చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం | Man cheats people of Rs.2 Crores in the name of chit | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం

Published Thu, Sep 3 2015 6:21 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Man cheats people of Rs.2 Crores in the name of chit

చెరుకుపల్లి : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.2 కోట్ల మేర స్థానికులకు టోపీ పెట్టాడు. దీనిపై సుమారు 80 మంది వరకు బాధితులు గురువారం సాయంత్రం చెరుకుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎం.రామదాసు అనే వ్యక్తి దగ్గర తాము చిట్టీలు వేశామని, కాగా గత రెండు నెలలుగా పాటలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement