-
చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
కమ్మర్పల్లి (నిజామాబాద్): వరద కాలువలో చెల్లెల్ని కాపాడబోయి అక్క నీట మునిగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గాం«దీనగర్లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గాం«దీనగర్కు చెందిన చిత్తారి రాజు, మంజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కాలనీకి చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి కామారెడ్డి నుంచి మంజుల తండ్రితోపాటు ఆమె సోదరి పానేటి శ్యామల కూడా వచ్చారు.పంచాయితీ జరుగుతున్న సమయంలో మంజుల ‘నేను చనిపోతా’అంటూ పరుగెత్తికెళ్లి కాలనీకి పక్కనే గల కాలువ వద్దకు వెళ్లి అందులో దూకింది. చెల్లెల్ని కాపాడేందుకు శ్యామల, కాలనీ వాసులు కూడా కాలువ వద్దకు వెళ్లారు. శ్యామల ధైర్యం చేసి కాలువలోకి దూకింది. కాలనీ వాసులు చీరను విసరగా మంజుల దాన్ని పట్టుకొని పైకి వచ్చింది. కానీ శ్యామల ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్యామల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ విజయం
నిజామాబాద్: నిజామాబాద్లో బీజేపీ విజయం సాధించించింది. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,25,369 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీ. జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్థన్ ఓటమిపాలయ్యారు. -
గాలి వాన బీభత్సం
కైలాస్నగర్/నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల వరకు ఎండ దంచికొట్టగా.. అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వాంకిడి సమీపంలో గల జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.తాంసిలో ఓ ఇంటి ఆవరణలో గల కొబ్బరిచెట్లు విరిగి పడ టంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తెచి్చన జొన్నలు తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందు లు పడ్డారు. తలమడుగు మండలం ఉండం గ్రామ సమీపంలోని 33 కేవీ వి ద్యుత్ స్తంభం విరిగిపడటంతో తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తలమడుగు మండలంలోని పూనగూడ, పల్సి–బి, పల్సి–కే గ్రామాలలో ఈదురుగాలుల దెబ్బ కు పలు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. బోథ్ మండలం మర్లవాయిలో ఇంటి పైకప్పుపై ఉన్న రేకులు ఎగిరిపోయి విద్యుత్వైర్లపై పడ్డాయి. -
రేవంత్ కాంగ్రెస్లో ఉండటమే పెద్ద తప్పు: ఎంపీ అర్వింద్
సాక్షి, నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. హస్తం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. వారు చెప్పినట్లు బీజేపీ 12 సీట్లు వస్తే సీఎం రేవంత్ను దేవుడే కాపాడాలని పెటైర్లు వేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడే కానీ.. ఆయన కాంగ్రెస్లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఎంపీ అర్వింద్ కామెంట్స్ కాంగ్రెస్ 100 రోజుల్లో ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ అని మరోసారి మోసానికి తెరలేపింది. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్ను ఏర్పాటు చేస్తాం మా ఏకైక గ్యారెంటీ మోదీనే. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది. మోదీ మూడో టర్మ్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. రైల్వే విభాగంలో కొత్త విప్లవం రాబోతుంది. రానున్న రోజుల్లో 25 వేల కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ. -
MLC Kavitha: కవితకు బిగ్ షాక్.. ఈడీ మరో సంచలన నిర్ణయం!
సాక్షి, నిజామాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నిజామాబాద్పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇక, కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆమె భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి బదిలీ అయిన కీలక అధికారితో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగిపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాల సేకరణ తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది. -
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్తో 14 మంది చిన్నారులకు గాయాలు -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డు
-
నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్దే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం -
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
-
నిజామాబాద్ జిల్లాలో కొకైన్, డ్రగ్స్ కలకలం
-
నల్లిబొక్క కోసం లొల్లి.. పెళ్లి క్యాన్సిల్.. ‘బలగం’ సీన్ రిపీట్
పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి అందమైన ఈ వేడుకను కొంతమంది చిన్న చిన్న విషయాలతో ముడిపెట్టి.. పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయి వాళ్లు మర్యాదలు సరిగా చేయలేదని, కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వింత వింత కారణాలతో ఏకంగా పీటల మీద కూడా పెళ్లిళ్లు ఆపేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నిశ్చితార్థం రోజు మటన్లో నల్లి బొక్క వడ్డించలేదని ఆగ్రహం చెందిన వరుడి కుటుంబ సభ్యులు చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్కు చెందిన వధువుకి, జగిత్యాలకు చెందిన వరుడితో వివాహం నిశ్చయమైంది. గత నెల నవంబర్లో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు భోజనాలను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథులందరికీ నాన్ వెజ్ వంటలు వండించారు. అయితే నిశ్చితార్థం అనంతరం తమకు మటన్లో మూలుగ బొక్క వడ్డించలేదని అబ్బాయి బంధువులు చెప్పడంతో గొడవకు దారితీసింది. దీనిపై స్పందించిన వధువు కుటుంబ సభ్యులు మూలుగు బొక్క వంటకాలలో చేయించలేదని చెప్పడంతో గొడవ కాస్తా పెద్దదిగా మారింది. ఈ వివాదం కాస్తా చివరికి పోలీసుల వరకు చేరుకోవడంతో.. అబ్బాయి కుటుంబ సభ్యులను నచ్చజెప్ప ప్రయత్నం చేశారు. కానీ వారు ససేమిరా అంటూ తమను అవమానించారని అన్నారు. అంతేగాక నల్లి బొక్క మెనూలో లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా దాచిపెట్టారని వాదించారు. చివరికి ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబం తెగేసి చెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే ఈ ఘటన అచ్చం ఇటీవల టాలీవుడ్లో వచ్చిన ‘బలగం’ సినిమాలోని కథను గుర్తు చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమాలో.. మూలుగ బొక్క కోసం బావ బామ్మర్ధుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడ కూడా అలాగే మూలుగ బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి సంబంధం రద్దయింది. -
ఒకే కుటుంబం.. 6 హత్యలు.. ఎలా చేశారంటే..!
-
‘ప్రసాద్ తల్లిని కూడా హత్య చేయాలనుకున్నారు’
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు. వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు. చదవండి: ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు -
నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురి హత్య కేసు విచారణ
-
నిజామాబాద్: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. అయితే, వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని మాక్లుర్కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్కు మాక్లుర్లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారం ప్రసాద్ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. అయితే, మాక్లుర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. మరోవైపు.. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. -
పోచారం రికార్డు బ్రేక్ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
నిజామాబాద్ లో అర్బన్ బారులు తీరిన ఓటర్లు
-
నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు
-
ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులది కీలకం
చెరకు సాగు.. నిజాం షుగర్స్ సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్ జేఏసీ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. గల్ఫ్ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తోంది. – మంద భీమ్రెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్ నిజాం షుగర్స్ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్కు తరలించి అమ్ముతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం. – పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం -
కేసీఆర్కు రేవంత్రెడ్డి సవాల్.. 80 సీట్లకు తక్కువ వస్తే దేనికైనా సిద్ధం
సాక్షి, నిజామాబాద్/ నారాయణ్ఖేడ్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడుతూ.. ఎంపీగా కవితను ఓడించారని కేసీఆర్ నిజామాబాద్పై పగ పట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి గెలిచిన ఎంపీ జాడ లేకుండా పోయాడని ధర్మపురి అర్వింద్ను ఉద్ధేశించి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రేవంత్ మండిపడ్డారు. పదవి పోతుందన్న భయంతో సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80కి పైగా సీట్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేవంత్.. 80 సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే శిక్షకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి పదేళ్లు గడిచిందని.. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకూ చక్కెర పరిశ్రమను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మద్దతు ధర అడిగిన ఎర్రజొన్న రైతులపై పోలీసు కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని అన్నారు. రైతుల భూములు మింగేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్కపలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని, వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు, కేసీఆర్, కేటీఆర్లు పోటీ పడతారని విమర్శించారు. చదవండి: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్ నారాయణ్ఖేడ్ గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయం: రేవంత్ ‘మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్. స్వాతంత్ర్యం కోసం నినదించిన కుటుంబం షెట్కాట్ కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్లో పడుకున్నావా? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు. కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
ఇందూరుకు ఇవి కావాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ నగరంలో 4,70,152 మంది జనాభా ఉన్నారు. ఇందులో 2,86,766 మంది ఓటర్లు ఉన్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్నా ఆ మేరకు సౌకర్యాల కల్పన మాత్రం జరగడం లేదన్న వాదనలున్నాయి. ఇక్కడ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, ముంపు సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల డిమాండ్లు ఇలా ఉన్నాయి. బస్తీ దవాఖానాల సేవలు అంతంతే.. నిజామాబాద్లో బస్తీ దవాఖానాలు సేవలు నామమాత్రమే. నగరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నప్పటికీ సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సేవలను మెరుగుపరచాలి. భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఇటీవల పనులు పూర్తయినా, మురుగునీరు ఇళ్ల నుంచి వెళ్లడానికి కనెక్షన్లు ఇవ్వలేదు. నగరం విస్తరించిన నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇతర ప్రాంతాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘నుడా’ పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద లేదా జానకంపేట రైల్వేస్టేషన్ వద్ద 50 ఎకరాల్లో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. డ్రైపోర్టు ఏర్పాటైతే ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయవచ్చని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఛాంబర్ ఆప్ కామర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎకానమీ సైతం పెరుగుతుందంటున్నారు. ముంపు సమస్య నివారించాలి నగరం మధ్యలో ప్రవహిస్తున్న పులాంగ్ వాగు ఆక్రమణల కారణంగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. రామర్తి చెరువు 70 శాతం ఆక్రమణకు గురైంది. దీంతో బోధన్ రోడ్డుకు ఇరువైపులా వర్షాకాలంలో ముంపు తప్పడం లేదు. న్యాల్కల్ రోడ్డు లోని రోటరీనగర్ ముంపునకు గురవుతోంది. నగరం విస్తరించిన నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానం.. కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్లు మాత్రమే బాగున్నాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను నిర్మించాలన్న డిమాండ్లున్నాయి. ఒక్క సర్కారీ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇక నగరానికి సమీపంలో తెలంగాణ వర్సిటీ ఉన్నా, దీని పరిధిలోనూ ఇంజనీరింగ్ కళాశాల లేదు. తెలంగాణ వర్సిటీలో కోర్సులు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
కేసీఆర్ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: సామాజిక తెలంగాణ కోరుకొని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోనియా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. కానీ తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మాటలకు విలువ లేదని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు విషయంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధపు హామీ ఇచ్చారని మండిపడ్డారు. నాలుగున్నరెళ్ళ కిందట పసుపు బోర్డు ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. పసుపు పంటకు రూ. 12 నుంచి 15 వేలు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. పసుపు రైతులతో పాటు అన్ని పంటలకు ఎమ్ఎస్పీతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు. తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీ.. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతుందని దుయ్యబటారు. తన మీద 24 కేసులు ఉన్నాయన్న రాహుల్.. కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవని అన్నారు. దేశంలోనే అవినీతి సీఎం కేసీఆరేనని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలుపు పక్కా కాంగ్రెస్ను ఓడించేందుకుచ బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను నిలబెడతారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడ ఎంఐఎం ఉంటుందని మండిపడ్డారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంతంటే! ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ నాకు ఇల్లు లేదు. దేశమే నా ఇల్లు. మా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. పెన్షన్ రూ. 4 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం. కేసీఆర్ ఎంత లూటీ చేస్తున్నారో అంతా తిరిగి ఇస్తాం’ అంటూ రాహుల్ కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రోడ్డు మార్గాన హైదరాబాద్కు.. సభ అనంతరం ఆర్మూర్ నుంచి రోడ్డు మార్గంలోనే రాహుల్ హైదరాబాద్ బయల్దేరారు. హైలికాప్టర్ రద్దు కావడంతో రోడ్డు మార్గంలో నేరుగా శంషాబాద్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తెలంగాణలో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగిసింది. ఈనెల 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్, ప్రియాంక యాత్ర ప్రారంభించారు. ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకుమూడు రోజుల యాత్ర సాగింది. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో కొనసాగింది. కాంగ్రెస్లో చేరిన రేఖా నాయక్ ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్లో చేరారు. సిట్టింగ్ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను జాన్సన్ నాయక్ కేటాయించడంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
TS Election 2023: పసుపు.. చక్కెర
తుమాటి భద్రారెడ్డి: రైతు ఉద్యమాల వేదికగా పేరున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శాసనసభ ఎన్నికలకు సకల అస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 శాసనసభ స్థానాలు ఉండగా 2014లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన 8 సీట్లు గెలిచింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు హామీతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రైతుల ఆసరాతో అనూహ్యంగా కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు. ఇక ఇప్పుడు నిజాం షుగర్స్ అంశం ప్రధాన ఎజెండాగా రైతుల ఓట్లు మరోసారి కొల్లగొట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. కాంగ్రెస్ సైతం నిజాం షుగర్స్, మంచిప్ప రిజర్వాయర్ ముంపు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, ఆరు హామీలతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అలాగే దళితబంధులో కమీషన్ల వసూళ్లు, డబుల్ ఇళ్ల నిర్మాణంలో విఫలం, కామారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తదితరాలపైనా ప్రచారం చేస్తోంది. ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, పైగా ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతుండడంతో ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత సమీకరణాలు మారనున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ బాల్కొండ బరిలో ముక్కోణపు పోటీ వరుసగా రెండుసార్లు గెలుపొందిన మంత్రి ప్రశాంత్రెడ్డి తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్రెడ్డికి టికెట్ వచ్చింది. ఈయనకు గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున 42వేల ఓట్లు దక్కడం గమనార్హం. ఇక బీజేపీ తరపున ఏలేటి మల్లికార్జున్రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి. బోధన్ బాస్ ఎవరో?.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మేడపాటి ప్రకాశ్రెడ్డి, వడ్డి మోహన్రెడ్డి ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సుదర్శన్రెడ్డికే టికెట్ ఇచ్చారు. షకీల్ను ఓడించాలనే లక్ష్యంతో శరత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. ఆర్మూర్ ఆషామాషీ కాదు ఇప్పటికే రెండుసార్లు గెలవడంతో ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే జీవన్రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గడ్డు పరిస్థితి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పొద్దు టూరి వినయ్రెడ్డికి టికెట్ ఖరారు అయ్యింది. బీజేపీ నుంచి పైడి రాకేశ్రెడ్డి బరిలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ పార్టీ ఆదేశిస్తే చివరి నిమిషంలో ఎంపీ అర్వింద్ బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అర్వింద్ బరిలో ఉంటే గెలుపు సులువని పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్లో నిలిచేది ఎవరు? ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బిగాల గణేశ్గుప్తా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో కింగ్కి పోటీ ఇచ్చేనా? బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి షబ్బీర్అలీ, బీజేపీ నుంచి∙వెంకటరమణారెడ్డి పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. షబ్బీర్అలీ గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్ప్లాన్, అక్రమ వెంచర్లు, ధరణి అక్రమాలు, పావలా వడ్డీ బకాయిల ఉద్యమాల్లో పాల్గొన్న వెంకటరమణారెడ్డి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లో సీన్ మారుతుందా? వరుసగా మూడోసారి, మొత్తంగా ఐదోసారి గెలిచి కేబినెట్లో స్థానం సంపాదించేందుకు బాజిరెడ్డి గోవర్దన్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ నుంచి కులాచారి దినేష్కు టికెట్ దక్కనుందనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేష్రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిప్ప జలాశయం ముంపు అంశం, ధరణి, పోడు భూముల అంశాలు కాంగ్రెస్ ప్రధాన ప్రచార అ్రస్తాలుగా వాడుతోంది. బాన్సువాడ బరిలో గెలుపెవరిది? రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే నమ్మకంతో బరిలో మరోమారు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్ నిలబడితే గెలుపు అవకాశాలుంటాయనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మాల్యాద్రిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఎల్లారెడ్డి.. ఏలేదెవరో? గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి వెళ్లారు. కేసీఆర్ పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్, సుభాష్ రెడ్డి మధ్య టికెట్ పోటీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నడుస్తోంది. జుక్కల్ ఎవరిపరం? సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్సింధే మూడోసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార, బుచ్చన్న టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్ మధ్య పోటీ నెలకొనగా మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వేల్పూర్కు సీఎం కేసీఆర్.. మంత్రి ప్రశాంత్రెడ్డికి పరామర్శ
సాక్షి, వేల్పూర్/హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వేముల మంజులమ్మ(77) హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె మరణించడంతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రశాంత్రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో మంజులమ్మ అంత్యక్రియలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. మంత్రి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. కాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే షకిల్ పరామర్శించారు. వేముల మాతృమూర్తి మృతిపై సీఎం కె.చంద్రశేఖర్రావుతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు