తొలి టీ20లో అదరగొట్టిన భారత్‌ | IND Vs NZ: Iyer Shines As India Hunt Down 204 | Sakshi
Sakshi News home page

తొలి టీ20లో అదరగొట్టిన భారత్‌

Published Fri, Jan 24 2020 4:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ అదరగొట్టింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంకా ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించి శుభారంభం చేసింది. రోహిత్‌ శర్మ(7) విఫలమైనా కేఎల్‌ రాహుల్‌(56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి(45; 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌(58 నాటౌట్‌; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలు ఆరంభంలో అదరగొడితే, శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిని అధిగమిస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.