్ మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్ను ఇలా (ఏకపక్షంగా) గెలవడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఛాలెంజింగ్గా ఉన్న పరిస్థితులను మేము స్వీకరించాము. టోర్నీ ఆరంభం నుంచి ఇదే మా విజయ రహస్యం. బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడారు. ఓ దశలో 140-150 స్కోర్కే పరిమితమవుతానుకున్నాం. నేను, సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 170 పరుగుల మార్కును తాకగలిగాం. ఈ పిచ్పై ఇది చాలా మంచి స్కోర్. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అక్షర్, కుల్దీప్ మా గన్ స్పిన్నర్స్. వీరిద్దరు ప్రత్యర్దిపై ఒత్తిడి తెచ్చారు. బుమ్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను మా మ్యాచ్ విన్నర్. మ్యాచ్ మొత్తంలో మేము చాలా కామ్గా ఉన్నాం.ఇలా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం. మేమె ఏ దశలోనూ ఆందోళన చెందలేదు. ఇదే మమ్మల్ని గెలిపించింది. ఫైనల్లో ఇదే తరహాలో నాణ్యమైన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. అందు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రస్తుతం జట్టు మంచి షేప్లో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఫైనల్లోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నానని రోహిత్ అన్నాడు.కాగా, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 WC: బాధలో విరాట్ కోహ్లి.. ఓదార్చిన ద్రవిడ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్స్లో విరాట్కు మంచి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తాచాటుతాడని అభిమానులు భావించారు. కానీ గయనా వేదికగా ఇంగ్లండ్తో సెమీఫైనల్లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిరాశతో కోహ్లి తన బ్యాట్ను పంచ్ చేస్తూ పెవిలియన్కు చేరాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కూడా కోహ్లి తన సహచరులతో దిగులుగా కూర్చోన్నాడు. ఊబికి వస్తున్న కన్నీరును ఆపునకుంటూ విరాట్ మ్యాచ్ను వీక్షించాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్లు కూడా ఉన్నాయి. Rahul dravid went to Virat as he was looking broken after that dismissal, can't see him like this man 💔 #INDvsENG pic.twitter.com/X0nPoSdF5s— a v i (@973Kohli) June 27, 2024 -
విరాట్ కోహ్లికి ఏమైంది..? మళ్లీ ఫెయిల్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన సెమీఫైనల్లోనూ కోహ్లి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో విరాట్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్లో రెండో బంతికి విరాట్ భారీ సిక్స్ బాదాడు. దీంతో కింగ్ ఫామ్లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ అదే ఓవర్లో నాలుగో బంతికి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్లు కూడా ఉన్నాయి. కాగా గత నాలుగు టీ20 వరల్డ్కప్ల సెమీస్లోనూ కోహ్లి హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కానీ ఈ సారి మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. దీంతో కోహ్లికి ఏమైందని పోస్ట్లు చేస్తున్నారు. ఓపెనర్గా రావడం వల్ల కోహ్లి విఫలమవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.pic.twitter.com/DYt6XrZCq4— Azam Khan (@AzamKhan6653) June 27, 2024 -
T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.ఇంగ్లండ్తో సెమీఫైనల్కు ముందు భారత క్రికెట్ అభిమానులను విరాట్ ఫామ్ కలవరపెడుతుంది. సెమీస్లో అయినా విరాట్ బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఇదే పేలవ ఫామ్ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్ ఎలాగైనా ఫామ్లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.ప్రస్తుత వరల్డ్కప్లో విరాట్ చేసిన స్కోర్లు..ఐర్లాండ్పై 1(5)పాక్పై 4 (3)యూఎస్ఏపై 0 (1)ఆఫ్ఘనిస్తాన్పై 24 (24)బంగ్లాదేశ్పై 37 (28)ఆస్ట్రేలియాపై 0 (5)కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో రోహిత్కు జతగా విరాట్ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్గా ప్రమోషన్ లభించాక విరాట్ ఐపీఎల్ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్ పేలవ ఫామ్న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ 2024లో భీకర ఫామ్లో ఉండిన విరాట్ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఏకంగా విరాట్ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కీలకమైన సెమీస్లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్లోకి రావాలి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి సెమీస్ ట్రినిడాడ్ వేదికగా రేపు (జూన్ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. -
రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు.కాగా గ్రూప్-1లో టాప్లో ఉన్న భారత జట్టు సెయింట్ లూసియా వేదికగా సోమవారం ఆసీస్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ విరాట్ కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్నాడు. ధనాధన్ దంచికొడుతూ 19 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఐదో భారత బ్యాటర్గా నిలిచాడు.హిట్మ్యాన్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకుంటూ పరుగుల వరద పారించాడు. రోహిత్ శర్మ దెబ్బకు పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు సాధించింది.ఇక మూడో ఓవర్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఏకంగా29 పరుగులు పిండుకున్నాడు రోహిత్. 6, 6, 4, 6, 0, 6తో అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఆసీస్తో మ్యాచ్లో రోహిత్ శర్మ 41 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయి సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతర్జాతీయ టీ20లలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా క్రికెటర్లు12 యువరాజ్ సింగ్- 2007లో ఇంగ్లండ్ మీద18 కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద18 సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద19 గౌతం గంభీర్- 2009లొ శ్రీలంక మీద19 రోహిత్ శర్మ- 2024లో ఆస్ట్రేలియా మీద. View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి, రోహిత్లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్!
టీమిండియా హెడ్కోచ్ ఎవరన్న అంశంపై ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నా.. డబ్ల్యూవీ రామన్ కూడా రేసులో ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గంభీర్ను ప్రధాన కోచ్గా కొనసాగిస్తూనే.. రామన్ సేవలను కూడా వినియోగించుకునే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. తాను హెడ్కోచ్ పదవి చేపట్టాలంటే గంభీర్ బీసీసీఐకి కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. నవ్భారత్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఎదుట ఎదుట ఇంటర్వ్యూకి హాజరైన సమయంలో తన ఐదు షరతులను వెల్లడించినట్లు సమాచారం. అవేమిటంటే..తాను హెడ్కోచ్ పదవి చేపట్టినట్లయితే.. క్రికెటింగ్ ఆపరేషన్స్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. ఆటకు సంబంధించిన ప్రతి విషయం తన ఆధీనంలోనే ఉండాలి.అదే విధంగా.. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ల సెలక్షన్ విషయం తనకే వదిలేయాలి.ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైనది.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు పాకిస్తాన్ వేదికగా జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ-2025 అనేది చివరి అవకాశం.ఒకవేళ ఈ వన్డే టోర్నీలో వీళ్లు గనుక విఫలమైతే జట్టు నుంచి వాళ్లందరిని తప్పించే వీలు కల్పించాలి. అయితే, ఇది కేవలం ఈ ఒక్క ఫార్మాట్కే పరిమితమా? లేదంటే మూడు ఫార్మాట్ల జట్ల నుంచి వీరికి ఉద్వాసన పలకాలని గంభీర్ భావిస్తున్నాడా? అన్న అంశంపై స్పష్టత లేదు.నాలుగో కండిషన్ ఏమిటంటే.. వన్డే, టీ20 ఫార్మాట్తో సంబంధం లేకుండా.. టెస్టు ఫార్మాట్కు ప్రత్యేక జట్టు ఉండాలి.ఇక ఐదోది.. 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే తన ప్రణాళికలను నిక్కచ్చిగా అమలు చేయడం.ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లిలకు గడ్డు పరిస్థితులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ వీరిని టెస్టు ఫార్మాట్కు మాత్రమే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్కు పనిచెప్పాడు. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్తో మెరిశాడు.ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 3 సిక్స్లు, ఒక ఫోర్తో 37 పరుగులు చేశాడు. ఈ వరల్డ్కప్లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వరల్డ్కప్(వన్డే అండ్ టీ20)లలో 3000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్గా విరాట్ నిలిచాడు. ఓవరాల్గా వరల్డ్కప్లలో కోహ్లి 3002 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్లలో 37 మ్యాచ్లు ఆడి 1795 పరుగులు చేసిన కోహ్లి.. టీ20 వరల్డ్కప్లలో 32 మ్యాచ్లు ఆడి 1207 పరుగులు చేశాడు. -
అతడొక అద్భుతం.. ఫ్యూచర్ ఇండియన్ స్టార్: గంభీర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా ఓపెనర్గా విరాట్ కోహ్లి విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లి తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. విరాట్ కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విరాట్ కోహ్లి స్థానంలో ఓపెనర్గా భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఛాన్స్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మెగా టోర్నీలో జైశ్వాల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ఈ క్రమంలో జైశ్వాల్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్న గంభీర్కు ప్రస్తుత తరంలో భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. వెంటనే గౌతీ ఏమీ ఆలోచించకుండా టక్కున యశస్వీ జైశ్వాల్ అని బదులిచ్చాడు."ప్రస్తుతం తరంలో నన్ను బాగా ఆకట్టుకున్న క్రికెటర్ యశస్వి జైస్వాల్. జైశ్వాల్ అద్బుతమైన ఆటగాడు. అతడికి దూకుడుగా ఆడే సత్తా ఉంది. అంతేకాకుండా అతడు ఓపెనర్గా కూడా బాగా రాణిస్తున్నాడు. లెఫ్టాండర్ కావడం యశస్వీకి బాగా కలిసొచ్చింది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. జైశ్వాల్కి కష్టపడేతత్వం ఉంది. కచ్చితంగా అతడు ఫ్యూచర్ ఇండియన్ స్టార్గా ఎదుగుతాడని" గంభీర్ పేర్కొన్నాడు. -
కోహ్లి విషయంలో సంతోషంగా లేను: టీమిండియా బ్యాటింగ్ కోచ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శల నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి పరుగులు చేయకపోవడం పట్ల తానూ సంతోషంగా లేనని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో పరుగుల వరద(741) పారించిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్గా బరిలోకి దిగుతున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం 88 పరుగులే చేశాడు.న్యూయార్క్ వేదికగా లీగ్ మ్యాచ్లలో పూర్తిగా విఫలమైన కోహ్లి.. వెస్టిండీస్లో సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. అఫ్గనిస్తాన్తో పోరులో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో కోహ్లి స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అతడిని తన రెగ్యులర్ పొజిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆంటిగ్వా వేదికగా శనివారం రాత్రి ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్కు కోహ్లి స్థానం గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘కోహ్లిని వన్డౌన్లో ఆడించాలనే ఆలోచన మాకు లేదు. ప్రస్తుత మా బ్యాటింగ్ ఆర్డర్ పట్ల మేము సంతోషంగానే ఉన్నాం.పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి జట్టును బట్టి మాత్రమే మా జట్టులో మార్పులు ఉంటాయి’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు.ఇక కోహ్లి ప్రదర్శన గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘‘అవును నేను ఈ విషయంలో సంతోషంగా లేను. అతడు పరుగుల వరద పారిస్తే చూడాలని ఉంది.అయితే, ఒక్కోసారి సవాళ్లు ఎదురుకావడం కూడా మన మంచికోసమే. ప్రస్తుత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇండియాలో బ్యాటింగ్ చేసేటపుడు తడబడ్డారు.ఇప్పుడు ఇక్కడ మాత్రం మెరుగ్గా ఆడుతున్నారు. మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రస్తుతం అదరగొడుతున్నారు. ఈ విషయంలో మాత్రం సంతోషంగా ఉంది’’ అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లికి వన్డౌన్లోనే మెరుగైన రికార్డు ఉంది. మూడో స్థానంలో వచ్చి 113 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్.. 53.96 సగటుతో 135.26 స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ఓపెనర్గా అతడి సగటు 39. స్ట్రైక్రేటు 39. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 121 మ్యాచ్లు ఆడిన కోహ్లి 4066 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలో నిరాశపరిచిన కింగ్ కోహ్లి.. ఇప్పుడు సూపర్-8లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.సూపర్-8లో భాగంగా బార్బోడస్ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. సరిగ్గా 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఇక ఈ మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ పరంగానే కాకుండా ఫీల్డింగ్లో కూడా నిరాశపరిచాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కోహ్లి జారవిడిచాడు. ఎన్నో సంచలన క్యాచ్లు అందుకున్న కింగ్ కోహ్లి.. ఈ మ్యాచ్లో సునాయస క్యాచ్ను జారవిడిచడంతో అంతా ఆశ్చ్యర్యపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతులు తలపై పెట్టుకుని షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లి విడిచిపెట్టిన క్యాచ్ పెద్ద కాస్ట్లీగా మారలేదు. ఎందకుంటే ఆ తర్వాతి ఓవరే జద్రాన్(8) అక్షర్పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.pic.twitter.com/MkAFbNakRq— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) June 20, 2024 -
‘సూపర్–8’లో భారత్ విజయారంభం..47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు (ఫొటోలు)
-
కోహ్లికి 121 మ్యాచ్లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్లో విరాట్ 2022 టీ20 వరల్డ్కప్లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్లో బాదిన ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్లో మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
Ind vs Afg: అతడు వద్దు.. కోహ్లి విషయంలో అలా చేయొద్దు!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా అఫ్గనిస్తాన్తో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లీగ్ దశలో న్యూయార్క్ పిచ్పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డ బ్యాటర్లు.. బ్రిడ్జ్టౌన్ పిచ్పై బ్యాట్ ఝులిపించాలని పట్టుదలగా ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ.. స్కిల్ సెషన్స్ను సద్వినియోగం చేసుకున్నారు టీమిండియా స్టార్లు. ఇక విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి.. టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.అమెరికాలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వెస్టిండీస్లో ఓ పేసర్పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఓపెనింగ్ జోడీని మారిస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.కోహ్లి విషయంలో ప్రయోగాలు వద్దుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించగల కోహ్లి.. అఫ్గన్తో పోరులోనూ ఓపెనర్గానే రావాలని ఆకాంక్షించాడు.న్యూయార్క్లో పరిస్థితులు వేరని.. విండీస్ పిచ్లపై కోహ్లి కచ్చితంగా బ్యాట్తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఆటగాడని.. అతడి విషయంలో ప్రయోగాలు అనవసరం అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ను తప్పించి.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అఫ్గనిస్తాన్తో సూపర్-8 మ్యాచ్కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: -
అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లి.. రణ్వీర్, షారుఖ్లకు వెనక్కు నెట్టి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత దేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సెలబ్రిటి బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక (KROLL) ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో రూ. 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లి ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29 శాతం మేర పెరిగింది. 2022లో రెండో స్థానంలో నిలిచిన కోహ్లి.. గతేడాది బాలీవుడ్ స్టార్లు రణ్వీర్ సింగ్ (రూ. 1693 కోట్లు), షారుఖ్ ఖాన్లను (రూ. 1001 కోట్లు) అధిగమించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. కోహ్లి 2017 నుంచి వరుసగా (మధ్యలో 2022లో రెండో స్థానం) ఆరు సార్లు భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.క్రికెట్కు సంబంధించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ 2024తో బిజీగా ఉన్న కోహ్లి గతేడాది వన్డే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువడంతో పాటు ఆ ఏడాదంతా పలు బ్యాటింగ్ రికార్డులు కొల్లగొట్టాడు. 35 ఏళ్ల కోహ్లి ఈ ఏడాది ఐపీఎల్లోనూ అదరగొట్టాడు. ఈ పరుగుల యంత్రం 2024 ఐపీఎల్ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లి 2023 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో విరాట్ ఆశించిన మేర రాణించనప్పటికీ టీమిండియా సూపర్-8కు చేరింది. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో తలపడనుంది. -
కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? కేకేఆర్ స్టార్ రిప్లై వైరల్
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా. జట్టును చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మెగా టోర్నీలో హర్షిత్ మొత్తంగా 13 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా.. వరుణ్ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్ సెలబ్రేషన్స్తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్ రాణా. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్ పేసర్.మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోతఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్కు సెండాఫ్ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.భయ్యాతో మాట్లాడానుతాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ హర్షిత్ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్ భయ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.ఆ సమయంలో వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్ కూడా నా వైపే ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మయాంక్ భయ్యాను కలిశాను.తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? ఈ క్రమంలో విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.నన్ను చాలెంజ్ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్ దశలో దుమ్ములేపిన కేకేఆర్.. ఫైనల్లో సన్రైజర్స్ను ఓడించి 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! -
సౌరభ్ నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్?
టీ20 ప్రపంచకప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్ నేత్రావల్కర్ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్ బౌలర్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సౌరభ్.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్ దశలో కెనడా, పాకిస్తాన్పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్.. టీమిండియాతో మ్యాచ్లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్లో అమెరికా ఓడినా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వరల్డ్క్లాస్ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్ కెరీర్తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ నేత్రావల్కర్ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్ నేత్రావల్కర్ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్ మాదిరే ఆమె కూడా కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్ సంస్థలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్ డాన్సర్32 ఏళ్ల సౌరభ్కు క్రికెట్ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్ డాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్ క్రికెట్ మ్యాచ్లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్- ఫిట్నెస్ బ్లెండ్ ప్రోగ్రామ్స్కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్! -
తప్పు విరాట్ కోహ్లిది కాదు.. పిచ్ది: హర్భజన్ సింగ్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనుబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.మొత్తంగా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్-2024లో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన విరాట్.. పొట్టి ప్రపంచకప్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.దీంతో కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు విరాట్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లిది ఎటువంటి తప్పులేని, న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ అస్సలు బ్యాటింగ్కు అకుకూలించలేదని భజ్జీ చెప్పుకొచ్చాడు."న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు.అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. తొలి 6 ఓవర్లలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాలను ఇస్తే.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి వారు తమపని తాము చేసుకుపోతారని" స్టార్స్పోర్ట్స్తో హర్భజన్ పేర్కొన్నాడు. -
నా ఫేవరెట్ క్రికెటర్ కోహ్లి.. ఎందుకంటే: కెనడా కెప్టెన్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆటంటే తనకెంతో ఇష్టమని కెనడా క్రికెట్ జట్టు కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అన్నాడు. తన ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే అని తెలిపాడు.కోహ్లి సేవలు కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచ క్రికెట్పై తనదైన ముద్ర వేసిన గొప్ప ఆటగాడని సాద్ బిన్ జఫర్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్లతో పాటు కెనడా గ్రూప్-ఏలో ఉంది.ఈ గ్రూపు నుంచి ఇప్పటికే భారత్, అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, ఐర్లాండ్, కెనడా ఎలిమినేట్ అయ్యాయి. ఇక ఈ మెగా టోర్నీలో కెనడా ఆడిన మూడు మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచింది.లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.మాకంటూ మంచి గుర్తింపు వస్తుందిస్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్. అతడు కేవలం టీమిండియాకే కాదు.. క్రికెట్ ప్రపంచానికి ఎంతో చేశాడు.ఇక టీమిండియా ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు. అలాంటి టీమ్తో మేము కలిసి ఒకే గ్రౌండ్లో ప్రత్యర్థులుగా ఆడటం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది.పాక్లో జన్మించిన సాద్ బిన్ జఫర్ఒకవేళ ఈ మ్యాచ్లో మేము గనుక రాణిస్తే కచ్చితంగా క్రికెటింగ్ సర్క్యూట్లో మాకంటూ మంచి గుర్తింపు వస్తుంది’’ అని సాద్ బిన్ జఫర్ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించిన సాద్ బిన్ జఫర్ తర్వాత కెనడాకు మకాం మార్చాడు.లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన జఫర్.. లెఫ్టాండ్ బ్యాటర్ కూడా. 37 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ప్రస్తుతం కెనడా జట్టు కెప్టెన్గా ఉన్నాడు. కెనడా తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, 41 టీ20 మ్యాచ్లు ఆడి ఆయా ఫార్మాట్లలో 16, 44 వికెట్లు తీశాడు.ఐర్లాండ్పై గెలిచిఇక వరల్డ్కప్-2024లో సాద్ బిన్ జఫర్ కెప్టెన్సీలో కెనడా తమ తొలి మ్యాచ్లో ఆతిథ్య అమెరికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. అనంతరం.. ఐర్లాండ్పై 12 పరుగుల తేడాతో గెలిచింది.అయితే, సూపర్-8 రేసులో నిలవాలంటే పాకిస్తాన్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరగా టీమిండియాతో మ్యాచ్ ఆడి ఇంటిబాట పట్టనుంది.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్With #TeamIndia already advancing in the Super 8 stage, Canada players share their favourite players to watch out for on the biggest stage! 🔥Will @ImRo45 & Co. go into the Super 8 with a win against Canada? 🤨#INDvCAN | TODAY, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/88cOlwURWU— Star Sports (@StarSportsIndia) June 15, 2024 -
IND vs CAN: భారత తుదిజట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్?!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్కు సిద్దమైంది. గ్రూప్-ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది.కాగా ఫ్లోరిడాలోని లాడెర్హిల్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్-8కు చేరగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక టీమిండియా- కెనడా మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.ఆ ఇద్దరు అవుట్!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులో ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా.. శివం దూబే స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో జరుగుతున్న టీమిండియా లీగ్ దశ మ్యాచ్లలో జడ్డూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.గత మ్యాచ్(అమెరికాతో)లో అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో మూడు మ్యాచ్లు ఆడే ఛాన్స్ కొట్టేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే, సూపర్-8కు ముందు అతడికి కెనడాతో మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే.. ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో శివం దూబే స్థానంలో సంజూను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా.. వెస్టిండీస్లో సూపర్-8 మ్యాచ్ల నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్కు కూడా అమెరికాలో తొలి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మ్యాచ్లోనైనా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్లు న్యూయార్క్లోనే జరిగాయి.అక్కడి నసావూ కౌంటీ డ్రాప్ ఇన్- పిచ్ బౌలర్ల పాలిట స్వర్గధామంలా మారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో కోహ్లి మూడు మ్యాచ్లలో కలిపి కేవలం ఐదు పరుగులే చేశాడు.అయితే, కెనడాతో మ్యాచ్ జరిగే వేదిక ఫ్లోరిడాలో పరుగులకు ఆస్కారం ఉన్న వికెట్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా కింగ్ భారీగా రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇండియా వర్సెస్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్కు తుదిజట్ల అంచనా భారత తుదిజట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కెనడా తుదిజట్టు(అంచనా)ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ (వికెట్ కీపర్), డిల్లాన్ హెయిలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx— BCCI (@BCCI) June 14, 2024 -
కోహ్లితో పరిచయం లేదు.. వికెట్ తీసినందుకు ఏమన్నాడంటే!
తనకు ఇష్టమైన రెండు రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందని అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. తన కెరీర్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని.. అంతా త్వరత్వరగా జరిగిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశాడు.ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం భావోద్వేగ క్షణంగా మిగిలిపోతుందని సౌరభ్ నేత్రావల్కర్ ఎమోషనల్ అయ్యాడు. కాగా భారత్కు చెందిన నేత్రావల్కర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిఅండర్-19 ప్రపంచకప్లోనూ యువ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. సీనియర్ జట్టులో చోటు దక్కకకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే ఒరాకిల్లో ఉద్యోగం సంపాదించిన నేత్రావల్కర్.. ప్రస్తుతం అమెరికా తరఫున టీ20 ప్రపంచకప్-2024 బరిలో దిగాడు.విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్లో విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. రోహిత్ శర్మ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తన తొలి టీ20 ప్రపంచకప్లోనే రెండు బిగ్ వికెట్లు తీసి మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు.అయితే, ఈ మ్యాచ్లో టీమిండియాతో మ్యాచ్లో అమెరికా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే కెనడా, పాకిస్తాన్లపై విజయాలతో గ్రూప్-ఏ సెకండ్ టాపర్గా సూపర్-8కు చేరువైంది.ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ అనంతరం తన భావాలు పంచుకున్న సౌరభ్ నేత్రావల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెండు రంగాల్లో కెరీర్ కొనసాగించడం ఆనందంగా ఉంది. అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.విరాట్తో నాకు అంతగా పరిచయం లేదుఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇక గత రెండు మ్యాచ్లు(పాక్, భారత్) అత్యంత కీలకమైనవి. విరాట్ వికెట్ తీయడం ఓ ఎమోషనల్ మూమెంట్.అతడికి బౌలింగ్ చేస్తున్నపుడు ఆఫ్ స్టంప్ ఎగురగొట్టాలని భావించా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి వికెట్ తీశా. అండర్-15, అండర్-17 డేస్ నుంచే నాకు సూర్యకుమార్ యాదవ్ తెలుసు.మేము కలిసినపుడు నాటి డ్రెసింగ్రూం వాతావరణం గురించి చర్చించుకుంటాం. అయితే, విరాట్తో నాకు అంతగా పరిచయం లేదు కానీ.. అతడి వికెట్ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’’ అని సౌరభ్ నేత్రావల్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: విరాట్ ఖాతాలో చెత్త రికార్డు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా యూఎస్ఏతో నిన్న (జూన్ 12) జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా (టాప్-7 ఆటగాళ్లలో) రికార్డుల్లోకెక్కాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 525 మ్యాచ్ల్లో 36 సార్లు డకౌటయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో (టాప్-7లో) విరాట్ తర్వాత సచిన్ టెండూల్కర్ (34), రోహిత్ శర్మ (33), వీరేంద్ర సెహ్వాగ్ (31), సౌరవ్ గంగూలీ (29) ఉన్నారు.మొత్తం భారత జట్టులో (11 మంది ఆటగాళ్లలో) అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. జహీర్ 309 మ్యాచ్ల్లో 44 సార్లు డకౌటయ్యాడు. జహీర్ తర్వాత ఇషాంత్ శర్మ (40), హర్భజన్ సింగ్ (37), విరాట్ (36), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 495 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 59 సార్లు డకౌటయ్యాడు. ఈ విభాగంలో విండీస్ మాజీ పేసర్ కోట్నీ వాల్ష్ (54), సనత్ జయసూర్య (53) టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో విరాట్ డకౌట్ అయినా టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. భారత్ మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అర్ష్దీప్ సింగ్ (4-0-9-4), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. -
కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్!
సౌరభ్ నేత్రావల్కర్.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మారుమోగిపోతున్న పేరు. ఈ రైటార్మ్ పేసర్ అండర్-19 కప్-2010 ఎడిషన్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు.దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడిన నేత్రావల్కర్.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ముంబైకర్ రోహిత్ శర్మకు జూనియర్. అదే విధంగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు.అంతేకాదు.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో.. భారత జట్టు ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు బౌలింగ్ చేసిన ఘనత కూడా సౌరభ్ నేత్రావల్కర్ సొంతం.ప్రత్యర్థిగా ఉన్న టీమ్లో ధోని, కోహ్లిముంబై తరఫున రంజీలు ఆడిన నేత్రావల్కర్.. ఎన్సీఏలో యువరాజ్ సింగ్ వికెట్ పడగొట్టడం ద్వారా 2009లో వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ పేస్బౌలర్.. యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలతో కలిసి డ్రెస్సింగ్రూం పంచుకున్నాడు.అప్పుడు వీరి జట్టుకు ప్రత్యర్థిగా ఉన్న టీమ్లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక అంచెలంచెలుగా ఎదిగి అండర్ క్రికెట్ వరల్డ్కప్ ఆడే అవకాశం దక్కించుకున్న సౌరభ్ నేత్రావల్కర్.. 2010 నాటి ఆ ఈవెంట్లో టీమిండియా తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.అగార్కర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉండటంతోఅయితే, సీనియర్ లెవల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయాడు ఈ ముంబైకర్. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉన్న జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికీ పట్టుదలని నేత్రావల్కర్ 2013లో రంజీల్లో అరంగేట్రం చేశాడు.అయితే, సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువు మీద శ్రద్ధ పెట్టాడు. ముంబైలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన అతడు.. ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లిన సౌరభ్ నేత్రావల్కర్కు 2015లో న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.యాప్ రూపకర్త ప్లేయర్ అనాలిసిస్ చేసేందుకు వీలుగా అతడు రూపొందించిన క్రిక్డీకోడ్ యాప్నకు ఫిదా అయిన యూనివర్సిటీ యాజమాన్యం అతడికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది.కార్నెల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన సౌరభ్ నేత్రావల్కర్కు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒరాకిల్ సంస్థ ఉద్యోగం ఆఫర్ చేసింది. అయితే, అక్కడే మళ్లీ తిరిగి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు నేత్రావల్కర్.అలా అమెరికా జట్టులో చోటుఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల సరళింపు నేపథ్యంలో.. H1B కార్డ్ హోల్డర్గా ఉన్న నేత్రావల్కర్కు 2018లో యూఎస్ఏ జట్టులో అడుగుపెట్టే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు కెప్టెన్గానూ వ్యవహరించాడతడు.ఈ నేపథ్యంలో యూఏఈతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2019లో సౌరభ్ నేత్రావల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పపువా న్యూగినియాతో మ్యాచ్తో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు అమెరికా తరఫున 48 వన్డేలు ఆడిన సౌరభ్ నేత్రావల్కర్ 73 వికెట్లు తీశాడు. 30 టీ20లలో కలిపి 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటితొలిసారిగా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా తరఫున బరిలోకి దిగిన నేత్రావల్కర్ పాకిస్తాన్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ రిజ్వాన్(9), ఇఫ్తికార్ అహ్మద్ రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేసి పాక్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పాక్ పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇక టీమిండియాతో మ్యాచ్లోనూ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. స్టార్ బ్యాటర్, ఓపెనర్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(3) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మ్యాచ్లో అమెరికా భారత్ చేతిలో ఓడిపోయినా ఈ టెకీ మాత్రం తనదైన ముద్ర వేయగలిగాడు. ఈ క్రమంలో సౌరభ్ నేత్రావల్కర్పై ప్రశంసలు కురుస్తున్నాయి.కాగా ఒరాకిల్లో పనిచేస్తున్న నేత్రావల్కర్.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు దాదాపు నెల రోజుల పాటు సెలవు(జూన్ 17 వరకు) పెట్టినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా సూపర్-8కు గనుక క్వాలిఫై అయితే తన లీవ్ను పొడిగించుకుంటాడు.పేటెంట్ ఉందినెట్టింట సెర్చ్ క్వెరీలో భాగంగా అత్యంత వేగంగా ఆటోకంప్లీట్ అయ్యే వినూత్న అల్గారిథమ్ను సౌరభ్ నేత్రావల్కర్ రూపొందించాడు. ఇందుకు సంబంధించి అతడి వద్ద పేటెంట్ రైట్ కూడా ఉంది.ఇంకో అల్గారిథమ్ పేటెంట్ కోసం అతడు అప్లై చేశాడు. ఈ విషయాలను నేత్రావల్కర్ స్వయంగా క్రిక్బజ్తో పంచుకున్నాడు. తాను ఒక కోడర్ అని.. SQL(లాంగ్వేజ్) & C విభాగంలో పనిచేస్తానని పేర్కొన్నాడు. కేవలం ఉద్యోగం, క్రికెట్ మాత్రమే కాదు సంగీతంలోనూ నేత్రావల్కర్కు ప్రావీణ్యం ఉంది. ఇక అమెరికాపై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్కు ఈ 32 ఏళ్ల పేసర్.. ‘‘బ్రదర్’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేయడం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి చెత్త ప్రదర్శన.. టీమిండియా దిగ్గజం కీలక వ్యాఖ్యలు
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేశాడు.న్యూయార్క్ వేదికగా తొలుత ఐర్లాండ్పై ఒకటి, పాకిస్తాన్పై నాలుగు పరుగులు చేసిన కోహ్లి.. తాజాగా ఆతిథ్య యూఎస్ఏ జట్టుతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ మూడు మ్యాచ్లలో టీమిండియా విజయాలు సాధించినా.. కోహ్లి ఫామ్లేమి మాత్రం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.కోహ్లి ఆట తీరుపై విమర్శలుఅదే విధంగా.. విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ వంటి యువ బ్యాటర్కు అవకాశం ఇవ్వకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా కోహ్లిని పంపడం సత్ఫలితాలు ఇవ్వడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుభవజ్ఞుడైన కోహ్లి సరైన సమయంలో రాణించి జట్టుకు ప్రయోజనం చేకూరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాకౌట్ మ్యాచ్లలో అతడి పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నాడు.బ్యాటింగ్ బాగా లేదని అనుకోవద్దు‘‘మ్యాచ్లు గెలవడం అనేది ఏ ఆటగాడిగైనా అతిపెద్ద ఊరట. గత కొన్నేళ్లుగా కోహ్లి జట్టు కోసం ఇదే పని చేస్తున్నాడు. ప్రస్తుతం మనం వరల్డ్కప్ ఆరంభ దశలోనే ఉన్నాం.దీని తర్వాత సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉన్నాయి. అంత వరకు కాస్త ఓపికగా ఉండటం అవసరం. అతడిపై నమ్మకం ఉంచడం మేలు. ఎందుకంటే.. అందరినీ తప్పని నిరూపించగల నైపుణ్యాలు అతడి సొంతం.వరుసగా మూడు లో స్కోర్లు నమోదు చేసినంత మాత్రాన అతడి బ్యాటింగ్ బాగా లేదని కాదు. ఒక్కోసారి బౌలర్లు అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తారు. ఇలా జరగటం సహజమే.కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడి పట్ల నమ్మకం ఉంచుదాం. త్వరలోనే కచ్చితంగా అతడు తన బ్యాట్ పవర్ చూపిస్తాడు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.సూపర్-8 దశకు అర్హతకాగా బుధవారం నాటి మ్యాచ్లో ఆతిథ్య అమెరికా జట్టుపై గెలిచిన టీమిండియా.. సూపర్-8 దశకు అర్హత సాధించింది. గ్రూప్(ఏ) దశలో తదుపరి కెనడాతో శనివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన. అనంతరం సూపర్-8 మ్యాచ్ల కోసం వెస్టిండీస్కు పయనం కానుంది. అమెరికాతో విండీస్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే View this post on Instagram A post shared by ICC Hindi (@icchindiofficial)