-
మీపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: మేరుగు నాగార్జున
సాక్షి, గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దగ్ధం చేయటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించి పక్కనే ఉన్న జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ నాయకులు.. మా కార్యకర్తలపై కేసు పెట్టడానికి పూనుకున్నారని ధ్వజమెత్తారు.ఇదేనా మీ పాలన అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ను దుయ్యబట్టారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలపైన దాడులు చేయడానికా...? మహా నాయకుల విగ్రహాలు తగలబెట్టడానికా...? ప్రజలు మీపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ మేరుగ నాగార్జున హెచ్చరించారు.బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
అమెరికాలోని డల్లాస్లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్పై అభియోగాలు నమోదు చేశారు. ఇతనిపై ఇంతకుముందు కూడా హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు.జూన్ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిపోయిందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరేగిపోతున్నారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చెప్పారు.ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల సమాలోచన సదస్సు (రౌండ్టేబుల్ సమావేశం) సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్, ప్రముఖ అంబేడ్కరిస్ట్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతతో, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి, ఎన్నికల హింసను, పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సదస్సుల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే చెప్పుకోవచ్చు. నాయకులను ప్రజల చేత ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందింది. నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా మలుచుకుని పోరాటాలు చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంతరం ఐక్యతతో ముందుకు సాగితేనే ఇలాంటి దాడులను ఆపగలం. – బైరి నరేష్, సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడుయూపీ తరహా అరాచకాలకు ముఖ చిత్రంగా ఏపీ యూపీ తరహా అరాచకాలకు ఏపీ ముఖచిత్రంగా మారుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జేసీబీలతో ఇళ్లను కూలి్చవేయడం చూస్తుంటే యూపీలో పాలనే ఏపీలో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య. వీటిన్నింటినీ అడ్డుకునేందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ త్వరలో ప్రజాసంఘాలన్నింటితో కలిసి విస్తృత పోరాటం చేస్తాం. – రెంజర్ల రాజేష్, అంబేడ్కరిస్ట్, గాయకుడుకూటమి పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు చూస్తుంటే...కూటమి పాలన ఐదేళ్లలో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను అరికట్టేందుకు సరైన నిర్ణయంతో ముందుకు సాగాలి. – చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం బాధాకరం. ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మారిస్తే వారు జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక బృందాలను తీసుకువచ్చామని చెప్పినప్పటికి, ఎన్నికలైన తరువాత దాడులు జరగడం బాధాకరం. దాదాపు 30 గ్రామాల్లో మాదిగ పల్లెలను టార్గెట్ చేస్తూ కూటమి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన అధికారులు పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటు. – కె.కృçష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శిచట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన తరువాత చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది. ముఖ్యంగా పల్నాడులో వ్యాపారాలను స్వచ్ఛందంగా టీడీపీ నేతలకు అప్పగించాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు తల వంచాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా కుల ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఈ దుష్పరిణామాలపై ప్రజా సంఘాలన్ని సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. – కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీఅన్యాయంగా కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ కేసులను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. – జయసుధ, వీసీకే పార్టీ నాయకురాలుఐక్యతతో ముందుకు సాగాలి రాష్ట్రంలో దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలి. బా«ధితులకు అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రజా సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. – బాలరాజు, అంబేడ్కరిస్ట్, నెల్లూరురాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పి కూటమి అరాచకాలను ఎండగట్టాలి. – భాను, జర్నలిస్ట్ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాల, మాదిగలపై దాడులు పెరిగిపోయాయి. వీటిన్నింటిని అరికట్టాలంటే కలిసి కట్టుగా పోరాటం చేయాలి. దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితులు రావాలి. – వాసిమళ్ల విజయ్, క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ఈవీఎంలు బ్యాన్ చేయాలి ఈవీఎంలు బ్యాన్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని బ్యాన్ చేస్తేనే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి. ప్రజా సమస్యల మీద పోరాడే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. గెలిచిన వారు ప్రజా రంజక పాలన అందించాలే గానీ, వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు. – పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిరాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన 77 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరగడం గర్హనీయం. రాష్ట్రంలో మనిíÙని మనిషిగా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మనుషుల మధ్య జరుగతున్న హింసను అరికట్టాలి. బాధితుల తరపున హైకోర్టులో పోరాడటానికి మేం సిద్ధం. – వేముల ప్రసాద్, హైకోర్టు అడ్వొకేట్ప్రతి ఎన్నికల్లో దళిత పల్లెల్లో రక్తం పారుతోంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా దళిత పల్లెలే దాడులకు గురవుతున్నాయి. దాడుల్లో దళితుల రక్తం ఏరులై పారుతోంది. ఏపీలో కూటమి నేతలు దళిత పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ -
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్
-
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
జనసేన కార్యకర్తల దాష్టీకం..
-
గుంటూరులో జనసేన కార్యకర్తల దాష్టీకం
గుంటూరు ఈస్ట్: గుంటూరు లక్ష్మీపురంలో జనసేన కార్యకర్తల దాష్టీకమిది. ప్రైవేటు హాస్టల్ బోర్డుపై కులం పేరు ఉందన్న కారణంతో జనసేన కార్యకర్తలు ఆ హాస్టల్ యజమానిని కొట్టి మోకాళ్ల మీద కూర్చొబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. జనసేన కార్యకర్తల దురాగతాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్లోకి మంగళవారం కొందరు జనసేన కార్యకర్తలు కర్రలతో ప్రవేశించారు. హాస్టల్ యజమానిని బయటకు పిలిచి బోర్డు పైన ఉన్న ఓ సామాజికవర్గం పేరును తొలగించాలని బెదిరించారు. హాస్టల్ యజమాని అందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా హాస్టల్ యజమానిపై దాడి చేశారు. వదిలిపెట్టాలని హాస్టల్ యజమాని ప్రాధేయపడినా వదల్లేదు. పైగా జనసేన కార్యకర్తలు హాస్టల్ యజమానిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి, వారి కాళ్ళు పట్టించుకున్నారు. అయితే జనసేన కార్యకర్తలకు భయపడిన హాస్టల్ యజమాని ఈ ఘటనపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశాడు. గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ నేమ్ బోర్డ్ లో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో, రాళ్ళతో దాడి చేసి ఆ హాస్టల్యజమానిని కొట్టి బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్ళు పట్టించుకున్న @JanaSenaParty గూండాలు.ఇదేనా నీ కొత్తతరం రాజకీయం అంటే @PawanKalyan ? pic.twitter.com/cVK38l1ksB— YSR Congress Party (@YSRCParty) June 6, 2024 -
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
గుంటూరులో అంగరంగ వైభవంగా నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నగరంలో జానపద కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారుల నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా జరిగాయి. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. తెలంగాణ ప్రజా గాయకుడు చింతల యాదగిరి పాడిన పాట ఈ చిట్టి చేతులు పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణాజిల్లాల నుండి జానపద, గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను మైమరిపించాయి. కిక్కిరిసిన జనసందోహంతో విజ్ఞాన మందిరం నిండిపోయింది. కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో విజ్ఞాన మందిరం మారుమ్రోగింది. షేక్ బాబుజి, ప్రజా నాట్యమండలి పీవీ రమణ, రంగం రాజేష్ లు తమ బృందంతో ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు అలరించాయి.తెలుగు భాష పరిరక్షణ కోసమే మా కృషి: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి మేం అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అమెరికాలో నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కవులు, కళకారులను అక్కడ తెలుగువారికి కూడా పరిచయం చేస్తున్నామని.. వారి గొప్పదనాన్ని వివరిస్తున్నామని బాపు నూతి తెలిపారు. తెలుగు భాష తరతరాలకు తరగని వెలుగులా ఉండాలనేదే తమ ఆశయమని తెలిపారు. తెలుగు కళాకారులు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని బాపు అన్నారు. కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువుకు గౌరవం దక్కిన సమాజం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని.. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సంబరాల్లో గౌరవిస్తూ వారికి పురస్కారాలు అందించామని బాపు నూతి అన్నారు. నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిందని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడం.... మహిళా సాధికారత కోసం ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసిందని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వశక్తితో నిలబడేలా వారికి కావాల్సిన చేయూత నాట్స్ అందించిందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు. అమెరికాలో తెలుగువారికి అండ నాట్స్: సత్య శ్రీరామినేనితెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలుస్తుందని డల్లాస్ నాట్స్ నాయకుడు సత్య శ్రీరామినేని అన్నారు. విద్యార్ధులు అమెరికాకు వచ్చేటప్పుడు యూనివర్సీటీల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలన్నారు. అమెరికాలో బోగస్ యూనివర్సీటీల వల్ల నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీరామినేని గుర్తు చేశారు. అందుకే నాట్స్ విద్యార్ధులకు అమెరికాలో చదువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘం: ఎమ్మెల్సీ లక్ష్మణరావునాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఏ సాయం చేయాలన్నా నాట్స్ ముందుంటుందనే విషయం నాట్స్ సేవా కార్యక్రమాలనే నిరూపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి సేవా కార్యక్రమాల్లో చూపిస్తున్న చొరవ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో నిలబడేలా వారికి ఆర్థిక సహకారం, నల్లమల అడవుల్లో గిరిజన మహిళల సాధికారత కోసం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహించేలా పురస్కారాలు అందిస్తున్న నాట్స్ కు లక్ష్మణరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు, కళకారులకు సన్మానంజానపద, సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కవులకు, కళకారులకు నాట్స్ పురస్కారాలు అందించింది. వారిని సన్మానించింది. అలాగే పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరున్న వారిని ఆహ్వానించి వారిని సంబరాల వేదికపై సత్కరించింది. ఇంకా ఈ సంబరాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, కన్నా మాస్టారు, పాటిబండ్ల విష్ణు, కృష్ట్నేశ్వరరావు, కార్యక్రమం సమన్వయ కర్త కాకుమాను నాగేశ్వరరావు, సుబ్బారాయుడు, దాసరి రమేష్, దాసరి సుబ్బారావు, సరిమల్ల చౌదరి, షేక్ బాషా, భగవాన్ దాస్, లక్ష్మణరావు, కిరణ్, గుర్రం వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ) -
ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు.కాగా మంగళవారం ఉదయం ప్రజాభవన్లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టినట్లు కంట్రోల్ రూమ్కు ఫోన్చేసిన రామకృష్ణ.. అధికారును కంగారు పెట్టించాడు. అయితే రామకృష్ణ భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య దూరం అవ్వడంతో ఆమె లేదని బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు.అసలేం జరిగిందంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు మూడు గంటలపాటు తనిఖీలు సాగాయి. అనంతరం ఫేక్ కాల్గా తేలడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చారు. -
టార్గెట్ పిన్నెల్లి
గుంటూరు,సాక్షి: నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసే యత్నాలు చేస్తున్నారు. అంతేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైఎస్సార్సీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. వైఎస్సార్సీపీ సూటి ప్రశ్నలుమాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల(ఏప్రిల్) 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు టీడీపీకి లొంగిపోయాయేమో అనిపిస్తోంది. పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి :::వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏదైనా హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చలా కొందరు అధికారులు తయారు అయ్యారని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ కూటమికి కొమ్ము కాస్తున్న అధికారులు జూన్ 4 ఎన్నికల పలితాల మూల్యం చెల్లించుకోక తప్పదని సున్నితంగా హెచ్చరిస్తోంది కూడా. -
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
-
ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.‘‘మంగళగిరి సిద్ధమేనా? దేవుడి దయతో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల నడుమ, ఇందరి ప్రేమానురాగాలు, ఇందరి ఆప్యాయతలు, ఇందరి ఆప్యాయతల నడుమ మీ అందరికి కూడా.. నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకి, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ .. మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జరగబోయే ఎన్నికలు.. కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే. ఇదే.. ఇదే.. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పొరపాటును చంద్రబాబుకి ఓటేయడం అంటే.. కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని గుర్తు పెట్టుకోవాలి. అందరికీ ఈ విషయాలు చెబుతూ.. నా మాటలపై ఆలోచన చేయండి. గత 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి, వాళ్ల చేతుల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లడం. మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ విధంగా బటన్లు నొక్కడం, నేరుగా ఖాతాల్లోకి వెళ్లడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆలోచన చేయండి.ఏకంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు. కేవలం 59 నెలల పాలనలోనే రెండు లక్షల ఉద్యోగాలిచ్చాం. గత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదని సగర్వంగా చెబుతున్నా. ఇందులో లక్షా 35 వేల మంది మన కళ్లముందు సచివాలయాల్లో కనిపిస్తున్నారు.ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. కనీసం వెతికినా దొరికేది కాదు. ఆ సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చేశాడు.. మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అంటూ మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే. ఆలోచేన చేయండి.. ఇది మీ బిడ్డ పాలనలో కాదా?.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను.. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ప్రయాణం, టోఫెల్ క్లాసులు, బైలింగువల్ టెక్స్ట్ బుక్లు మన పిల్లల చేతుల్లోనే కనిపిస్తున్నాయి.బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న వాళ్లు 93 శాతం ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నది ఈ 59 నెలల కాలంలోనే. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను డిగ్రీ స్థాయిలో.. ఇలా చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి. 15 ఏళ్ల తర్వాత.. ఐబీ సర్టిఫికెట్ పదో తరగతి పాసైతాడు. మరో మూడేళ్లకు డిగ్రీ చేసి.. అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి కోర్సులతో పట్టా పుచ్చుకుంటాడు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. పేదల భవిష్యత్తు మారాలి.. అందుకు మీ బిడ్డ అడుగులు వేయడం ఎంత అవసరమో ఆలోచన చేయండి.గతంలో ఎన్నడూ జరగని విధంగా, చూడని విధంగా.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, అక్కచెల్లెమ్మలకు.. ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటి వద్దకే రేషన్. ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు రావడం.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా పేదలకు తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?. ఈ పథకాలు గతంలో ఉండేటివా?..ఏ పేదవాడు అప్పులు పాలవ్వకూడదని.. ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు.. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏ పేదవాడికి అయినా వైద్యం కోసం 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. రెస్ట్ పీరియడ్లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. పేదవాడికి అండగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ప్రతీ ఇంటిని జల్లెడ పడుతూ.. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా కూడా.. 600 రకాల సేవలు అందించే సచివాలయం. ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్తో కూడిన వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఈ పథకాలు, ఈ మార్పులు, ఈ లంచాలు.. వివక్ష లేని పాలన గతంలో జరిగిందా?.. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలిచిన పాలన ఇది. ఆలోచన చేయండి.మరో పక్క చంద్రబాబునే గమనించండి. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పథకం లేదు. ఆయన పాలన ఎలా ఉండేదో గమనించండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారం తప్పితే.. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో. ఈ పాంప్లెట్ గుర్తుకు తెచ్చుకోండి. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డాడు. ఈ ఫాంప్లెట్ను ముఖ్యమైన హామీలంటూ స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటైనా జరిగాయా? నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ అయ్యాయా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. ఆలోచన చేయండి. మూడో హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నా.. రూ.25 వేల కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరి అకౌంట్లలో అయినా ఒక్క రూపాయి అయినా వేశారా?. నాలుగో ముఖ్యమైన హామీ.. ఇంటింటికీ ఉద్యోగం.ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?. ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? ఒక్కటంటే.. ఒక్క హామీ నెరవేరిందా?. పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? ఆలోచన చేయండి.మళ్లీ.. కొత్త మేనిఫెస్టో డ్రామా. మళ్లీ ఇదే ముగ్గురూ. మళ్లీ చంద్రబాబూ.. సూపర్ సిక్స్ అంట. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట. నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారం అంట. నమ్ముతారా?. ఇంటింటికీ బెంజికారు అంట. నమ్ముతారా?. మరి ఆలోచన చేయమని అడుగుతున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. -
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు. గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు.జననేత రాకతో పొన్నూరులో పండుగ వాతావరం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు. జగన్ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.సీఎం జగన్ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఉన్న ఈ ప్రభుత్వం మీద విలువలు లేని చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నారో వింటున్నారు కదా14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా జగన్ను తిడుతున్నాడుచంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడుపోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడునువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడుచంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా?14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మేలు చెప్పి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు?మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేాశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా?బచ్చా అంటున్న జగన్ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకు?చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు?ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు?రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాంలంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాంనాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్లో 68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాపేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో. -
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)
-
టీడీపీ గూండాలు అరెస్ట్
-
కృష్ణా తీరం.. పోటెత్తిన జనప్రవాహం
(మేమంతా సిద్ధం బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఆకాశం నిప్పులు చిమ్మినా.. మేఘాలకు చిల్లులు పడినా.. నీపై మా అభిమానం తగ్గదు అన్నా.. నింగి, నేల ఉన్నంతకాలం నీతోనే మేమంతా జగనన్నా.. అంటూ సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుంటూరు ప్రజల ఘాటైన ప్రేమాభిమానాలను గుండెల నిండా నింపుకుని.. ఎన్టీఆర్ జిల్లా వాసుల ఆప్యాయతలను పంచుకోవడానికి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రెండు జిల్లాలనూ కలిపే కనకదుర్గ వారధి జన ప్రవాహంతో పోటెత్తింది. అడుగుతీసి అడుగువేయలేనంతగా ప్రజలతో నిండిపోయింది. గుండెల్లో నింపుకున్న గుంటూరు.. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్లో రాత్రి బస వద్ద మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్ను కలిశారు. పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ సీఎం జగన్ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉ.10.13 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. జననేత రాక కోసం అప్పటికే జాతీయ రహదారి అభిమానులతో నిండిపోయింది. రహదారికి రెండువైపులా జగన్ రాకకోసం ప్రజలు ఉత్సాహంతో ఎదురుచూశారు. అల్లంత దూరాన సీఎం జగన్ బస్సును చూడగానే ఒక్కసారిగా పరుగు పరుగున ఎదురెళ్లారు. జగనన్నా.. అంటూ బిగ్గరగా నినదిస్తూ.. చేతులు ఊపుతున్న అభిమానులను చూసి జగన్ ప్రతిగా అభివాదం చేశారు. దారిపొడవునా తనకు ఎదురొస్తున్న జన ప్రవాహానికి అభివాదం చేస్తూ.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ బస్సుయాత్ర ముందుకు సాగింది. కంతేరు అడ్డరోడ్డులో అక్కడి గ్రామస్తులు జగన్కు గజమాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత చినకాకాని వద్ద మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో ఎదురొచ్చారు. వారిని చిరునవ్వుతో పలకరించి కాజా టోల్ప్లాజా వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతమంతా అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. స్థానికులు భారీ గజమాలతో జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిచ్చిన ఆప్యాయతను అందుకుని ఎన్ఆర్ఐ సర్కిల్ మీదుగా మంగళగిరి చేరుకున్నారు. హైవేపై బారులు తీరిన జనం జగన్కు జేజేలు పలికారు. వారికి అభివాదం చేస్తూ సీకే కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న సీఎం అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనకదుర్గ వారధిపై జనప్రవాహం.. ఇక గుంటూరు జిల్లా నుంచి జగన్ బస్సుయాత్ర వస్తోందని తెలిసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, పార్టీ అభిమానులు జగన్కు స్వాగతం పలికేందుకు కనకదుర్గ వారధిపైకి భారీగా తరలివచ్చారు. వర్షంలోనే గుంటూరు జిల్లా ఘనంగా వీడ్కోలు పలుకగా, ఎన్టీఆర్ జిల్లా ఆత్మీయంగా స్వాగతం చెప్పింది. దుర్గమ్మ నీడలో.. కృష్ణమ్మ సాక్షిగా.. కనకదుర్గ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇదే వారధిపై పాదయాత్ర చేసిన రోజులను ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకున్నారు. విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు వెంటరాగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సా.5.38 గంటలకు వారధి దాటింది. విజయవాడలో జనజాతర.. నగర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా అభిమాన నాయకుడి ఆగమనంతో విజయవాడ నగరం జన జాతరను తలపించింది. మహిళలు, చిన్నారుల కోలాటాలు, స్టిక్ వాకర్స్, డప్పులు, వాయిద్యాలు, బటర్ఫ్లై వేషధారణలు, శక్తి వేషాలు, కేరళ సంప్రదాయ నృత్యాలు, బాణాసంచా కాంతులు, డీజే సౌండ్లు, భారీ గజమాలలు, జగన్ నిలువెత్తు కటౌట్లు.. ఇలా ఒకటేమిటి.. దారిపొడవునా కోలాహలం కనిపించింది. వారధి దాటిన దగ్గర్నుంచీ అభిమానులు పోటెత్తడంతో బస్సుయాత్ర ముందుకు కదలడమే కష్టమైంది. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. కృష్ణలంక సాయిబాబా గుడి నుంచి ప్రతిదారీ ప్రజాభిమానంతో కిక్కిరిసిపోయింది. యాత్ర బందరు రోడ్డు రమేష్ ఆస్పత్రి సెంటర్ నుంచి శిఖామణి సెంటర్కు చేరుకోగానే అత్యంత భారీ గజమాలతో అభిమానులు జగన్కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మెట్రో సెంటర్, చుట్టుగుంట, రోకళ్లపాలెం, సత్యనారాయణపురం, సింగ్ నగర్ డాబాకోట్లు సెంటర్ వరకూ ఇసుకేస్తే రాలనంత జనం బస్సుయాత్ర వెంట నడిచారు. సింగ్నగర్ వంతెనపైకి చేరుకోగానే మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. ప్రజల మధ్య భారతమ్మ.. శనివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తాడేపల్లి జంక్షన్కు చేరుకున్న బస్సుయాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ బస్సుయాత్రగా వస్తున్న సీఎం జగన్కు రోడ్డుపై నిలబడి అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య తానూ ఓ సామాన్యురాలిగా చిరునవ్వుతో జగన్కు చేతులు ఊపారు. ప్రతిగా సీఎం జగన్ కూడా బస్సులో నుంచే భారతికి అభివాదం చేశారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులిచ్చారు. అనంతరం మణిపాల్ ఆసుపత్రి జంక్షన్కు భారీగా చేరుకున్న అభిమానులు మళ్లీ రా.. అన్నా అంటూ వీడ్కోలు పలికారు. -
గుంటూరులో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
సీఎం జగన్ గురించి గుంటూరు రైతు.. గొప్ప మాటలు
-
ప్రజలే తన స్టార్ క్యాంపెనర్లు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. మంచికి అండగా నిలవాలని గుంటూరు జిల్లా ఏటుకూరు మేమంత సిద్ధం సభలో ప్రజలకు పిలుపు
-
గుంటూరు సాక్షిగా కూటమి పై నిప్పులు చెరిగిన సీఎం జగన్
-
మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలి.. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి గడపకూ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ఈరోజు గుంటూరులో కనిపిస్తున్న ఈ మహా జన సముద్రం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పుడు జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వాతాత, సోదరులు, స్నేహితులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతన్న లకు భరోసా, అక్క చెల్లెమ్మలకు సాధికారత, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సేవలు అందించిన మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను ఒక్క రూపాయి కూడా లంచం, వివక్షకు తావు లేకుండా 130 సార్లు బటన్ నొక్కి పారదర్శకంగా నేరుగా అందించిన ఈ ప్రభుత్వానికి, మీ జగన్కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కేందుకు, మరో వంద మందికి చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు.. ఈ ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్కు మధ్య జరుగుతున్నది కాదు. ఈ యుద్ధం బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మన విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ అబద్ధాల బాబుకు ఇద్దరు వంత పాడుతున్నారు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు. 2014 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించిన బాబు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ నమ్మబలుకుతున్నారు. మంచి కొనసాగాలో వద్దో ఆలోచించండి.. ఈ రోజు మీరంతా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలసి ఒక్క అంశంపై ఆలోచన చేయమని కోరుతున్నా. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని మీరందరూ కొనసాగించేందుకే ఓటు వేసినట్లే. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీ అంతట మీరే మీకు వద్దని చెప్పినట్లేనని గుర్తుంచుకోవాలని కోరుతు న్నా. 58 నెలల క్రితం మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఫలానాది చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ మాదిరిగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నాడు. సెల్ఫోన్ లైట్లతో సంఘీభావం.. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లలో ఏ ఒక్కటీ తగ్గకుండా గెలిపించేందుకు మీరు సిద్ధమేనా? పేదల భవిష్యత్తు బాగుండాలని చేస్తున్న ఈ యుద్ధానికి మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయాలి. పాలకుడు మోసగాడైతే... ఎలాంటి వారు రాజకీయ నాయకుడిగా ఉండాలి? ఎలాంటి వారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్న విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎందుకంటే మనం వేసే ఓటు ద్వారా రాబోయే ఐదేళ్ల జీవితం ఆ పాలకుడి చేతుల్లో పెడుతున్నాం. ఆ పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయి. పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి. అవ్వాతాతల సంక్షేమం అడుగంటిపోతుంది. అందుకే ఈ వాస్తవాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య, అసెంబ్లీ అభ్యర్థులు నూరి ఫాతిమా, బలసాని కిరణ్కుమార్, మురుగుడు లావణ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, విడదల రజని, అంబటి మురళీకృష్ణ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, బత్తుల దేవానంద్ తదితరులు ఏటుకూరు సిద్ధం సభలో పాల్గొన్నారు. బాధలు విన్నాడు.. భరోసా ఇచ్చాడు.. తనను కలిసిన బాధితులకు సీఎం జగన్ ఆపన్న హస్తం సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ను పలువురు కలిసి తమవారికి వచ్చిన కష్టాలు చెప్పుకొన్నారు. వైద్యం అందించాలని కోరారు. వారి బాధలు సావధానంగా విన్న సీఎం జగన్.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తన సోదరుడు షేక్ సుభానికి వైద్యం చేయించండన్నా అంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన బాజీబీ సీఎం జగన్ను వేడుకున్నారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని భాగ్యనగర్ కాలనీ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ వస్తున్నారని తెలుసుకుని కోమాలో ఉన్న సోదరుడిని కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్లో తీసుకొచ్చి రోడ్డుపై నిలబడింది బాజీబీ. వారిని గమనించిన సీఎం వెంటనే బస్సు దిగి సమస్యను తెలుసుకున్నారు. వీఆర్వోగా పనిచేస్తున్న సుభాని గత ఆగస్ట్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, అప్పటి నుంచి కోమాలోకి వెళ్లాడని చెబుతూ ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చయ్యాయని, సీఎం సహాయనిధి ద్వారా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూ.3 లక్షలు సాయం కూడా అందించారని సీఎం దృష్టికి తెచ్చారు. ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. వారి సమస్యను విన్న సీఎం జగన్.. సుభానికి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, దాచేపల్లి మండలం శ్రీనగర్కు చెందిన గంటెల వెంకటేశ్వర్లు, శారదల 12 ఏళ్ల కుమారుడు చరణ్కు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మేమంతా సిద్ధం యాత్రకు ధూళిపాళ్ల శివారులో సీఎం జగన్ రోడ్ షో చేస్తుండగా బస్సు వెంట ఆ బాలుడిని ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగెత్తడం సీఎం జగన్ గమనించి.. బస్సాపి వారిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే చరణ్కు వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. బాబు మోసాలకు వంతపాడుతున్న వదినమ్మ, దత్తపుత్రుడు సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాల బుర్రకథకు తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కని పిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘మీ బిడ్డకు ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించాలని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని ప్రజలను కోరుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారీ వర్షంలోనూ జనం ‘సిద్ధం’ భోజన విరామం కూడా లేకుండా 9 గంటల పాటు సీఎం జగన్ యాత్ర అభిమాన సముద్రం ముందు గాలి దుమారం తేలిపోయింది. ఈదురు గాలులు వీస్తున్నా జనసందోహం చెక్కు చెదరని సంకల్పంతో జననేత కోసం నిరీక్షించింది. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సుయాత్ర పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నంబూరు వరకు జరిగింది. యాత్ర మేడికొండూరు చేరుకునేసరికి ఈదురు గాలులతో వర్షం మొదలైంది. జన సంద్రమే గొడుగులా సీఎం జగన్ కాన్వాయి ముందుకు సాగింది. గుంటూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు పలుదఫాలుగా వర్షం పడింది. గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు ఒరిగిపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని నిలబెట్టడం గమనార్హం. ఏటుకూరులో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం తడిచి ముద్ద అయింది. ప్రతిచోటా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శుక్రవారం భోజన విరామం కూడా లేకుండా తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా సాగింది. గుంటూరు జిల్లాలో పేరేచర్ల నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర జనసంద్రాన్ని తలపిస్తూ రోడ్షో జరిగింది. 2014 ఫ్లాష్బ్యాక్లోకి వెళితే.. ఒక్కసారి 2014 ఫ్లాష్బ్యాక్లోకి వెళితే.. నాడు కూడా ఇదే కూటమి! మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలతో ప్రజల జీవితాలతో చెలగా టమాడారు. ఇదే చంద్రబాబు సంతకం చేసి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో పాంప్లెట్లు ముద్రించి ప్రతి ఇంటికి పంపారు. మీరు మర్చిపోతారేమోననే భయంతో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు. చంద్రబాబు నాటి మోసాల్లో ఒక్కసారి ముఖ్యమైన వాటిని మీకు గుర్తు చేస్తా. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మీకుగానీ, మీ ఇంటి చుట్టుపక్కల వారికిగానీ ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. మరి జరిగిందా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా? -
ఏటుకూరులో మేమంతా సిద్ధం.. వెల్లువలా జన ప్రభంజనం (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 14వ రోజు షెడ్యూల్
గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అటు ఎండను, ఇటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సీఎం జగన్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు(శుక్రవారం) ధూళిపాళ్ల నుంచి బయల్దేరి ఏటుకూరు వరకూ దిగ్విజయంగా కొనసాగింది. ఒకవైపు భారీ వర్షం పడినా సీఎం జగన్ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. మేమంతా సిద్ధం’ 14వ రోజు శనివారం(ఏప్రిల్ 13) షెడ్యూల్ ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ రేపటి(శనివారం)బస్సుయాత్రను నంబూరు బైపాస్(రాత్రి బస చేసిన చోటు) నుంచి ప్రారంభిస్తారు. కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు 14వ రోజు బస్సుయాత్ర షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు.