![Road Accident In Nizamabad District People Lost Life - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2020/05/16/car.jpg.webp?itok=J_9SBxdZ)
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి నాకాతండా వద్ద ఆగి ఉన్న టిప్పర్ను స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బీహార్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. మృతులు కేరళలోని కోజికోడ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment