రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి | Road Accident In Nizamabad District People Lost Life | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Published Sat, May 16 2020 7:38 AM | Last Updated on Sat, May 16 2020 7:41 AM

Road Accident In Nizamabad District People Lost Life - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి నాకాతండా వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బీహార్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. మృతులు కేరళలోని కోజికోడ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement