-
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్కు టీమిండియా..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్కు రిజర్వ్ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. -
టీమిండియా బాల్ టాంపరింగ్కు పాల్పడింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్కప్లో టీమిండియా బాల్ టాంపరింగ్కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ అసాధారణమైన రివర్స్ స్వింగ్ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.అర్ష్దీప్ తన సెకెండ్ స్పెల్లో (16వ ఓవర్లో) కొత్త బంతితో రివర్స్ స్వింగ్ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది. అలాంటిది అర్ష్దీప్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్ టాంపరింగ్కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ ఆరోపణలు చేశాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్దీప్ సింగ్ (4-0-37-3), కుల్దీప్ యాదవ్ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. -
సిక్సర్ల కింగ్ శివమ్ దూబే.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
T20 World Cup 2024: సెమీస్ బెర్త్లు ఖరారు.. టీమిండియా ప్రత్యర్ధి ఎవరంటే..?
టీ20 వరల్డ్కప్ 2024లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. తొలి సెమీఫైనల్కు ట్రినిడాడ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా జరుగనుంది. తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఫైనల్ మ్యాచ్కు బార్బడోస్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం 29వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 పోరుతో గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఖంగుతినిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్కు అర్హత సాధించింది. వరుణుడి అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్-1లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.స్కోర్ వివరాలు..ఆఫ్ఘనిస్తాన్ 115/5 (గుర్బాజ్ 43, రిషద్ హొసేన్ 3/26)బంగ్లాదేశ్ 105 ఆటౌట్ (17.5 ఓవర్లలో) (లిటన్ దాస్ 54 నాటౌట్; నవీన్ ఉల్ హక్ 4/26, రషీద ఖాన్ 4/23) 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం (డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా విజయ లక్ష్యం 19 ఓవర్లలో 114 పరుగులు) -
T20 World Cup 2024: ఆసీస్పై టీమిండియా విజయం.. హిట్మ్యాన్ ఖాతాలో రికార్డుల వెల్లువ
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హిట్మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్దీప్ సింగ్ (3/37), కుల్దీప్ యాదవ్ (2/24) ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీశారు. సునామీ ఇన్నింగ్స్తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో రోహిత్ సాధించిన రికార్డులు..అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డుఅంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఒకే ప్రత్యర్థిపై (ఆస్ట్రేలియాపై) అత్యధిక సిక్సర్లు (132 సిక్సర్లు) కొట్టిన బ్యాటర్గా రికార్డుబాబర్ ఆజమ్ను (4145) అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు (4165)టీ20 వరల్డ్కప్లో అత్యధిక స్కోర్ (92) సాధించిన భారత కెప్టెన్గా రికార్డుపొట్టి ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత కెప్టెన్గా రికార్డుఅంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు (529)అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్గా రికార్డుటీ20 వరల్డ్కప్లో ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు (8) బాదిన భారత బ్యాటర్గా రికార్డుప్రస్తుత ప్రపంచకప్ (2024)లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి (19 బంతుల్లో) రికార్డు -
T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 24) జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హిట్మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్దీప్ సింగ్ (3/37), కుల్దీప్ యాదవ్ (2/24) ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీశారు. సునామీ ఇన్నింగ్స్తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.మ్యాచ్ అనంతరం హిట్మ్యాన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తిని, ఉత్సాహాన్నిచ్చింది. ప్రత్యర్ధి ఎంత ప్రమాదకమైందో తెలుసు. కలిసికట్టుగా ఆడాలకున్నాం. అలాగే చేశాం. 200 చాలా మంది స్కోర్. ఇక్కడ గాలి చాలా బిగ్ ఫాక్టర్. ఏమైనా జరిగి ఉండవచ్చు. అయితే మేము అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకున్నాం. వ్యక్తిగతంగానూ అందరూ రాణించారు. సరైన సమయాల్లో వికెట్లు పడగొట్టడం ప్లస్ పాయింట్ అయ్యింది. కుల్దీప్ బలం గురించి బాగా తెలుసు. అతన్ని సరైన సమమంలో వినియోగించుకోవాలి. అమెరికా ఫేస్లో పిచ్లు పేసర్లకు అనుకూలించేవి. అందులో కుల్దీప్కు అక్కడ అవకాశాలు దక్కలేదు. వ్యక్తితంగా నా బ్యాటింగ్ విషయానికొస్తే.. చాలా సంతృప్తినిచ్చిన ఇన్నింగ్స్ ఇది. సెంచరీ గురించిన ఆలోచనే లేదు. మొదటి నుంచి ఎలా ఆడానో (వేగంగా) అలాగే ఆడాను. స్టార్క్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. సెమీస్ విషయానికొస్తే.. కొత్తగా ఏమీ ట్రై చేయాలని అనుకోవట్లేదు. టోర్నీ ఇప్పటివరకు ఎలా ఆడామో అలాగే ఆడతాం. ఎవరేమీ చేయాలో ప్లాన్ చేసుకుంటాం. మున్ముందు ఏం జరుగుతుందో పెద్ద ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడతాం. ప్రత్యర్ధి గురించి పెద్దగా ఆలోచన లేదు. జట్టుగా ఇదే మా ప్రణాళిక. -
T20 World Cup 2024: రసవత్తరంగా మారిన గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ రేసు
టీ20 వరల్డ్కప్ 2024లో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి టీమిండియా తొలి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా (ఆసీస్పై విజయంతో).. రెండో బెర్త్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీమిండియా చేతిలో ఆసీస్ ఓటమితో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు ముందు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతాల్లో చెరి 2 పాయింట్లు ఉండగా.. బంగ్లాదేశ్ ఖాతా పాయింట్లేమీ లేవు.ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో కూడా 2 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు బంగ్లాదేశ్ కూడా సెమీస్ రేసులో ఉంటుంది.ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 61 పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో గెలిచినా.. 13 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించినా భారత్తో పాటు సెమీస్కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్ను ఓడిస్తే భారత్తో పాటు సెమీస్కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ 61 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, సెయింట్ విన్సెంట్ వేదికగా ఇవాళ (జూన్ 25) ఉదయం 6 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ ఎంచుకుంది. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులుగా ఉంది. గుర్బాజ్ (43), ఇబ్రహీం జద్రాన్ (18), ఒమర్జాయ్ (10) ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (4), నబీ (1) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, ముస్తాఫిజుర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంపై గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది. -
T20 World Cup 2024: బాబర్ ఆజమ్ రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత కెప్టెన్లలో అతి తక్కువ మ్యాచ్ల్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా రోహిత్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్తో సమానంగా నిలిచినప్పటికీ.. మ్యాచ్ల పరంగా బాబర్ కంటే తక్కువ మ్యాచ్ల్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. హిట్మ్యాన్ కేవలం 60 మ్యాచ్ల్లో 48 విజయాలు సాధించగా.. బాబర్కు ఈ మార్కును తాకేందుకు 85 మ్యాచ్లు అవసరమయ్యాయి. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా రోహిత్ ఈ రికార్డును సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శివాలెత్తిపోవడంతో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. హిట్మ్యాన్ వీరవిహారం (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ (31), శివమ్ దూబే (28), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విరాట్ కోహ్లి (0) మరోసారి నిరాశపరిచాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. హెడ్కు జట్టులో మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (37), మ్యాక్స్వెల్ (20), టిమ్ డేవిడ్ (15), కమిన్స్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ 2, బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్.. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. -
టీమిండియాలో ఎంట్రీ.. నితీశ్ కుమార్ రెడ్డికి ఏసీఏ అభినందనలు
టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించాడు.ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్గా యోహానన్నియామకంక్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్గా నియమించారు.అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్లుగా నియమించారు.ఇంటర్నేషనల్కు ఆడిన యోహానన్ను ప్రధాన కోచ్గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.యోహానన్ గురించి..యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి కోరారు. -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్..?
టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. 20 మంది ప్రాబబుల్స్ జాబితాను ఇదివరకే ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తుంది.అయితే ఈ పర్యటనకు కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా సందిగ్దత నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేక సూర్యకుమార్ యాదవ్లలో ఎవరో ఒకరు టీమిండియా సారధిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్మన్ గిల్ జింబాబ్వే పర్యటలో టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్లతో పాటు ఐపీఎల్-2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా ఉంటారని సమాచారం.వీరితో పాటు టీ20 వరల్డ్కప్ రెగ్యులర్ జట్టులో సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
T20 World Cup 2024: సెమీస్లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్..!
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-2 సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు చేరుకున్నాయి. గ్రూప్-1 సెమీస్ బెర్త్లు నేడు (జూన్ 24) జరుగబోయే మ్యాచ్లతో ఖరారవుతాయి. ఇవాళ రాత్రి (భారతకాలమానం ప్రకారం) జరిగే భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-1 సెమీస్ బెర్త్లపై క్లారిటీ వస్తుంది. ఏ కారణాల చేతైనా ఈ మ్యాచ్ ఫలితంతో క్లారిటీ రాకపోతే రేపు ఉదయం జరిగే బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వరకు ఆగాల్సి ఉంటుంది.కాగా, గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్లు ఖరారు కావడంతో సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడతాయనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. నేడు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్లో భారత్ గెలిచినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా సెమీస్లో టీమిండియా.. ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీమిండియా ఆసీస్పై గెలిచినా లేక ఈ మ్యాచ్ రద్దైనా గ్రూప్-1లో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 టాపర్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్లో తలపడాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-2 టాపర్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచిందిసెమీస్లో తమ ప్రత్యర్ధిగా ఎవరుండాలని ఎంచుకుని సౌలభ్యం ప్రస్తుతం టీమిండియాకు దొరికింది. ఆసీస్పై గెలిస్తే ఇంగ్లండ్.. ఆసీస్ చేతిలో ఓడితే సౌతాఫ్రికాను టీమిండియా ఢీకొట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2కు సంబంధించి యూఎస్ఏపై గెలుపుతో ఇంగ్లండ్.. వెస్టిండీస్ను చిత్తు చేసి సౌతాఫ్రికా సెమీస్ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. -
T20 World Cup 2024: బట్లర్ విశ్వరూపం.. సిక్సర్ల సునామీ.. యువీ తర్వాత..!
యూఎస్ఏతో జరిగిన వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్కప్ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.హర్మీత్ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో యూఎస్ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024: టీమిండియాతో 'కీ' ఫైట్.. ఆసీస్ గుండెల్లో గుబులు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 24) భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక సమరం జరుగనుంది. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.అయితే ఈ మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. సెయింట్ లూసియాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించినా మధ్యలో ఆటంకాలు తప్పవని సమాచారం.ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్కు ఎలాంటి నష్టం ఉండదు. 5 పాయింట్లతో టీమిండియా సెమీస్కు చేరుకుంటుంది. ఆసీస్ భవితవ్యం మాత్రం బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ భారత్తో మ్యాచ్ రద్దైతే ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి.మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఆఫ్ఘన్లు గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆ జట్టే భారత్తో పాటు సెమీస్కు చేరుకుంటుంది. ఆసీస్ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా రద్దైతే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడకుండా ఉండాలంటే నేటి మ్యాచ్లో ఆస్ట్రేలియా.. భారత్పై ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది.ఇలా జరిగితే మాత్రం భారత్ ఇంటికే..ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నా సెమీస్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారతపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్ఘనిస్తాన్ 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడిస్తే రన్రేట్లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఆ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. -
హ్యాట్రిక్ సెంచరీలు మిస్ అయిన టీమిండియా వైస్ కెప్టెన్.. అయినా రికార్డే..!
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024హ్యాట్రిక్ సెంచరీలు మిస్ఈ మ్యాచ్లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్ మొత్తంలో (3 మ్యాచ్ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కేది.మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ లారా వొల్వార్డ్ట్ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ ఓ మోస్తరు స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో తంజిమ్ బ్రిట్స్ (38), డి క్లెర్క్ (26), డి రిడ్డర్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు.నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో మంధనతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు. -
World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు ఏ జట్టుకు సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. మరో నాలుగు మ్యాచ్లే ఆడాల్సి ఉన్నప్పటికీ 6 జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అన్ని జట్లతో పోలిస్తే టీమిండియాకు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రేపటి వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏ జట్టు ఏమరపాటుగా ఉన్నా సెమీస్ బెర్త్ గల్లంతవడం ఖాయం.గ్రూప్-1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సెమీస్ రేసులో ముందుంది. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్ల్లో మెరుగైన విజయాలు సాధించి గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. సూపర్-8లో రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించినా టీమిండియాకు సైతం టెక్నికల్గా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు.ఒకవేళ భారత్.. రేపు జరుగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఆసీస్ చేతిలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి.. ఆతర్వాత బంగ్లాదేశ్తో జరుగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 93 పరుగుల తేడాతో గెలిస్తే టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమే అయినప్పటికీ.. జరదని మాత్రం చెప్పలేని పరిస్థితి. కాబట్టి రేపు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్లో గెలవాలనే టీమిండియా అనుకోవాలి.మరోవైపు ఇవాళ (జూన్ 23) ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో గ్రూప్-1లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా సెమీస్ రేసులో లేని ఆఫ్ఘనిస్తాన్.. ఆసీస్పై గెలుపుతో ఒక్కసారిగా సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు భవిష్యత్తు భారత్-ఆసీస్ మ్యాచ్పై ఆధారపడి ఉంది.ఇదిలా ఉంటే, గ్రూప్-2 సెమీస్ రేసు గ్రూప్-1 కంటే కఠినంగా ఉంది. గ్రూప్-1లో అయినా మొదటి సెమీస్ బెర్త్పై (భారత్) ఓ క్లారిటీ ఉంది. గ్రూప్-2లో అయితే అదీ లేదు. ఇప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో టాపర్గా ఉన్నా ఆ జట్టుకు కూడా సెమీస్ బెర్త్ అంత ఈజీగా దక్కేలా లేదు. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సౌతాఫ్రికా, విండీస్లతో పోలిస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్కు కాస్త మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్లో చిన్న జట్టైన యూఎస్ఏతో తలపడాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మొత్తంగా చూస్తే ఈ సారి ప్రపంచకప్ సెమీస్ బెర్త్లు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా మారాయి. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 దశలో పెను సంచనలం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి, ఒకదాంట్లో ఓడిన (భారత్ చేతిలో) ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!భారత్తో జరుగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడి.. ఆతర్వాత జరుగబోయే మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుతాయి.ఇలా జరిగినా ఆసీస్ ఇంటికే..!ఒకవేళ భారత్తో రేపు జరిగే మ్యాచ్లో ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలుపొందినా సెమీస్ చేరుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. తదుపరి బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే.. అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరి నాలుగు పాయింట్లు ఉంటాయి. నెట్ రన్రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (2.425) మిగతా జట్లకంటే మెరుగ్గా ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా సెమీస్ అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. బంగ్లాదేశ్పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్తో పాటు ఆఫ్ఘన్ సెమీస్కు చేరుతుంది. ఆసీస్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి..గ్రూప్-1 నుంచి ఆసీస్ సెమీస్కు చేరాలంటే రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆసీస్ సెమీస్కు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే టెక్నికల్గా ఆ జట్టుకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి (ఆస్ట్రేలియాపై భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ భారీ తేడాలతో గెలవాలి). -
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన బుమ్రా.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ది బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 24 బంతులు వేసిన బుమ్రా ఏకంగా 20 డాట్ బాల్స్ సంధించి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మెరుపు ప్రదర్శనతో విరుచుకుపడటంతో భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత ప్రపంచకప్లో బుమ్రా చెలరేగడం ఇది తొలిసారి కాదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. గ్రూప్ దశలో ఐర్లాండ్పై 2/6, పాకిస్తాన్పై 3/14 మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి రెండు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మరింత డోస్ పెంచిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవలేదు కానీ.. జట్టు గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. బుమ్రాకు జతగా బ్యాటింగ్లో సూర్యకుమార్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. ఓవరాల్గా ఆఫ్ఘన్పై గెలుపులో అందరూ తలో చేయి వేసి టీమిండియాకు సూపర్ విక్టరీ అందించారు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32).. బౌలింగ్లో అర్ష్దీప్ (4-0-36-3), కుల్దీప్ (4-0-32-2), అక్షర్ పటేల్ (3-1-15-1), రవీంద్ర జడేజా (3-0-20-1) భారత్ గెలుపుకు దోహదపడ్డారు. -
కోహ్లికి 121 మ్యాచ్లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.స్కై మెరుపులు..టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024: సత్తా చాటిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్..?
టీ20 వరల్డ్కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు (అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్) అవకాశం ఇస్తారని తెలుస్తుంది. సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్లు గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్కు ఎంపికవుతారని తెలుస్తుంది.మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీకైంది. కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తుంది. పూర్తి స్థాయి హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్ను జింబాబ్వే పర్యటనకు హెడ్కోచ్గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
T20 World Cup 2024: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. తుది జట్టులో కుల్దీప్
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-8 మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మార్పు చేశాయి. భారత్కు సంబంధించి సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. ఆప్ఘనిస్తాన్ తరఫున కరీమ్ జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
టీమిండియా హోం సీజన్ (2024-25) షెడ్యూల్ విడుదల
2024-2025 హోం సీజన్కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (జూన్ 20) ప్రకటించింది. ఈ సీజన్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో మొదలై వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో ముగుస్తుంది. ఈ మధ్యలో భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.2024-25 హోం సీజన్ షెడ్యూల్ వివరాలు..బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టెస్ట్ (చెన్నై): సెప్టెంబర్ 19 నుంచి 23 వరకురెండో టెస్ట్ (కాన్పూర్): సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకుతొలి టీ20 (ధర్మశాల): అక్టోబర్ 6రెండో టీ20 (ఢిల్లీ): అక్టోబర్ 9మూడో టీ20 (హైదరాబాద్): హైదరాబాద్న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టెస్ట్ (బెంగళూరు): అక్టోబర్ 16 నుంచి 20 వరకురెండో టెస్ట్ (పూణే): అక్టోబర్ 24 నుంచి 28 వరకుమూడో టెస్ట్ (ముంబై): నవంబర్ 1 నుంచి 5 వరకుఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టీ20 (చెన్నై): జనవరి 22రెండో టీ20 (కోల్కతా): జనవరి 25మూడో టీ20 (రాజ్కోట్): జనవరి 28నాలుగో టీ20 (పూణే): జనవరి 31ఐదో టీ20 (ముంబై): ఫిబ్రవరి 2తొలి వన్డే (నాగ్పూర్): ఫిబ్రవరి 6రెండో వన్డే (కటక్): ఫిబ్రవరి 9మూడో వన్డే (అహ్మదాబాద్): ఫిబ్రవరి 12టీ20 వరల్డ్కప్ 2024 తర్వాత టీమిండియా షెడ్యూల్..ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే (5 టీ20లు)ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక (3 వన్డేలు, 3 టీ20లు)బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా (2 టెస్ట్లు, 3 టీ20లు)న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా (3 టెస్ట్లు)ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (5 టెస్ట్లు)ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (3 వన్డేలు, 5 టీ20లు)ఛాంపియన్స్ ట్రోఫీ 2025వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్